-
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్లైన్కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు. -
ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్సెస్ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్లో వారి కనెక్షన్కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు) -
Hyderabad: ఉచిత నీటి పథకానికి సమీపిస్తున్న గడువు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందేందుకు వినియోగదారులు తమ కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జలమండలి ఈ నెల 31 చివరి గడువు విధించిన విషయం విదితమే. మహానగరంలో మొత్తం 9.84 లక్షల నల్లాలు ఉండగా ఈ నెల 17 వరకు సుమారు 50 శాతం మంది మా త్రమే నమోదు ప్రక్రి యను పూర్తిచేసుకున్నారు. వారం రోజులుగా అన్ని డివిజన్లలో కలిపి సుమారు 20 వేల మంది అనుసంధానం పూర్తి చేసుకున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నెల 31తో గడువు తీరనుండడంతో ఎంత మంది ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉచితానికీ బద్ధకమేనా.. ► నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి 13 నెలల సమయమిచ్చినా సిటీజన్లు ముందుకు రాకపోవడం గమనార్హం. నగరంలో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లున్న పలువురు వినియోగదారులు వాటిని అద్దెకిచ్చి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి అనుసంధానం చేసుకునే విషయంలో పలు ఇబ్బందులున్నాయి. ► వాణిజ్య నల్లాలు మినహా సుమారు 4.10 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని జలమండలి సూచించింది. లేని పక్షంలో ఈ 13 నెలల నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ► ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి వేలల్లో నీటి బిల్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తకుండా నాలుగు వాయిదాల్లో 13 నెలల బిల్లును చెల్లించే వెసులుబాటు ను కల్పించనున్నట్లు తెలిపింది. ► ఉచిత నీటిపథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచే సదరు వినియోగదారులు నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని పొందుతారు. అప్పటివరకు నీటి బిల్లు చెల్లించాల్సిందే. (చదవండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్..) మీటర్లు తప్పనిసరి... ప్రతి గృహవినియోగ నల్లాకూ నీటి మీటరును సైతం వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మీటర్లు ఉంటే అవి పని చేసే స్థితిలో ఉండాల్సిందే. ఈ మీటరు రీడింగ్ ఆధారంగా నెలకు 20 వేల లీటర్ల కంటే అధిక వినియోగం ఉన్న వినియోగదారుల నుంచి నీటిబిల్లు విధిగా వసూలు చేయనున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న అన్ని ఫ్లాట్ల యజమానులు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా ఫ్లాట్ల వినియోగదారులకు నీటి బిల్లులు తథ్యం. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
పానీ చోర్.. పారాహుషార్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలపై జలమండలి విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధాన నగరంతో పాటు శివార్లలోనూ బోర్డు విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. ఏళ్లుగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో పలువురు నల్లాలను అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వైనంపై లోతుగా ఆరా తీస్తున్నారు. తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా ఈ అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఇటీవల నగర శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో.. అయిదు అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ►మహానగర పరిధిలో జలమండలికి 10.80 ల క్షల నల్లా కనెక్షన్లున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ(డొమెస్టిక్), మరో 2 లక్షల వరకు మురికి వాడలు (స్లమ్స్), మరో 80 వేల వరకు వాణిజ్య, బల్క్ నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాక సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలున్నట్లు అంచనా. ►పాత నగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనే తేడా లేకుండా ఈ అక్రమ నల్లాలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు జలమండలి అక్రమ నల్లాల భరతం పట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల తనిఖీలను ముమ్మరం చేయడంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. ►అక్రమ నల్లాలపై జలమండలి నజర్ ►శివార్లు, నగరంలో విస్తృత తనిఖీలు ►‘ఇంటి దొంగల’పైనా కేసులు నమోదు ►గ్రేటర్ పరిధిలో లక్ష వరకు అక్రమ నల్లాలు కంచే చేను మేసిన చందంగా.. ►జలమండలి పరిధిలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సహకారంతో పలువురు ఈ అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. భూమి లోపలున్న జలమండలి మంచినీటి పైపులైన్లకు అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా కన్నాలు వేసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ►ఈ వ్యవహారంలో బోర్డు సిబ్బంది, ప్రైవేటు ప్లంబర్లు, జలమండలి నల్లా కనెక్షన్లు మంజూరు చేసే గ్రీన్బ్రిగేడ్ సిబ్బంది పాత్ర సుస్పష్టం. ఏళ్లుగా బదిలీలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది కీలక పాత్రధారులుగా ఉంటున్నారు. విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడిన తర్వాత సదరు భవనాల యజమానులు, ఇందుకు సహకరించిన బోర్డు సిబ్బందిపైనా ఐపీసీ 269,430 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సమాచారం అందించండి.. అక్రమ నల్లాలపై ఎలాంటి సమాచారాన్నైనా తమకు అందించాలని జలమండలి నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. గృహ వినియోగ నల్లా కనెక్షన్ తీసుకొని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిపైనా 99899 98100, 99899 92268 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. ఉచిత తాగునీటి పథకం పక్కదారి పట్టకుండా ఉండాలంటే అక్రమ నల్లాల అంతు చూడాలని జలమండలి భావిస్తోంది. ఈ దిశగా ముందుకు వెళుతోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులను ముమ్మరం చేసింది. -
9 లక్షల కుటుంబాలకు ఉచిత తాగునీరు
రహమత్నగర్ (హైదరాబాద్): గ్రేటర్ పరిధిలో 9 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల మేర స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ రహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ధానిక లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించారు. అనంతరం సమా వేశంలో మాట్లాడుతూ.. రాజధానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు శుద్ధిచేసి నగర ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాబో యే తరాలకు మంచినీటి సమస్య లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధంచేశారని తెలిపారు. ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్కు రూ.8కోట్లు మంజూరు చేసి అద నపు నీటి నిల్వ సామర్థ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఖాళీ స్థలంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు కేటాయించి నివాసాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జలమండలి రూపొందించిన బ్రోచర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, నాగేందర్, వివేక్, ముఠాగోపాల్, మున్సిపల్ పరిపాలన ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎమ్మెల్సీ మల్లేశ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement