-
HMDA:మార్టిగేజ్ చేశాకే తాత్కాలిక లేఔట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి అవతల కొత్త లేఔట్ల అనుమతులకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాత్కాలిక లే ఔట్కు అనుమతి ఇచ్చే సమయంలోనే.. ఆ స్థలంలో 15 శాతాన్ని సంబంధిత మున్సిపాలిటీ/ కార్పొరేషన్కు మార్టిగేజ్(తనఖా) చేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తేనే తాత్కాలిక లేఔట్ అనుమతి ఇవ్వాలని, తుది లే ఔట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తనఖా పెట్టిన ప్లాట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి మార్టిగేజ్ నిబంధన ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏ అవతల జిల్లాల్లోనూ దీనిని అమలు చేయనున్నారు. ఖాళీ స్థలాన్ని ముందే చూపాలి లే ఔట్ల విస్తీర్ణం ఆధారంగా వదలాల్సిన ఖాళీ స్థలా లను ముందుగానే గుర్తించి.. అనుమతికి దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని లే ఔట్లలో కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లుగా నిర్ణయించారు. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో.. 1965, 1970ల నాటి లేఔట్ నిబంధనలన్నీ రద్దవుతాయని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ స్పష్టం చేసింది. లేఔట్ కు వెళ్లే రహదారి కనీసంగా 18 మీటర్ల వెడల్పు ఉండాలని.. అంతకన్నా తక్కువగా ఉంటే ఆ రో డ్డును 18 మీటర్లకు విస్తరించే విధంగా వందశాతం రోడ్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పే ర్కొంది. జిల్లాల్లో లే ఔట్ల అనుమతిపై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. లే ఔట్లో ఖాళీగా వదిలే స్థలాలను సంబంధిత స్థానిక సంస్థకు రిజిస్టర్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని మరిన్ని కీలక అంశాలు ♦ జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మెంబర్ కన్వీనర్గా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, డీటీసీపీవో, కలెక్టర్ నియమించే మరో నామినీ సభ్యులుగా ఉంటారు. ♦ లే ఔట్కు దరఖాస్తు చేసుకునే వారు వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై సెల్ప్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ♦ దరఖాస్తు సమయంలో రూ. పదివేలు ఫీజు చెల్లించాలి. తాజా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, భూమార్పిడి సర్టిఫికెట్, అనుమతించిన మాస్టర్ప్లాన్/డీటెయిల్డ్ టౌన్ ప్లానింగ్ స్కీమ్ కాపీ జత చేయాలి. ♦ నది/సరస్సు/చెరువు/కుంట/నాలాకు 200 మీటర్ల దూరంలో లేఔట్ ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఎన్వోసీ తీసుకోవాలి. ♦ 50 హెక్టార్లపైబడిన లే ఔట్కు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ♦ లేఔట్కు రోడ్డు పొడవు ఆధారంగా.. రోడ్డు వెడల్పు ఎంత ఉండాలన్నది వర్తిస్తుంది. 300 మీటర్ల రోడ్డు అయితే 9 మీటర్ల వెడల్పు, 500 మీటర్లలోపు ఉంటే 12 మీటర్లు, 1000 మీటర్లలోపు ఉంటే 18 మీటర్లు, వెయ్యి మీటర్ల కంటే ఎక్కువ పొడవైన రోడ్డు ఉంటే 24 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండాలి. ♦ లే ఔట్లో కనీసం పది శాతం ఖాళీ స్థలం ఉండాలి. అందులో 9 శాతం పచ్చదనానికి, ఒక శాతం ఇతర అవసరాల కోసం వినియోగించాలి. ♦ సామాజిక మౌలిక సదుపాయాల కోసం అదనంగా 2.5శాతం కేటాయించాలి ♦ కనీస ప్లాటు విస్తీర్ణం 50 చదరపు మీటర్లు.. వెడల్పు కనీసం ఆరు మీటర్లు ఉండాలి. ♦ ప్లాటెడ్ ఏరియాలో 15 శాతాన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్కు తనఖా చేయాలి. 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే ఔట్ ఉంటే.. విద్య, ఆరోగ్య, వాణిజ్య అవసరాలకు అదనంగా స్థలాలు కేటాయించాలి. ♦ నీటి వనరులకు దగ్గర ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ♦ నదులు/వాగులకు 50 మీటర్లలోపు అనుమతులు ఇవ్వరు. చెరువులు/కుంటలు/ట్యాంకులకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉంటేనే 10 హెక్టార్ల లే ఔట్లకు అనుమతిస్తారు. పదిహెక్టార్లలోపు ఉంటే 9 మీటర్ల సరిహద్దు ఉండాలి. ♦ నాలాలు, కాలువలు, వాగు, వరద నీటి కాలువల (పది మీటర్ల వెడల్పు ఉన్నవి)కు రెండు మీటర్ల కనీస సరిహద్దు ఉంటే అనుమతిస్తారు. ♦ హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఉంటే.. కింద స్థలాన్ని గ్రీన్ఫీల్డ్ జోన్గా గుర్తిస్తారు. వాటిలో రహదారులు వేసుకోవచ్చు, లేదా గ్రీనరీ పెంచాలి. గ్రీన్ఫీల్డ్ జోన్కు కనీసం మూడు దూరంలోనే ప్లాట్లు చేయాలి. ♦ రైల్వే ఆస్తులకు సమీపంలో కనీసం 30 మీటర్లు దూరంలో లే ఔట్ అభివృద్ధి చేయాలి. ♦ రక్షిత పురాతన నిర్మాణాల నుంచి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరంలోపు ఉంటే సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ఆయిల్, నేచురల్ గ్యాస్ పైపులైన్లకు సమీపంలో లేఔట్లు ఉంటే వారి దగ్గర నుంచి ఎన్వోసీ తీసుకోవాలి. ♦ లే ఔట్ కోసం అన్ని పత్రాలతో సరిగా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో తాత్కాలిక అనుమతులు ఇస్తారు. లేని పక్షంలో అనుమతులు లభించినట్లు భావించాలి. ♦ దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోగా సంబంధిత అధికారులు వాటిని వివరిస్తూ ఆన్లైన్లోనే సమాచారం ఇస్తారు. లే ఔట్ చేసే సంస్థలు/వ్యక్తులు వాటిని ఏడు రోజుల్లోగా సవరించి సమర్పించాలి. ♦ తాత్కాలిక లేఔట్ను ఆమోదించిన రెండేళ్లలో అన్ని సౌకర్యాలతో లేఔట్ పూర్తి చేయాలి. తాత్కాలిక లేఔట్ కోసం చెల్లించిన ఫీజులో అదనంగా 20 శాతం ఫీజు చెల్లిస్తే మరో సంవత్సరం పొడిగింపు ఇస్తారు. ♦ అన్నీ సక్రమంగా ఉంటే తుది లేఔట్ మంజూరు చేసి. తనఖా పెట్టిన స్థలాలను 21 రోజుల్లోగా విడుదల చేస్తారు. -
చెస్ కోసం ఇంటినే తాకట్టు పెట్టేశారు!
వారిద్దరూ అన్నదమ్ములు.. టీనేజీ కూడా ఇంకా దాటలేదు. కానీ, దేశం నలుమూలలా తిరిగారు. ఇరుకైన జనరల్ రైలు భోగీల్లో నిద్రలేని ప్రయాణాలెన్నో చేశారు. ఎన్నెన్నో టోర్నమెంట్లో పాల్గొన్నారు. కొన్నిసార్లు పతకాలు, మరికొన్ని సార్లు ప్రశంసలు.. ఏదైతేనేం ఆత్మ సంతృప్తితోనే తిరిగి వస్తారు. ఎంత కష్టానికై నా ఓర్చుకుంటారు. ఇష్టమైన చదరంగం కోసం ఏకంగా తమ ఇంటినే తాకట్టు పెట్టుకున్నారు. మట్టిలో మాణిక్యాలు వీరు.. కాస్త చేయూతనిస్తే తళుక్కున మెరిసిపోతారు..! బిహార్లోని అరారియా గ్రామానికి చెందిన 16 ఏళ్ల కుమార్, 14 ఏళ్ల సౌరభ్లు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తారు. కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో నేర్చుకుంటారు. పుస్తకాలు పడతారు. వాటిని బాగా చదివి సారాన్నంతా బుర్రకెక్కించుకుంటారు. తర్వాత ఆ విజ్ఞానాన్నంతా చెస్ బోర్డుపై ప్రదర్శిస్తారు. విజేతలుగా నిలుస్తారు. సింపుల్గా అరుుతే ఇదే వారి కథ..! కానీ, విజేతలుగా నిలవడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలను దాటాలి. కుమార్, సౌరభ్లకు అవి ఆప్తమిత్రులు..! 2007 నుంచి చదరంగం ఆడటం మొదలుపెట్టారు ఈ అన్నదమ్ములు. కానీ, ప్రొఫెషనల్ శిక్షణ ఏనాడూ తీసుకోలేదు. 2014లో వీరికి ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ కోచ్ విశాల్ సరీన్ పరిచయమయ్యేంతవరకూ అలాంటి శిక్షణ ఒకటి ఉంటుందని కూడా వీరికి తెలీదు. అతడి పరిచయం తర్వాత కుమార్, సౌరభ్లు తమ ఇంట్లోని పాత కంప్యూటర్ ముందు కూర్చుని స్కైప్లో విశాల్ చెప్పే చెస్ పాఠాలు శ్రద్ధగా వింటున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీకి మకాం మార్చి శిక్షణ కూడా తీసుకోలేని దుస్థితి వీరిది. అందుకే ఏకలవ్య శిష్యులుగా మారారు. దాదాపు చెస్లోని మెలకువలన్నీ స్వయంగానే నేర్చుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకుంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరిలో చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ గ్రాండ్మాస్టర్ టోర్నమెంట్లో కుమార్ ప్రతిభకు అందరూ నోరెళ్లబెట్టారు. తొమ్మిది రౌండ్లలో 6 పారుుంట్లు సాధించి, ఇంటర్నేషనల్ మాస్టర్గా (ఐఎమ్) నిలిచాడు. ఇలా మరో రెండు ఐఎమ్లు సాధిస్తే ఇంటర్నేషనల్ మాస్టర్గా ‘ఫిడే’ టైటిల్ సాధిస్తాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అండర్ 19 పోటీల్లో జాతీయ చాంపియన్గానూ నిలిచాడు. కానీ, వీరి ప్రతిభకు ప్రధాన అడ్డంకి పేదరికమే. టోర్నమెంట్లలో పాల్గొనాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. పెద్దమనసుతో సాయం చేసే దాతల కోసం ప్రస్తుతం వీరు చూస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం..!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement