breaking news
Intersection
-
Chicago: 100 కార్లతో రేసింగ్.. తుపాకులతో విధ్వంసం..
వాషింగ్టన్: అమెరికా చికాగో ఇంటర్సెక్షన్లో షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది కలిసి 100 కార్లతో డ్రాగ్ రేసింగ్ నిర్వహించి విధ్వంసం సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరిపి రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికాగో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే రేమండ్ లోపేజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డ్రాగ్ రేసింగ్ కారవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇవి వీధుల్లో తమషా కోసం నిర్వహించే గేమ్స్ కాదని మండిపడ్డారు. ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో చికాగో ఇంటర్సెక్షన్ను కొన్ని గ్యాంగ్లు కలిసి 100 కార్లతో తమ నియంత్రణలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నడిరోడ్డుపై రేసింగ్లు నిర్వహించి స్టంట్లు చేశారని పేర్కొన్నారు. మొత్తం 13 సార్లు కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఐదుగురు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్.. -
విభజనకు సిద్ధం
కొత్త జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం సంస్థ డైరెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ల సమావేశంలో వెల్లడి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్న జిల్లా కార్యదర్శి చిరిగినచొక్కనైనా వేసుకో.. కానీ ఓ మంచిపుస్తకం కొనుక్కో అన్నాడు ఓ మహానుభావుడు.. ఎందుకంటే పుస్తకం ఓ మంచి స్నేహితుడిలాగా మార్గదర్శకం చేస్తూ గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాంటి పుస్తకాల విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు. స్వాతంత్య్ర ఉద్యమనాటి కాలం నుంచి గ్రంథాలయాల పాత్ర కీలకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎందరో మహనీయులు, పేద విద్యార్థులకు ఆకలింపుగా ఉన్న గ్రంథాయాలు నేడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల వారీగా విభజనకు సిద్ధమవుతున్నాయి. – ఆదిలాబాద్ కల్చరల్ ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాల పునర్విభజన పూర్తయిన నాలుగు నెలల తర్వాత గ్రంథాలయాల పునర్విభజనకూ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖతో కలిసి సమావేశం నిర్వహించింది. జనవరి 4న గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ, విద్యాశాఖ కమిషనర్ కిషన్, ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లోని కార్యదర్శులు, చైర్మన్ (ప్రస్తుత జేసీలు)లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇందులో పునర్విభజనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని, కొత్త జిల్లాలో గ్రంథాలయసంస్థ కార్యాలయాలు, సెంట్రల్ లైబ్రరీలకు స్థలాలను పరిశీలించాలని చెప్పినట్లు సూచించారు. దీంతో కొత్త జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మినహా, నిర్మల్, మంచిర్యాల జిల్లాకేంద్రాల్లో జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదర్శనగర్లోని గ్రంథాలయంలో 1200 గజాలతో కూడిన స్థలంలో ఆరు గదులతో నిర్మించబడిన భవనాన్ని జిల్లా గ్రంథాలయసంస్థ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాలలోని గాంధీపార్క్ రోడ్డులోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సుమారు వెయ్యి గజాల స్థలంలో కార్యాలయం ఏర్పాటుకు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎకరం విస్తీర్ణంలో కార్యాలయం, సెంట్రల్ లైబ్రరీ కొనసాగుతోంది. కాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్థలం లేక పోగా గ్రంథాలయ కార్యదర్శి ప్రభాకర్ ఆ జిల్లా కలెక్టర్కు స్థలం కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ అంశం డీఆర్వోకు అప్పగించినట్లు తెలిసింది. కాగా త్వరలో ఆ జిల్లాలోనూ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించనున్నారు. విభజనలో గ్రంథాలయాలు, ఉద్యోగులు, పుస్తకాలు ► ఆదిలాబాద్ జిల్లాలో 18మండలాలుండగా 13 మం డలాల్లో గ్రంథాయాలున్నాయి. వీటిలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుండగా 1,28,259 పుస్తకాలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ గాదిగూడ, భీంపూర్, ఆదిలాబాద్రూరల్, సిరికొండ, మావల మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ►నిర్మల్ జిల్లాలో 18మండలాలుండగా 16 మండలాల్లో గ్రంథాయాలు పని చేస్తున్నాయి. వీటిలో 14మంది రెగ్యులర్ ఉద్యోగులు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండగా 1,30,014 పుస్తకాలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ (రూరల్), దస్తూరాబాద్, సోన్ మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ►మంచిర్యాల జిల్లాలో 18మండలాలుండగా 14గ్రంథాయాలు పని చేస్తున్నాయి. వీటిలో రెగ్యులర్ ఉద్యోగులు 8మంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఐదుగురు పని చేస్తుండగా 1,19,865 పుస్తకాలున్నాయి. ఇందులో వేమనపల్లి మండలంలో గ్రంథాలయం ప్రారంభానికి నోచుకోలేదు. కొత్తగా ఏర్పడ్డ నర్సాపూర్, హాజీపూర్, కన్నెపల్లి, భీమారం మండలాల్లో గ్రంథాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ►కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15మండలాలుండగా తొమ్మిది మండలాల్లోనే గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో రెగ్యులర్గా ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తుండగా 64,141 పుస్తకాలున్నాయి. తిర్యాణి, బెజ్జూర్, దహేగాం మండలాల్లో గ్రంథాలయాలు ప్రారంభానికి నోచుకోలేదు. కొత్తగా ఏర్పడ్డ లింగాపూర్, పెంచికల్పేట్, చింతమణి పల్లె మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన జి ల్లా కేంద్రాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనూ స్థలానికి కలెక్టర్కు విన్నవించాం. త్వరలో డీఆర్వోను కలిసి స్థల వివరాలు సేకరించనున్నాం. యుద్ధప్రాతిపాదికన జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. – ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
రెండుగా ఆర్టీఏ కార్యాలయం
ముమ్మరంగా విభజన ఏర్పాట్లు నాలుగు జిల్లాల ఫైళ్ల ఆన్లైన్ పూర్తి హుజూరాబాద్, ములుగులో సబ్ ఆర్టీఏలు ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయ విభజన వేగవంతమైంది. ప్రస్తుత వరంగల్ రవాణా శాఖలో రెండు జిల్లాల పనులు సాగుతున్నాయి. నూతనంగా వరంగల్, హన్మకొండ, జయశంకర్ జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 1 నుంచే కొత్త కార్యాలయాల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు భూపాలపల్లిలో ఓ అద్దె భవనంలో జిల్లా కార్యకలాపాలకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మహబూబాబాద్లో సబ్ ఆర్టీఏ కార్యాలయంలోనే జిల్లా కార్యాలయం ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. వరంగల్ ఆర్టీఏ ప్రధాన భవనం పైఫ్లోర్లో హన్మకొండ, గ్రౌండ్ ఫోర్లో వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీఏ విభజన పనులతోపాటు కార్యాలయాల మరమ్మతులు వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా రవాణాశాఖ కమిషనర్ ఉత్తుర్వుల మేరకు నాలుగు జిల్లాల స్టేషనరీ చేరింది. ఈమేరకు సోమవారం డీటీసీ శివలింగయ్య కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడుతున్న జిల్లా కార్యాలయాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలకు సంబంధించిన విభజన ఫైళ్లను ఆన్లైన్లోనే నమోదు చేశామని, ప్రభుత్వం అందజేసిన స్టేషనరీ చేరుకుందని చెప్పారు. ఉద్యోగుల విభజన సైతం పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న జనగామ సబ్ కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. వాహనదారుల సౌకర్యార్థం నూతనంగా ములుగు, హుజూరాబాద్లో సబ్ కార్యాలయాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీలోగా నూతన కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి దసరా నుంచి కొత్త కార్యాలయాల్లో పనులు ప్రారంభించనున్నట్లు డీటీసీ తెలిపారు.