breaking news
kagita venkatrrao
-
మీ ఊరు గుర్తుందా.. ఎమ్మెల్యే సారు..?
సాక్షి, పెడన: బంటుమిల్లి మండలంలోని నాగేశ్వరరావుపేట పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వగ్రామం. నాగేశ్వరరావు పేట పంచాయతీ పరిధిలో లక్ష్మీనారాయణపురం, జానకీరామపురం, గార్లగుంట శివారు గ్రామాలున్నాయి. కాగిత వెంకట్రావు 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్గాను, అంచనాల కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గాను, చీఫ్విప్గా చేసిన ఘనతా ఉంది. ఇన్ని పదవులు అలంకరించినా స్వగ్రామైన పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. రహదార్ల నిర్మాణం, తాగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జానకీరామపురం, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పేదలకు ఇచ్చిన కాలనీల్లో అనర్హులు పట్టాలు దక్కించుకున్న ఆరోపణలున్నాయి. వారు స్థలాలను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట. ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికీ కుళాయి పథకం ఎమ్మెల్యే కాగిత స్వగ్రామంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు ఉన్నా కనీసం సొంత పంచాయతీ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పించ లేకపోయారు. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ఏర్పడిన సీసీ రోడ్లు తప్ప 20 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు బహు అరుదు అని గ్రామస్తులు వ్యంగ్యంగా చెబుతుంటారు. నాగేశ్వరరావుపేట గ్రామాన్ని ఆనుకుని బంటుమిల్లి ప్రధాన కాలువ ఉన్న గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు ఎక్కువగా ఊట బావులపైనే ఆధారపడుతున్నారు. గార్లగుంట దళితవాడ రోడ్డు నిర్మాణంలో నాణ్య ప్రమాణాలు మృగ్యమయ్యాయి. -
పీఏసీ ఛైర్మన్గా భూమా నాగిరెడ్డి
-
పీఏసీ ఛైర్మన్గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్గా పదవికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఈ పదవి దక్కింది. పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.