breaking news
joopally krishanarao
-
అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!
అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వేలకు పైగా మంది ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు తీకొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడుచులు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ.. లయబద్దంగా కదులుతుంటే ఆడిటోరియం అంతటా సందడి నెలకొంది. వారిని అనుసరిస్తూ కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోతురాజులు, హైదరాబాదీ బ్యాండ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు మరువకూడదని, భావితరాలకు వారసత్వంగా అందించాలన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు అందించిన సహాకారం మరువలేనిదని తెలిపారు. అనంతరం యూఎస్ గవర్నమెంట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ అందరూ కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) వాషింగ్టన్ డీసీ ఛాప్టర్ కు ప్రోక్లమేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా డెలిగేట్ శ్రీనివాసన్ కన్నన్, అటార్నీ జనరల్ జేసన్ ఎస్. మియారెస్, లౌడన్ కౌంటీ సూపర్వైజర్ లౌరా సావినో, లౌడన్ కౌంటీ స్కూల్ బోర్డు డాక్టర్ సుమేరా రషీద్, డెమొక్రాట్ పార్టీ నేత శ్రీధర్ నాగిరెడ్డి, జీటీఏ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రెసిడెంట్ మునుకుంట్ల తిరుమల్ రెడ్డి , చైర్మన్ కళావల విశ్వేశ్వర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పడూరు శ్రీవన్ రెడ్డి , నేషనల్ ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, దేశినేని సంపత్, జీటీఏ వనిత టీమ్ తెలకుంట్ల జయశ్రీ , ప్రత్యూష నారపరాజు, సేరిపల్లి రేఖ తదిరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!) -
జూపల్లి కృష్ణరావును బీజేపీలోకి ఆహ్వానించా : డీకే అరుణ
-
కొల్లాపూర్లో హీటెక్కిన రాజకీయం
-
కేసీఆర్ ఏం చేసినా ప్రశ్నించకూడదా?
-
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దకొత్తపల్లి: కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం అమరగిరి పుష్కరఘాట్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆయన మాట్లాడారు. పుష్కర ఘాట్ల వద్ద బ్రాహ్మణులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు మంత్రికి తెలిపారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ అధికారులతో మంత్రి మాట్లాడారు. సోమశిల ఘాట్ల వద్ద ఉన్న కొంత మందిని అమరగిరి ఘాట్కు మార్చాలని సూచించారు. పని కల్పించాలని గిరిజనుల వినతి అమరగిరి పుష్కరఘాట్ల వద్ద తమకు పనులు కల్పించాలని గిరిజన మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి మహిళలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరబోటులో సోమశిల ఘాట్కు మంత్రి కృష్ణానదిపై వెళ్లారు. నదిలో కృష్ణానది తీరం వెంట ఉన్న అందాలను మంత్రి సెల్ఫోన్లో ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి అమరగిరి వరకు స్టీమర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి వెంట ఎంపీపీ వెంకటేశ్వర్రావు, నిరంజన్రావు, రాంమోహన్రావు, కొల్లాపూర్ జెడ్పీటీసీ హన్మంతునాయక్, అమరగిరి ఘాట్ అధికారి కృష్ణయ్య, నాగరాజు, తదితరులు ఉన్నారు.