breaking news
HEAT CLIMATE
-
అధిక వేడి వల్ల... ముందస్తు ముదిమి!
మెల్బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట. ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు! వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది. జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి? తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. పరిశోధనల్లోఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది. వేడికి, వయసుకు లింకేమిటి? వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి. -
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
భద్రం.. ఈసారి ఎండలు దంచుడే దంచుడు
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో ఉష్ణ తీవ్రత అప్పుడే మొదలుకాగా మున్ముందు వడగాడ్పులు సైతం ప్రతాపాన్ని చూపనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్, మేలలో వడగాడ్పులు తీవ్ర స్థాయి నుంచి అతితీవ్ర స్థాయిలో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎండలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కావొచ్చని తెలిపింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరువగా... సాధారణంగా మార్చిలో వేసవి ప్రారంభమైనప్ప టికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఈ సారి సూర్యప్రతాపం మార్చి తొలి వారంలోనే మొదలైంది. గతేడాది మార్చి నెల మొదటి వారంలో 35.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఈసారి ఇప్పటికే భద్రాచలంలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మరో 4-5 రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒక ట్రెండు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతాయని, మార్చి మూడో వారం నుంచి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తుందని వాతావరణ శాఖ వివరించింది. ఏప్రిల్, మేలలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వడగాడ్పుల నుంచి అతి తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రం లోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ బులెటిన్లో తెలిపింది. -
భగ్గుమంటున్న భానుడు!
శ్రీకాకుళం, ఆమదాలవలస: వేసవి ప్రారంభానికి ముందే భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. దీంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలపై ఆమదాలవలస కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం ‘సాక్షి’తో బుధవారం మాట్లాడుతూ.. మేఘాలతోపాటు పవనాలు లేకపోవడమేనని వివరించారు. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 19న 32 డిగ్రీలు, 20న 33, బుధవారం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. పగటిపూట కంటే రాత్రి వేళ ఉష్టోగ్రతల్లో సగం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉందన్నారు. దీనికి మేఘాల్లేకపోవడంతో పాటు పవనాలు వీయకపోవడం కూడా కారణంగా విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితిలో పగటి పూట ఎండలు ఎక్కువగా ఉంటాయని, రాత్రి పూట చలి కూడా ఉంటుందన్నారు. మేఘాలు, పవనాలు లేని కారణంగా పొగమంచు కూడా కురుస్తోందని, దీంతో మామిడి, జీడిమామిడిలతోపాటు పలు పంటలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. పొగ నుంచి పంటలకు సోకుతున్న తెగుళ్లను రక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతుల్లో తగిన మందులను వినియోగించాలని రైతులకు సూచించారు. కాగా వాతావరణంలో మార్పుల కారణంగా పొడి వాతావరణం తేమగా ఉంటుందని.. ఉదయం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటువంటి తేమ సాయంత్రానికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. అతి నీలలోహిత కిరణాలు తాలూకా ప్రభావం అతిఎక్కువుగా 12 పాయింట్ల వరకు ఉంటోందని, వాస్తవంగా 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటుందన్నారు. ఇలాంటి ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు, మంచులో తిరిగే వారికి వివిధ రకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతోందన్నారు. -
ఏమిటీ ‘శిక్ష’ణ!
ఉండి : జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు తమకు శిక్షగా మారాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తమ పాలిట శాపంగా మారాయంటూ వాపోతున్నారు. తరగతులు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావడం వరకు బాగానే ఉన్నా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్లకు వెళ్ళాలంటే ప్రాణం పోయేలా ఉంటోందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నందున ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రావద్దని చెబుతున్న వైద్యుల సలహాలను, కలెక్టర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్లో చాలా మంది బీపీ, సుగర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. తీవ్రమైన ఎండల్లో సుమారు 20 కి.మీ ప్రయాణించి శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉండి మండలంలోని ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం తొలిరోజునే ఉప్పులూరు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సరసా సత్యనారాయణ వడదెబ్బకు ప్రాణాపాయ స్థితికి చేరారు. వెంటనే దగ్గరలోని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో శిక్షణ తరగతిలోనే కళ్ళుతిరిగిపడిపోయారు. దాంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు వాతావరణాన్ని కూడా అంచనా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇవీ శిక్షణ మండలాలు ఉండి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, వీరవాసరం, మోగల్తూరు, నిడదవోలు, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం, ఇరగవరం, పెనుగొండ, ఛాగల్లు మండలాల్లో సుమారు మండలానికి 100 నుంచి 150 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు. వచ్చే నెలకు మార్చాలి మండుటెండల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం దారుణం. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని వడగాల్పుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వచ్చే నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచిది. - గాదిరాజు రంగరాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, చెరుకువాడ.