breaking news
irani cafe
-
ఆ రెస్టారంట్ మె‘న్యూ’ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే..
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లు ఈ మధ్యనే కాస్త పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని రెస్టారెంట్లు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తు్తంటే..ఫుణేలోని ఓ రెస్టారెంట్ వింత మెనూతో ముందుకొచ్చింది. సాధారణంగా మెనూలో ఆహార పదార్థాల లిస్టు ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్.. మెనూలో ‘డూస్ అండ్ డోంట్స్’ అంటూ విచిత్ర జాబితా పెట్టి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. విచిత్రంగా వ్యవహరిస్తున్న ఈ రెస్టారెంట్ పేరు ‘ఇరానీ కేఫ్’. ఈ కేఫ్లో ఎంతో రుచికరమైన తినుబండారాలు తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే రెస్టారెంట్ ఫుడ్ మెనూలో రెండు డజన్ల వింత నిబంధనలను చేర్చింది యాజమాన్యం. రెస్టారెంట్కు వెళ్లినవారు, రెస్టారెంట్ పరిసరాల్లో ఉన్న వారంతా తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాల్సిందేన ట. నిబంధనల్లో ‘‘నో స్మోకింగ్, నో అవుట్ సైడ్ ఫుడ్, నో బార్గెయినింగ్, నో బ్రషింగ్ టీత్, నో స్లీపింగ్, నో కోంబింగ్, నో ఫ్రీ అడ్వైస్, గాంబ్లింగ్ గురించి చర్చించకూడదు, చిల్లర అడగడం వంటివాటిని రెస్టారెంట్లో అనుమతించరు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఈ నిబంధనలు నచ్చుతుంటే మరికొందరికి ఊపిరి కూడా పీల్చుకోవద్దు అంటారా ? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఈ రెస్టారెంట్కు ఒక్కసారైనా వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. -
అందరి చూపు ఆ కేఫ్ వైపే!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్ట్ గ్యాలరీలు అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇక కాఫీడేలు, కల్చరల్ సెంటర్లలోని ఎగ్జిబిషన్ హాల్స్ సైతం ప్రముఖులకో, మేధావులకో అందుబాటులో ఉంటాయి. అక్కడ నిర్వహించే ఫొటో ప్రదర్శనలను తిలకించే అవకాశం సామాన్యులకు సు‘దూరమే’. ఈ దూరాన్ని చెరిపేయాలనుకున్నారు నగరానికి చెందిన ‘ఫొటో వాకర్స్’. సిటీ ఐడెంటిటీ సింబల్స్లో ఒకటైన ఇరానీ కేఫ్నే ఫోటో ఎగ్జిబిషన్కు వేదిక చేసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్స్ అనగానే ఏ గ్యాలరీ అనే ప్రశ్నే వస్తుంది. అయితే వీటిని సామాన్యులకు చేరువ చేయాలనే ట్రెండ్ ఇటీవలే మొదలైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇవి ఇప్పటికే సామాన్యుడి ముంగిటకు వచ్చేశాయి. ఏకంగా బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు.. ఇలా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెతికి మరీ ఎక్స్పోలను ఆరెంజ్ చేస్తున్నారు. నగరానికి ఈ ట్రెండ్ని పరిచయం చేస్తూ ఎక్కువ జనాలు వచ్చే ఇరానీ కేఫ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సిటీ లుక్.. సిటిజన్స్ క్లిక్.. ఈనెల 19న అబిడ్స్లోని హోటల్ గ్రాండ్ ఇరానీ కేఫ్లో ఫొటో గ్రాఫర్స్ గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. మధ్య తరగతి, సామాన్య జనాన్ని అందుకునేందుకు సిటీలో తొలిసారిగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, నగరం నలుమూలల్నీ ప్రతిబింబించే ఫొటోలను, నగరవాసులే తీసిన నేపధ్యంలో ఈ ప్రదర్శనను ఏదైనా రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టాలని అనుకున్నామని చెప్పారు నిర్వాహకులు. తాము ఆశించినట్టే గ్యాలరీల కన్నా మిన్నగా గంటకి కనీసం 50 నుంచి 70 మంది సందర్శకులు వీటిని వీక్షిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్పిరిట్ ఆఫ్ సిటీ.. ఈ ఎగ్జిబిషన్ కోసం ‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ టైటిల్తో ఫొటోలు పంపించాల్సిందిగా కోరామని, వందలాదిగా ఎంట్రీలు వచ్చాయని, అందులో నుంచి ప్రత్యేకమైన ఫొటోలను ఎంపిక చేసినట్టు హైదరాబాద్ ఫొటోగ్రాఫర్స్ క్యూరేటర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. మన సిటీకి చెంది హైదరాబాద్ వీకెండ్ షూట్ టీం మెంబర్స్తో పాటు హైదరాబాద్ ఫొటో వాకర్స్.. వీకెండ్స్లో సిటీలో సంచరిస్తూ.. నచ్చిన దృశ్యాన్ని క్లిక్మనిపించిన వాటిలో నుంచి ఉత్తమ ఫొటోలను తీసుకున్నారు. అజయ్ కుమార్ పాణిగ్రాహి, ఆశ సతీశ్, బాబీ చౌదరి, చంద్ర కూచిభొట్ల, దీపాలు శర్మ, ద్వారకానాథ్ కీర్తి.. ఇలా ఆ వీకెండ్ షూట్ టీంలోని 20 మంది టాప్ ఫొటోగ్రాఫర్ల ఎక్స్క్లూజివ్ ఫొటోస్ని ఈ ఇరానీ కేఫ్ ఎక్స్పోలో ఉంచారు. కామన్ పీపుల్ సైతం కేఫ్లోని ఇరానీ చాయ్ని ఆస్వాదిస్తూ ఫొటోగ్రాఫ్్సని చూస్తూ వాటి వెనక స్టోరీని తెలుసుకుంటూ.. ఫొటో గ్రాఫర్స్తో సెల్ఫీలు దిగుతూ కొత్త థ్రిల్ని ఎంజాయ్ చేస్తున్నారని చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.