-
జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : నటి జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది. అందులోని మరి కొన్ని సన్నివేశాలు వివాదానికి తెరలేపాయి. దీంతో హిందూ మక్కళ్ కట్చి ప్రచార విభాగ అధ్యక్షుడు కాళీకుమార్ నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాచియార్ చిత్రంలో జ్యోతిక ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’ అంటూ మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంభాషణలను వెంటనే తొలగించి, జ్యోతిక, దర్శకుడు బాలాపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సమంతా.. ఈ చర్యలేల?
చెన్నై: నటి సమంత '10 ఎండ్రదుకుళ్' చిత్రంపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. విడుదలకు ముందు ఆ చిత్రం గురించి చాలా ఎక్కువే ప్రచారం చేసుకుంది. విక్రమ్ సరసన నటించిన ఆ చిత్రం విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేదు కదా సమంతకు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఒక పక్క చిత్రం నిరాశపరిచిన ఊరకుండకుండా సమంత ఆ చిత్రంలో చుట్ట తాగే ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దారిన పోయేదాన్ని తలకు చుట్టుకున్నట్లు ట్విట్టర్లోని చుట్ట పీల్చే ఫొటోలను చూసిన హిందు మక్కల్ కచ్చి కార్యకర్తలు సమంత చర్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమె బేషరత్తుగా క్షమాపణ చెప్పకుంటే ఇంటిని చుట్టుముట్టి ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు చేశారు. దీని గురించి ఆ పార్టీ రాష్ట కార్యదర్శి వీరమాణిక్యం శివ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ పొగతాగడం వల్ల మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ గురవుతున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పొగ తాగడం హానికరమంటూ పలు విధాలుగా ప్రచారం చేస్తోంది. కాని సమంత లాంటి వాళ్లు భావితరాలను పొగతాగే విధంగా ఉసుగొలుపుతున్నారని ఆరోపించారు. సమంత తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన చుట్ట తాగే ఫొటోలను వెంటనే తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమెకు పొగాకు ప్యాకెట్లను పోస్ట్ ద్వారా పంపుతామని అవసరం అయితే సమంత ఇంట్టిని చుట్టు ముట్టి ఆందోళనకు దిగడానికి వెనుకాడమని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement