breaking news
indian footbal team
-
దిగ్గజం లేకుండానే.. భారత జట్టు ప్రకటన
బెంగళూరు: సెంట్రల్ ఏషియా ఫుట్బాల్ అసోసియేషన్ (సీఏఎఫ్ఏ) నేషన్స్ కప్లో పాల్గొనే భారత ఫుట్బాల్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. 23 మందితో కూడిన ఈ జట్టులో దిగ్గజ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయలేదు. నిజానికి ముందుగా ప్రకటించిన ప్రాబబుల్స్లోనూ ఛెత్రి లేడు. ఆగస్టు 1 నుంచి జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న 29 మందిలో 23 మందిని ఎంపిక చేశారు. కోత్త కోచ్ ఖాలిద్ జమీల్ జట్టుతో పాటు తజికిస్తాన్కు పయనమవుతారు. ఈ నెల 29 నుంచి జరిగే నేషన్స్ కప్లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది.ఇందులో ఆతిథ్య జట్టు తజికిస్తాన్తో పాటు ఇరాన్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ముందుగా 29న తజికిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. అనంతరం సెపె్టంబర్ 1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్లో పోటీపడుతుంది. సన్నాహక టోర్నీగాఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత్కు కీలకమైన మ్యాచ్లు ముందున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నేషన్స్ కప్ను పూర్తిస్థాయి సన్నాహక టోర్నీగా సద్వినియోగం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.ఏఎఫ్సీ క్వాలిఫయర్స్లో తనకన్నా తక్కువ ర్యాంకు జట్లు బంగ్లాతో డ్రా చేసుకున్న భారత్... 0–1తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. థాయ్లాండ్తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత్ 0–2తో ఓడిపోవడంతో కోచ్ మనొలో మార్కెజ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ జట్టుకు స్వదేశీ కోచ్ జమీల్ను ఎంపిక చేశారు. తదుపరి ఏఎఫ్సీ క్వాలిఫయర్స్లో భారత్ అక్టోబర్ 9, 14 తేదీల్లో సింగపూర్తో ఇంటా బయటా రెండు మ్యాచ్లు ఆడనుంది. ఛెత్రిలాంటి మేటి ఆటగాళ్లు లేరు నేషన్స్ కప్ జట్టులోకి మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయనప్పటికీ అతనిలాంటి నాణ్యమైన ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేరని కోచ్ జమీల్ అంగీకరించారు. నేషన్స్ కప్ అనేది కేవలం సన్నాహక టోర్నీ కావడం వల్లే ఛెత్రిలాంటి దిగ్గజాన్ని ఎంపిక చేయలేదని చెప్పారు. ‘భారత్లో సునీల్ ఛెత్రి అంతటి ఆటగాళ్లు లేనపుడు... అతను ఆడతానంటే అభ్యంతరం ఏముంటుంది. అతనొక దిగ్గజం.జట్టు కోసం ఎంతో చేశాడు. అలాంటి ఆటగాడి అనుభవాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటాం’ అని జమీల్ అన్నాడు. ప్రస్తుతం నేషన్స్ కప్పై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. కీలకమైన ఆసియా క్వాలిఫయర్స్కు ముందు జరుగుతున్న ఈ పోటీలను సది్వనియోగం చేసుకుంటామన్నాడు.భారత ఫుట్బాల్ జట్టు: గుర్ప్రీత్ సింగ్, అమ్రిందర్, హృతిక్ (గోల్ కీపర్స్); రాహుల్, నోరెమ్ రోషన్, అన్వర్ అలీ, సందేశ్, చింగ్లేశన సింగ్, మింగ్తన్మవియా రాల్తే, మొహమ్మద్ ఉవాయ్ (డిఫెండర్లు); నిఖిల్ ప్రభు, సురేశ్, ఫరూఖ్ భట్, జీక్సన్ సింగ్, బోరిస్ సింగ్, ఆశిక్ కురునియన్, ఉదాంత సింగ్, మహేశ్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు); ఇర్ఫాన్, మాన్వీర్, జితిన్, లలియంజులా ఛాంగ్తే, విక్రమ్ ప్రతాప్ (ఫార్వర్డ్). -
కొత్త హెడ్కోచ్.. భారత జట్టు దశ మారేనా?.. పెను సవాళ్లకు సిద్ధం
