-
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్
న్యూఢిల్లీ: వీలు దొరికినపుడల్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై విరుచుకుపడే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీని హిమంత ఈసారి ఏకంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్తో పోల్చారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ బాబా సిద్ధికీ రాహుల్ గాంధీ టీమ్పై చేసిన బాడీ షేమింగ్ ఆరోపణలపై హిమంత స్పందించారు. నార్త్ కొరియా నియంత కిమ్ ఒక్కడే తనతో ఫొటో దిగే పార్టీ కార్యకర్తలు ఫొటోజెనిక్గా ఉండాలని కోరుకుంటారని హిమంత రాహుల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కలవాలని వెళ్లిన తనను 10 కేజీల వెయిట్ తగ్గి రావాల్సిందిగా రాహుల్ టీమ్ సభ్యులు సూచించారని బాబా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు సంచనం రేపాయి. కాగా, గత నెలలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన సమయంలో హిమంత ప్రభుత్వం రాష్ట్రంలో యాత్రకు చాలా షరతులు విధించింది. గువహతిలోకి యాత్ర ప్రవేశించేందుకు వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి రాహుల్గాంధీపై అస్సాం సీఐడీ కేసు కూడా పెట్టింది. త్వరలో ఈ కేసులో సీఐడీ రాహుల్కు సమన్లు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. The only other person, I can think of, who makes such ridiculous demands from his party workers – that they should look nice and photogenic – is a dynast who rules North Korea. https://t.co/sAlcMoOwPQ — Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్ను కలవాలంటే 10 కేజీలు తగ్గమన్నారు -
రాహుల్కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
ప్లాస్మా దాతలకు అస్సాం శుభవార్త
గువాహటి : ఈశాన్య రాషష్ట్రం అస్సాంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. ప్లాస్మాదాతలు కరువై చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానాన్ని ప్రోత్సహించే విధంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా దాతలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గౌహతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మమాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే స్కోరు సాధిస్తే మొదటగా ప్లాస్మా దాతకే ప్రాధాన్యత ఇస్తామని, వారికి ఇంటర్వ్యూల్లో రెండు మార్కులు అదనంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రభుత్వం ఆఫర్) ప్రతీ ప్లాస్మా దాతకు ఓ సర్టిఫికేట్ అందిస్తామని.. తద్వారా భవిష్యత్తులో వారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. ఇతర రాష్ర్టాలనుంచి కూడా రావచ్చని అస్సాం ప్రభుత్వం వారికి స్వాగతం పలుకుందని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడంతో పాటు వారిని ప్రత్యేక అతిథిగా చూసుకుంటామని పేర్కొన్నారు. రాష్ర్టంలో అతి త్వరలోనే వర్చువల్ ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమవుతుందని సిల్చార్, దిఫు, దిబ్రుగ సహా 6 ప్రాంతాల్లో ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గువాహటిలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఇటీవల గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రోగులకు ప్లాస్మా చికిత్సనందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,754కు చేరుకోగా 12,888 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన) -
లాక్డౌన్ ప్రకటించిన అస్సాం ప్రభుత్వం
గువాహటి : గత వారం రోజులుగా అస్సాం రాష్ర్టంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా కరోనా తీవ్రత ఉన్న గువాహటిలోని కమ్రప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రకటించారు. జూన్ 28 నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలతో సహా వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు తెరవడానికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా వారాంతాల్లో (శని, ఆదివారం) అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. దీని ప్రకారం రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 12 గంటల కర్ఫ్యూ ఉండనుంది. అయితే పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన గువాహటిలో పరిమిత సంఖ్యలో బ్యాంకులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతేకాకుండా అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని ఉత్తర్వులో పేర్కొంది. (సేనల సన్నద్ధతపై నివేదిక) రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల్లోనే 700కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో 276 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా వీటిలో 133 కేసులు గువాహటిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,300కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. (ప్లాస్మా థెరఫీకి గ్రీన్సిగ్నల్) -
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే..
అసోం: అసోంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాయడం, మాట్లాడడం కచ్చితంగా రావాల్సిందే. సర్బానంద సోనావాల్ ప్రభుత్వం తాజా నిబంధనలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కేవలం అసోం భాషలో మాట్లాడడం సరిపోదని, రాయడం కూడా వచ్చి ఉండాలని తెలిపారు. అసోం భాషను కాపాడుకోవడంలో భాగంలోనే ఈ నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తన కుమారుడు వేరే రాష్ట్రంలో చదువుతున్నాడని.. అతడు అసోం భాషలో మాట్లాడగలడని, కానీ రాయడం రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేడని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని అన్నారు. పదవ తరగతి వరకు అసోం భాషను బోధించాలనే నిబంధనను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి అసోంని రాష్ట్ర భాషగా ఎప్పటికి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement