‘సైనికుల విషయంలోనూ బీజేపీ రాజకీయం’ | "Soldiers in the politics of the BJP ' | Sakshi
Sakshi News home page

‘సైనికుల విషయంలోనూ బీజేపీ రాజకీయం’

Nov 1 2016 2:57 AM | Updated on Mar 29 2019 9:31 PM

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉంటున్న భారత సైనికులను కూడా బీజేపీ విభజించి రాజకీయం చేయాలని ...

బొమ్మనహళ్లి (బెంగళూరు) :దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉంటున్న భారత సైనికులను కూడా బీజేపీ  విభజించి రాజకీయం చేయాలని చూస్తున్నదని,  భారత సైనికుల పైన ప్రస్తుతం ఇంతటి ప్రేమను చూపిస్తున్న బీజేపీకి ఇంతకు ముందు సైనికులు గుర్తుకు రాలేదా? అని లోక్‌సభ కాంగ్రేస్ పార్టి నాయకుడు మల్లిఖార్జున ఖర్గె మండిపడ్డారు. సోమవారం బెంగళూరు నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధి 32వ వర్థంతి  సందర్భంగా ఇందిరాగాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సైనికులు ఇటివల చేసిన సర్జికల్ దాడులను బీజేపీ ప్రభుత్వం తామే చేరుుంచామని, గొప్పలు చెప్పుకుంటోందన్నారు.

భారత సైనికులు అంటే పార్టిలకు చెందినవారు కాదని,  ప్రజల రక్షణ కోసం దేశ రక్షణ కోసం ఉంటున్నారని, వారిని గౌరవించాలి తప్ప వారు మా వారు అని బీజేపీ చెప్పుకుంటున్నారని అన్నారు. భారత సైనికులు సర్జికల్ దాడి చేయడం ఇది మొదటి సారి కాదని, గతంలో కాంగ్రేస్ పార్టి అధికారంలొ ఉన్న సమయంలో కూడా సర్జికల్ దాడులు చాల జరిగాయన్నారు. అందులో భారత సైనికులు ఎన్నో విజయాలను కూడ సాదించారని, కానీ తాము ఎప్పుడు కూడ మేము చేరుుంచామని ఎక్కడ చెప్పలేదని ఖర్గె అన్నారు. సర్జికల్ దాడుల్లో భారత సైనికులు విజయం సాదిస్తున్నారంటె అది భారత సైనికుల గొప్పతనమని, ఈ విజయాన్ని వారికి ఇవ్వాలి తప్ప ఫ్రభుత్వాలదో, పార్టిలదో కాదని ఖర్గె అన్నారు.

 
వివాదం సరికాదు..

రాష్ట్ర ప్రభుత్వం టిప్పు సుల్తాన్  జయంతి వేడుకలను నిర్వహిస్తుండగా దానిని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇలా చేయడం సరికాదని ఖర్గె అన్నారు. దేశం కోసం పోరాటం చేసిన వారిని కూడ హిందుఅని, ముస్లీం అని విడదీయడం సరి కాదని, ఇలా చెస్తె మతోన్మాదం చోటు చేసుకుంటుందన్నారు. గత యేఢాది జరిగిన టిప్పు జయంతి రోజున గొడవ మళ్లీ జరుగుతుందని టిప్పు జయంతి వేడుకలను నిర్వహించవద్దని చెప్పడం సరి కాదని అన్నారు. మొదటి నుంచి డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ ఫొటోను ఎక్కడ కూడ బీజేపీ నాయకులు తమ పార్టి కార్యాలయాల్లో పెట్టలేదని, ఇప్పడు అంబేడ్కర్  దేశానికి రాజ్యాంగాన్నిరచించిన నాయకుడిగా బీజేపీకి గుర్తుకు వస్తున్నారన్నారు. చివరికి అంబేడ్కర్‌ను కూడ రాజకీయంలోకి లాగుతున్నారని ఖర్గె అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement