-
సిటీ పోలీసు హై అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ అందుబాటులో ఉండేలా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ సహకారం తీసుకోవాలంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. డయల్–100కు అదనంగా జోన్ల స్థాయిలో మరికొన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయా నంబర్లు ఇవి.. ప్రధాన కంట్రోల్ రూమ్: 040–27852333, 27852435, 27852436, 9490616690 సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852759, 9490598979 ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853562, 9490598980 నార్త్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853599, 9490598982 సౌత్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27854779, 9490616551, 7013299622 వెస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852483, 9490598981 ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040–27852482, 9490598985 ట్రాఫిక్ హెల్ప్ లైన్: 9010203626 -
మాస్కులు, శానిటైజర్ల ధరలపై హెల్ప్లైన్
న్యూఢిల్లీ: మాస్కులు, శానిటైజర్ల ధరల నియంత్రణకు జారీ చేసిన నోటిఫికేషన్ తు.చ. తప్పకుండా అమలయ్యేలా హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చి, వాటిపై ప్రచారం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మాస్కులు, శానిటైజర్ల ధరలను దుకాణదారులు భారీగా పెంచడంపై ‘జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్’అనే ఎన్జీవో వేసిన పిటిషన్పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. శానిటైజర్లు, లిక్విడ్ సోప్, మాస్కుల ధరల నియంత్రణకు జారీ చేసిన ఆదేశాలు అమలుకాని సందర్భాల్లో ప్రజలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది.(9 గంటలకు.. 9 నిమిషాల పాటు) అదేవిధంగా, పౌరులందరికీ కోవిడ్ పరీక్షలు ఉచితంగా జరిపించాలంటూ దాఖలైన పిల్, వలస కార్మికులకు కేంద్రమే వేతనం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. రిసార్టులు, హోటళ్లను షెల్టర్లుగా మార్చి, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వరకు ‘పిల్లు వేయడమే పనిగా పెట్టుకున్న వారి’పై లాక్డౌన్ విధించాలని కేంద్రం వ్యాఖ్యానించింది. యావత్ అధికార యంత్రాంగం తమ శక్తియుక్తులను కరోనాపై పోరుకు ధారపోస్తున్న ఈ కష్ట సమయంలో, ఏసీ గదుల్లో కూర్చున్న కొందరు వేసే పిల్ల కారణంగా అధికారులు విలువైన సమయాన్ని వృథా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. (మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత ) -
నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రజాదరణ మూటగట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోలో’కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి రెండు రోజుల్లోనే 2 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరో లక్ష మంది వారి అభిప్రాయాలను హెల్ప్లైన్ నెంబర్, వెబ్సైట్ల్లో పంచుకున్నారు. ఇంకా ఫోన్ కాల్స్ని లెక్కిస్తూనే ఉన్నాం. భారీ స్పందన లభిస్తోంది’అని వెల్లడించాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూసిన మమతా బెనర్జీ తిరిగి ప్రజాదరణ సమకూర్చుకునే దిశగా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడానికి వెయ్యి మందికి పైగా పార్టీ నేతలు రానున్న 100 రోజుల్లో 10వేల గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా ప్రారంభించిన ఈ భారీ ప్రజాదరణ కార్యక్రమం కోసం మమతా.. 9137091370 హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. -
ఫలితాలు చెప్పే ‘ఓటర్ హెల్ప్లైన్’ యాప్
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన యాప్ చెక్ పెట్టేస్తుంది. ఈ యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్లోకి నేరుగా వచ్చేస్తాయి. దీంతో మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్లో కావలసిన నియోజకవర్గం అప్డేట్స్ చూసుకోవచ్చు. రిటర్నింగ్ అధికారి ప్రకటించే వరకూ వేచిచూసే అవసరం లేకుండా ‘ఓటర్ హెల్ప్లైన్’ అనే యాప్ ద్వారా మే 23న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఫలితాల వివరాలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కూడా ఈసీ కల్పించింది. (చదవండి: ఓట్ల లెక్కింపులో 25,000 మంది సిబ్బంది) -
విశాఖ ఎంసెట్ కౌన్సిలింగ్ వద్ద గందరగోళం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement