-
నవ వధువుది ఆత్మహత్యే..
ఖలీల్వాడి: ఈ నెల 2న నిజామాబాద్ సుభాష్నగర్లోని సుధా హైట్స్ అపార్ట్మెంట్ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి.. రెండు నెలల క్రితం హమాల్వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్బక్స్ కాఫీ స్టోర్కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్పై ఉన్న టిప్ జార్ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..!
కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సృష్టించాడు. నెపం వేరేవారిపై నెట్టేందుకు మరో వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. తీరా పోలీసులు విచారణలో అసలు నిజం వెలుగుచూడడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు. పుత్తూరు(చిత్తూరు జిల్లా): మండలంలోని ఉత్తరపు కండ్రిగలో బుధవారం భానుప్రియ(26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు భర్త నారాయణమూర్తే భార్యను హత్యచేశాడని గురువారం తేల్చేశారు. పోలీసుల కథనం మేరకు.. నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మహీధర్(6), బాబి(4) అనే ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో భానుప్రియను స్థానికులైన ఉపాధ్యాయుడు గోపి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ వేధిస్తుండేవారు. దీంతో అనుమానం పెంచుకున్న నారాయణమూర్తి సైతం భార్యను ఇబ్బందిపెట్టేవాడు. దీనిపై మూడురోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి, ఉరేసి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టాడు. చివరకు నారాయణమూర్తే అసలు నిందితుడని తెలియడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపై మరో కేసు నమోదు చేశారు. చదవండి: ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య భర్తను చంపి.. ఇంటి పెరట్లో పాతిపెట్టి.. -
గొడవపడిన భర్త..కాల్గర్ల్ పేరుతో భార్య ఫొటో పోస్టు
సాక్షి,హైదరాబాద్: భార్యతో గొడవ పడిన విషయాన్ని మనస్సులో పెట్టుకుని సొంత భార్య ఫొటోనే సామాజిక మాధ్యమంలో పెట్టి అల్లరిపాలు చేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కుషాయిగూడ ఈసీఐఎల్లోని రాధికా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తోన్న జాన్ జార్జ్ అలియాస్ సన్నీ దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కుటుంబంతో కలసి ఉంటున్నాడు. ఈ మధ్యలో చిన్నచిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భార్య వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలను కున్న సన్నీ ఆమె తన స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను షేర్చాట్లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఉన్నవారంతా కాల్గర్ల్స్ అని కామెంట్ చేయడంతో పాటుగా వాయిస్ ఇచ్చాడు. ఆ ఫొటోకింద భార్య ఫోన్ నంబర్ను పేర్కొన్నాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అతడి భార్యకు ఫోన్కాల్స్ రావటంతో బాధితురాలు శనివారం రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడు సన్నీని శనివారం అరెస్టు చేశారు. -
సీసీ కెమెరాలు అమర్చి పైశాచికత్వం
కృష్ణరాజపురం : భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త.. ఇంట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. భర్త పైశాచికత్వాన్ని భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన బెంగళూరులోని రామ్మూర్తినగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మూపర్తి బెంగళూరు నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన అనూపతో వివాహమైంది. ఆ సమయంలో రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం ఇచ్చి రూ.45 లక్షలు ఖర్చు చేసి పెళ్లిని ఘనంగా వివాహం జరిపించారు. కొద్ది కాలం భార్యను బాగానే చూసుకున్న ప్రదీప్.. మెల్లగా తనలోని పైశాచికత్వాన్ని బహిర్గతం చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ పడకగదిలో, వంటగదిలో, హాల్లో సీసీ కెమెరాలు అమర్చాడు. దీంతోపాటు కెమెరాతో వీడియో తీస్తూ తన ముందు నగ్నంగా నడవాలంటూ అనూపను వేధించేవాడు. అందుకు నిరాకరించిన అనూపను శారీరకంగా కూడా వేధించాడు. మరో వైపు బెంగళూరులోనే ఉంటున్న ప్రదీప్ అక్క ప్రశాంతి, ఆమె భర్త సంజీవ్లు అనూపను శారీరకంగా, మానసికంగా హింసించా రు. ఓ దశలో అనూపను పుట్టింటికి పం పించారు. దీంతో అనూప తల్లితండ్రులు అదనంగా రూ.5 లక్షలు ఇచ్చారు. దీన్ని అదునుగా భావించి ముగ్గురు మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగారు. విడాకులు విషయం దాచి రెండో పెళ్లి... ప్రదీప్కు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్యను కూడా ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రదీప్ తల్లితండ్రులు మూడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన అనూపతో వివాహం జరిపించారు. కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్న ప్రదీప్ అక్క ప్రశాంతి.. కొద్ది రోజుల క్రితం అనూపను తన ఇంటికి తీసుకెళ్లి ప్రదీప్ మొదటి వివాహం సీడీని చూపించి మొదటి భార్య తల్లితండ్రులు ఇంకా ఎక్కువ మొత్తంలో తన తమ్మడికి కట్నకానుకలు ఇచ్చారని అంతకంటే ఎక్కువ మొత్తంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిం చింది. అనూప తల్లితండ్రులు వచ్చి ఆరా తీయగా ప్రదీప్ మొదటి వివాహం వ్యవహార ం వెలుగు చూసింది. అంతేగాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించిన విషయం కూడా బహిర్గతమైంది. దీంతో అనూప ఈనెల 4వ తేదీ భర్త ప్రదీప్తో పాటు ప్రదీప్ అక్కబావలైన ప్రశాంతి, సంజీవ్కుమార్లపై రామ్మూర్తినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement