breaking news
Justin Greaves
-
జులై నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
2026 జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విజేతలను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ పోటీపడగా.. విండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ విజేతగా నిలిచాడు.మహిళల విభాగంలోనూ ఈ అవార్డు వెస్టిండీస్ ప్లేయర్కే దక్కింది. ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్, శ్రీలంక ప్లేయర్ హర్షిత సమరవిక్రమ పోటీని ఎదుర్కొని విండీస్ హేలీ మాథ్యూస్ ఈ అవార్డును కైవసం చేసుకుంది.గ్రీవ్స్ జూలై నెలలో సొంతగడ్డపై శ్రీలంక, పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనలతో ఇరగదీశాడు. బ్యాటింగ్లో సెంచరీలు సాధించడంతో పాటు బౌలింగ్లో ఐదు వికెట్ల ఘనత నమోదు చేశాడు.హేలీ మాథ్యూస్ కూడా జూలై నెలలో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐర్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఆమె అసాధారణంగా రాణించి వెస్టిండీస్ను 3-0తో సిరీస్ విజయానికి నడిపించింది. ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో సెంచరీలు సహా 265 పరుగులు చేసిన మాథ్యూస్.. బంతితోనూ రాణించి ఏడు వికెట్లు పడగొట్టింది. -
టీమిండియా స్టార్లకు షాక్.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐసీసీ జూలై నెల 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' నామినీస్లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, వెస్టిండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, బంగ్లాదేశ్ బ్యాటర్ తంజిద్ హసన్ జూలై నెల పురుషుల నామినీస్ జాబితాలో ఉన్నారు.ఈ జాబితాలో భారత ఆటగాళ్లకు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లండ్ పర్యటనలో రాణించకపోవడమే.హ్యారీ బ్రూక్.. భారత్పై దుమ్మురేపాడుఇంగ్లండ్ వైట్బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జూలైలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో విశేషంగా రాణించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లండ్ భారత్పై వన్డే, టీ20 సిరీస్లను గెలుచుకుంది. భారత్పై వచ్చిన విజయాలు, వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బ్రూక్ను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలబెట్టాయి.జస్టిన్ గ్రీవ్స్.. బ్యాట్తో, బంతితో అదరగొట్టాడువెస్టిండీస్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ కూడా జూలై నెలలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో సెంచరీలు సాధించడంతో పాటు బౌలింగ్లో ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు. దీంతో ఒకే నెలలో బ్యాట్, బంతితో జట్టుకు కీలకంగా మారాడు. అతడి ఆల్రౌండ్ ప్రదర్శన ఐసీసీ అవార్డు నామినేషన్ దక్కేలా చేసింది.బంగ్లాదేశ్ నుంచి తంజిద్ హసన్బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తంజిద్ హసన్ కూడా జూలై నెలలో వైట్బాల్ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కీలక ఇన్నింగ్స్లు ఆడిన తంజిద్.. జూలై నెలలో తన స్థాయిని మరోసారి చూపించాడు. దీంతో ఐసీసీ అతడిని కూడా ముగ్గురు నామినీల్లో చేర్చింది.టీమిండియా స్టార్లకు ఎందుకు చోటు దక్కలేదు..?జూలైలో భారత జట్టు ఇంగ్లండ్లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. కానీ ఈ పర్యటనలో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 0-4తో కోల్పోయింది.వన్డే సిరీస్లో మాత్రం భారత్ మంచి ఆరంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ను ఓడించింది. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్లలో భారత్ తరఫున రోహిత్ శర్మ మాత్రమే ఓ వన్డే సెంచరీతో ఆకట్టుకున్నాడు.మహిళల విభాగానికొస్తే.. శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, వెస్టిండీస్కు చెందిన హేలీ మాథ్యూస్, ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్ జూలై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా నిలిచారు. -
విండీస్కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్తో!
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్గా కాకుండా బ్యాటర్గా తన విలువను ప్రదర్శించాడు. పాక్తో జరిగిన తొలి టెస్టులో వరుస ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన జస్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్తో (125 బంతుల్లో 64 నాటౌట్) రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. గ్రీవ్స్తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ (36 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (46) అర్ధశతకం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 2 వికెట్లు తీయగా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి వికెట్కు బ్రాండన్ కింగ్, టగ్ నరైన్ చంద్రపాల్ (15) 49 పరుగులు జోడించిన తర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పెద్దగా ఎవరు ఆకట్టుకోలేదు. 120 పరుగుల వద్ద వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోవడంతో జస్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు తనలోని క్లాస్ బ్యాటర్ను బయటికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతులను బౌండరీలను తరలించాడు. షెయ్ హోప్ ఔటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థసెంచరీని సాధించాడు. చేజ్తో కలిసి ఆరో వికెట్కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించడంతో విండీస్ మళ్లీ ట్రాక్లో పడింది. రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపై విండీస్ స్కోరు ఆధారపడి ఉంది. Justin Greaves Is A Classy Batter. Very Fluent Batter. His Drives Are Awesome pic.twitter.com/QfKDf5rWT0— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 2, 2026Read: తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు! -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్- పాక్ టెస్టు మ్యాచ్
వెస్టిండీస్- పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు కరేబియన్ గడ్డపై సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్ సందర్భంగానే వెస్టిండీస్లో తొలిసారి ఒక టెస్టు మ్యాచ్లో పేసర్లు అత్యధికంగా నలభై వికెట్లు కూల్చారు. కాగా ఒకప్పుడు పేస్ బౌలర్లకు స్వర్గధామంగా నిలిచిన కరీబియన్ పిచ్లపై చాలా రోజుల తర్వాత విండీస్- పాక్ మధ్య ట్రినిడాడ్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా మళ్లీ ఆ దృశ్యం కనిపించింది.90 పరుగుల తేడాతోఆద్యంతం ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య విండీస్ 1–0తో ముందంజ వేసింది. కాగా వెస్టిండీస్ విధించిన 211 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 40.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ బాబర్ ఆజమ్ (107 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లందరూ విఫలం కాగా... ఆఖరి వికెట్గా క్రీజులోకి అడుగుపెట్టిన మొహమ్మద్ అబ్బాస్ (23; 4 ఫోర్లు) జట్టులో రెండో అత్యధిక స్కోరు చేశాడు. బాబర్–అబ్బాస్ 49 పరుగులు జోడించడం విశేషం. పాక్ ఇన్నింగ్స్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అజాన్ అవైస్ (3), ఇమాముల్ హక్ (3), సల్మాన్ ఆఘా (0), మహమ్మద్ రిజ్వాన్ (11), ఆమేర్ జమాల్ (0), అలీ ఉస్మాన్ (2), షాన్ మసూద్ (3) పెవిలియన్కు క్యూ కట్టారు.బాబర్ రాణించినా...ఇక తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షాన్ మసూద్ జట్టుకు అత్యవసర దశలో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చినా... ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సిరీస్ ద్వారానే తిరిగి పాకిస్తాన్ టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న బాబర్ ఆజమ్ ఒకవైపు క్రీజులో పాతుకుపోయినా... మరోవైపు అతడికి అండగా నిలిచే వారు లేకపోయారు.తొలి ఇన్నింగ్స్లో ఒక దశలో 244/4తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్ ఆ తర్వాత 38 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోగా... రెండో ఇన్నింగ్స్లో 71 పరుగులకే తొలి 9 ఇకెట్లు కోల్పోవడం గమనార్హం. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టగా... రోచ్, గ్రీవ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి నేలకూలిన 40 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లడం విశేషం.గ్రీవ్స్ దెబ్బఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా... పాకిస్తాన్ 282 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులు చేసిన ఆతిథ్య విండీస్... పాక్ జట్టు ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. అయితే బ్యాటర్ల వైఫల్యంతో పాక్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. విండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొత్తంగా ఆరోసారి.. కరేబియన్ గడ్డపై ఇదే తొలిసారిటెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో మొత్తం 40 వికెట్లను పేస్ బౌలర్లే తీయడం ఇది ఆరోసారి. గత నెలలో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్లో ఈ అద్భుతం నమోదైంది. అంతకుముందు ఇంగ్లండ్–వెస్టిండీస్ (1984) టెస్టులో, పాకిస్తాన్–జింబాబ్వే (1993) టెస్టులో, ఇంగ్లండ్–దక్షిణాఫ్రికా (1998) టెస్టులో, భారత్–దక్షిణాఫ్రికా (2018) టెస్టులో 40 వికెట్లు పేస్ బౌలర్ల ఖాతాలోకి వెళ్లాయి.అయితే, కరేబియన్ గడ్డపై 96 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇలా పేసర్లే ఓ టెస్టు మ్యాచ్లో 40 వికెట్లు కూల్చడం ఇదే తొలిసారి. అంతేకాదు.. వెస్టిండీస్- పాక్ మధ్య జరిగిన తొలి టెస్టు విండీస్లో జరిగిన 273వ మ్యాచ్ కాగా.. టరూబా వేదికగా నిర్వహించిన తొలి టెస్టు మ్యాచ్ ఇదే. ఇదిలా ఉంటే.. ఒక టెస్టు మ్యాచ్లో మొత్తం 40 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి ఇప్పటి వరకు వెళ్లలేదు. వెస్టిండీస్ గడ్డ మీద టెస్టు మ్యాచ్లో పేసర్లు అత్యధిక వికెట్లు తీసిన సందర్భాలువెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్- 2026లో బ్రియన్ లారా స్టేడియంలో 40 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా- 2025లో సబీనా పార్కులో 38 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ భారత్- 1997లో కింగ్స్టన్ ఓవల్లో 38 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్- 1990లో కింగ్స్టన్ ఓవల్లో 37 వికెట్లు వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్- 2021లో సబీనా పార్కులో 37 వికెట్లు.చదవండి: గిల్ సంచలన నిర్ణయం! -
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో బౌలింగ్లో ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా జస్టిన్ గ్రీవ్స్ రికార్డులకెక్కాడు. గ్రీవ్స్ తన తొలి ఆరు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే మలి విడత బౌలింగ్కు వచ్చిన గ్రీవ్స్ తాను వేసిన వరుస 5 ఓవర్లలో ఓవర్కు ఒక్కో వికెట్ చొప్పున ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఆ ఐదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్లు నమోదు చేయడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో 5 వికెట్లు తీసే క్రమంలో ఒక్క పరుగు ఇవ్వకుండా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా జస్టిన్ గ్రీవ్స్ నిలిచాడు. ఒక దశలో మ్యాచ్ పాకిస్తాన్వైపు మొaగ్గు చూపిందని అంతా భావించగా, రెండో స్పెల్ బౌలింగ్కు వచ్చిన జస్టిన్ గ్రీవ్స్ తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా తిప్పేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో 3 వికెట్ల నష్టానికి 244 పరుగులతో మంచి పట్టు సాధించిన పాకిస్తాన్కు గ్రీవ్స్ చుక్కలు చూపించాడు. తన వరుస ఐదు ఓవర్లలో పాక్ బ్యాటర్లు షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అబ్బాస్లను పెవిలియన్ చేర్చాడు. జస్టిన్ గ్రీవ్స్కు టెస్టుల్లో ఇదే తొలి ఐదు వికెట్లు ప్రదర్శన కావడం విశేషం. గ్రీవ్స్ దెబ్బకు భారీ స్కోరు చేస్తుందనుకున్న పాకిస్తాన్ 282 పరుగులకు ఆలౌటైంది. మూడు వికెట్ల నష్టానికి 244 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాక్ తన చివరి ఏడు వికెట్లను 38 పరుగులతో చేజార్చుకోవడం విశేషం. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కీమర్ రోచ్ (5), షమర్ జోసెఫ్ (22) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 155 పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. 🚨Justin Greaves claims his maiden five-wicket haul in Test cricket. 🇼🇸Figures: 11 overs, 5/27- Pakistan: 267/9 (72 overs), trail by 44 runs. pic.twitter.com/eiZDyVLSiz— Talha Nawaz (@TalhaDigital007) July 27, 2026An unbelievable spell of fast bowling from West Indies seamer Justin Greaves that netted five consecutive wicket maidens in the first #WTC27 Test 💥More 👉 https://t.co/7XajvpaQ4g pic.twitter.com/aM1vcGFKDq— ICC (@ICC) July 28, 2026Read: రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్! -
వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు!
