-
ఎంబసీలను బలోపేతం చేయాలి
హైదరాబాద్: విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రిటైర్డ్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం. వినోద్కుమార్ డిమాండ్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎమిగ్రేషన్ (విదేశీ వలసల) ముసాయిదా బిల్లు – 2019 పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్కుమార్ మాట్లాడుతూ.. విదేశీ వలసలకు సంబందించి నూతన చట్టం తీసుకువచ్చే ప్రయత్నం హర్షణీయమన్నారు. 35 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న సందర్భంలో ఎమిగ్రేషన్ యాక్ట్ – 1983 విదేశీ వలసల చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారని, సమకాలీన వలసల పోకడల సమస్యలను పరిష్కరించేందుకు ఈ చట్టానికి కొన్ని అంతర్గత పరిమితులను చేర్చారని అన్నారు. అప్పటికాలానికి అనుగుణంగా పరిమిత వనరుల ప్రకారం ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 పనిచేసిందని అన్నారు. వలస కార్మికుల రక్షణ, సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన మేరకు అమలు చేయకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన ముసాయిదా బిల్లును తీసుకురావలనుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పారు. గల్ఫ్ దేశాల్లో రాయబార కార్యాలయాల్లో తెలుగు తెలిసిన అధికారులను నియమించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ రాయబార కార్యాలయాల్లో సరైన సిబ్బంది, నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఎంబసీలను పటిష్టం చేçసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని కోరారు. కార్మికుల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు వలస వెళ్తున్న కార్మికుల రక్షణ, సంక్షేమాన్ని భారత ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని నియామకాలు ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారానే జరగాలని, లైసెన్స్లేని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. నేపాల్, శ్రీలంక తరహాలో కార్మికుల్లో నైపుణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, కార్మికుల నైపుణ్యతకు తగినట్లుగా నియామకాలు జరగాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చే ముసాయిదా బిల్లులో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన నిబంధనలు రూపొందించాలని కోరారు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టిని పెట్టాల్సిన అవసరముందన్నారు. మైగ్రంట్స్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ.. విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులందరు తమ వివరాలను ఎంబసీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీలు, ఎడ్యుకేషన్ కాన్సల్టెన్సీలు తప్ప నిసరిగా లైసెన్స్లు తీసుకోవాలన్నారు. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన రిక్రూట్మెంట్, మత్తు మందుల రవాణా, నేరస్తులకు అశ్రయం ఇవ్వటం, మహిళలు, పిల్లలను ఇబ్బందులు పెట్టడం లాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్ట్రేలియా ఎన్నారై ఆదిరెడ్డి యార మాట్లాడుతూ విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆస్ట్రేలియాకు కొత్తగా వచ్చిన భారతీయ విద్యార్థులకు తమ సంఘాలు సహాయకారిగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ రిటైర్డ్ అధికారి మహ్మద్ ఇబ్రహీంఖాన్, సిస్టర్ లిస్సీజోసెఫ్, మురళిధర్ దేశ్పాండే, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, చాంద్పాషా, గొడ్డేటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్షణక్షణం..భయం గుప్పిట్లో..
ఇరాక్లో ఏవో గొడవలు జరుగుతున్నయట.. ఇది తెలిసినప్పటి నుంచి పాణంల పాణముంటలేదు బిడ్డా.. నువ్వెంబడే రా బిడ్డా.. నీ బాంచెన్.. ఓ తల్లి ఆవేదన.బతికుంటే ఏదైనా చేస్కొని బతకొచ్చు.. నువ్వుంటే మాకు గదే సాలు.. నువ్వు రాయే... భార్య దీనరోదన.నాన్న మాకు భయమైతంది. నీకు ఏమో అయితదట కద. మాకు ఏడు పొస్తుంది. తొందరగా రా నాన్నా... పిల్లల మారాం ఇది. అన్నా ఆ పని, పైసలు లేకుంటే మాయె. నువ్వు మా కాడుంటె ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యంతో బతుకుతం... నువ్వెంబడే రావాలన్నా.. ఓ తమ్ముడు, చెల్లీ వేడుకోలు. ఇరాక్లో తలెత్తిన అంతర్యుద్ధం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, జన్నారం ప్రాంతానికి చెందిన పలువురు యువకులు అక్కడికి జీవనోపాధికి వెళ్లారు. ప్రస్తుతం ఇరాక్లో తీవ్రవాదులకు, అక్కడ ప్రభుత్వం భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న సంగ్రామం నేపథ్యంలో ఇక్కడున్న జిల్లావారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులదీ అదే దుస్థితి. రాజీనామా చేసినా అంతే ఖానాపూర్ : ఇక్కడి కంపెనీలకు చెందిన పనులు చివరి వరకు చేరడంతో పూర్తిస్థాయిలో పనిచేయించుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇండియాకు పంపడం లేదు. ఎవరైనా పోతామన్నా.. వారికి ఫినిష్ ఇచ్చినా.. వేతనం నుంచి టికెట్ డబ్బులు కట్ చేస్తామని మా కంపెనీ ప్రకటించింది. మా సమస్యను ఇండియన్ ఎంబసీలు టోల్ఫ్రీలకు తెలియజేసినా స్పందన లేదు. మేం 60 మందిమి రాజీనామా చేసినా కంపెనీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. - కతులాపురం ప్రవీణ్, ఖానాపూర్ కాలయాపన చేస్తున్నారు ఖానాపూర్ : ప్రమాదం పొంచి ఉన్నందున మమ్మల్ని ఇండియాకు పంపమని కంపెనీని అడిగితే ప్రస్తుతానికి మేముంటున్న ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం లేదని నోటీసు మా కంపెనీ ప్రాంతంలో అతికించారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. వెంటనే మమ్మల్ని పంపకుంటే మాకు ఏమవుతుందోనని మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. - బొమ్మెన మధుకర్, రేవోజిపేట, కడెం క్షేమంగా రప్పించాలె దండేపల్లి : మా తమ్ముడు శంకర్ ఇరాక్ వెళ్లి మూడు నెలలైంది. అక్కడేమో బాంబు లేసుకుంటున్నారని తెలవడంతో అప్పటి నుంచి మాకు చాలా భయంగా ఉంది. ఇటీవల ఫోన్ చేసిండు మాట్లాడిండు. అక్కడ లొల్లులైతన్నయట నువ్వు తొందరగా వచ్చేయ్ అని చెప్పిన. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మాలాంటోళ్ల బాధను జర అర్థం చేసుకోవాలె. - గంధం రాయలింగు, దండేపల్లి ఎలాగైనా రప్పించండి జన్నారం : మాది జన్నారం మండలం రోటిగూడ. నేను ఇరాక్ పోయి 8 నెలలు అవుతోంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతోంది. యాజమాన్యం కంపెనీ మూసుకుని వెళ్లింది. నెల జీతం ఇయ్యలేదు. భయంతో ఇంటికి వెళ్తామంటే వెళ్లనీయడం లేదు. వెయ్యి డాలర్లు ఇస్తే పంపిస్తామని అంటున్నారు. భయటకు వెళ్తే చంపివేస్తామని బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది. మమ్ములను ఎలాగైనా ఇంటికి వచ్చేలా చేయండి. - నాడెం నాగరాజు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement