-
గ్రూప్–4 పరీక్షను బహిష్కరించిన ఓయూ విద్యార్థి నేతలు
లాలాపేట(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు -
గ్రూప్ 4లో పరీక్షల స్థాయి మధ్యస్తం.. పలువురు అభ్యర్థుల పరేషాన్!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రెండు పరీక్షలకు మొత్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 9,12,380 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్షల్లో ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్–1లో ఎక్కువగా సూటిప్రశ్నలు, అప్లికేషన్ తరహా ప్రశ్నలు వచ్చాయని, పేపర్–2లో గణితం నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. గ్రాఫ్స్, చార్టులతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టిందన్నారు. చాలా వరకు నంబరింగ్ సిస్టంలో ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు కాస్త తికమకపడ్డట్లు తెలిసింది. చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న బలగం చిత్రం నుంచి కూడా ఈ పరీక్షలో ఓ ప్రశ్న రావడం గమనార్హం. ♦ సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ సెంటర్లో శనివారం ఉదయం అభ్యర్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రం బండిల్ సీల్ లేకుండా ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సీలు ముందే తీసి పేపర్ లీక్ చేశారా అని ప్రశ్నించారు. ఓఎంఆర్ షీట్స్ బండిల్ అనుకొని పొరపాటున సీల్ తీశామని ఇన్విజిలేటర్లు, పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ♦ హైదరాబాద్లోని మారుతీనగర్లో ఉన్న ఓ కేంద్రంలో కె.రాజేష్ (36) అనే అభ్యర్థి పేపర్–1 పరీక్షను సెల్ఫోన్లో చూసి రాస్తూ పట్టుబడ్డాడు. కలెక్టర్ ఆదేశంతో అతనిపై మాల్ప్రాక్టీస్ కింద కేసు నమోదైంది. ♦ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వల్లందాస్ మురళి అనే అభ్యర్థి కాస్త ఆలస్యంగా పేపర్–2 పరీక్ష రాసేందుకు రాగా అప్పటికే గేటుకు తాళం వేశారు. దీంతో గోడదూకి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. ♦ వరంగల్ జిల్లా కొనాయమాకుల వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ మహిళ 3 నెలల పాపతో వచ్చింది. అక్కడే డ్యూటీ చేస్తున్న గీసుకొండ ఎస్సై ఎ. శ్వేత ఆ బిడ్డను పరీక్ష సమయం ముగిసే వరకు అక్కున చేర్చుకుంది. ♦ ఖమ్మం దరిపల్లి ఆనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం పరీక్ష రాసిన వారిలో నలుగురు అభ్యరులు ఓఎంఆర్ షీట్లు ఇవ్వకుండానే బయటకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని షీట్లు తీసుకున్నారు. అలాగే వారు మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. ♦ జగిత్యాల జిల్లాలోని గ్రూప్–4 పరీక్ష కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు తమ ఆభరణాలు తొలగించడానికి ఇబ్బంది పడ్డారు. ♦ జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో పేపర్–1 పరీక్ష రాసేందుకు వచ్చి కిటికీ పక్కన కూర్చున్న ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్ గాలి కి కొట్టుకుపోయింది. దాన్ని తెచ్చుకొనేందుకు పోలీసులు అతన్ని అనుమతించకపోగా అక్కడి సిబ్బంది చివరకు షీట్ను తీసుకొచ్చారు. ♦ జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు. ♦ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకురాని దాదాపు 100 మంది అభ్యర్థులను పరీక్షకు నిరాకరించారు. ♦ విద్యుత్ వైరు తెగిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వేస్టేషన్ వద్ద సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న రైలు సమీపాన నిలిచిపోయింది. దీంతో గ్రూప్–4 పరీక్ష రాసేందుకు రైల్లో వస్తున్న వందలాది మంది అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తూ ప్రైవేటు వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు బయలుదేరారు. ♦ వనపర్తి జిల్లాలోని 46 పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తీసుకెళ్లేందుకు రాత్రి 11:15 గంటలు దాటినా టీఎస్పీఎస్సీ అధికారులు ఎవరూ రాలేదు. దీనిపై పరీక్షల నిర్వాహణ అధికారి రమేష్రెడ్డి మాట్లాడుతూ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఒక్కరే అధికారి ఉండటంతో ఆలస్యమైనట్లు చెప్పారు. -
TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement