breaking news
holy place
-
ముస్లింల స్థలాలను లాక్కోవడానికే వక్ఫ్ చట్టం: ఒవైసీ
కిషన్గంజ్ (బిహార్): ముస్లింల మసీదులు, ఇతర పవిత్ర స్థలాలను లాక్కునేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ’సీమాంచల్ న్యాయ యాత్ర’ను ప్రారంభించారు. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాష్ట్రంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన పార్టీ విజయావకాశాలను పెంచుకునే లక్ష్యంతో మూడు రోజుల సుడిగాలి పర్యటనకు ఒవైసీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోచధమన్ అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాలు, ఖబరస్తాన్లను లాక్కోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని, సదుద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఈ ఆస్తులు అల్లాహ్కు చెందినవని మోదీ గ్రహించలేదని విమర్శించారు. మోదీ తన దురుద్దేశపూర్వక ఆలోచనలతో ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పారు. ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింలు తమ మసీదులలో ప్రార్థనలు చేస్తూనే ఉంటారని, అల్లాహ్ను విశ్వసించేవారి పవిత్రమైన స్థలాలు బీజేపీ–ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ.. బిహార్లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పారీ్టలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచి్చనప్పటినుంచి దేశ ముస్లింలు లౌకిక పారీ్టగా చెప్పుకొంటున్న పారీ్టకి మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు.. చాలా కాలంగా ముస్లింల ఓట్లు కోరుకున్నారని, కానీ, కూలీల్లా ఈ భారాన్ని ఎప్పటికీ మోయలేమని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ‘ఒంటరిగా మిగిలిపోతున్న మన యువతపై శ్రద్ధ వహించాలి. మన శ్రేయస్సుకు అవసరమైనవి చేయాలి. కొన్ని పారీ్టలు.. అధికారాన్ని అనుభవించేందుకు ఇకపై మన ఆకాంక్షలను త్యాగం చేయరాదు’.. అని ఒవైసీ పిలుపునిచ్చారు. -
ప్రపంచంలోని టాప్ 10 పవిత్ర స్థలాలు
-
జెరుసలేంలో ఉద్రిక్తతలు
జెరూసలేం: ఇజ్రాయెల్లోని జెరుసలేంలోని అల్ అక్సా మసీదులో పోలీసులు, పాలస్తానీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈ మసీదులోనే ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ యూదులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు జరుగుతుంటాయి. శుక్రవారం మసీదులో ప్రార్థనల కోసం 60 వేల మంది ముస్లింలు వచ్చారు. గుడ్ఫ్రైడే కావడంతో అక్కడే ఉన్న చర్చికి యూదులు కూడా వేలాదిగా వచ్చారు. హమాస్కు మద్దతుగా రోడ్లెక్కారు. యూదుల పవిత్ర స్థలం ముగ్రాభి గేట్పైకి రాళ్లు విసిరారు. పోలీసులపైకీ రాళ్లు రువ్వుతూ రెచ్చగొట్టారు. లాఠీచార్జీలో 150 మందికి పైగా గాయపడ్డారు. -
దూరాన్ని, దాస్యాన్ని తొలగిస్తూ చిరిగిన తెర !!!
కల్వరిలో యేసు మరణసమయంలో యెరూషలేములోని మహా దేవాలయపు తెర మధ్యలో పైనుండి కిందికి చిరగడం ఒక గొప్ప అద్భుతం. అసలు ఆనాటి ఆ యూదు దేవాలయ నిర్వహణ, నిర్మాణమే ‘ప్రజలను దేవునికి దూరంగా పెట్టడం’ అనే సంప్రదాయంతో సాగింది. దేవాలయ ప్రాంగణంలో మహిళల కోసం, యూదులు కాని అన్యుల కోసం అంటూ మంటపాలను విడి విడిగా కట్టి ఉంచారు. యూదుస్త్రీలకు, యూదులు కాని అన్యులకు దేవాలయ ప్రవేశం లేదు. వారు ఆవరణంలోని మంటపాల దాకా మాత్రమే వెళ్ళాలి. ఇక యూదు పురుషుల కోసమైతే మరో విశాలమైన మంటపాన్ని కట్టారు. వాళ్లకు కూడా అక్కడిదాకానే ప్రవేశార్హత. ఆవరణం మధ్యలో బలి అర్పణల కోసం ఒక బలిపీఠాన్ని నిర్మించారు. బలి పీఠాన్ని యూదులు కూడా తాకడానికి లేదు. కేవలం యాజకులు మాత్రమే బలిపీఠం దాకా వెళ్తారు, వాళ్ళే బలులర్పిస్తారు. ఆవరణలో నుండి దేవాలయం లోనికి వెళ్ళడానికి చాలా మెట్లుంటాయి. అంటే దేవాలయం చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక దేవాలయం మొత్తం పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం అని రెండు భాగాలుగా నిర్మించబడింది. పవిత్ర స్థలం లోనికి ఆయా పూజా విధుల నిర్వహణ కోసం, అందుకు ప్రత్యేకించబడి, ప్రతిష్ట చేయబడిన యాజకులు మాత్రమే అది కూడా నిర్ణీత విధానంలో ప్రవేశించాలి. పవిత్ర స్థలంలోకి యాజకులు కూడా పూజా కార్యక్రమాలకోసమే వెళ్ళాలి తప్ప, ఆషామాషీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్లేందుకు దేవుని అనుమతి లేదు. ఇక దేవుని నివాస స్థలంగా పరిగణించబడే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు కూడా ప్రవేశించరాదు. ప్రధాన యాజకుడొక్కడే అది కూడా ఏడాదికొక్కసారి మాత్రమే ప్రజలందరి ప్రాయశ్చిత్తం కోసం ‘ప్రాయశ్చిత్త దినం’ నాడు ప్రత్యేక దుస్తులు ధరించి అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తాడు. లేవీకాండం 16వ అధ్యాయంలో ఆ వివరాలుంటాయి. యూదులకు అత్యంత ప్రాముఖ్యమైన ఆరాధనా ప్రక్రియను ప్రధాన యాజకుడు అతిపవిత్ర స్థలంలో, పాప పరిహారార్థ బలి వస్తువును చేత పట్టుకొని వెళ్లి అక్కడున్న కరుణాపీఠాన్ని ఆశ్రయించాలి. ఎన్ని లక్షల మంది యూదులున్నా వాళ్ళెవరూ ఆ స్థలంలోకి ఎవరూ కనీసం తొంగి చూడకూడదు. అందుకే యాజకులను, భక్తులను దూరంగా ఉంచడానికి పవిత్ర స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య పొడవాటి తెర వేలాడుతూ ఉంటుంది. అక్కడి దేవాలయ నిర్మాణం, వాతావరణమంతా ఇలా భయం భయంగా ‘ఇక్కడ దేవుడున్నాడు. ఆయన అత్యంత పరిశుద్ధుడు, మీరు అత్యంత పాపులు. అందువల్ల మీరంతా దేవునికి దూరంగా ఉండండి’ అని ఖండితంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంటుంది. దేవాలయ యాజమాన్యం, వ్యవహారాలన్నీ ధర్మశాస్త్ర నిబంధనల మేరకు జరగాలి. ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగితే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలుంటాయి. ధర్మశాస్త్రపు దాస్యం నుండి, దాని శిక్షావిధి నుండి యేసుప్రభువు సిలువయాగం ద్వారా యేసుప్రభువులో యూదులకే కాదు మానవాళి యావత్తుకూ దేవుడు స్వేచ్ఛను ప్రకటించాడు (రోమా 8:1) అందుకు సూచనగా, శుభారంభంగా దేవుడే దేవాలయపు అడ్డు తెరను చించేశాడు. యాజకులు, యాజకేతరులు, స్త్రీలు, పురుషులు, పాపులు, నీతిమంతులు, భక్తులు, ధర్మకర్తలనే విభేదాలు లేని ఒక ఆత్మీయ సమసమాజావిర్భావం దేవుని హృదయాభిలాష మేరకు కల్వరిలో యేసు ఆత్మత్యాగం ద్వారా జరగడమే గుడ్ ఫ్రైడే నాటి ప్రత్యేకత. ఒక విధంగా తండ్రియైన దేవుడే తన రక్షణ ప్రణాళికలో భాగంగా తన అద్వితీయ కుమారుడైన యేసులో మానవాళికంతటికీ ‘మతస్వేచ్ఛ’ను ప్రకటించి పరలోక ద్వారాలను పూర్తిగా తెరిచాడు. అలా దేవుని కృపా యుగం ఆరంభమయింది. దేవుడంటే అక్కడెక్కడో ఎవరికీ అందకుండా, ఎవరికీ కనిపించకుండా, సామాన్యులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉండేవాడన్న ధర్మశాస్త్ర యుగపు చీకటి రోజులకు దేవుడే తెర వేస్తూ ఆయన మానవాళికంతటికీ అందుబాటులోకి వచ్చిన పరలోకపు తండ్రి అయ్యాడు. దేవునితో మనిషి అనుభవించిన యుగయుగాల ఎడబాటుకు, అనాథత్వానికి దేవుడే ఇలా ఒక పరిష్కారాన్నిచ్చాడు. దేవాలయపు అడ్డు తెర చిరగడంతో విశ్వాసుల ఆత్మీయ స్వేచ్ఛకు అంకురార్పణ జరిగి క్షమాయుగం. కృపాశకం ఆరంభమైంది. -
కలకలం.. పవిత్ర స్థలంలో మద్యం, మాంసం
అమేథి: పవిత్ర రంజాన్ రోజున మత ఘర్షణలు సృష్టించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్లాన్ చేశారు. ప్రార్థనా స్థలంలో రాత్రవేళలో మద్యం, మాంసం వేసి వెళ్లారు. యూపీలోని అమేథీ షుకుల్ బజార్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాదల్ఘర్ ఈద్గాలో వద్ద రంజాన్ ప్రార్థనలకు వెళ్లిన వారు ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. ఈద్గాను శుభ్రం చేసిన అనంతరం అక్కడ రంజాన్ ప్రార్థనలు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ పూనమ్ వెల్లడించారు.