-
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్ల హైలైట్స్
-
Virat Kohli: ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు.. గర్వం అణిగిందా?
Virat Kohli Misses 2nd Test: దక్షిణాఫ్రికాతో వాండరర్స్ టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెటేతర కారణాల వల్లే అతడు ఆఖరి నిమిషంలో వైదొలిగాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వెన్ను నొప్పి కారణంగానే దూరమైతే... ఆదివారం నాటి పత్రికా సమావేశంలో ఎందుకు అప్డేట్ ఇవ్వలేదంటూ ఆరాలు తీస్తున్నారు. కాగా రెండో టెస్టు కోసం కోహ్లి నెట్స్లో తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. ఈ నేపథ్యంలో ప్రొటిస్తో మ్యాచ్లో సెంచరీ బాది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ... టాస్ సమయంలో జట్టుకు కోహ్లి దూరమయ్యాడన్న వార్త బయటకు వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా అతడు రెండో టెస్టు నుంచి తప్పుకొన్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో హేటర్స్ మాత్రం కోహ్లి ఫిట్నెస్పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు.. ‘‘కోహ్లి ఫిట్నెస్ నుంచి అభిమానులు గొప్పలు చెప్పుకుంటారు కదా.. ఇప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. కొత్త ఏడాది మొదటి మ్యాచ్కే మీ కెప్టెన్ దూరమయ్యాడు. ఇప్పుడేమంటారు.. గర్వం అణిగిందా. ముఖాలు మాడిపోయాయా’’ అంటూ వ్యంగ్య రీతిలో స్పందిస్తున్నారు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి రాగా... కేఎల్ రాహుల్ కెప్టెన్గా, బుమ్రా అతడికి డిప్యూటీగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్కోచ్! Kohli fans were bragging about his fitness and now their faces are in mud .. poetic justice#INDvsSA#INDvSA#SAvsIND#SAvIND — Mishra 🇮🇳 (@itsAKMishra__) January 3, 2022 Toota hai Virat Kohli ki fitness ka ghamand pic.twitter.com/XpABP8xgXq — Sudhanshu Ranjan Singh (@memegineers_) January 3, 2022 Virat shared pictures, trained at nets. No way he has a fitness issue. No mention of it in yesterday's PC. #Kohli — Arpan (@ThatCricketHead) January 3, 2022 Kohli's century drought has now extended to him not being able to play his 100th Test on time #INDvSA — AayushKataria (@aayush11kataria) January 3, 2022 -
ఆజమ్ కంటే రిజ్వాన్ బెటర్... భారత్ నుంచి ఒక్కడే.. నా ఫేవరెట్ జట్టు ఇదే!
ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు మధురానుభూతులు పంచితే.. మరికొన్ని టీమ్లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ముఖ్యంగా తమకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి ఆస్ట్రేలియా పండుగ చేసుకుంటే.. టీమిండియా కనీసం మెగా టోర్నీ సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. మరోవైపు భారత దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఈ మేజర్ ఈవెంట్ టైటిల్ గెలవలేకపోయినా.. పూర్తి స్థాయి పోరాటపటిమ కనబరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గానూ తన అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే... ఇద్దరు పాక్ ఆటగాళ్లకు చోటిచ్చాడు. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్బజ్తో చాట్ సందర్భంగా.... జట్టు ఎంపికలో తాను పరిగణనలోకి తీసుకున్న అంశాలను ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజమ్.. మహ్మద్ రిజ్వాన్ ఇద్దరి గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇద్దరి స్ట్రైక్ రేటు దాదాపుగా.. 130 ఉంది. ఇద్దరికీ ఈ ఏడాది చాలా బాగా కలిసివచ్చింది. అయితే, పవర్ప్లేలో స్ట్రేక్ రేటును బట్టి వీరిద్దరిలో నేను రిజ్వాన్ వైపే మొగ్గు చూపుతాను. ఇక ఆల్రౌండర్ల విషయానికొస్తే ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ను ఎంపిక చేసుకుంటాను. బౌలర్లలో రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, బుమ్రాను ఎంచుకుంటాను. ఓపెనర్లుగా జోస్ బట్లర్, రిజ్వాన్ నా ఛాయిస్’’ అని హర్షా బోగ్లే చెప్పుకొచ్చాడు. హర్షా బోగ్లే 2021 అత్యుత్తమ టీ20 జట్టు: జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: David Warner: ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి -
Virat Kohli: వాళ్లంతా ఐపీఎల్లో ఓకే.. మరి టీ20 ప్రపంచకప్లో..?