మిడ్ఫీల్డర్గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఖాలిద్ జమీల్ తదనంతం కోచ్గా క్లబ్ జట్లపై ప్రభావం చూపాడు. అరకొర నిధులతో సరిపెట్టినా జట్టును మేటిగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. అలా తక్కువ బడ్జెట్లో విజయవంతమైన కోచ్గా నిరూపించుకున్నాడు. అందుబాటులో ఉన్న రూ. 2 కోట్ల నిధులతో 2016–17 సీజన్ ఐ–లీగ్లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)ని విజేతగా నిలబెట్టాడు. అదే విధంగా.. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, ముంబై ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్, జంషెడ్పూర్ ఎఫ్సీ క్లబ్లకు కోచ్గా సేవలందించాడు. ఇక ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ప్లేఆఫ్కు చేర్చిన తొలి భారత కోచ్గా జమీల్దే ఘనత! తాజాగా మనొలో (స్పెయిన్) స్థానంలో భారత హెడ్ కోచ్గా నియమితుడైన 49 ఏళ్ల ఖాలిద్ తొలిసారిగా ఓ అంతర్జాతీయ జట్టుకు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. జమీల్కు కలిసొచ్చిందిలా... చాలా ఏళ్లుగా క్లబ్, ఫ్రాంచైజీ జట్లకు కోచింగ్ ఇచ్చిన ఖాలిద్ జమీల్కు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి నియామకం. అయితే ఇదేమీ గాలివాటంగా రాలేదు. ఇండియా లీగ్ (ఐ–లీగ్)లో ప్లేయర్గా విజయవంతమయ్యాడు. 2005లో మహీంద్ర యునైటెడ్ విజేత జట్టు సభ్యుడైన జమీల్ తదనంతరం మేనేజర్గా ఐజ్వాల్ ఎఫ్సీ తరఫున కమాల్ చేశాడు. ఐజ్వాల్ను విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర ఖాలిద్దే!కేవలం పరిమిత నిధులతోనే తక్కువ బడ్జెట్లోనే జట్టును విజయపథాన నిలిపాడు. ఆ తర్వాత ముంబై ఎఫ్సీకి కోచ్గా వెళ్లాడు. తదనంతరం ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ను సెమీఫైనల్ చేర్చిన కోచ్గా పేరు తెచ్చుకున్నాడు. జంషెడ్పూర్ ఎఫ్సీ కోచ్గాను పనిచేశాడు. టైటిళ్లు సాధించకపోయిన జట్టును సానబెట్టిన తీరుతో ఏఐఎఫ్ఎఫ్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’గా రెండు సీజన్లపాటు అవార్డు గెలుచుకున్నాడు. ఇవన్నీ కూడా టీమిండియా కోచ్ అయ్యేందుకు సోపానంలా పనిచేశాయి.అద్భుతాలు కాదు... కానీ! ఇప్పటికిప్పుడు జమీల్ నుంచి అద్భుతాలను ఆశించడమంటే అది అత్యాశే అవుతుంది. అయితే ఆచరణీయ సాధన సంపత్తితో జట్టును తీర్చిదిద్దుతాడని గత ఫలితాలను బట్టి చెప్పొచ్చు. స్వయంగా ప్లేయర్ అయిన ఖాలిద్ జట్టు లోటుపాట్లపై తక్షణం విశ్లేషించగలడు. డిఫెన్స్ వైఫల్యంతో ఇటీవల దిగువ ర్యాంక్ జట్లతోనూ ఓడిన భారత్ జట్టును ఓ మెట్టుపైనే నిలబెట్టేందుకు తన వంతు కృషి చేయగలడు. డిఫెన్స్, ఫార్వర్డ్లపై తనకున్న అపారమైన అనుభవం జట్టుకు మేలు చేస్తుంది.ముఖ్యంగా ఆటగాళ్లపై వ్యక్తిగత శ్రద్ద పెట్టి తీర్చిదిద్దే సామర్థ్యం అతనిలో ఉంది. సీనియర్లు, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించే నైపుణ్యం జమీల్లో ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక్క సిరీస్తో, ఒక్క ఏడాదితో జరిగేది కాదు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త కోచ్కు తగినంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు చేరాలంటే మాత్రం ప్రణాళికబద్ధంగా శ్రమించాలి. కాబట్టి కోచ్గా కుదిరేందుకు, జట్టును మార్చేందుకు కచ్చితంగా సమయం పడుతుంది. పెను సవాళ్లకు సిద్ధం భారత కోచ్ పదవి కోసం సుమారు 170 మంది పోటీపడ్డారు. వీరిలో పేరున్న విదేశీ కోచ్లు కూడా ఉన్నారు. వారందరిని వెనక్కినెట్టిన ఖాలిద్ జమీల్ కొత్త హెడ్ కోచ్ అయ్యాడు. 2011–2012 తర్వాత స్వదేశీ కోచ్ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే జమీల్ ముందున్న సవాళ్లపై దృష్టి పెట్టాడు. ఈ నెలలోనే సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ జరుగనుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే టోర్నీతో టీమిండియాకు అతని కోచింగ్ మొదలవుతుంది.తజికిస్తాన్తో జరిగే తొలిపోరులో భారత్ సాధించే సానుకూల ఫలితం అతన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించనుంది. ఇటీవల హాంకాంగ్ చేతిలో 0–1తో ఓడిపోయిన భారత్... 2027 ఆసియా కప్ రేసులో ఉండాలంటే సింగపూర్తో తదుపరి జరిగే మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. తద్వారా ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత్ ఎగబాకేందుకు అవకాశముంటుంది. ఇంటాబయటా జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లు, ఆసియా క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్ రాణించాలంటే వెంటనే చేయాల్సింది సమీక్ష ఆ తర్వాతే సన్నద్ధతపై పూర్తి అవగాహన వస్తుంది. తన శిష్యులకు కలిసొచ్చేనా... సుదీర్ఘ కాలంపాటు క్లబ్, ఫ్రాంచైజీ జట్లతో ఉన్న అనుబంధంతో ఎంతో మంది శిష్యులు జతయ్యారు. వీరిలో అపూయా రాల్తే, సందేశ్ జింగాన్, మో సనన్లతో ఖాలిద్కు చక్కని బంధమేర్పడింది. ఇప్పుడు వీరందరికి అనుకూలమైన కోచ్ రావడం కాస్త అనుకూలించనుంది. నార్త్ఈస్ట్, జంషెడ్పూర్, ముంబై ఎఫ్సీ ఇలా క్లబ్ జట్లలో విశేషంగా రాణించిన వారికి తప్పకుండా భారత జట్టులో చోటు లభిస్తుంది. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చే కోచ్ వల్ల తప్పకుండా కుర్రాళ్లకు కలిసిరానుంది. భారత జట్టు కోసం తన దృష్టిలో ఉన్న కోర్ గ్రూప్ ప్లేయర్లను సానబెడతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. తద్వారా జమీల్ జట్టులో తన ‘మార్క్’ చూపించే ప్రయత్నమైతే గట్టిగానే చేస్తాడు. -సాక్షి క్రీడా విభాగం -
Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్బాల్ దిగ్గజం
భారత ఫుట్బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్ ఛెత్రి(Sunil Chhetri) అనడంలో సందేహమే లేదు. జాతీయ జట్టు తరఫున 151 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ సాధించాడు. గత ఏడాది జూన్లో అతను అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ఛెత్రి పునరాగమనం చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.కోచ్ మనోలో మార్క్వెజ్ విజ్ఞప్తి మేరకు తిరిగి వచ్చాడని చెబుతున్నా... భారత్ ఫుట్బాల్ జట్టు తాజా పరిస్థితిని ఇది సూచిస్తోంది. అతను తిరిగి రావడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘జట్టు కోణంలో చూస్తే ఇది సరైన నిర్ణయమే. 40 ఏళ్లు దాటిన వ్యక్తిని మళ్లీ ఆడిస్తున్నారేంటి అని అడగవచ్చు. అయితే గతంలోనూ ఇలాంటివి జరిగాయి.మంచి స్ట్రయికర్ను సిద్ధం చేసేందుకు భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. ఐఎస్ఎల్లో బాగా ఆడుతున్న వారంతా విదేశీయులే. పైగా ఛెత్రి సూపర్ ఫిట్గా ఉన్నాడు’ అని మాజీ ఆటగాడు ఎం.విజయన్ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ 2027 కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో ఛెత్రికి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చోటు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్ఎల్లో మంచి ఫామ్లో ఉన్న ఛెత్రి 12 గోల్స్తో టాప్స్కోరర్గా ఉన్నాడు. వయసుకంటే అతని ఆటను చూడాలని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే అన్నారు.‘ఛెత్రి నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని స్థాయి ప్లేయర్ మొత్తం జట్టులో స్ఫూర్తిని నింపగలడు. అలాంటి స్ట్రయికర్ ఉంటే భారత జట్టుకు మేలు జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. ఛెత్రి రిటైర్మెంట్ తర్వాత నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్ 3 మ్యాచ్లు ‘డ్రా’ చేసుకొని మరో దాంట్లో చిత్తుగా ఓడింది తప్ప ఒక్క విజయమూ దక్కలేదు. రీఎంట్రీ అవసరమా?అయితే ఛెత్రి పునరాగమనం భారత ఫుట్బాల్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తోంది. అతడు తప్పుకున్న తర్వాత కూడా కనీసం ఒక నాణ్యమైన స్ట్రయికర్ను జట్టు తయారు చేసుకోలేకపోతోంది.‘ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా సరే ఛెత్రి తప్పుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు. ఎప్పటి వరకు అతనిపై ఆధారపడతారు. ఏ ఆటలోనైనా, ఎంత గొప్పవారైనా ఆటను ముగించాల్సిందే. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడం, ప్రతిభను ప్రోత్సహించి ఫలితాలు రాబట్టడం ఫెడరేషన్ చేయాల్సిన పని. కానీ మళ్లీ వచ్చి ఆడమని అడగటం ఏ రకంగాను సరైంది కాదు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా... యువ ఆటగాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అని ఫుట్బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ భాయ్చంగ్ భుటియా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. హెడ్కోచ్ మనోలో మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు తెలుసునని.. అయితే, ఛెత్రిని తిరిగి తీసుకురావడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలేమీ కలగవని పేర్కొన్నాడు. ఛెత్రి పునరాగమనం అద్భుతంగా అనిపిస్తున్నా.. భారత ఫుట్బాల్ అభివృద్ధికి ఇది ఏమాత్రం దోహదం చేయదని అభిప్రాయపడ్డాడు. నలభై ఏళ్ల ఆటగాడిపై ఆధారపడి జట్టును నడుపుతామని చెప్పడం సరైన సంకేతం కాదని భుటియా పేర్కొన్నాడు. -
భారత ఫుట్బాల్ టీమ్ హెడ్ కోచ్గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్బాల్ టీమ్కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్సీ గోవాకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్సీ గోవా కోచ్గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్సీ గోవాకు కోచ్గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్గా నిలవడం విశేషం. స్పెయిన్లో కోచ్గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్గా పని చేశారు. -
FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. 1996లో అత్యుత్తమంగా..
స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్షిప్లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్లో, బ్రెజిల్ మూడో ర్యాంక్లో ఉన్నాయి. -
హ్యాట్రిక్ గోల్స్తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్బాల్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
ఫుట్బాల్కు గుడ్ డేస్
హైదరాబాద్లో ఫుట్బాల్కు మళ్లీ మంచిరోజులు వస్తాయని భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో సనోఫీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన వరల్డ్ ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భుటియా కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. అవి ఆయున మాటల్లోనే.. ‘హైదరాబాద్ నుంచి విక్టరీ అమల్రాజ్ వంటి మేటి ఫుట్బాల్ ఆటగాళ్లు భారత జట్టుతో పాటు వివిధ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్ సూపర్లీగ్తో (ఐఎస్ఎల్) ఈ సిటీలోనూ ఫుట్బాల్కు మళ్లీ క్రేజ్ వస్తుంది. హైదరాబాద్ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి రుచులు నాకు చాలా నచ్చుతాయి.. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐఎస్ఎస్ లీగ్ ఫ్రాంచైజీల్లో క్రికెట్ స్టార్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, బాలీవుడ్ నటులు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి వారే భాగస్వాములుగా ఉండటం శుభపరిణామం. ఐపీఎల్ తరహాలోనే ఐఎస్ఎల్లోనూ మెరికల్లాంటి ప్లేయుర్స్ రాణించే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ను అమితంగా ఆరాధించే మనదేశంలో స్వయంగా క్రికెటర్లే ఫుట్బాల్ వైపు చూస్తున్నారంటే, యువత తప్పకుండా ఈ పరిణామంపై ఆలోచిస్తారు. అయితే, ఫుట్బాల్ ఆడే సమయంలో ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. గాయాల పట్ల అలసత్వం పనికిరాదు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఆరుసార్లు మోకాలికి ఆపరేషన్లు జరిగాయి. నాలుగేళ్ల కిందట ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ యాదవ్ సలహాపై విస్కో సప్లిమెంటేషన్ తీసుకుంటుండటంతో ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటున్నా’. - వీఎస్