breaking news
Gut
-
రోజూ బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ తింటున్నారా..? అంబానీ, సచిన్ల హెల్త్ కోచ్ షాకింగ్ విషయాలు
ఉరుకుల పరుగుల హడావిడి జీవితాలే అందరివి. కాసేపు కుదురుగా నచ్చిన వంటకం వండుకుని తినే తీరికే లేదు చాలామందికి. భార్య భర్తలిద్దరు ఉద్యోగాలు, మరోవైపు పిల్లలు బాధ్యతలు.. కారణంగా ఏదో సింపుల్గా త్వరగా అయ్యే అల్పాహారం, వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు బ్రేక్ఫాస్ట్ ఈజీ అనే స్థాయికి వచ్చేశారు. అది లేకుండా రోజు గడవదు చాలామందికి. కానీ రుచిగా ఉండే ఈ వైట్ బ్రెడ్ జోలికి అస్సలు వెళ్లకూడదని..దాన్నిరోజు అల్పాహారంగా తీసుకుంటే ఇక ఆరోగ్యం అంతే అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు అంబానీ, సచిన్ టెండూల్కర్ల ఆరోగ్య కోచ్. అస్సలు బ్రెడ్ ఏవిధంగా ప్రమాదకరమో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం!.అంబానీలు, సచిన్ టెండూల్కర్తో సహా అనేక మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు వెల్నెస్ కోచ్ డాక్టర్ మిక్కీ మెహతా. ఆయన తరుచుగా ఇన్స్టాలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ప్రతిరోజు బ్రెడ్ తీసుకుంటే ప్రేగు ఆరోగ్యం ఎలా పాడవ్వుతుందో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సవివరంగా వెల్లడించారు. బ్రెడ్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు..ప్రజలు తమ దైనందిన జీవితంలో బ్రెడ్ తినడం అనేది అత్యంత సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు. భారతీయుల అల్పాహారంలో భాగమైపోయిందని కూడా అన్నారు. టీ విత్ బ్రెడ్, ఆమ్లెట్ బ్రెడ్, లేదా జామ్ విత్ బ్రెడ్, పోహా విత్ బ్రెడ్ లాగించేస్తున్నారు. కానీ ఈ తెల్లబ్రెడ్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాకరమైనదని నొక్కి చెప్పారు మెహతా. దీనివల్ల ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే సమస్య వస్తుందని చెప్పారు. ఇటీవల తన కుమార్తె ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆమె అకస్మాత్తుగా తల తిరగడం, వంటి సమస్యలను ఎదుర్కొంది. అచ్చం మద్యం సేవించిన వ్యక్తి మాదిరిగా కళ్లుతిరిగిపడిపోయిందని అన్నారు.బ్రూవరీ సిండ్రోమ్ అంటే..ఆమె పెద్ద మొత్తంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తింటున్నట్లు గమనించలేదని అన్నారు మెహతా. ఆమె ఎప్పుడైతే అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది అప్పుడే అసలు విషయం తెలిసిందన్నారు డాక్టర్ మెహతా. అంటే జీర్ణం కాని బ్రెడ్ ఇథనాల్ లేదా ఆల్కహాల్గా మారుతుందట. ఇది శరీరంపై ఆల్కహాల్కి మించిన ప్రభావం చూపిస్తుందట. పైగా ప్రేగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. దాంతో నెమ్మది నెమ్మదిగా బ్రూవరీ సిండ్రోమ్కి దారితీస్తుందట. ఇది ఒక అరుదైన వైద్య పరిస్థితి. దీన్ని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇక్కడ ఆల్కహాల్ సేవించకపోయినా..ఒక విధమైన మత్తులో ఉంటారట. అంటే.. అరగని బ్రెడ్ శరీరంలో జీర్ణశయాంతర ప్రేగులో కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఎదరవ్వుతుంది. నివారణ..బ్రెడ్ని తినలేకుండా ఉండలేం అనుకున్నవారు..బాగా ఆకలేసి..అందుబాటులో ఏం లేకపోతే తప్ప బ్రెడ్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు మెహతా. అలాగే మంచి ఫైబర్తో కూడిన ఆహారాని డైట్లో భాగం చేసుకుంటే..బ్రెడ్ వ్యర్థాలు సులభంగా బయటకు విసర్జించబడతాయని అన్నారు మెహతా. సో బ్రెడ్ తినేవాళ్లంతా కాస్తా జాగ్రత్తంగా ఉండటమే బెటర్..!. View this post on Instagram A post shared by Dr. Mickey Mehta (@mickey_mehta)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కొందరు జస్ట్ 4 గంటలే నిద్రపోయినా ఆరోగ్యంగానే ఉంటారు! రీజన్ అదే అంటున్న నిపుణులు) -
గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!
ఒకప్పుడు జీర్ణవ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేయడం వరకే దాని పని అనుకునేవారు. కానీ... దాని పని ‘అంతకు మించి’అంటూ ఇటీవలి ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. జీర్ణ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ అంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కోటాను కోట్ల (ట్రిలియన్ల కొద్దీ) బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయి. వాటినే సంక్షిప్తంగా ‘గట్ బయోమ్’గా పేర్కొంటున్నారు. ఈ జీవులే మానవుల సంపూర్ణారోగ్య నిర్వహణకు తోడ్పడుతున్నాయనీ, ఇవి కేవలం ఒక జీర్ణం(Digestion) చేసే పనే కాకుండా... ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం వంటివాటినీ సమర్థంగా నిర్వహిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... ఓ వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు(రిస్క్)లు కూడా ఆ బయోమ్పైనే ఆధారపడి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... ఓ వ్యక్తి తీసుకునే ఆహారంపైనే అతడి గట్ బయోమ్ ఆధారపడి ఉండటం, ఇక దాని మీదనే అతడి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటోంది. సూక్ష్మ సమాచార వారధిజీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ అన్నది దేహానికి మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం. ఈ అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం తాలూకు సమతౌల్యత మీదే ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ జీవవైవిధ్యత వల్లనే ఆహారం సరిగా జీర్ణం కావడం, జీర్ణమైనది ఒంటికి పట్టడం, జీవక్రియలన్నీ సక్రమంగా జరగడం.అన్నిటికంటే ముఖ్యంగా ఆ బయోమ్ కారణంగానే అతడి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బయోమ్ వల్లనే జీర్ణవ్యవస్థకూ, మెదడుకూ మధ్య నిరంతరం ఓ సమాచార వ్యవస్థ (గట్–బ్రెయిన్ ఏక్సిస్) నడుస్తుంటుంది. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి.నేచురల్ సమతౌల్యంమంచి సమతులాహారం తీసుకుంటూ గట్ మైక్రోబయోమ్(Gut Micorbiome) తాలూకు సమతౌల్యతను కాపాడుకోవడం ద్వారా ఓ వ్యక్తి తాలూకు జీవనశైలిని సానుకూలంగా అంటే పాజిటివ్గా మలచేందుకు ఆస్కారముంటుంది. భారతీయ సంప్రదాయ ఆహారంలోనివి... అంటే ముఖ్యంగా మొక్కలు, వృక్షాల నుంచి లభ్యమయ్యే చిరుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాల వంటివి ఈ గట్బయోమ్ సమతౌల్యాన్ని స్వాభావికంగా (నేచురల్గా) నిర్వహితమయ్యేలా చేస్తాయి. మన జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ సరిగా వృద్ధిచెందడానికైనా లేక అవి సరిగా అభివృద్ధి చెందకపోవడానికైనా మన ఆహారమే కారణమవుతుంది. మంచి ఆహారం తీసుకుంటే అవి సానుకూలంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, పప్పులు (దాల్), శెనగలు, ఆకుపచ్చరంగులో ఉండే పాలకూర, గోంగోర వంటి ఆకుకూరల వల్ల జీర్ణవ్యవస్థలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ది చెందుతాయి.మంచి ఆరోగ్యం కోసం...కేవలం ఆహారంపైనే కాకుండా మన జీవనశైలి కూడా గట్ మైక్రోబియమ్ మీద ప్రభావం చూపుతుంది. మన ప్రపంచంలోని వివిధ ఖండాల్లో చాలా ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలు నివసించే ప్రాంతాలను బ్లూ జోన్స్గా పరిగణిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్లో నివసించే వారు మిగతా ప్రజల కంటే సుదీర్ఘ కాలం జీవిస్తుంటారు. అలాగే వారు సంపూర్ణారోగ్యంతో జీవనం సాగిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్గా గుర్తించిన ప్రాంతాలు... సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమా లిండా (కాలిఫోర్నియా) వంటివి. వీటిల్లో నివసించే వాళ్లను, వారి జీవనశైలిని పరిశీలించినప్పుడు... వారి జీవనశైలి మూలంగా జీర్ణవ్యవస్థ తాలూకు ఆరోగ్యం మెరుగుపరుచుకోడానికి అవలంబించాల్ని కొన్ని పద్ధతులు తెలిశాయి. అవి...నిద్రపోదాంనాణ్యత లేని నిద్ర, తరచూ నిద్రాభంగం కావడం వంటి సమస్యల వల్ల జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ దెబ్బతింటుంది. దాంతో జీర్ణసమస్యలు వస్తాయి. బ్లూజోన్లోని ప్రజలు కంటి నిండా నిద్రపోవడంతోపాటు వేళకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది కూడా వాళ్ల ఆరోగ్యానికి కావడం వల్ల ఆరోగ్యాన్ని కోరుకునేవారంతా రోజూ కనీసం 7 – 8 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల వాళ్లకు గట్ ఆరోగ్యంతోపాటు సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.చురుగ్గా ఉందాం...మనలో రోజువారీ కదలికలు ఎక్కువగా ఉంటే... అలా ఉండటం వల్ల సమకూరే వ్యాయామం కారణంగా జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండటం, ఆహారం బాగా జీర్ణం కావడం జరుగుతుంది. బ్లూజోన్లోని ప్రజలు తమ స్వాభావికమైన కదలికలతోనే తమ రాకపోకలు సాగిస్తుంటారు. ఉదాహరణకు నడక, సైక్లింగ్ వంటివి. అలాగే తోటపని లాంటి పనుల వల్ల దేహపు కదలికలు బాగా చురుగ్గా జరుగుతుంటాయి. అంతేకాకుండా నడక, యోగా, వంటి తేలికపాటి వ్యాయామాలు, దేహపు కదలికల వల్ల... వాళ్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.నీళ్లు తాగుదాం...నీళ్లు తాగడమన్నది మంచి జీర్ణవ్యవస్థకూ, ఆహారం బాగా జీర్ణం కావడానికీ, తిన్నవి బాగా ఒంటికి పట్టడానికి తోడ్పడుతుంది. బ్లూజోన్లోని ప్రజలు కూడా నీళ్లు తాగడాన్ని ఓ మంచి అలవాటుగా పాటిస్తారు. వాళ్లు చక్కెరతో కూడిన తియ్యటి పానీయాలను చాలా పరిమితంగా తీసుకుంటారు. మంచి ఆరోగ్యం కోసం రోజంతా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండటం, అలాగే తీయ్యటివీ, కెఫిన్తో కూడిన పానీయాలు చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రోబయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితోపాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి. అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతో తోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి.ఒత్తిడిని ఎదుర్కొందాం...దీర్ఘకాలికమైన ఒత్తిడి జీర్ణవ్యవస్థలో ఇన్ఫ్లమేషన్కూ, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడానికీ... అది మళ్లీ జీర్ణవ్యవస్థలో మైక్రోబియమ్ బలహీనపడటానికి దారితీస్తుంది. ధ్యానం, బాగా లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రకృతితో సమన్వయమై వీలైనంత ఎక్కువసేపు గడపటం వంటి అంశాలు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఉదాహరణకు జపాన్లోని ‘ఒకినవా’ అనే ప్రాంతంలోని ప్రజలు ‘ఇకిగయి’ అనే జీవనవిధానం ద్వారా ఒత్తిడి తగ్గించుకుని, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యమూ సమకూరుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.విచక్షణతో తిందాం...బ్లూ జోన్లో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రజలు తమ కడుపు 80 శాతం నిండగానే తినడం ఆపేస్తారు. దీనివల్ల తిన్నది బాగా జీర్ణమవుతుంది. వాళ్లు భోజనాన్ని బాగా ఆస్వాదిస్తూ, మెల్లమెల్లగా నములుతూ హాయిగా తింటారు. దీనివల్ల కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలేవీ రావు. గట్కూ, మెదడుకూ మంచి సమన్వయమూ ఉంటుంది.టేక్...కేర్భోజనంలోని ఆహారాల్లో... తగినన్ని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి∙ పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను ఆహారంలో భాగం చేయాలి. ప్రాసెస్డ్ ఆహారాలూ, చక్కెరతో కూడిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్ను దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి ఒళ్లంతా మంచి కదలికలతో రోజంతా చాలా చురుగ్గా ఉండాలి∙ స్ట్రెస్ను అదుపులో ఉంచుకోడానికి మంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి వేళకు కంటి నిండా నిద్రపోతూ గట్ – బ్రెయిన్ ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి.దీర్ఘాయుష్మాన్భవ...జీర్ణాశయం ఆరోగ్యం కోసం ప్రయత్నించడమంటే అది కేవలం గట్ తాలూకు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు... నిజానికి అది సంపూర్ణారోగ్యం కోసం చేసే ప్రయత్నమని గుర్తుంచుకోవాలి. బ్లూజోన్లో నివసించేవాళ్ల నుంచి స్ఫూర్తి ΄పొందుతూ అందరమూ మన జీవనశైలినీ, భారతీయ సంప్రదాయ ఆహారాలైన మొక్కల నుంచి లభ్యమయ్యేవీ, పులిసేందుకు సిద్ధంగా ఉండేవీ, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది కేవలం జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణారోగ్యానికి దోహదపడుతుంది.ప్రో బయాటిక్పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రో బయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితో పాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి.అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్స్,హైదరాబాద్ (చదవండి: సాత్విక ఆహారంతో బరువుకి చెక్పెట్టండిలా..!) -
బ్లాక్ పెప్పర్ వాటర్ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే..
మాటిమాటికీ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే మీ ఇమ్యునిటీ సిస్టం బలహీణంగా ఉన్నట్టే! దీనికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు! ఈ పెప్పర్ వాటర్ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. పూజా కోహ్లీ చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా. రోగనిరోధకతను పెంచుతుంది సులభ మార్గంలో రోగనిరోధకతను పెంచడంలో బ్లాక్ పెప్పర్ వాటర్ బెస్ట్. ఇది శరీర కణాలను పోషించి, వాటి నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కూడా. సహజ మార్గాల్లో హానికారక వ్యర్థాలను బయటికి పంపేందుకు.. గట్ (పేగుల) హెల్త్ పైనే మన పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గేందుకు.. దీనివల్ల వనకూరే మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. బరువును అదుపులో ఉంచుతుంది. మన పూర్వికుల కాలం నుంచి నేటివరకు కూడా ఉదయం పొరకడుపున చిటికెడు నల్లమిరియాల పొడి కలిపిన నీరు తాగే అలవాటు ఆచారంగా పాటిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి కాబట్టే. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం ఒక నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పును స్పష్టంగా తెలియజేస్తుంది. తేమగా ఉంచుతుంది వేడి నీరు, నల్ల మిరియాల పొడి మిశ్రమం గట్ హెల్త్కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడటం ద్వారా ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్గా పనిచేయడమేకాకుండా, రోజు మొత్తం యాక్టివ్ గా ఉండేందుకు ఉపకరిస్తుంది. మలబద్ధకం నివారణకు దివ్యేషధమే దీర్ఘకాలికంగా మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది మీ ప్రేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. క్రమంగా మీ సమస్య తగ్గుముఖం పట్టి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది. శక్తి నిస్తుంది మీరు పెప్పర్ వాటర్ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని మీ శక్తి రెంట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. చదవండి: అలొవెరా జ్యూస్తో డల్ స్కిన్కు చికిత్స..!! -
కడుపు కదిలిపోతే... క్యారట్తో..!
గృహవైద్యం జీర్ణాశయంలో ఒడుదొడుకులు మొదలైతే తక్షణ ఉపశమనానికి క్యారట్- పుదీనా రసం తీసుకోవాలి. నాలుగు కప్పుల నీటిలో నాలుగు క్యారట్ ముక్కలు, నాలుగైదు తాజా పుదీనా ఆకులు (లేకపోతే ఎండిన పుదీనా ఆకుల పొడి ఒక టీ స్పూను) వేసి సన్నమంట మీద ఓ 15 నిమిషాల పాటు మరిగించాలి (క్యారట్ మెత్తబడే వరకు). వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి చెంచాడు అల్లం తురుము, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. సాధారణంగా ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. అవసరమైతే నాలుగు గంటల విరామంతో మరో గ్లాసు తాగవచ్చు.