T20 World Cup 2021: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరల్డ్ టీ20 మొట్టమొదటి జగజ్జేతగా నిలిచిన టీమ్... మేటి ఆటగాళ్లు గల జట్టు... అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న వైనం... అన్నింటికీ మించి.. మెంటార్గా... చివరి నిమిషంలో కూడా ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి, ఊహకందని వ్యూహాలు రచించగల.. చాణక్యం తెలిసిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని... వెరసి ఈసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది విరాట్ కోహ్లి సేన. సామాన్య క్రీడాభిమానులే కాదు... ఎంతో మంది దిగ్గజాలు, పోటీలో పాల్గొనే జట్లకు చెందిన స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు సైతం టైటిల్ ఫేవరెట్ టీమిండియానే అని చెబుతున్న తరుణం... మరి ఇన్ని అంచనాల నడుమ దాయాది పాకిస్తాన్తో మ్యాచ్తో వరల్డ్కప్ వేట మొదలుపెడుతున్న భారత జట్టులో ఎవరి రికార్డు ఎలా ఉంది? కెప్టెన్గా మొట్టమొదటి.. చివరి టీ20 ప్రపంచకప్ ఆడనున్న కోహ్లికి ఈ టోర్నీ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందా?! ►ఐసీసీ మెగా టోర్నీ సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించిన టీమిండియా.. గ్రూప్-2లో ఉంది. 15 మంది సభ్యులతో బీసీసీఐ ప్రకటించిన జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్. మెంటార్: ఎంఎస్ ధోని ►ఇలా మొత్తంగా ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక వికెట్ కీపర్(రిషభ్ పంత్).. ఇలా సమతౌల్యమైన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. వారే ఓపెనర్లు.. వార్మప్ మ్యాచ్లలో ఓపెనింగ్ స్థానాల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లను బరిలోకి దించారు. అయితే, మేజర్ టోర్నీలో కేఎల్, హిట్మ్యాన్ను పంపుతామని ఇప్పటికే కోహ్లి ప్రకటించాడు. విరాట్ కోహ్లి(కెప్టెన్)(Virat Kohli) కెప్టెన్గా పలు చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు కోహ్లికి ఉంది. అయితే, బ్యాటర్గా మాత్రం అతడికి తిరుగులేదు. ముఖ్యంగా... టీ20 ఫార్మాట్.. వరల్డ్కప్ ఈవెంట్లలో కోహ్లికి మంచి రికార్డు ఉంది. 2014, 2016 టోర్నీలలో ఈ ‘రన్ మెషీన్’ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలవడం విశేషం. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సుదీర్ఘ కాలం టాప్లో కొనసాగిన కోహ్లి.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. చాలా రోజులుగా అతడి ఖాతాలో సెంచరీ లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన కోహ్లి.. ఈ సీజన్లో 15 మ్యాచ్లలో 15 ఇన్నింగ్స్ ఆడి 405 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు: 72 నాటౌట్. ఇక తొలి మ్యాచ్లో భాగంగా.. టీ20 మెగా టోర్నీలో పాకిస్తాన్పై కోహ్లి అజేయ రికార్డు కలిగి ఉండటం తొలి మ్యాచ్లో కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు పాక్తో మూడు మ్యాచ్ల(2012, 2014,2016)లో ఆడిన కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. వరుసగా 78, 38, 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)(Rohit Sharma) హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్గా మంచి రికార్డు ఉంది. స్ట్రైక్రేటు పరంగా చూసినా... అనుభవం దృష్ట్యా.. హిట్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేగాక సారథిగానూ ఐపీఎల్లో అత్యద్భుత రికార్డు రోహిత్ శర్మ సొంతం. ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత అతడిది. ఇక టీ20 వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి స్థానంలో రోహిత్ టీ20 పగ్గాలు చేపట్టడం లాంఛనమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి.. రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్తో కలిసి మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నమోదు చేస్తే టీమిండియా దూసుకుపోవడం ఖాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో విశేషం ఏమిటంటే... ఇప్పటి వరకు జరిగిన 6 టీ20 వరల్డ్కప్లలో టీమిండియా తరఫున ఆడిన ఏకైక క్రికెటర్గా రోహిత్కు ఉన్న అపార అనుభవం అదనపు బలం. కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటర్గా తన సత్తా ఏమిటో ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021 సీజన్లో మరోసారి నిరూపించాడు కేఎల్ రాహుల్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన అతడు... 13 మ్యాచ్లలో 13 ఇన్నింగ్స్ ఆడి.. 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. కేఎల్ రాహుల్ ఫామ్ గురించి చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. ఏ స్థానంలోనైనా ఆడగల సమర్థత రాహుల్కు ఉండటం అదనపు బలం. అవసరమైన సమయాల్లో వికెట్ కీపర్గా కూడా తన సేవలు అందించగలడు. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ అందరితో పోలిస్తే కాస్త ఆలస్యంగానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్గా ఉన్న సూర్య... ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనతో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ(317 పరుగులు).. టోర్నీ చివర్లో ఫామ్లోకి రావడం, వార్మప్ మ్యాచ్లోనూ రాణించడంశుభపరిణామం. అయితే, తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్న ఒత్తిడిని సూర్య ఎలా అధిగమిస్తాడో చూడాలి! రిషభ్ పంత్(Rishabh Pant) టీమిండియా యువ సంచలనం రిషభ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా సత్తా చాటుతూ... ఎంఎస్ ధోని వారసుడిగా పేరొందాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్ను టేబుల్ టాపర్గా నిలిపి సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు పంత్. బ్యాటర్గానూ 419 పరుగులతో సత్తా చాటాడు. ఇక టీ20 వరల్డ్కప్ టోర్నీలో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ పాత్ర కీలకం. టెస్టు, వన్డే, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్లలో తను మంచి రికార్డు కలిగి ఉన్నపటికీ... కొన్నిసార్లు అనవసర షాట్లు ఆడి.. వికెట్ సమర్పించుకోవడం అతడి బలహీనత. ఇషాన్ కిషన్(Ishan Kishan) శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్. ముంబై ఇండియన్స్ తరఫున సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్ కిషన్... ఈసారి(241 పరుగులు) పెద్దగా రాణించలేదు. కానీ, తనదైన రోజు చెలరేగి ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా అతడికి ఉంది. ఇటీవలి వార్మప్ మ్యాచ్లోనూ ఇరగదీసి తన విలువేంటో నిరూపించుకున్నాడు. ఇక టీ20 వరల్డ్కప్ టోర్నీకి ఓపెనర్గా ఎంపికయ్యావని కోహ్లి తనతో వ్యాఖ్యానించినట్లు వెల్లడించిన ఇషాన్ కిషన్.. అన్నీ కుదిరితే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం లేకపోలేదు. అన్నట్టు ఇషాన్ కిషన్కు ఇదే తొలి వరల్డ్కప్. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జడేజా. ఇటు బౌలింగ్లోనూ.. అటు బ్యాటింగ్లోనూ సత్తా చాటడమే కాదు.. ఫీల్డింగ్లోనూ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకోగలడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో 227 పరుగులు చేసిన జడ్డూభాయ్... 13 వికెట్లు తీసి.. చెన్నై సూపర్కింగ్స్ నాలుగోసారి చాంపియన్గా నిలిచే క్రమంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇలా జడేజా ఫామ్లో ఉండటం శుభపరిణామం. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీమిండియా స్టార్ ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. విధ్వంసకర షాట్లతో విరుచుకుపడటం సహా... పదునైన బంతులతో బ్యాటర్లను తిప్పలు పెట్టగల ప్రతిభ అతడి సొంతం. అయితే, గాయం కారణంగా కొన్ని రోజులు జట్టుకు దూరం కావడం... ఇటీవలి ఐపీఎల్(బౌలింగ్ చేయలేకపోయాడు)లోనూ పెద్దగా రాణించకపోవడం కాస్త ఆందోళనకరంగా పరిణమించింది. అయితే, తనదైన రోజున బ్యాటర్గా రాణించగల హార్దిక్ ప్రతిభపై కోహ్లి నమ్మకం ఉంచితే తుదిజట్టులో అతడిని చూసే అవకాశాలు ఉంటాయి. శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో మెరుగ్గా రాణించి తన విలువేమిటో నిరూపించుకున్నాడు శార్దూల్ ఠాకూర్. అంతేకాదు ఐపీఎల్-2021లో విశ్వరూపం ప్రదర్శించి 21 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్గా నిలిచిన ‘షేర్’దూల్.. చెన్నై చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి సీఎస్కే కెప్టెన్, టీమిండియా టీ20 మెంటార్ ఎంఎస్ ధోని నమ్మకం చూరగొన్న అతడు... చివరి నిమిషంలో బౌలింగ్ ఆల్రౌండర్గా టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో 15 మంది సభ్యుల్లో ఒకడిగా చేరాడు. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) వాస్తవానికి టీ20 వరల్డ్కప్ జట్టులో అశ్విన్కు చోటు దక్కడం అనూహ్యమనే చెప్పాలి. సుమారు నాలుగేళ్ల క్రితం భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఆడిన అశూను ఎంపిక చేయడం సామాన్యులనే కాదు... క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ టూర్(టెస్టు)లో అశ్విన్కు సరైన అవకాశాలు లభించలేదనే కారణంతోనే.. ఇప్పుడు అవకాశం ఇచ్చారా అంటూ కొందరు మాజీలు ప్రశ్నించడం గమనార్హం. అయితే, అత్యుత్తమ స్పిన్నర్గా అశ్విన్కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేశారనడంలో సందేహం లేదు. కానీ... తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) యార్కర్ల కింగ్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన బంతులు విసురుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో దిట్ట. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రా బలం. ఇక ఐపీఎల్-2021లో ముంబై తరఫున 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా... టీ20 ప్రపంచకప్లోనూ తన సత్తా చాటడం ఖాయంగానే కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) స్వింగ్ కింగ్గా భువీకి పేరుంది. మ్యాచ్ ఆరంభ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయడం అతడి బలం. అయితే, ఐపీఎల్-2021లో భువీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ తరఫున 11 ఇన్నింగ్స్లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అయితే, అనుభవం దృష్ట్యా భువీ వంటి పేసర్ తమకు ఎప్పుడూ అవసరమేనని, తన ఎంపిక సరైందనేని కోహ్లి.. టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్ల సమావేశంలో చెప్పడం భువనేశ్వర్ విలువేమిటో చాటుతోంది. మహ్మద్ షమీ(Mohammed Shami) ఐపీఎల్లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న షమీ.. కచ్చితత్వంతో వేగంగా బంతులు విసరడంలో తనకు తానే సాటి. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2021లోనూ పంజాబ్ తరఫున ఆడిన షమీ 19 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ చహర్(Rahul Chahar) రాహుల్ చహర్ ఎంపిక సైతం క్రీడాభిమానులను, కొంతమంది మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక బౌలర్ అయిన యజువేంద్ర చహల్ను కాదని... రాహుల్ను ఎంపిక చేయడమే ఇందుకు కారణం. ఫామ్ లేమిని కారణంగా చూపి.. తనను పక్కన పెట్టిన సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పని నిరూపించేలా.. ఐపీఎల్-2021లో ఆర్సీబీ తరఫున 18 వికెట్లు తీసి మెరుగ్గానే రాణించాడు చహల్. అదే సమయంలో... రాహుల్(13 వికెట్లు).. చహల్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్ను అని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. మరి సెలక్టర్లు తన మీద ఉంచిన నమ్మకాన్ని అతడు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడని చాలా మంది మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తన బంతులతో బ్యాటర్లను తికమక పెట్టగల వైవిధ్యమైన బౌలింగ్ శైలి అతడి సొంతం. ఐపీఎల్-2021లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున మైదానంలో దిగిన వరుణ్ చక్రవర్తి... 18 వికెట్లతో సత్తా చాటాడు. ఇక వార్మప్ మ్యాచ్లలో వరుణ్ను ఆడించకపోవడం చూస్తుంటే... ప్రధాన ఆయుధాన్ని దాచి.. అసలైన సమరంలో అతడిని రంగంలోకి దించి మెరుగైన ఫలితాలు రాబట్టడమే వ్యూహమని తెలుస్తోంది. - సాక్షి వెబ్స్పెషల్ మరి... 2007లో విజేతగా నిలిచినా.. ఆ తదుపరి వరల్డ్కప్ అంటే 2009లో తొలి రౌండ్లో వెనుదిరిగిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది టీమిండియా. అయితే 2010, 2012లో సూపర్ 8, 2014లో రన్నరప్, 2016లో సెమీస్కు చేరి సత్తా చాటింది. మరి... కెప్టెన్గా కోహ్లికి, కోచ్గా రవిశాస్త్రికి చివరిదైన ఈ టీ20 వరల్డ్కప్ను టీమిండియా గెలుస్తుందంటారా?! మీ అభిప్రాయం చెప్పండి. -
WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్దే గెలుపు!
న్యూఢిల్లీ: ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకునే బుమ్రా.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత్కు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ఒకవేళ అతడు గనుక ఫాం కొనసాగిస్తే న్యూజిలాండ్పై భారత్ గెలిచే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా పేస్ దళంలో బుమ్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే 83 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి జట్లపై టెస్టు ఫార్మాట్లో ఐదు వికెట్లు(ఒకే ఇన్నింగ్స్) తీసిన తొలి ఆసియా బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ... ‘‘ 3-4 ఐపీఎల్ మ్యాచ్లు చూశాను. బుమ్రా మంచి ఫాంలో ఉన్నాడు అనిపించింది. తనొక ప్రత్యేకమైన బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ప్రధాన పేసర్ తను. షార్ట్ బంతులు సంధించి వికెట్లు పడగొట్టగలడు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా.. డబ్ల్యూటీసీలో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. తను ఫాంలో ఉంటే మనకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.’’ అని మాజీ సెలక్టర్ సబా కరీం అభిప్రాయపడ్డాడు. కాగా జూన్లో న్యూజిలాండ్తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement