Indian soldiers
-
సియాచిన్, గల్వాన్లకు సైతం మొబైల్ కనెక్టివిటీ
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్లో 5జీ మొబైల్ టవర్ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు. -
మార్చి 15 కల్లా సైన్యాన్ని ఉపసంహరించుకోండి
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. హిమాచల్ సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
జమ్మూలో భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్ల కాల్పులు
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. -
భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు. ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
చైనాను నమ్మలేం... అప్రమత్తతే రక్ష!
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్లలో పెట్రోలింగ్కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం. భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది. కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి. ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు. ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు. సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్లో ఒక ఫార్వర్డ్ పోస్ట్ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్లలో పెట్రోలింగ్కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఒబామా వైట్హౌస్లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. 2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం. చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి. అవినాష్ కోల్హే వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్ -
చైనా దూకుడుకు కారణాలెన్నో!
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి. ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే. ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి. దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి. అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు. జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది. అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం. రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్ను టిబెట్ ప్రావిన్స్తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా. మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం. ఈ పరిస్థితుల మధ్య భారత్తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది. చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
మన సైనికులకు సెల్యూట్: రాజ్నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్పవర్గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
1857 సిపాయిల తిరుగుబాటు: వీరుల అస్థిపంజరాలు లభ్యం
బ్రిటిష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్లోని బయటపడ్డాయి. అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. Chandigarh| These skeletons belong to 282 Indian soldiers killed during India's 1st freedom struggle against the British in 1857. These were excavated from a well found underneath religious structure in Ajnala near Amritsar, Punjab: Dr JS Sehrawat Asst Prof Dept Anthropology PU pic.twitter.com/pfGdz4W5sC — ANI (@ANI) May 11, 2022 ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్గా భారత్కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్రామ్సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
మన సైనికుల పరాక్రమం గర్వకారణం
న్యూఢిల్లీ: 1971లో దాయాది దేశం పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
చైనా మైండ్ గేమ్కు ఇదే నిదర్శనం
న్యూఢిల్లీ: జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనా సైన్యం 10మంది భారతీయ సైనికులను అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో 4గురు అధికారులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘర్షణలు జరిగిన తరువాత రోజు ఉదయమే భారత్ మన అధీనంలో ఉన్న డజనుకు పైగా చైనా సైనికులను వారికి అప్పగించింది. కానీ డ్రాగన్ మాత్రం మన సైనికులను తిరిగి పంపించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల్లో గాయపడి ఎల్ఏసీకి అవతలి వైపు ఉన్న 50 మంది భారతీయ సైనికులను తిరిగి పంపించడానికి చైనాకు 24 గంటలు పట్టింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ క్రమంలో వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా... మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా, భారత సైనికులందరిని తిరిగి అప్పగించలేదని.. నలుగురు అధికారులతో సహా పది మంది భారత సైనికులను విడిచిపెట్టలేదని తర్వాత తెలిసింది. వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తరువాత మూడు రోజుల పాటు భారత్-చైనా మధ్య తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మన సైనికులు వారి వద్ద ఉన్నారనే విషయాన్ని చైనా ఖండించలేదు. పైగా వారంతా సురక్షితంగా ఉన్నారని చైనా హామీ ఇచ్చింది. అయితే వారిని వెంటనే విడుదల చేయకుండా.. భారతీయుల సహానానికి పరీక్ష పెట్టింది. ఇది చైనా మైండ్ గేమ్కు నిదర్శనం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 16, 17,18 తేదీలలో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జనరల్-స్థాయి చర్చలు జరిగాయి. వీటిలో ప్రధానంగా భారతీయ సైనికుల విడుదల గురించి చర్చించారు. చివరకు జూన్ 18న చైనా.. 10 మంది భారత సైనికులను విడుదల చేసింది. అయితే ఈ 10 మందిని పీఎల్ఏ కస్టడీలోనే ఉంచారా లేదా అనే దాని గురించి రెండు దేశాలు స్పష్టత ఇవ్వలేదు. (వారు పోరాడటానికి జన్మించారు..) లడఖ్లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. కాని దురదృష్టవశాత్తు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబు ఈ దాడిలో మరణించారు. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించలేదు. -
తెరపైకి మరో ఘర్షణ వీడియో
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి. ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్ లేవు కానీ, సైనికులు మాస్క్లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. ये सही था सर पहले पटक के चीनियों को बलभर कचर दिए फिर बोले Don't fight... don't fight 😂 https://t.co/sDoSZVjqI3 — Abhinav Pandey (@AbhinavABP) June 22, 2020 -
చైనా చెర నుంచి సైనికులు విడుదల..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భారత్కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చర్చల అనంతరం భారత్కు చెందిన పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది. వారంత క్షేమంగా ఉన్నారని తెలిపింది. అయితే భారత సైనిక వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా దాడిలో 20 మంది జవాన్లు మృతి చెందగా.. మొత్తం 76 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇక చైనా కస్టడీలో ఎవరూ లేదని స్పష్టం చేసింది. (ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం) కాగా డ్రాగన్ తొలిసారి 1962 యుద్ధం సమయంలో భారత సైనికులను బంధీలను చేసింది. డజన్ల కొద్ది సిబ్బందిని రోజుల తరబడి తన చెరలో ఉంచుకుంది. అనంతరం భారత ప్రభుత్వ శాంతియుతమైన చర్చలతో వారికి విముక్తి కల్పించింది. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు సమస్యలను చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. (76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ) -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్నాథ్ ట్వీట్ చేశారు. -
మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: లడక్లో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దేశాన్ని కాపాడే క్రమంలో గాల్వన్ లోయలో ప్రాణ త్యాగం దేసిన భారత సైనికులకు సెల్యూట్ చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) లడఖ్లో జరిగిన దాడుల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన సైనిక వీరుడు రాజేశ్ ఒరంగ్ అమరుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని కుటుంబం బీర్భమ్లో నివసిస్తోంది. అతడు భారత ఆర్మీకి ఆరేళ్లుగా సేవలందిస్తున్నాడు. భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గాల్వన్ లోయలో 26 ఏళ్ల రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత యాభై ఏళ్లలో తొలిసారిగా సరిహద్దులో తీవ్రస్థాయి ఘర్షణలు చెలరేగగా, ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కుటుంబానికి రాజేశే పెద్ద దిక్కని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. (లడక్ కాల్పుల్లో పళని వీరమరణం) -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్పూర్లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. అయితే వార్మెమోరియల్ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. చదవండి: యుద్ధ స్మారకం అంకితం -
యుద్ధ స్మారకం అంకితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు. నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో.. అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్మారకం విశేషాలు ► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు. ► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు. ► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు. ► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ల విగ్రహాలు ఉన్నాయి. -
పతకాలు నెగ్గిన వారందరూ సైనికులే
కదనరంగంలోనే కాదు దేశం కోసం క్రీడాంగణంలోనూ తమ సత్తా చాటుతామని భారత సైనికులు నిరూపించారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు మన క్రీడాకారులు స్వర్ణం, రెండు కాంస్యాలతో తమ పోరాటానికి చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. గురువారం నాలుగు ఈవెంట్స్లో ఫైనల్కు చేరినా ఒక్క పతకం కూడా గెలవలేకపోయిన బాధను మరచి... శుక్రవారం వీరోచిత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్లతో కూడిన బృందం పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్లో పసిడి పతకం దక్కించుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్లతో కూడిన జోడీ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్లో కాంస్యం... దుష్యంత్ చౌహాన్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్లో కాంస్యం సాధించాడు. రోయింగ్తోపాటు టెన్నిస్, షూటింగ్లోనూ రాణించి పోటీల ఆరో రోజును భారత్ రెండు స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలతో ముగించింది. పాలెంబాంగ్: ఒకరోజు ముందు పతకాలు గెలవాల్సిన చోట తడబడ్డామనే బాధ ఒకవైపు వేటాడుతుండగా... దేశానికి పతకాలతో తిరిగి వెళ్లాలనే చివరి అవకాశం కళ్ల ముందు కదలాడుతుండగా... భారత రోయర్లు అద్భుతం చేశారు. తమ శక్తినంతా కూడదీసుకొని స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి మూడు పతకాలతో స్వదేశానికి సగర్వంగా తిరిగి రానున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు శుక్రవారం భారత్ మూడు పతకాలతో మెరిపించింది. ముందుగా లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకంతో ఖాతా తెరిచాడు. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని దుష్యంత్ 7 నిమిషాల 18.76 సెకన్లలో చేరి మూడో స్థానాన్ని పొందాడు. హ్యున్సు పార్క్ (కొరియా; 7ని:12.86 సెకన్లు) స్వర్ణం... చున్ చియు హిన్ (హాంకాంగ్; 7ని:14.16 సెకన్లు) రజతం గెలిచారు. 2014 ఇంచియోన్ క్రీడల్లోనూ ఇదే విభాగంలో దుష్యంత్కు కాంస్యం లభించింది. కాంస్యంతో ఖాతా తెరిచిన ఉత్సాహంతో క్వాడ్రాపుల్ స్కల్స్ ఫైనల్ రేసుకు సిద్ధమైన భారత బృందం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్లతో కూడిన బృందం 6 నిమిషాల 17.13 సెకన్లలో అందరికంటే ముందుగా చేరుకొని పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్ స్కల్స్లో కాంస్యం నెగ్గిన సవర్ణ్ ఆ తర్వాత గాయంతో దూరమయ్యాడు. గతేడాది పునరాగమనం చేసిన అతను ఈసారి స్వర్ణాన్ని మెడలో వేసుకున్నాడు. ‘నేను పునరాగమనం చేస్తానని...దేశం కోసం మళ్లీ పతకం గెలుస్తానని అస్సలు అనుకోలేదు. నా వెన్నునొప్పి చికిత్సకు భారత రోయింగ్ సమాఖ్య ఖర్చులు భరించింది. మళ్లీ బరిలో దిగేందుకు చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ కూడా ఎంతో ప్రోత్సహించారు’ అని సవర్ణ్ సింగ్ అన్నాడు. కాంస్యం, స్వర్ణం లభించాక లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్లతో కూడిన జోడీ భారత్ ఖాతాలో మూడో పతకాన్ని జమచేసింది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని భగవాన్, రోహిత్ ద్వయం 7 నిమిషాల 04.61 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో మాత్రం భారత్కు నిరాశ ఎదురైంది. సంయుక్త డుంగ్డుంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామిని సింగ్లతో కూడిన భారత బృందం ఉమెన్స్ ఫోర్ ఫైనల్లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచింది. రోయింగ్ కోచ్పై వేటు? ఏషియాడ్ రోయింగ్లో పతకాల లక్ష్య సాధనలో విఫలమైనందుకు విదేశీ కోచ్ నికోలాయ్ జియోగాపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. భారత బృందం ప్రదర్శనపై రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గిరీష్ ఫడ్నిస్... త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా రొమేనియాకు చెందిన జియోగా... శిక్షణపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అతడి పద్ధతుల కారణంగా భారత రోయర్లు అస్వస్థతకు గురవడంతో పతకాల సాధనలో వెనుకడినట్లు సమాఖ్య అధికారులు భావిస్తున్నారు. దీంతో జియోగాను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ►ఆసియా క్రీడల చరిత్రలో రోయింగ్లో భారత్కు లభించిన స్వర్ణాల సంఖ్య. 2010లో బజరంగ్ లాల్ ఠక్కర్ సింగిల్ స్కల్స్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణం సాధించాడు. ►ఢిల్లీ ఏషియాడ్ (1982)లో రోయింగ్ను తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించారు. -
సైనిక చరిత్రతో నేతల సరాగాలు
సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. మోదీ కూడా అందులోని వారే కదా! భారత సైనిక చరిత్ర గురించి ప్రధానమంత్రి సృష్టించిన గందరగోళం ఆయనకూ, ఆయన అనుచరులకూ సంబంధించినదే. వారు కనీసం వికీపీడియాలోకి వెళ్లి చూసినా భారత సైనిక దళాల ప్రధాన అధికారి పదవిని (అప్పుడు) కేఎం కరియప్ప (తిమ్మయ్య కాదు) జనవరి 15, 1949న చేపట్టారని తెలిసేది. అందుకే ఆ రోజును సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ పదవిని చేపట్టేనాటికి కరియప్ప వయసు యాభయ్ ఏళ్లు (1899లో పుట్టారు). అప్పుడు త్వరితంగా జరిగిన పరిణామాల కారణంగా, ఒక ఘటన మరొక ఘటన మిళితమైపోయి కనిపించడం వల్ల ఆనాటి చరిత్ర కొంచెం తికమక పెడుతుంది. మరింత స్పష్టత కోసం– 1947–48 ఇండోపాక్ యుద్ధ సమయంలో కూడా రెండు దేశాల సైనిక దళాలు బ్రిటిష్ కమాం డర్ల నాయకత్వంలోనే పనిచేశాయి. తరువాత రెండు దేశాల సైనిక నాయకత్వాలను స్థానిక సైనిక అధికారులకు అప్పగించి, రాజకీయ నాయకులతో నేరుగా సంప్రతించే పద్ధతి తెచ్చారు. కశ్మీర్లో జరుగుతున్న పోరు కోసం భారత్ కరియప్పను ఎంచుకుంది. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న కరియప్పకు ఢిల్లీ, పంజాబ్ కమాండ్ నాయకత్వం అప్పగించారు. ఆ కమాండ్కే ఆయన వెస్ట్రన్ కమాండ్ అని పేరు మార్చారు. కరియప్ప, ఆయనే ఎంపిక చేసిన మేజర్ జనరల్ కేఎస్ తిమ్మయ్య ఇద్దరూ కూర్గ్ ప్రాంతం వారే. పైగా ఇద్దరి ఇంటి పేర్లు కే అనే అక్షరంతోనే మొదలవుతాయి. కే అంటే కోదండేరా. ఇద్దరూ అదే వర్గానికి చెందినవారు. తిమ్మయ్యను కశ్మీర్ (తరువాత 19) డివిజన్కు కరియప్ప పంపిం చారు. కూర్గీలు లేదా కొడవాలది ఒక చిన్న సామాజిక వర్గం. విజయవంతమైన వర్గం కూడా. అయితే 1950 నాటికి ఈ రెండు పేర్లు దేశానికి కొత్త. ఒకేలా ధ్వనిస్తాయి. ఆ ఇద్దరు కలసి పనిచేశారు. కశ్మీర్ పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించి ప్రముఖలయ్యారు. తరువాత సైనిక దళాల ప్రధాన అధికారులు అయ్యారు కూడా. కరియప్ప వలె కాకుండా (ఈయన రక్షణమంత్రి సర్దార్ బల్దేవ్సింగ్ కలివిడిగా ఉంటూ, హాస్యోక్తులకు ప్రసిద్ధిగాంచినవారు) తిమ్మయ్య తన కాలపు రక్షణమంత్రి వీకే మేనన్తో విభేదిస్తూ ఉండేవారు. మేనన్ ఎరుపు మరీ ఎక్కువగా ఉన్న కమ్యూనిస్టు. అయితే ఆంగ్ల విధానంలో సైనిక శిక్షణ తీసుకున్న అధికారులకు కమ్యూనిస్టులంటే అసహ్యం. రక్షణమంత్రి నిరంతరం జోక్యం చేసుకోవడం పట్ల తిమ్మయ్య అసహనంగా ఉండేవారు. ఆ కాలం విశేషాలను అద్భుతంగా చిత్రించిన ఇందర్ మల్హోత్రా ఇచ్చిన ఉదంతం ఒకటి ఉంది. రక్షణమంత్రితో మరోసారి గొడవపడే సందర్భాన్ని తప్పించుకునేందుకు తిమ్మయ్య ఎత్తుగడ అది. రక్షణమంత్రితో సమావేశం తప్పించుకోవడానికి ఆయనకు ఏ కారణం చెప్పమంటారు అని తిమ్మయ్య సహాయకుడు అడిగాడట. దీనికి తిమ్మయ్య, ‘మేనన్జైటిస్ వ్యాధి సోకింద’ని చెప్పమన్నారట. చివరికి 1959లోనే తిమ్మయ్య పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ నచ్చ చెప్పడంతో రాజీనామాను ఉపసంహరించుకుని, పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగి 1961లో వైదొలిగారు. ఇదంతా, మరీ ముఖ్యంగా ఈ కూర్గ్ చమత్కారం సామాన్య ప్రజలను నిజంగానే తికమకపెడుతుంది. కానీ ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం కూడా ఇలాంటి గందరగోళంలో ఎలా పడిపోయారు? దీనికి ఆమోదయోగ్యమైన ఒక వాదనను ప్రతిపాదించవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, పాతికేళ్లు అన్నీ యుద్ధాలే. అందులో పాకిస్తాన్ (1947–48, 1965,1971), చైనా (1962) యుద్ధాలు పెద్దవి. హైదరాబాద్ (1947), గోవా (1960), చైనాతో మరోసారి 1967 నాథులా దగ్గర జరిగినవి చిన్నవి. 1971 నాటి యుద్ధం మినహా, మిగిలిన వాటిలో భారత్కు స్పష్టమైన విజయం దక్కలేదు. 1962లో మనది స్పష్టమైన ఓటమి. 1965 నాటి యుద్ధం ప్రతిష్టంభనతో ముగిసింది. 1947–48 నాటి యుద్ధం అసంపూర్ణం. ఆనాటి రాజకీయ నాయకత్వం సైన్యాన్ని నిరుత్సాహపరచకుండా ఉంటే వారు మరింత బాగా పోరాడి ఉండేవారని చెప్పడం రివాజుగా మారింది. ఇవన్నీ వలసపాలనానంతర దశాబ్దాలు. ప్రజాస్వామిక వ్యవస్థలు ఆకృతి దాలుస్తున్నాయి. తరువాత స్థానంలో మాత్రమే సైన్యం ఉంది. పౌర, రాజకీయ ఆధిక్యానికి ఒక సవాలుగా ఉండేది. ఒక చిన్న వాస్తవం: 1958లో పాకిస్తాన్ ఆధిపత్యం స్వీకరించిన జనరల్ (తరువాత ఫీల్డ్మార్షల్) ఆయుబ్ ఖాన్ సరిహద్దులలో కరియప్ప దగ్గరే కల్నల్గా పనిచేశారు. ఈ కారణాలతోనే ఈ మొత్తం కాలంలో రాజకీయ, సైనిక వ్యవస్థలకు సంబంధించి వ్యూహాత్మక సిద్ధాంతంతో కూడిన కథనం రూపుదిద్దుకుంది. అదే– సాయుధ దళాలు, వారి కమాండర్లు ఎలాంటి తప్పిదాలు చేయలేదు, అపజయాలకీ, ఎదురుదెబ్బలకీ రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించినట్టు, విజయం వస్తే అందులో అంతా భాగస్వాములే. అప్పటి నుంచి అదే ధోరణి. కార్గిల్, 1999 వైఫల్యం ప్రధానంగా సైనిక నాయకత్వానిదే గానీ, వాజ పేయి ప్రభుత్వానిది కాదు. అంత పెద్ద సరిహద్దు ప్రాంతంలో పాకిస్తానీలు అంత లోపలికి, ఎవరూ గుర్తించకుండా ఎలా చొచ్చుకు రాగలిగారు? మరోసారి చాలా అనుకూలమైన పురాణం పుట్టింది. ఈసారి ఆ లోపం పౌర నిఘా సంస్థల మీదకు పోయింది. కొద్దిమంది సైనికాధికారుల మీదకు మాత్రం కొంత బాధ్యతను మోపారు. మనమంతా ఆ యుద్ధంలో జరిగిన వీరకృత్యాలను మననం చేసుకున్నాం. అపజయాల విమర్శల నుంచి సైనికులను కాపాడాలనుకోవడమే ఇందుకు కారణం. సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. ఆ కథలు ఎలా ఉంటాయంటే– కరి యప్ప, తిమ్మప్ప, చౌధరి, మానెక్షాలకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆక్రమిత కశ్మీర్ ఉండేది కాదు, చైనా గుణపాఠం నేర్చుకునేది, టిబెట్ విముక్తమయ్యేది, 1971లో పాక్ భూతం చచ్చేది, మరో రెండువారాల యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్ను మన సైన్యం ఆక్రమించేది– ఇలా. ఇందుకు సరైన ఆధారాలేమీ ఉండవు. కానీ అధికార వ్యవస్థకు సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజాస్వామ్యంలో మా ఆర్మీ బలోపేతమైనదన్న సెంటిమెంట్ అవసరమవుతుంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. ఆనాడు కరియప్ప, తిమ్మయ్య, చౌధరి మరింత సమయం ఇవ్వాలని నాటి ప్రధానిని కోరారని, కానీ గాంధీ–నెహ్రూ వంశీకులు అంగీకరించలేదని ఆరెస్సెస్ నేతలు చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్కు చెందిన ఎవరిని అడిగినా ఇదే వాదం వినిపిస్తారు. మోదీ కూడా అందులోని వారే కదా! శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
వాట్సాప్తో ఎటాక్
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని సైనికులకు భారత ఆర్మీ వార్నింగ్ ఇస్తోంది. వాట్సాప్ను వాడుతూ చైనీస్, భారత సిస్టమ్స్ను హ్యాక్ చేస్తున్నట్టు ఆదివారం దేశీయ ఆర్మీ ఓ వార్నింగ్ వీడియోను పోస్టు చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రీపోస్టు చేశారు. ‘మన డిజిటల్ ప్రపంచాన్ని కొల్లగొట్టడానికి చైనీస్ అన్ని రకాల ప్లాట్ఫామ్లను వాడుతున్నారు. మన సిస్టమ్లను హ్యాక్ చేయడానికి చైనీస్ వాడుతున్న కొత్త మాధ్యమం వాట్సాప్ గ్రూప్లు. +86 ప్రారంభమయ్యే చైనీస్ నెంబర్లు మీ గ్రూప్లోకి ప్రవేశించి, మీ డేటాను సంగ్రహించడం ప్రారంభించాయి’ అని తెలుపుతూ ఆర్మీ అధికారులు ఈ వీడియో ట్వీట్ చేశారు. సైనికులు తమ కాంటాక్ట్ నెంబర్లను పేర్లతో సేవ్ చేసుకోవాలని, అన్ని వాట్సాప్ గ్రూప్లను ఎప్పడికప్పుడు చెక్ చేసుకోవాలని, తెలియని నెంబర్లను పదేపదే క్రాస్చెక్ చేసుకోవాలని భారత ఆర్మీ సూచించింది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మారిస్తే, గ్రూప్ అడ్మిన్కు తెలియజేయాలని తెలిపింది. ఒకవేళ సిమ్ కార్డును మారిస్తే, దాన్ని పూర్తిగా నాశనం చేయాలని సూచించింది. ఆర్మీ అడిషినల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఈ వీడియోను రూపొందించింది. ‘బీ అలర్ట్, బీ సేఫ్’ అనే ట్వీట్తో ఈ వీడియోను విడుదల చేసింది. గతేడాది చైనా సరిహద్దులో ఉన్న సైనికులను తమ స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని ఆర్మీ ఆదేశించిన సంగతి తెలిసిందే. చైనీస్ హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న 40కి పైగా యాప్లను అన్ఇన్స్టాల్ చేయమని కూడా ఆదేశాలు జారీచేసింది. చైనీస్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆ యాప్స్ అనుమానితమైనవిగా ఆర్మీ పేర్కొంది. ఇరు దేశాల మధ్య డోక్లాం వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఆర్మీ ఈ హెచ్చరికలు జారీచేయడం పలు ఆందోళనలకు దారితీస్తోంది. -
పాక్ కాల్పుల్లో భారత జవాన్ల మృతి
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లతో పాటు ఓ అధికారి మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఘటనపై అప్రమత్తమై బలగాలు వెంటనే ప్రతిదాడి మెదలుపెట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. -
పాక్చెరలో ‘అదృశ్య’ బందీలు!!
నాలుగున్నర దశాబ్దాలుగా 54 మంది భారత సైనిక వీరులు ⇒ 1971 భారత్ పాక్యుద్ధంలో భారత సైనికులు అదృశ్యం ⇒ చనిపోయారని ప్రకటించి సంతాపం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ⇒ వారు పాక్జైళ్లలో మగ్గుతున్నారంటూ ఎన్నో సాక్ష్యాధారాలు ⇒ టైమ్మేగజీన్సహా చాలా పత్రికల్లో తరచుగా కథనాలు ⇒ తమ కుటుంబాలకు సైతం లేఖలు రాసిన భారత ఖైదీలు ⇒ వారిని స్వయంగా చూసిన వారూ, కలిసిన వారూ ఉన్నారు ⇒ కొందరు భారత సైనికులు పాక్జైళ్లలోనే కన్నుమూసిన వైనం ⇒ అయినా వారి వివరాలు బయటపెట్టని పాక్దుర్మార్గ నైజం ⇒ భారత యుద్ధ ఖైదీలు ఎవరూ లేరంటూ బుకాయింపులు ⇒ వారి విడుదలను సీరియస్గా పట్టించుకోని భారత ప్రభుత్వాలు ⇒ తమ వారి జాడ కోసం 46 ఏళ్లుగా వారి బంధువుల ఆక్రోశం ⇒ తాజాగా జాధవ్కేసులో ఐసీజే తీర్పుతో చిగురించిన ఆశలు ⇒ హవల్దార్కోసం ఐసీజేలో కేసు వేయాలన్న పంజాబ్హైకోర్టు ⇒ ఇప్పటికైనా భారత యుద్ధ ఖైదీలకు చెర వీడేనా? (సాక్షి నాలెడ్జ్సెంటర్) భారతీయుడు కుల్భూషణ్జాధవ్కు పాకిస్తాన్విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్సవాల్చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్ను భారత్నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్పై అంతర్జాతీయ వేదిక మీద భారత్కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. వారంతా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారందరూ లేదా వారిలో చాలా మంది పాక్జైళ్లలో ఖైదీలుగా మగ్గిపోతున్నారని.. ఆ జైళ్లలోనే కొందరు మరణించారని నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో సాక్ష్యాధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ 54 మంది సైనికుల కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఆక్రోశిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. భారత సైనికులెవరూ తమ వద్ద లేరని పాక్ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. మన ప్రభుత్వాలు ఆ బుకాయింపునే ఆ కుటుంబాల వారికి వల్లెవేస్తోంది. నైరాశ్యంలో మునిగిపోయిన ఆ కుటుంబాలకు జాధవ్కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతిరేఖగా కనిపిస్తోంది. 1971 యుద్ధంలో అదృశ్యమైన హవల్దార్ధరమ్పాల్సింగ్ను పాక్లో యుద్ధ ఖైదీగా జైలులో ఉన్నారని, ఆయనను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య తాజాగా పంజాబ్ హరియాణా కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ధరమ్పాల్సింగ్విడుదల కోసం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలనీ నిర్దేశించింది. మరోవైపు.. పాక్జైళ్లలో మగ్గిపోతున్న భారత యుద్ధ ఖైదీలందరి విడుదల అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాలని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఐసీజేకి నివేదించి న్యాయం కోరాలని అదృశ్యమైన సైనికుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 54 మంది భారత వీరుల ‘అదృశ్యం’ పూర్వాపరాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్... అది 1971 డిసెంబర్. పాకిస్తాన్ప్రభుత్వంపై తూర్పు పాకిస్తాన్తిరుగుబాటు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. తూర్పు పాకిస్తాన్లో జరుగుతున్న మారణకాండను నివారించడానికి భారత్రంగంలోకి దిగింది. భారత సైన్యం పాక్బలగాలపై పోరాడి మెడలు వంచింది. తూర్పు పాకిస్తాన్స్వాతంత్రం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ యుద్ధంలో పాక్తో పోరాడిన భారత సైనిక వీరుల్లో 54 మంది ‘అదృశ్యమ’య్యారు. వారిలో చాలా మంది యుద్ధంలో వీరమరణం పొంది అమరులయ్యారని భారత ప్రభుత్వం భావించింది. ఆ మేరకు సంతాపాలు ప్రకటించింది. కానీ.. ఆ 54 మందీ.. లేదా వారిలో చాలా మంది సజీవంగానే ఉన్నారని.. పాకిస్తాన్జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని.. అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. పాక్మాత్రం 1971 యుద్ధానికి సంబంధించి తమ వద్ద యుద్ధ ఖైదీలు ఎవరూ లేరనే బుకాయిస్తోంది. ‘అదృశ్యమైన 54 మంది’ జాబితాను 1979లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సమరేంద్ర కుందు లోక్సభలో వెల్లడించారు. అదృశ్యమైన మేజర్అశోక్లేఖలు... 1971లో చాంబ్సెక్టార్లో డిసెంబర్5న పాక్బలగాలతో భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మేజర్అశోక్సూరి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మేజర్అశోక్సూరి చనిపోయారని సైన్యం ప్రకటించింది. బుల్లెట్రంధ్రం ఉన్న ఒక హెల్మెట్ను.. ఢిల్లీలో నివసిస్తున్న ఆయన తండ్రి డాక్టర్ఆర్.ఎస్.సూరికి పంపించింది. కానీ ఆ హెల్మెట్మీద ఉన్న పేరు వేరే ఎవరిదో! సరిగ్గా మూడేళ్ల తర్వాత 1974 డిసెంబర్లో ఆ మేజర్తండ్రికి ఒక చీటీ అందింది. అందులో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను’ అంటూ ఆయన కుమారుడు మేజర్అశోక్సూరి చేతిరాత ఉంది. దానికి అనుసంధానించి ఉన్న లేఖలో ‘సాహెబ్, వాలేకుం సలామ్! నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేను. ఈ చీటీని మాత్రం తేగలిగాను. మీ కుమారుడు సజీవంగా పాకిస్తాన్లో ఉన్నారు. నేను పాక్కు తిరిగి వెళ్తున్నాను ఇట్లు ఎం. అబ్దుల్హమీద్’ అనే సమాచారం ఉంది. మళ్లీ 1975 ఆగస్టులో ఆ తండ్రికి కరాచీ జైలు నుంచి మరో లేఖ అందింది. ‘ప్రియమైన నాన్నకు పాదాభివందనం. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మన గురించి భారత సైన్యం లేదా, ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నించు. మేం ఇక్కడ 20 మంది అధికారులం ఉన్నాం. ... మా విముక్తి కోసం పాక్ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం సంప్రదించగలదు’ అనే సందేశం వచ్చింది. ఆ చేతిరాత ‘యుద్ధంలో చనిపోయిన’ మేజర్అశోక్దే అని నాటి రక్షణశాఖ కార్యదర్శి నిర్ధారించుకున్నారు. ‘అదృశ్యుల’ బంధువుల విజ్ఞప్తులు... అప్పటి నుంచీ మేజర్అశోక్తండ్రి మరణించేవరకూ ప్రతి వారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు వెళ్లి తన కుమారుడిని విడిపించాలని కోరుతుండేవారు. అదృశ్యమైన సైనికులు పాక్లో బందీలుగా ఉన్నదే నిజమైతే.. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని, అలా చేస్తే అక్కడ వారి ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని ఉన్నతాధికారులు ఆయనకు సూచించారు. దీంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పలేదు. అయితే.. అదృశ్యమైన సైనికులకు సంబంధించిన కుటుంబాలు ‘అదృశ్యమైన సైనిక సిబ్బంది బంధువుల సంస్థ’గా ఏర్పడి తమ ప్రయత్నాలు కొనసాగించారు. మేజర్అశోక్సూరి తండ్రి తమ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని మిగతా సైనికుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు. ఆయన తరచుగా ప్రధానమంత్రికి లేఖలు రాశేవారు. ప్రధాని నుంచి ఆయనకు సమాధానాలు కూడా వచ్చేవి. అదృశ్యమైన భారత సైనికుల సిబ్బంది వ్యవహారాన్ని తేల్చాలని, మానవతా దృక్పథంతో ఉత్కంఠకు తెరదించాలని ప్రాధేయపడుతూ పాక్విదేశాంగ మంత్రికి కూడా వివిధ మార్గాల్లో వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత వార్తలు ఈ 54 మంది ఏమయ్యారు? 1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా -
1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా
1982లో ఖైదీల మార్పడికి భారత్ పాక్లు ఒప్పందం చేసుకున్న తర్వాత.. 1983లో పాక్ప్రభుత్వం ఈ కుటుంబాల సభ్యులను ‘తమ వారిని గుర్తించేందుకు’ రావాలని ఆహ్వానించింది. కుటుంబ సభ్యలకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం పాక్కు వెళ్లడానికి అనుమతించింది. కానీ.. అది చాలా రహస్యమైన పర్యటన అని, ఈ విషయం మీడియాకు తెలియరాదని స్పష్టం చేశారు. 1983 సెప్టెంబర్14న ఈ బృందం, కొందరు విదేశాంగ శాఖ అధికారులతో కలిసి పాక్లోని ముల్తాన్వెళ్లింది. అదే రోజున పటియాలా జైలులోని 25 మంది పాక్ఖైదీలను ఆ దేశ అధికారులు కలవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ‘భారత్ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసింది’ అంటూ పాక్పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు సెప్టెంబర్15వ తేదీ ముల్తాన్జైలుకు భారత సైనికుల కుటుంబ సభ్యుల బృందం వెళ్లింది. తాంబే భార్య అక్కడ సందర్శకుల రిజిస్టర్లో సంతకం చేస్తుండగా.. అక్కడున్న జైలు అధికారి ‘మిసెస్తాంబే, క్షమించాలి. తాంబే ఇక్కడ లేరు’ అని వ్యాఖ్యానించారు. నిజానికి.. దాదాపు 200 మంది ఖైదీలను భారత్కు తిప్పి పంపిస్తామని పాక్అప్పటికే ప్రతిపాదించింది. అయితే.. ఆ ఖైదీలను గుర్తించాలని చెప్పింది. ఈ ఆరుగురు కుటుంబ సభ్యుల బృందానికి ఆరుగురు ఖైదీలను మాత్రమే చూపించారు. ఆ బృందం తాము వెదుకుతున్న వారిలో ఏ ఒక్కరినీ గుర్తించలేదు. ఇక వారిని వెళ్లిపోవాలని పాక్అధికారులు చెప్పారు. ఈ ‘తరగతి’ ఖైదీల విషయంలో నాటి తమ ప్రధాని జియావుల్హక్ఆదేశాలను మాత్రమే తాము అమలు చేయగలమని స్పష్టంచేశారు. కుటుంబ సభ్యులు హతాశులై తిరిగివచ్చారు. అసలు పాక్200 మంది ఖైదీలను భారత్కు అప్పగిస్తామని చెప్పినపుడు.. ఇక గుర్తింపు ప్రక్రియలు ఎందుకనేది అర్థంకాని విషయమని భారత సైనికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మేజర్అశోక్సూరి తండ్రి తన కుమారుడి కోసం ప్రయత్నిస్తూనే 1999లో కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ అనేక దౌత్యప్రయత్నాల అనంతరం 2007 జూన్లో 14 మందితో కూడిన బంధువుల ప్రతినిధి బృందం పాక్లోని పలు జైళ్లను సందర్శించింది. కానీ ఒక్కరి జాడ కూడా లభించలేదు. అయితే.. తమ వారు పాక్జైళ్లలోనే ఉన్నారన్న వారి నమ్మకం మరింత బలపడింది. టైమ్మేగజీన్లో మేజర్ఘోష్ఫొటో..: 1971 డిసెంబర్5న మేజర్ఎ.కె.ఘోష్అదృశ్యమయ్యారు. ఆ నెల 17వ తేదీన యుద్ధం ముగిసింది. ఆయన పాక్జైలులో కటకటాల వెనుక ఉన్న ఫొటో అదే నెల 27వ తేదీన అంతర్జాతీయ పత్రిక అయిన టైమ్మేగజీన్లో ప్రచురితమైంది. అంటే యుద్ధం ముగిసిన తర్వాత మేజర్ఘోష్పాక్నిర్బంధంలో ఉన్నారనేందుకు టైమ్మేగజీన్ఫొటోనే సాక్ష్యం. యుద్ధం తర్వాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ఖైదీల అప్పగింత జరిగింది. పాక్ఖైదీలను భారత్ఆ దేశానికి అప్పగించింది. భారత్కు అప్పగించిన ఖైదీల్లో మేజర్ ఘోష్లేరు. ఒకవేళ ఈ మధ్యలోనే ఆయన పాక్జైలులో చనిపోయారని అనుకుంటే.. అందుకు సంబంధించిన రికార్డులన్నా ఉండాలి. అలాంటి వారు ఏమయ్యారనేది తెలుసుకునేందుకు భారత్ పాక్ప్రభుత్వాలు చర్చించుకోవచ్చు. 40 మంది యుద్ధ ఖైదీలు ఉన్నారు..: 1974లో భారత దేశానికి పాక్అప్పగించిన భారత ఖైదీల్లో మోహన్లాల్భాస్కర్ఒకరు. 1968 నుండి 74 వరకూ పాక్జైలులో ఉన్న ఆయన ‘మే భారత్కా జాసూస్థా’ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఒక కుట్ర కేసులో జైలు పాలైన పాక్రెండో పంజాబ్రెజిమెంట్అధికారి కల్నల్ఆసిఫ్షఫీ, మేజర్జనరల్అయాజ్అహ్మద్సిప్రాలను తాను ఫోర్ట్ఆఫ్అటాక్జైలులో కలిశానని.. భారత వైమానిక దళానికి చెందిన అధికారి గిల్ను, సైన్యానికి చెందిన కెప్టెన్సింగ్తనకు మిత్రులని 1965, 1971 యుద్ధాలకు సంబంధించి దాదాపు 40 మంది భారత యుద్ధ ఖైదీలు ఆ జైలులో ఉన్నారని, వారిని విడుదల చేసే అవకాశం లేదని సిప్రా తనకు వివరించినట్లు ఒక ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కుట్ర కేసులో జైలుకెళ్లిన పాక్సైనికాధికారి అయాజ్అహ్మద్ఆ తర్వాత కాలంలో అమెరికాలో ఉన్నపుడు ఆయనను స్వ్కాడ్రన్లీడర్జైన్అల్లుడు మనీష్జైన్2000 సంవత్సరంలో సంప్రదించారు. వింగ్కమాండర్గిల్ను పాక్జైలులో తాను కలిశానని షఫీ మరోసారి అనధికారికంగా ధృవీకరించారు. హక్కుల ప్రతినిధి బృందం నిర్ధారణ..: కెనడాకు చెందిన భారతీయులతో కూడిన మానవ హక్కుల ప్రతినిధి బృందం ఒకటి 2003లో పాక్లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్జిత్సింగ్ను సందర్శించేందుకు లాహోర్సమీపంలోని కోట్లఖ్పత్జైలుకు వెళ్లింది. అప్పుడు కొన్ని బ్యారక్ల నుంచి వారికి కేకలు వినిపించాయి. ‘‘మేము 1971 యుద్ధ ఖైదీలం. గత 35 ఏళ్లుగా ఇక్కడ మగ్గిపోతున్నాం. ఈ నరకం నుంచి మమ్మల్ని బయటపడేయండి’’ అన్నది ఆ కేకల సారాంశం. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన ఆ బృందం.. అదృశ్యమైన 54 మంది భారత సైనికుల్లో చాలా మంది ఇంకా జీవించి ఉన్నారని, వారు పాకిస్తాన్జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని గుర్తించింది. కోట్లఖ్పత్జైలులో సుబేదార్అస్సాసింగ్సహా 11 మంది భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్లు పేర్లు కూడా వెల్లడించింది. అలాగే మరికొంత మంది భారత యుద్ధ ఖైదీలు పాక్జైళ్లలోనే చనిపోయారని, వారి అస్తికలు అంత్యక్రియల కోసం వేచిచూస్తున్నయని కూడా పేర్కొంది. కానీ పాక్ప్రభుత్వం ఆ కథనాలన్నీ అవాస్తవాలని కొట్టివేసింది. ⇒ 1971 డిసెంబర్7వ తేదీన లాహోర్రేడియోలో చదివిన యుద్ధ ఖైదీల జాబితాలో కెప్టెన్రవీందర్కౌరా పేరును కూడా వెల్లడించారు. ⇒ పాక్సైనిక బలగాలు తాంబే సహా ఐదుగురు పైలట్లను సజీవంగా నిర్బంధించాయని ఢాకాకు చెందిన ఇంగ్లిష్దినపత్రిక సండే అబ్జర్వర్1971 డిసెంబర్5వ తేదీనే రావల్పిండి డేట్లైన్తో ప్రచురించింది. ⇒ మేజర్వారాయిచ్పాక్నార్త్వెస్ట్రన్ఫ్రాంటియర్ప్రావిన్స్లోని దార్గాయ్జైలులో ఖైదీగా ఉన్నారని అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్జనరల్రియాజ్1972లో మ్యూనిచ్ఒలింపిక్స్వద్ద నాటి భారత బీఎస్ఎఫ్ఐజీ అశ్వినీకుమార్కు వ్యక్తిగత హోదాలో తెలిపారు. ఆ తర్వాత కొద్ది కాలానికే జనరల్రియాజ్రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ⇒ భారత గూఢచారిగా పనిచేస్తూ పాక్లోని వివిధ జైళ్లలో గడిపిన కిశోరిలాల్1974లో విడుదలయ్యారు. తాను కోట్లఖ్పత్జైలులో ఉన్నపుడు యుద్ధ ఖైదీలైన ఫ్లైట్లెఫ్టినెంట్విజయ్వసంత్తాంబే, మేజర్ఎ.కె.ఘోష్లను కలిసినట్లు వెల్లడించారు. ⇒ 1979లో పాక్లో మరణశిక్షకు గురైన బీబీసీ ప్రతినిధి విక్టోరియా స్కోఫోల్డ్రాసిన ‘భుట్టో: ట్రయల్అండ్ఎగ్జిక్యూషన్’ అనే పుస్తకంలో కోట్లఖ్పత్జైలులో తాను 1971 యుద్ధపు భారత ఖైదీల బ్యారక్పక్క సెల్లో ఉన్నట్లు రాశారు. యుద్ధ ఖైదీలను అర్ధరాత్రిళ్లు తీవ్ర చిత్ర హింసలకు గురిచేసేవారని వారి ఆర్తనాదాలు ఎంతో వేదన కలిగించేవని ఆమె వివరించారు. ⇒ పాక్జైళ్లలో తనతో పాటు 35 మంది భారత యుద్ధ ఖైదీలు ఉన్నారని, వారిని విడిపించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని మేజర్కన్వల్జీత్సింగ్సంధూ 1980లో గుర్ముఖి భాషలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతి ఆయన భార్య జస్బీర్కౌర్కు అదే సమయంలో అందింది. ⇒ చుక్యేగర్అనే ప్రఖ్యాత అమెరికా వైమానిక దళ అధికారి.. 1972 భారత్ పాక్యుద్ధం తర్వాత ఒక అసైన్మెంట్విషయమై పాకిస్తాన్వెళ్లారు. అదృశ్యమైన భారత వైమానిక దళ పైలట్లు చాలా మందిని తాను పాక్జైళ్లలో చూశానని ఆయన 1984లో ప్రచురించిన తన ఆత్మకథలో ప్రస్తావించారు. ⇒ గూఢచర్యం ఆరోపణలతో పాక్జైలులో ఎనిమిదేళ్లు గడిపిన భోగల్రామ్అనే భారతీయుడు 2000 సంవత్సరంలో విడుదలయ్యారు. 1971 యుద్ధ ఖైదీ అస్సాసింగ్ను కోట్లక్పత్జైలులో ఇంటరాగేషన్సెల్లో తాను చూసినట్లు ఆయన వెల్లడించారు. జైలు నుంచి రహస్యంగా భారత్లోని తన కుటుంబానికి ఒక లేఖను పంపించడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను ఇంటరాగేట్చేయడానికి తీసుకువచ్చారని భోగల్రామ్తెలిపారు. ఎప్పటికైనా చెర వీడేనా..?: 1971 యుద్ధంలో భారత్నిర్బంధించిన 93,000 మంది పాక్సైనికులను సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ఆ దేశానికి అప్పగించింది. పాక్650 మంది భారత యుద్ధ ఖైదీలను అప్పగించింది. కానీ నిజాయితీగా వ్యవహరించలేదు. ఆచూకీ లేకుండాపోయిన మరో 54 మంది భారత సైనికులు అక్కడే ఉన్నారని ఎన్ని ఆధారాలున్నా వారిని అప్పగించకుండా మోసం చేసింది’ అని భారత సైనికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాక్లో మగ్గుతున్న భారత సైనికుల విషయాన్ని పార్లమెంటులో ఎన్నోసార్లు లేవనెత్తారు. కానీ.. ప్రభుత్వాల నుంచి ‘భారత సైనికులెవరూ తమ వద్ద ఖైదీలుగా లేరని పాక్చెప్తోంది’ అన్న సమాధానమే వస్తోంది. తెరవెనుక దౌత్య ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు. ‘ఇన్నాళ్ల తర్వాత భారత యుద్ధ ఖైదీలు తమ వద్ద ఉన్నారని పాక్అంగీకరించి విడుదల చేస్తే.. ఆ దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. మరోవైపు.. ఇన్నాళ్లుగా ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామన్న అపకీర్తిని భారత్కూడా మూటగట్టుకుంటుంది. కాబట్టి ఇరు దేశాలూ వ్యూహాత్మకంగా అదృశ్య వీరుల విషయంలో మైనం పాటిస్తున్నాయి’ అనేది పరిశీలకుల విశ్లేషణ. ధరమ్పాల్సింగ్కోసం ఐసేజీలో కేసు వేయండి: హైకోర్టు హవల్దార్ధరమ్పాల్సింగ్ను పాక్చెర నుంచి విడిపించాలంటూ ఆయన భార్య పాల్కౌర్తాజాగా పంజాబ్ హరియాణా హైకోర్టు పిటిషన్దాఖలు చేశారు. పంజాబ్లోని భటిండా జిల్లా లెహ్రా ధూద్కోట్కు చెందిన 78 ఏళ్ల ఆ మహిళ.. తన భర్తను విడిపించేలా కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించాలని ఆ పిటిషన్లో కోరారు. తన భర్త 1971 యుద్ధంలో పాకిస్తాన్తో పోరాడారని, అక్కడ పాక్సైన్యం ఆయనను నిర్బంధించిందని పాల్కౌర్తెలిపారు. అయితే.. ఆయన కనిపించడం లేని అదే ఏడాది డిసెంబర్లో పేర్కొనడంతో యుద్ధంలో అమరుడైనట్లుగా ప్రభుత్వం భావించిందని వివరించారు. ధరమ్పాల్సింగ్మరణం పట్ల సంతాపం తెలుపుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ తన భర్త యుద్ధంలో మరణించలేదని, పాకిస్తాన్లోని కోట్లఖ్పత్రాయ్జైలులో మగ్గుతున్నారని తన పిటిషన్లో వెల్లడించారు. ఫిరోజ్పూర్కు చెందిన సతీశ్కుమార్అనే మరో యుద్ధ ఖైదీ ఈ విషయాన్ని తనకు తెలియజేశారని చెప్పారు. ధరమ్పాల్సింగ్సజీవంగా ఉన్నారని, 197476 మధ్య తాను ఉన్న జైలులోనే ఆయన కూడా ఉన్నారని సతీశ్కుమార్చెప్పారు. ఆయన తను చెప్తున్న విషయాన్ని ప్రమాణపత్రం (అఫిడవిట్)లో కూడా వివరించారు. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం గురువారం కేంద్ర హోంశాఖకు నోటీసు జారీ చేసింది. యుద్ధ ఖైదీల విడుదల కోసం భారత్ పాక్ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీ అయిన ధరమ్పాల్సింగ్ను విడుదల కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలు చేయాలని కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ఎం.ఎం.ఎస్. బేడీ కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించారు. నిజానికి.. 4వ సిఖ్రెజిమెంట్కు చెందిన హవల్దార్ధరమ్పాల్సింగ్మరణించినట్లు ప్రకటించినప్పటికీ.. ఆయన మృతదేహం లభ్యం కాకపోవడంతో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. అదృశ్యమైన సైనికుల జాబితాలోనూ ఆయన పేరును చేర్చలేదు. సంబంధిత వార్తలు పాక్చెరలో ‘అదృశ్య’ బందీలు!! ఈ 54 మంది ఏమయ్యారు? -
స్పష్టమైన ఆధారాలున్నాయ్
-
స్పష్టమైన ఆధారాలున్నాయ్
- సైనికుల తలలు నరకడంపై పాక్కు భారత్ స్పష్టీకరణ - పాక్ ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ: భారత సైనికుల తలలను పాకిస్తాన్ సైనికులే నరికారనడానికి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆర్మీ కమాండర్లపై చర్యలు తీసుకోవాలని పాక్ను భారత్ కోరింది. ఈ ఘటనను ‘తీవ్రమైన కవ్వింపు చర్య’గా భారత్ పరిగణిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. నియంత్రణ రేఖ కృష్ణ ఘాటీ వద్ద సేకరించిన రక్తపు నమూనాలు మృతిచెందిన భారత సైనికుల రక్తంతో సరిపోలు తున్నాయన్నారు. ఢిల్లీలో పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ను విదేశాంగ కార్యదర్శి జెశంకర్ బుధవారం పిలిపించి నిరసన తెలిపారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను అందజేయడంతో పాటు ఈ అమానుష కాండకు పాల్పడిన పాక్ సైనిక సిబ్బందిపై, ఆర్మీ కమాం డర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని జైశంకర్ డిమాండ్ చేశారు. హంతకులు ముమ్మాటికే పాక్ నుంచి వచ్చిన వారేనని పాక్ రాయబారికి వివరించినట్టు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, పాక్ సైనికుల చేతిలో హత్యకు గురైన బీఎస్ఎఫ్ సైనికుడు ప్రేమ్ సాగర్ అంత్య క్రియలు ఉత్తరప్రదేశ్లోని ఆయన స్వగ్రామం తికంపూర్లో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైనికుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
కశ్మీర్లో పాక్ దురాగతం
-
కశ్మీర్లో పాక్ దురాగతం
- దాడిలో ముగ్గురు భారత జవాన్ల బలి - ఒక సైనికుడి తలను నరికిన ముష్కరులు - భారీ ప్రతీకారం ఉంటుందన్న భారత్ జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మంగళవారం వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)ను దాటి ముగ్గురు భారత సైనికులను మెరుపుదాడిలో చంపేసి, వారిలో ఒకరి తలను కిరాతకంగా నరికేశారు. గత నెలరోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. మృతులను రాజస్తాన్కు చెందిన ప్రభు సింగ్ (25), ఉత్తరప్రదేశ్కు చెందిన కుష్వాహ (31), శశాంక్ సింగ్ (25)లుగా గుర్తించారు. ప్రభు తలను నరికివేశారు. దీనికి ప్రతీకారం భారీగానే ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాక్ సరిహద్దు యాక్షన్ టీం (బ్యాట్) సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ‘బ్యాట్’లో పాక్ ఆర్మీతోపాటు ఉగ్రవాదులూ ఉంటారని భావిస్తున్నారు. ‘కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లోని ఎల్ఓసీ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటు నిరోధక బృందంలోని సైనికులపై దాడికి పాల్పడ్డారు’ అని సీనియర్ ఆర్మీ అధికారి చెప్పారు. ‘ముష్కరులు ముగ్గురు సైనికులను హతమర్చారు. ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలు చేశారు. ఈ కిరాతకానికి ప్రతీకారం ఉంటుంది’ అని ఆర్మీ నార్తర్న్ కమాండ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. తల నరికేసిన సైనికుడి మృతదేహంపై ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్న పాక్ ముష్కరుల సంతకాలున్నాయని అధికారులు చెప్పారు. దాడిని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తీవ్రంగా ఖండించారు. ఈ అమరవీరుల త్యాగనిరతికి వందనం అని ట్వీట్ చేశారు. ఇద్దరు మిలిటెంట్ల ఎన్కౌంటర్.. ఉత్తర కశ్మీర్లోని బందిపొరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. హజిన్ గ్రామంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీన్ని భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారన్నారు. మృతదేహాల వద్ద నుంచి నగదుతోపాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు కొత్త రూ.2వేల నోట్లు ఉన్నాయి. చొరబాటు యత్నం భగ్నం.. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఒక పాక్ మిలిటెంట్ చొరబాటు యత్నాన్ని సైన్యం అడ్డుకుంది. కశ్మీర్లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో సరిహద్దు బీఎస్ఎఫ్ బలగాలు అతడిని మట్టుబెట్టారుు. దట్టమైన మంచుకుతోడు చీకటి ఉండటంతో అతడు బీఎస్ఎఫ్ శిబిరం వద్దకు వచ్చేందుకు యత్నించాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ ముఖానికి మాస్క్ ధరించిన అతడు మరింత సమీపంలోకి వస్తుండటంతో బలగాలు అతడిపై కాల్పులు జరిపారుు. కాగా, పాక్ ముష్కరులు ముగ్గురు భారత సైనికులను చంపేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ పాక్ విదేశాంగ కార్యాలయంలో నిరసన తెలిపారు. -
పాక్ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు
-
పాక్ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ ఉగ్రవాదులు క్రూర చర్యకు దిగారు. భారత జవాను చంపేసి శరీరాన్ని ముక్కలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న పరస్పర దాడి నేపథ్యంలో ఈ అమానుషం చోటు చేసుకుంది. వాస్తవాదీన రేఖ వద్ద కొన్ని గంటలుగా భారత జవాన్లకు పాకిస్థాన్ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. భారత ఆర్మీ ధీటుగానే స్సందిస్తోంది. అయితే, ఈ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒకరి శరీరాన్ని ఉగ్రవాదులు క్రూరంగా ముక్కలు చేసి పడేశారు. మచ్చల్ సెక్టార్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. భారత ఆర్మీ పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత పాక్ ఉగ్రవాదులు చేతిలో ఎదురు దెబ్బ తగలడం ఇదే తొలిసారి. ఇప్పటికే జవాన్లను కలిసిన రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశాలు ఇచ్చి వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పాక్ ఉగ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను ప్రతిబింబిస్తోంది. -
‘సైనికుల విషయంలోనూ బీజేపీ రాజకీయం’
బొమ్మనహళ్లి (బెంగళూరు) :దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉంటున్న భారత సైనికులను కూడా బీజేపీ విభజించి రాజకీయం చేయాలని చూస్తున్నదని, భారత సైనికుల పైన ప్రస్తుతం ఇంతటి ప్రేమను చూపిస్తున్న బీజేపీకి ఇంతకు ముందు సైనికులు గుర్తుకు రాలేదా? అని లోక్సభ కాంగ్రేస్ పార్టి నాయకుడు మల్లిఖార్జున ఖర్గె మండిపడ్డారు. సోమవారం బెంగళూరు నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధి 32వ వర్థంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సైనికులు ఇటివల చేసిన సర్జికల్ దాడులను బీజేపీ ప్రభుత్వం తామే చేరుుంచామని, గొప్పలు చెప్పుకుంటోందన్నారు. భారత సైనికులు అంటే పార్టిలకు చెందినవారు కాదని, ప్రజల రక్షణ కోసం దేశ రక్షణ కోసం ఉంటున్నారని, వారిని గౌరవించాలి తప్ప వారు మా వారు అని బీజేపీ చెప్పుకుంటున్నారని అన్నారు. భారత సైనికులు సర్జికల్ దాడి చేయడం ఇది మొదటి సారి కాదని, గతంలో కాంగ్రేస్ పార్టి అధికారంలొ ఉన్న సమయంలో కూడా సర్జికల్ దాడులు చాల జరిగాయన్నారు. అందులో భారత సైనికులు ఎన్నో విజయాలను కూడ సాదించారని, కానీ తాము ఎప్పుడు కూడ మేము చేరుుంచామని ఎక్కడ చెప్పలేదని ఖర్గె అన్నారు. సర్జికల్ దాడుల్లో భారత సైనికులు విజయం సాదిస్తున్నారంటె అది భారత సైనికుల గొప్పతనమని, ఈ విజయాన్ని వారికి ఇవ్వాలి తప్ప ఫ్రభుత్వాలదో, పార్టిలదో కాదని ఖర్గె అన్నారు. వివాదం సరికాదు.. రాష్ట్ర ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తుండగా దానిని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇలా చేయడం సరికాదని ఖర్గె అన్నారు. దేశం కోసం పోరాటం చేసిన వారిని కూడ హిందుఅని, ముస్లీం అని విడదీయడం సరి కాదని, ఇలా చెస్తె మతోన్మాదం చోటు చేసుకుంటుందన్నారు. గత యేఢాది జరిగిన టిప్పు జయంతి రోజున గొడవ మళ్లీ జరుగుతుందని టిప్పు జయంతి వేడుకలను నిర్వహించవద్దని చెప్పడం సరి కాదని అన్నారు. మొదటి నుంచి డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ ఫొటోను ఎక్కడ కూడ బీజేపీ నాయకులు తమ పార్టి కార్యాలయాల్లో పెట్టలేదని, ఇప్పడు అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్నిరచించిన నాయకుడిగా బీజేపీకి గుర్తుకు వస్తున్నారన్నారు. చివరికి అంబేడ్కర్ను కూడ రాజకీయంలోకి లాగుతున్నారని ఖర్గె అన్నారు. -
భారతీయ జవాన్లకు గాయాలు
లండన్: భారత్-బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మంది భారతీయ సైనికులకు, ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలయ్యాయి. మిలటరీ పరికరాలు మోసుకొస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది జూన్ 13 నుంచి 28 వరకు బ్రిటన్లోని సాలిస్బరీ మైదానంలో ఇరు దేశాల సైనికులు ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నారు. దీంతోపాటు అనంతర కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా తిరిగొస్తుండగా ప్రమాద బారిన పడ్డారు. ఈ రెండు వాహనాలను నడిపింది బ్రిటన్ సైనికులే. గాయపడినవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ఒక కెప్టెన్, హవల్దారు తీవ్రంగా గాయపడగా మిగితావారు మాత్రం స్వల్ఫ గాయాలతో బయటపడ్డారు. -
కార్గిల్లో మళ్లీ పాక్ కాల్పులు
1999 నాటి యుద్ధం తర్వాత తొలిసారి.. న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల కిందట కార్గిల్లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది. జమ్మూ కాశ్మీర్లోని ఎత్తయిన ప్రాంత మైన కార్గిల్ సెక్టార్లో నాలుగు రోజుల్లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ 14 ఏళ్లలో కార్గిల్లో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి ద్రాస్, కార్గిల్ల మధ్యలోని కక్సార్లో ఉన్న చెనిగుండ్ పోస్టుపై పాక్ బలగాలు తొలుత చిన్నపాటి ఆయుధాలతో, తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. గురువారం రాత్రి లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో సాందో పోస్టుపై ఇదే దుశ్చర్యకు ఒడిగట్టాయి. పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటైన ఎదురుకాల్పులతో గట్టి జవాబిచ్చారు. 1999లో పాక్ సైనికులు కార్గిల్లోకి చొరబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్గిల్ జోలికి రావడానికి భయపడిన పాక్ బలగాలు ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ మళ్లీ కార్గిల్లో కాల్పులు జరిపాయి.1999 నాటి యుద్ధంలో భారత యువ లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, ఆయన సహచరులు చెనిగుండ్ పోస్టు వద్దే కనిపించకుండా పోయారు. తర్వాత చిత్రహింసలతో ఛిద్రమైన వారి మృతదేహాలను పాక్ భారత్కు అప్పగించింది. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో భారత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి జమ్మూలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. -
పాక్ సైన్యం దుశ్చర్యే : ఎ.కె.ఆంటోనీ
భారత జవాన్ల హత్యపై ఆంటోనీ - తొలి ప్రకటనను సవరిస్తూ పార్లమెంటులో ప్రకటన - భారత్-పాక్ సంబంధాలపై ప్రభావముంటుంది - బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే - భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయరాదు - పాక్కు రక్షణ మంత్రి ఆంటోనీ హెచ్చరిక - ఉగ్ర సంస్థలను నిర్మూలించాలని డిమాండ్ - స్వాగతించిన సుష్మ.. పెదవి విరిచిన శివసేన మంగళవారం కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి భారత జవాన్లపై దాడిచేశారు. ... నాకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసు. పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదు. దౌత్యమార్గంలో పాక్కు భారత నిరసన తెలిపాం. - లోక్సభలో రక్షణమంత్రి ఆంటోనీ గురువారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లపై దాడిచేసి హత్యచేసిన ఘటనలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని స్పష్టమైంది. భారత్ సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఐదుగురు భారత జవాన్లను హతమార్చిన దురాగతంలో పాకిస్థాన్ సైన్యం పాత్ర ఉన్నట్టు స్పష్టమైందని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రకటించారు. ఈ ఘటన పర్యవసానంగా నియంత్రణ రేఖపై భారత వైఖరిలో, పాకిస్థాన్తో సంబంధాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. పాకిస్థాన్పై కఠిన స్వరం వినిపిస్తూ.. భారత్ పాటిస్తున్న సంయమనాన్ని అలసత్వంగా పరిగణించరాదని, భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదని హెచ్చరించారు. కాశ్మీర్ సరిహద్దు వద్ద పూంచ్ సెక్టార్లో భారత జవాన్లను హతమార్చింది ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులని మంగళవారం లోక్సభలో ఆంటోనీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి, ప్రత్యేకించి బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తమవడం తెలిసిందే. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇచ్చారని ఆరోపిస్తూ రెండు రోజులుగా పార్లమెంటును అవి స్తంభింపచేశాయి. దాంతో తొలి ప్రకటనను సవరిస్తూ గురువారం పార్లమెంటులో ఆయన తాజాగా ప్రకటన చేశారు. తొలు త చేసిన ప్రకటన అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చేసిందని, అనంతరం సైనికదళాధిపతి ఘటనా ప్రాంతానికెళ్లి వివరాలు సేకరించారన్నారు. ప్రభావముంటుంది... ‘‘నియంత్రణ రేఖకు అవతల పాకిస్థాన్ వైపు నుంచి.. పాక్ సైన్యం మద్దతు, సహాయం, తోడ్పాటు లేకుండా.. అప్పుడప్పుడూ పాక్ సైన్యం నేరుగా పాత్ర పోషించకుండా ఏమీ జరగదని మనకందరకూ తెలుసు’’ అని ఆంటోనీ వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లను హత్యచేసిన దాడిలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని ఇప్పుడు స్పష్టమైంది’’ అని చెప్పారు. ఎలాంటి కవ్వింపూ లేకుండా జవాన్లపై జరిపిన కిరాతక దాడి భారతీయులందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘‘మా సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. ఉగ్రవాద వ్యవస్థలను, సంస్థలను, వాటి సదుపాయాలను నిర్మూలించటంలో పాకిస్థాన్ నిబద్ధదతో కూడిన చర్యలు చూపాలి. 2008 నవంబర్ నాటి ముంబై ఉగ్రవాద దాడికి బాధ్యులైన వారిని సత్వరమే చట్టం ముందు నిలబెట్టటానికి ప్రత్యక్ష చర్యలు చేపట్టాలి’’ అని పాకిస్థాన్ను డిమాండ్ చేశారు. ఆంటోనీ ప్రకటనను లోక్సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ వెంటనే స్వాగతించారు. రక్షణమంత్రి తన పొరపాటును అంగీకరించి, దానిని సరిదిద్దుకున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సుష్మా వ్యాఖ్యలను ఆంటోనీ ముకుళిత హస్తాలతో స్వాగతించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన మాత్రం ఆంటోనీ తాజా ప్రకటనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్తో చర్చలు జరపరాదని ఆ పార్టీ నేత అనంత్ గీతె పేర్కొన్నారు. రాజ్యసభలోనూ ఆంటోనీ ఇదే ప్రకటన చదవబోగా గందరగోళం రేగడంతో సభ వాయిదా పడింది. రక్షణమంత్రి సోమవారం రాజ్యసభలో మళ్లీ ఈ ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్శుక్లా చెప్పారు. భారత జవాన్ల హత్య ఉదంతం పూర్వాపరాలను సైనికాధిపతి జనరల్ బిక్రమ్సింగ్ ఆంటోనీకి వివరించారు. లోక్సభ సోమవారానికి వాయిదా: భారత జవాన్ల హత్య, తెలంగాణ తదితరాలపై తీవ్ర గందరగోళం తలెత్తటంతో లోక్సభను సోమవారం వరకూ వాయి దా వేశారు. ఉదయం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కొందరు ఆంధ్రప్రదేశ్ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీక ర్ మీరాకుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవటంతో ఆమె తొలుత మధ్యాహ్నం వరకూ సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఆంటోనీ ప్రకటన చేశారు. అనంతరం మళ్లీ గందరగోళం తలెత్తటంతో సభను 2 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనా కూడా కొద్దిసేపటికే డిప్యూటీ స్పీకర్ కరియాముండా సభను సోమవారానికి వాయిదా వేశారు. -
పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్సభలో ఆ పార్టీ నేత యశ్వంత్సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు. లోక్సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నారు. పరిహారం వద్దు: జవాను భార్య పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు. -
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం!
సంపాదకీయం: విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వచ్చినవారు పాకిస్థాన్ సైనికులా, ఉగ్రవాదులా అన్న అంశంపై జరుగుతున్న చర్చ సంగతి అలా ఉంచితే పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చినవారు ఈ ఘటనకు పాల్పడ్డారన్నది మాత్రం వాస్తవం. పూంచ్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో తమ సైన్యం ప్రమేయమేమీ లేదని పాకిస్థాన్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్లో జరుగుతున్న వివిధ ఉగ్రవాద ఘటనలకు మూలాలు తమవద్దే ఉన్నాయని పదే పదే రుజువవుతున్నా వాటిని నిరోధించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోలేకపోతోంది. తాజా ఘటన ఆ పరంపరకు కొనసాగింపేనని గ్రహించి తన వైఫల్యాన్ని అంగీకరించక పోగా ‘మా సైన్యం కాల్పులకు దిగలేద’ని చెబితే సరిపోతుందని పాక్ ప్రభుత్వం ఎలా అనుకుంటున్నదో అర్ధం కాదు. 2003లో అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రకటించాక మూడు నాలుగేళ్లపాటు సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. అటు తర్వాత అడపా దడపా కాల్పులు, మిలిటెంట్ల చొరబాటు యత్నాల వంటివి చోటుచేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా అధీనరేఖ వద్ద పరిస్థితి మొదటికొస్తున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాల్పుల విరమణకు సంబంధించి అక్కడ మొత్తం 44 ఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది సోమవారం ఘటనతో కలుపుకుంటే ఇప్పటికే 57 ఘటనలు జరిగాయి. ఈ జనవరిలో మెంధార్ సెక్టార్లో పాక్ దళాలు ఇద్దరు భారత జవాన్లను కాల్చిచంపి వారిలో ఒకరి తలను ఎత్తుకుపోయాయి. మన సైన్యం చెబుతున్నదాన్ని బట్టి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనూ 100 మంది ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఈ రెండు నెలల కాలంలోనే మన సైన్యం 19 మంది ఉగ్రవాదులను కాల్చిచంపింది. ఇవన్నీ అధీనరేఖ వద్ద ఆనాటికానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడల్లా మన ప్రభుత్వం పాకిస్థాన్కు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగుపడటం లేదు. పాకిస్థాన్తో వచ్చిన సమస్యేమిటంటే అది భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా, దానిపై పటిష్టమైన నియంత్రణగల రాజ్యవ్యవస్థ అక్కడ కొరవడింది. అక్కడి పౌర ప్రభుత్వం అధీనంలో ఉండటాన్ని సైన్యం నామోషీగా భావిస్తుంది. గత ఐదేళ్లుగా అలా చెప్పుచేతల్లో ఉంటున్నట్టు కనబడుతున్నా అది అంతంత మాత్రమే. ఇలాంటి అనిశ్చితిలో పాకిస్థాన్లో ఏమైనా జరగవచ్చు. ఉగ్రవాది బిన్ లాడెన్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏళ్ల తరబడి ఆ సంగతిని గ్రహించలేని నిస్సహాయ స్థితి పాక్ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న అమెరికా సైన్యం ఆకాశమార్గంలో వచ్చి లాడెన్ను చంపి శవాన్ని సైతం పట్టుకెళ్లాకగానీ అక్కడి పాలకవ్యవస్థకు తెలియలేదు. రెండు నెలలక్రితం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికితోడు షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాల్లోనూ ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ, మాటలు చెప్పినంత వేగంగా పరిస్థితులు మారలేదని అధీన రేఖ వద్ద యథావిధిగా కొనసాగుతున్న దుందుడుకు చేష్టలు నిరూపిస్తున్నాయి. భారత్తో సయోధ్యకు పాక్ నాయకత్వం ప్రయత్నించి నప్పుడల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జరిగిన ఘటన కూడా దానికి కొనసాగింపే కావచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో ఇరు దేశాల ప్రధానులూ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది. దానికితోడు పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ అష్ఫాక్ కయానీ రిటైర్ కావాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం ప్రస్తుతం షరీఫ్ పరిశీలనలో ఉంది. షరీఫ్పై ఒత్తిడి తెచ్చేందుకు, భారత ప్రధానితో చర్చలకు ముందు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నించి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో సమష్టిగా వ్యవహరించి, భారత్ నిరసనను పాకిస్థాన్కు ముక్తకంఠంతో తెలియజెప్పాల్సిన ప్రస్తుత తరుణంలో యూపీఏ ప్రభుత్వం తొట్రుపాటు పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధీన రేఖ ఘటనలో తమ సైన్యం ప్రమేయంలేదని పాక్ చేతులు దులుపుకుంటే, మన రక్షణ మంత్రి ఆంటోనీ ‘ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న మరికొందరు’ కాల్పులు జరిపారని ప్రకటించారు. ఆయన ఆంతర్యమేమిటోగానీ, ఆ ప్రకటన సారాంశం మాత్రం పాక్ సైన్యానికి ప్రమేయంలేదని చెప్పినట్టే ఉంది. పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నదని అంతకు గంట క్రితమే జమ్మూ నుంచి సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఇలా భిన్నస్వరాలు వినబడటానికి కారణమేమిటి? పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో నడిచే ఐఎస్ఐ ఉగ్రవాదులకు తోడ్పాటునంది స్తున్నట్టు పదే పదే రుజువవుతున్నా ఇంత ‘జాగ్రత్తగా’ ప్రకటన చేయాల్సిన అవసరం ఆంటోనికి ఏమొచ్చింది? ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిం చకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్పై గట్టిగా ఒత్తిడి తెచ్చి, అక్కడి సైన్యం తీరుతెన్నులను ప్రపంచానికి వెల్లడించడం ద్వారా వారిని ఏకాకులను చేయవలసిన ప్రస్తుత తరుణంలో తడబాట్లకు తావుండకూడదు. దౌత్యపరంగా గట్టిగా వ్యవహరించాల్సిన తరుణంలో మనల్ని మనం బలహీనపరుచుకోకూడదు. -
20 మంది ఉగ్రవాదులతో కలిసి భారత్లోకి చొరబడిన పాక్ దళాలు
జమ్మూ/కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని బయటపెట్టుకుంది. చీకటి వేళ ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడిలో గాయపడిన మరో జవాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జనవరిలో హద్దు మీరిన పాక్ సైన్యం ఇద్దరు భారత జవాన్లను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి తల నరికిన ఘటన దుమారం రేపింది. దాడి జరిగిందిలా.. ‘పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్కు చెందిన ఆరుగురు సైనికులు సోమవారం గస్తీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 01:15 గంటల అనంతరం వారి నుంచి సైనిక స్థావరానికి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో 05:30 గంటల సమయంలో మరో బృందాన్ని వారి కోసం పంపగా ఐదుగురు జవాన్ల మృతదేహాలు తూటా గాయాలతో రక్తపుమడుగులో కనిపించాయి’ అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాయపడిన మరో జవాన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. అతనికి ఎయిమ్స్లో చికిత్స చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్(బీఏటీ) నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, పాక్ సైనికులు, సుమారు 20 మంది సాయుధ ఉగ్రవాదులు 450 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మృతుల్లో ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్, నలుగురు ఇతర ర్యాంకుల అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులను నాయక్ ప్రేమ్ నాథ్ సింగ్, లాన్స్ నాయక్ శంభు శరణ్రాయ్, సిపాయి రవినంద్ ప్రసాద్, సిపాయి విజయ్ కుమార్ రాయ్, కులీన్ మన్నెగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో నలుగురు 21 బీహార్ రెజిమెంట్కు, ఒకరు 14 మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందినవారు. దేశప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు: ఖుర్షీద్ పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను కాల్చిచంపిన నేపథ్యంలో దీనిపై అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా జవాబిస్తామని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మంగళవారం మాట్లాడుతూ.... ప్రభుత్వానికి తన బాధ్యతలపై అవగాహన ఉందని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే దేశప్రయోజనాలకు అనుగుణంగా సరైన చర్య తీసుకుంటామన్నారు. ‘దేశ భద్రత, శాంతికి విఘాతం కలిగించేలా పరిస్థితులను సృష్టించుకోవాలనుకోవడం లేదు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తాం’ అని పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు: పాక్ ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి దాడి చేసి ఐదుగురు భారత సైనికులను హత్యచేసిన ఘటనతో తమ సైనిక బలగాలకు ఎలాంటి సంబంధమూ లేదని పాకిస్థాన్ మంగళవారం వెల్లడించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎల్వోసీ వెంబడి పూంచ్ సెక్టార్లో జరిగిన దాడిలో ఐదుగురు భారత సైనికుల మరణానికి పాక్ బలగాలే కారణమంటూ భారత మీడియాలోని కొన్ని వర్గాలు ప్రసారం చేసిన కథనాలను పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇజాజ్ చౌదరి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కాల్పులు జరగలేదని తమ సైన్యం ధ్రువీకరించిందని, భారత మీడియా ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు.