Jatinder Singh
-
T20 WC 2026: ఆసీస్కు మరో ఘోర అవమానం!
వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో తిరుగులేని జట్టుగా ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియాకు.. టీ20 ఫార్మాట్లో మాత్రం అవమానాలే మిగులుతున్నాయి. పొట్టి క్రికెట్ వరల్డ్కప్లో ఒకే ఒక్కసారి (2021) విజేతగా నిలిచిన కంగారూలు.. తాజా ఎడిషన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు.టీ20 వరల్డ్కప్-2026లో గ్రూప్-బిలో భాగంగా తొలుత ఐర్లాండ్పై గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. శ్రీలంక చేతిలోనూ ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో ఒమన్ (AUS vs OMA)తో శుక్రవారం ఆసీస్ తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, ఈ మ్యాచ్కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి సమయంలో వారిని చిత్తు చేసే సువర్ణావకాశం తమకు ఉందని పేర్కొన్నాడు.ఆసీస్ను మేమూ చిత్తుగా ఓడిస్తాం‘‘ఈ మ్యాచ్లో మేము గెలిచేందుకు వంద శాతం అవకాశం ఉంది. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరైన సమయంలో సరైన విధంగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆసీస్ను చిత్తు చేయడం సులభం. మా జట్టు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తమదైన ముద్ర వేయాలని మా వాళ్లు ఆతురతగా ఎదురుచూస్తున్నారు’’ అని జతిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.ఘోర అవమానంకాగా ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా ఓడిస్తామంటూ సవాలు విసరడం గమనార్హం. దీంతో ఆసీస్ ఫ్యాన్స్.. ‘‘ఇది ఘోర అవమానం.. ఇకనైనా సరిగ్గా ఆడండి’’ అంటూ మార్ష్ బృందానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రూప్-బిలో జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఓడిపోయింది. ఇక 2024 వరల్డ్కప్ ఎడిషన్లో ఆసీస్ చేతిలోనూ చిత్తైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ సానుకూల దృక్పథంతో ఉండటం విశేషం.ఒమన్ జట్టుఅమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (కెప్టెన్), ఆశిష్ ఒడెదర, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), మహ్మద్ నదీమ్, జితేన్ రామనంది, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, షా ఫైసల్, షఫీక్ జాన్, కరణ్ సోనావాలే, జే ఒడెడ్రా, వసీం అలీఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మాట్ రెన్షా, మాథ్యూ కుహ్నెమాన్, స్టీవెన్ స్మిత్.UPDATE: మార్ష్ విధ్వంసం.. పసికూనను చిత్తుచేసిన ఆసీస్చదవండి: T20 WC 2026: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు! -
T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్ జట్టు జోరు కనబరుస్తోంది. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేతో ఒమన్ గురువారం తలపడింది.బెనెట్, ముసేకివా హాఫ్ సెంచరీలుకొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన వార్మప్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ (28 బంతుల్లో 56) మెరుపు అర్ధ శతకం బాదగా... బ్రెండన్ టేలర్ (20 బంతుల్లో 26) రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.వన్డౌన్లో వచ్చిన డియాన్ మేయర్స్ 26 పరుగులు చేయగా.. ర్యాన్ బర్ల్ (1), టోనీ మున్యోంగ (0), క్లైవ్ మండాడే (0) పెవిలియన్కు క్యూ కట్టారు. లోయర్ ఆర్డర్లో తషింగ ముసేకివా (28 బంతుల్లో 54 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఇక ఒమన్ బౌలర్లలో సూఫియాన్ మెహమూద్ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్ రెండు, షా ఫైజల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ 19.2 ఓవర్లలో పూర్తి చేసింది. జతిందర్, రామనంది ధనాధన్ఓపెనర్లలో ఆమిర్ కలీమ్ (23) ఫర్వాలేదనిపించగా.. జతిందర్ సింగ్ హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 55) చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. మిగిలిన వాళ్లలో హమాద్ మీర్జా (35), జితేన్ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయి ఒమన్ 188 పరుగులు సాధించింది. ఫలితంగా జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో జింబాబ్వే పన్నెండో స్థానంలో ఉండగా.. ఒమన్ది ఇరవయ్యవ ర్యాంకు. కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి ఒమన్ గ్రూప్-బిలో ఉంది.చదవండి: పాక్తో మ్యాచ్.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్ -
ఒమన్ వరల్డ్కప్ జట్టు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్లో ఒమన్ డిప్యూటీ కోచ్గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్కప్కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
IND vs OMAN: గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్: ఒమన్ కెప్టెన్
భారత్ వంటి పటిష్ట జట్టుపై పసికూన ఒమన్ (IND vs OMAN) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకుంది. వరల్డ్ నంబర్ వన్ టీమిండియా చేతిలో ఓటమిని అంతతేలికగా అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాటం చేసింది. చివరికి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ఈ మ్యాచ్ ఒమన్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గదిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ తర్వాత ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Jatinder Singh) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వాళ్ల ఆట తీరును చూస్తుంటే గర్వంగా అనిపించింది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం,.గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్ఎలాంటి పరిస్థితుల్లోనూ మా వాళ్లు పోరాట పటిమను వదల్లేదు. చివరి వరకు అద్భుతంగా పోరాడారు. ఇది నాకు గర్వకారణం. నిజానికి మా జట్టులో అంతగా అనుభవం ఉన్న ఆటగాళ్లులేరు. మా గురించి ఏమాత్రం హైప్ కూడా లేదు.అయినా సరే మేము ఇలా ఆడటం గొప్పగా అనిపించింది. మా దేశంలోనే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ జరుగబోతున్నాయి. ఇందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. పపువా న్యూగినియా, సమోవా జట్లను మేము ఎదుర్కోబోతున్నాము.అతడు హైలైట్ఏదేమైనా టీమిండియాతో మ్యాచ్లో మా వాళ్లు సూపర్. ముఖ్యంగా జితేన్ రామ్నంది రనౌట్లతో హైలైట్ అయ్యాడు. అతడు టీమ్ మ్యాన్. జట్టు కోసం ఏమైనా చేస్తాడు’’ అని జతీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ బౌలింగ్ ఆల్రౌండర్ జితేన్ రామ్నంది రెండు వికెట్లు తీయడంతో పాటు.. హార్దిక్ పాండ్యా (1), అర్ష్దీప్ సింగ్ (1)లను రనౌట్ చేశాడు.ఇక ఒమన్ బ్యాటర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఆమిర్ ఖలీమ్ (46 బంతుల్లో 64), వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) మెరుపులు మెరిపించారు. అయితే, 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఒమన్ 167 పరుగులకే పరిమితమైంది.టీమిండియా వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్పై 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (టీమిండియా- 45 బంతుల్లో 56).Awww… we agree with you @sanjaymanjrekar 😊Sending some virtual hugs from us too Jatinder! 🤗Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/A6ZIElXmhl— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్!