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన వెస్టిండీస్ 1-2తో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రెండు వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ తన జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. చివరి రెండు వన్డేలకు గాయాలతో సతమతమవుతున్న ఆల్రౌండర్ జాన్ కాంప్బెల్, టెస్టు కెప్టెన్ రోస్టన్ చేజ్ల స్థానంలో బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్లను ఎంపిక చేసింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాయాలు, ఫామ్ లేమీతో సతమతమవుతున్న జట్టులోకి వీరి రాకతో విండీస్ కాస్త బలంగా కనిపిస్తోంది. కివీస్తో సిరీస్కు ముందు శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ల్లో జస్టిన్ గ్రీవ్స్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు మాత్రం గ్రీవ్స్ను జట్టు నుంచి తప్పించారు. ఇక 2025 అక్టోబర్లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన బ్రాండన్ కింగ్ అప్పటి నుంచి టెస్టులు, టీ20లకే పరిమితమయ్యాడు. తాజాగా వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతుండడంతో బ్రాండన్ కింగ్ను జాన్ కాంప్బెల్ స్థానంలో జట్టులో పరిశీలించాలని విండీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. తల్లి అంత్యక్రియల కోసం షమర్ స్ప్రింగర్, వ్యక్తిగత కారణాలతో కారీ పియెర్రీ కూడా జట్టును వీడినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా రోస్టన్ చేజ్ కుడి చూపుడువేలికి గాయమైంది. అప్పటి నుంచి చేజ్ రీహాబిలిటేషన్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు మూడో వన్డే సందర్భంగా కాంప్బెల్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడికి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంప్బెల్ మూడు వన్డేలు కలిపి 30 సగటుతో 60 పరుగుల మాత్రమే చేశాడు. మరోవైపు తొలి వన్డేలో ఓడినప్పటికీ వరుసగా రెండు, మూడు వన్డేలు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం బార్బడోస్ వేదికగా జరగనుంది.చివరి రెండు వన్డేలకు విండీస్ జట్టు:షెయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), అకీమ్ ఆగస్ట్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రాన్ హెట్మైర్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, విటెల్ లాస్, గుదకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జేడెన్ సీల్స్.Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్
ఆంటిగ్వాలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు హైస్కోరింగ్ డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విండీస్, రెండో టెస్టును డ్రాగా ముగించడంతో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత వెస్టిండీస్కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. అలాగే శ్రీలంకపై 2003 తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.రెండో టెస్ట్ చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 92/2తో ఆట ప్రారంభించిన శ్రీలంక వేగంగా పరుగులు సాధించింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, మిలన్ రత్నాయకే వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడడంతో లంచ్ సమయానికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఆధిక్యాన్ని 300 దాటించిన శ్రీలంక 251/9 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దినేశ్ చండిమల్ 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కమిందు మెండిస్ 44 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.306 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్బెల్, బ్రాండన్ కింగ్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో రెండు సార్లు చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించినా ఫలితంపై ప్రభావం చూపలేదు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో బ్రాండన్ కింగ్ ఎల్బీగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా, డీఆర్ఎస్లో నిర్ణయం మారడంతో శ్రీలంకకు నిరాశ ఎదురైంది.చివరికి క్యాంప్బెల్ (51 నాటౌట్), బ్రాండన్ కింగ్ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును నిలబెట్టగా, ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 549/9 డిక్లేర్ చేయగా, లహిరు ఉదార 188, సోనాల్ దినూష 92, కమిందు మెండిస్ 84 పరుగులతో రాణించారు. ప్రత్యుత్తరంగా వెస్టిండీస్ 499 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112 పరుగులతో ఆకట్టుకోగా, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి టెస్టులో సాధించిన ఘన విజయమే సిరీస్ ఫలితాన్ని వెస్టిండీస్కు అనుకూలంగా మలిచింది. -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్.. హోప్ శతకం
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మ్యాచ్పై పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి, ఓవరాల్గా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయానికి అవసరమైన లక్ష్యాన్ని నిర్దేశించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.మూడో రోజు ప్రారంభమైన జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ భాగస్వామ్యం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. హోప్ (112) తన కెరీర్లో ఐదో టెస్టు సెంచరీని, స్వదేశంలో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. గ్రీవ్స్ (180) తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గ్రీవ్స్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.గ్రీవ్స్-హోప్ 76.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 242 పరుగుల భారీ భాగస్వామ్యానికి నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. ఓ దశలో 5 వికెట్లకు 438 పరుగులతో బలంగా కనిపించిన వెస్టిండీస్ చివరి ఐదు వికెట్లను కేవలం 61 పరుగులకే కోల్పోయి 499 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్ను 549/9 వద్ద డిక్లేర్ చేసిన శ్రీలంకకు 50 పరుగుల ఆధిక్యం లభించింది. అసిత ఫెర్నాండో ఐదు వికెట్లతో రాణించాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంకకు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ షాకిచ్చారు. లహిరు ఉదారా నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరగగా, నిషాన్ మదుష్కను అల్జారీ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ఆ క్లిష్ట సమయంలో దినేశ్ చండిమల్, కమిందు మెండిస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్కు అజేయంగా 60 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చండిమల్ 66 బంతుల్లో 40 పరుగులతో, కమిందు మెండిస్ 35 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్గా నిలిచారు.సంక్షిప్త స్కోర్లు:శ్రీలంక: 549/9 డిక్లేర్ & 92/2 (దినేశ్ చండిమల్ 40*, కమిందు మెండిస్ 30*)వెస్టిండీస్: 499 (జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112; అసిత ఫెర్నాండో 5/130)శ్రీలంకకు మొత్తం 142 పరుగుల ఆధిక్యంకాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
శ్రీలంకకు ధీటుగా బదులిస్తున్న వెస్టిండీస్
శ్రీలంక-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 549 పరుగులు (డిక్లేర్) చేయగా.. వెస్డిండీస్ లంక స్కోర్కు ధీటుగా బదులిస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.ధీటుగా బదులిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్ ఇంకా 231 పరుగులు వెనుకపడే ఉంది. మూడో రోజు ఆటలో విండీస్ బ్యాటర్లు షాయ్ హోప్ (86), జస్టిన్ గ్రీవ్స్ (85) లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అంతకుముందు ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (72) కూడా ఇంచుమించు ఇదే పని చేశాడు. మిగతా ప్లేయర్లలో బ్రాండన్ కింగ్ (17), ఆమీర్ జాంగూ (9) నిరాశపర్చగా.. కవెమ్ హాడ్జ్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య తలో 2 వికెట్లు తీశాడు.అంతకుముందు శ్రీలంక తరఫున ఓపెనర్ లహీరు ఉదార (188) భారీ శతకంతో కదంతొక్కాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోనల్ దినుష (92) సెంచరీ చేజార్చుకున్నాడు. కమిందు మెండిస్ (84) కూడా సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఔట్ కాగా.. కుసాల్ మెండిస్ (69) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో ధనంజయ డిసిల్వ 33, నిషన్ మధుష్క 6, దినేశ్ చండీమల్ 1, మిలన్ రత్నాయకే 15, విజేసుందెర 14, ప్రభాత్ జయసూర్య 17 (నాటౌట్) పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ తలో 2 వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేస్, కవెమ్ హాడ్జ్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్లో ఆరు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పరిమిత ఓవర్ల సిరీస్లలో పరాభవంకాగా ఐదు టీ20, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (West Indies tour of New Zealand, 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య కివీస్ 3-1తో గెలిచింది. వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ మేరకు పరిమిత ఓవర్ల సిరీస్లలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత.. వెస్టిండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టింది.తొలి టెస్టులో అసాధారణ పోరాటంక్రైస్ట్చర్చ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టును అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులిచ్చే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. తేజ్నరైన్ చందర్పాల్ (52), షాయీ హోప్ (Shai Hope- 56) మాత్రమే రాణించగా.. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 167 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. ఫలితంగా కివీస్కు తొలి ఇన్నింగ్స్లో 64 పరుగుల ఆధిక్యం లభించింది.హోప్ సెంచరీ, జస్టిన్ డబుల్ సెంచరీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. ఎనిమిది వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా విండీస్కు 531 (64+ 466)పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో షాయీ హోప్ (234 బంతుల్లో 140)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గ్రీవ్స్.. 388 బంతులు ఎదుర్కొని 19 ఫోర్ల సాయంతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి రోజు విండీస్కు చేతిలో 4 వికెట్లు ఉండి.. విజయానికి 74 పరుగుల దూరంలో ఉన్న వేళ.. సమయాభావం దృష్ట్యా ‘డ్రా’కు అంగీకరించాల్సి వచ్చింది.ఆరో స్థానంలో వచ్చిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా 31 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves)... టెస్టు క్రికెట్లో నాలుగో ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక ఇతరులలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ నాలుగో ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చి 221 పరుగులు చేయడం విశేషం.చదవండి: భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు


