Hotel sector
-
హోటల్ రంగాలపై యుద్ధ ప్రభావం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పశ్చి మాసియాలో కమ్ముకున్న యుద్ధ వాతావరణం ఆతిథ్యం, హోటల్ రంగాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆంక్షలు, తీవ్ర కొరతతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులో హోటళ్ల రంగం సమ్మెబాట పట్టగా ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండు వేలకు పైగా స్టార్ హోటళ్లు, మూడు వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులతో కలిపి 20 – 25 వేల హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిత్యం 50 వేల వరకు వాణిజ్య సిలిండర్లను విని యోగిస్తుండగా.. తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా 40 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ దందాగ్యాస్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు అమలు చేస్తున్నాయని, దీంతో ఇదే అదునుగా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందాకు తెర తీశారని హోటళ్ల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక్కో వాణిజ్య సిలిండర్పై రూ.115 చొప్పున పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్ రూ.2500– రూ.3 వేల వరకు బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.వినియోగదారులపై తీవ్ర ప్రభావంవాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల రంగంతో పాటు వినియోగదారులను కుదేలు చేసేలా కనిపిస్తోంది. గ్యాస్ను అధిక ధరకు కొనుగోలు చేస్తే తోపుడు బండ్లపై తినే ఇడ్లీ దగ్గర పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో మెనూ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది చివరకు జనంపైనే పడుతుంది. రాష్ట్రంలో నెలకు 84 లక్షలకుపైగా గృహ, వాణిజ్య వినియోగ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఇందులో 10 శాతానికిపైగా వాణిజ్య సిలిండర్లే ఉన్నాయి. కాగా, గ్యాస్ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఏపీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు మరో రెండు వారాలకు వరకు సరిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ బుకింగ్ కాల పరిమితిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. కాగా, బ్లాక్ మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల దందాను వెంటనే అరికట్టాలని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రమణ, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ వీరాస్వామి కోరారు. కొరత భయంతో బుకింగ్లు పెరగడం వల్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం అవుతోందని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్అధ్యక్షుడు కె.శ్రీనాథ్రెడ్డి తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు : మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని చూసి భయపడొద్దని సూచించారు. -
‘హోటల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో హెటల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెటల్ రంగాన్నిఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి బొత్స.. చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుపడాలి. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూదన్నదే మా ప్రభుత్వ ఉద్ధేశం. హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తాం. హోటల్స్ లో భోజనం క్యాలిటీగా ఇవ్వాలి.క్వాలిటీగా ఇస్తే ప్రజలు అక్కడికే వస్తారు. ఏ రంగంలో నైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలి.సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం’ అని తెలిపారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్వి స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బొత్సతో పాటు మంత్రి జోగి రమేస్, తూర్పు నియోజకవర ఇంచార్జి దేవినేని అవినాష్లు హాజరయ్యారు. -
కొత్త ‘ఆతిథ్యం’
హుడా కాంప్లెక్స్: అతిథ్య రంగం ట్రెండ్ మారుతోంది.. కాలానుగుణంగా వినియోగదారుల అభి‘రుచుల’ మేరకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆయా రంగంల్లోనూ పెను మార్పులు తీసుకువచ్చింది. ఆతిథ్యరంగంలో ఇప్పటివరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్లు, ఆర్డర్ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగించడంతో పాటు.. అవి వడ్డించే రోబోలను ఆసక్తిగా తిలకిం చేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవిడ్కు దూరంగా.. వినూత్నంగా కోవిడ్ ఉధృతికి తోడు వరుస లాక్డౌన్లతో ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ఆతిథ్య రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు పుట్టినరోజు.. పెళ్లి రోజు.. ఇతర శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లి కడుపు నిండా తిందామని భావించిన వారు కోవిడ్కు భయపడి వీటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మలక్పేట్కు చెందిన మణికాంత్ గౌడ్. అలా రోబోలతో కొత్తగా రెస్టారెంట్కు శ్రీకారం చుట్టాడు. ఆర్డర్ మొదలు.. సప్లయ్ వరకు హోటల్కు వచ్చిన అతిథులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు సాధారణ మనుషుల స్థానంలో రోబోలను తీసుకువచ్చాడు. ఈ మేరకు కొత్తపేట్లో కొత్తగా రెస్టారెంట్ను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలు పని చేస్తున్నాయి. వచ్చిన అతిథుల నుంచి ఆర్డర్ తీసుకోవడం.. ఆర్డర్ను చెఫ్కు అందజేయడం.. ఆహార పదార్థాలు సిద్ధం కాగానే వాటిని అతిథులకు వడ్డించడం.. తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లడం.. శుభ్రం చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం లాంటి పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. మరోరోబో వచ్చి గెస్టులతో ముచ్చటిస్తుంది. వారికి బోరు కొట్టకుండా ఇష్టమైన సంగీతం, సాహిత్యం వినిపిస్తూ అమితంగా ఆకట్టుకుంటోంది. నగరంలోనే తయారీ 2019లో మాదాపూర్లో ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశా. ఇప్పటికే సికింద్రాబాద్లోని ఓ హైస్కూల్కు ఎడ్యుకేషన్ రోబోను ఇచ్చాం. ఇటీవల కొత్తపేట్లోని హోటల్కు రోబోలను సరఫరా చేశాం. తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, అహ్మదాబాద్, పుణే నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్లో రియల్ ఎస్టేట్ రంగంలోను రోబోలను ప్రవేశ పెట్టబోతున్నాం. వీటి ధర రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. – రామ్సింగం, సీఈఓ, ప్రైవేట్ లిమిటెడ్ రోబోలతో మంచి ఆదరణ నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా రెస్టారెంట్ తెరవాలని భావించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండడంతో రోబోల తయారీ, పనితీరుపై అవగాహన ఉండటం కలిసి వచ్చింది. అలా రోబోలతో సరికొత్తగా రెస్టారెంట్ను మార్చేశాం. వీటిని చూసేందుకు చాలామంది వస్తున్నారు. కస్టమర్లు పెరిగారు. ఆదరణ చాలా బాగుంది. – మణికాంత్గౌడ్, రెస్టారెంట్ యజమాని, కొత్తపేట నైస్ థ్రిల్లింగ్ ఏదైనా తిందామని కుటుంబసభ్యులతో కలిసి కొత్తపేటలోని రెస్టారెంట్కు వెళ్లాం. అక్కడ రోబోలను చూసి ఆశ్చర్యపోయాం. ఆర్డర్ తీసుకోవడం, సప్లయ్ చేయడం అచ్చం మనిషిలాగే చేస్తున్నాయి. నైస్ థ్రిల్లింగ్. వాటిని చూస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ.. నచ్చింది తింటూ ఎంజాయ్ చేశాం. – రాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ -
జీఎస్టీతో హోటల్ రంగం కుదేలే..
తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఆందోళన సాక్షి, హైదరాబాద్: కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న, మధ్యతరహా హోటళ్లకు పెనుభారం తప్పదని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని నాన్ ఏసీ హోటళ్లపై 12%, ఏసీ రెస్టారెంట్లపై 18%, స్టార్ హోటళ్లపై 28 % వడ్డించడంతో పలు హోటళ్లను మూసేయాల్సిన దుస్థితి తలెత్తుతోందని చెబుతు న్నారు. జీఎస్టీ రేటును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్స్ అసోసియేషన్ ఈ నెల 30న బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో బంద్కు మద్దతిచ్చే అంశంపై తెలం గాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చిన్న, మధ్యతరహా ఏసీ రెస్టారెంట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. తాజా పన్ను విధానంతో పలు హోటళ్లు మూతపడే పరిస్థితిని రానుందని, దీంతో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు.


