breaking news
Indian women archery team
-
భారత మహిళల ఆర్చరీ జట్టు: ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే!
అంటాల్యా (టర్కీ): టాప్–4లో నిలిచి దర్జాగా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆర్చరీ జట్టుకు నిరాశ ఎదురైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో దీపిక కుమారి, అంకిత, భజన్ కౌర్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.భారత జట్టు 3–5 (51–51, 55–52, 53–54, 52–54)తో వెరోనికా, అనస్తాసియా, ఒలాలతో కూడిన ఉక్రెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో సెమీఫైనల్కు చేరిన చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించాయి.క్వాలిఫయింగ్ టోర్నీ లో ఓడినప్పటికీ భారత జట్టుకు వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందే చివరి అవకాశం మిగిలి ఉంది. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ ముగిశాక ఈనెల 24న ప్రపంచ ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు.ఇప్పటికీ ఒలింపిక్స్కు అర్హత పొందని రెండు ఉత్తమ ర్యాంక్ జట్లకు ‘పారిస్’ బెర్త్లు ఖరారవుతాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్, అమెరికా, చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. చివరి రెండు బెర్త్లను వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా ఖరారు చేస్తారు. -
క్వార్టర్స్కు భారత ఆర్చరీ టీమ్
భారత మహిళల ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో భారత మహిళల టీమ్ విజయం సాధించింది. కొలంబియాపై 5-3 తేడాతో గెలుపొంది భారత మహిళల జట్టు క్వార్టర్ పైనల్లోకి ప్రవేశించింది. తొలి సెట్ 52-51తో గెలిచిన దీపికా కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి బృందం రెండో సెట్ లో 49-50 తో వెనుకంజ వేసింది. మూడో సెట్లో 52-52 తో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో నిర్ణయాత్మక సెట్ నిర్వహించారు. ఈ సెట్ లో భారత్ 52 పాయింట్లు కొల్లగొట్టగా, కొలంబియా మహిళల జట్టు కేవలం 44 పాయింట్లు స్కోరు చేయడంతో ఓటమి పాలైంది. భారత మహిళల ఆర్చరీ బృందం క్వార్టర్స్ లో రష్యాతో తలపడనుంది.