breaking news
Grenade blast
-
అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు!
గువాహటి : దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు జరుగుతున్న వేళ అసోం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రోజున దాదాపు గంట వ్యవధిలో అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దిబ్రుగర్లో రెండు ఎల్ఈడీ బ్లాస్ట్లు జరగగా.. సోనారి, దులియాజన్, దూమ్దూమా ప్రాంతాల్లో గ్రానేడ్ పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అసోంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లను ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఖండించారు. ‘రిపబ్లిక్ డే రోజున బీభత్సం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు కారకులపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుద’ని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. నిషేధిత యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఈ పేలుళ్లుకు పాల్పడి ఉండోచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అసోం ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా.. ఈ సంస్థ పిలుపునిచ్చింది. -
అసోం: గుహవాటిలో గ్రనేడ్ పేలుడు
-
పంజాబ్లో ఉగ్రదాడి
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ నగర శివార్లలో ఉన్న సంత్ నిరంకారి భవన్పై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ప్రార్థనలు జరుగుతుండగా ఇద్దరు ఉగ్రవాదులు భక్తులపైకి గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ముగ్గురు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిని తాము ఉగ్రవాదుల దుశ్చర్యగానే భావిస్తున్నామని పోలీసులు చెప్పగా, దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చనీ, పంజాబ్లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయతిస్తోందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. అమృత్సర్ శివార్లలో, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న రాజాసన్సీ ప్రాంతంలోని అద్లివాల్ అనే గ్రామంలో ఉన్న సంత్ నిరంకారి భవన్పై ఈ దాడి జరిగింది. దాదాపు 200 మంది నిరంకారీలు లోపల ప్రార్థనలు చేస్తుండగా, మొహాలకు ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు బైక్పై అక్కడకు చేరుకున్నారు. ద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి లోపలకు చొరబడిన అనంతరం ప్రార్థనలు చేస్తున్న వారిపైకి గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. దీనిని ఉగ్ర చర్యగానే తాము పరిగణిస్తున్నామని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. గ్రెనేడ్ పడిన ప్రాంతంలో చిన్న గుంత ఏర్పడిందన్నారు. అక్కడ పడి ఉన్న గ్రెనేడ్ ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని తెలిపారు. నిరంకారి భవన్ ప్రాంతంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలను అమర్చలేదని ఐజీ ఎస్ఎస్ పర్మార్ చెప్పారు. దాడి జరిగిన నిరంకారి భవన్కు సీల్ వేసిన పోలీసులు, పంజాబ్లోని ఇతర నిరంకారి భవన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హెచ్చరికలు ఉన్నా దాడి.. 1980, 90ల్లోని తీవ్ర హింసాత్మక పరిస్థితుల నుంచి బయటపడి, ఇటీవలే శాంతి నెలకొన్న పంజాబ్లో మళ్లీ కల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవలే హెచ్చరించారు. మరోవైపు ఆరు నుంచి ఏడు మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రస్తుతం పంజాబ్లో ఉన్నారనీ, వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా నిఘా సమాచారం ఉంది. కొన్ని రోజుల క్రితమే పఠాన్కోట్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి కారును నలుగురు కలిసి లాక్కొని పరారయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్నా ఆదివారం నిరంకారి భవన్పై దాడి జరగడం గమనార్హం. తీవ్రంగా భయపడ్డాం:ప్రత్యక్ష సాక్షులు గ్రెనేడ్ దాడి కారణంగా తాము తీవ్ర భయానికి లోనయ్యామని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గ్రెనేడ్ పేలిన అనంతరం భవన్లో దట్టమైన పొగ అలముకుందనీ, భక్తులంతా పరుగులు తీశారని చెప్పారు. ప్రతి ఆదివారం తాము ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడం మామూలేనన్నారు. సిమ్రన్జిత్ కౌర్ అనే మహిళ మాట్లాడుతూ ‘ప్రతి ఆదివారం నేను ఇక్కడ సేవకు వస్తాను. నేను గేటు వద్ద విధుల్లో ఉండగా యుక్తవయసులో ఉన్న ఓ వ్యక్తి మొహానికి ముసుగు కప్పుకుని వచ్చాడు. ఏదో విసిరి పరారయ్యాడు. అది బాంబు అని తర్వాత అర్థమైంది. అంతటా దట్టమైన పొగ అలముకుంది. అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు’ అని ఆమె తెలిపారు. ప్రశాంతతకు భంగం కలగనివ్వం: సీఎం పంజాబ్ చాలా కష్టపడి సంపాదించుకున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు దుష్టశక్తులకు అవకాశం ఇవ్వబోమని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదని ఆయన అభయమిచ్చారు. ఈ దాడి వెనుక ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఖలిస్తానీ, కశ్మీరీ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ దుర్మార్గ ప్రయత్నాలు చేస్తోందన్న భావన ఈ దాడితో బలపడిందన్నారు. మృతుల బంధువులకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సీఎం, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దాడి వెనుక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. గత 18 నెలల్లో 15 ఉగ్ర కుట్రలను భగ్నం చేసినట్లు సీఎం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు.. రోదిస్తున్న బాధితుల కుటుంబీకులు -
బలగాలపై గ్రనేడ్ విసిరాడు..
-
బలగాలపై గ్రనేడ్ విసిరాడు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా ఓ ఉగ్రవాది గ్రనేడ్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో గ్రనేడ్ విసిరిన ఉగ్రవాది కూడా ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారుల నివాసాలు ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా చేస్తున్నారు. గురువారం సాయంత్రం భద్రతా బలగాలు తమ వాహనాల్లో వెళుతుండగా అదే అదను చూసుకొని ఉగ్రవాది జహంగీర్ చౌక్ ప్రాంతంలో గ్రనేడ్ విసిరాడు. దాని పేలుడు ధాటికి అతడు కూడా గాయపడ్డాడు. రోడ్డుపై భారీ కందకం ఏర్పడింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై శ్రీనగర్కు చెందిన ప్రత్యేక పోలీసు అధికారి స్పందిస్తూ కొంతమంది చొరబాటు దారులు బలగాలపై గ్రనేడ్లు విసరాలని ప్రణాళిక రచించుకున్నారని, అయితే, అది కాస్త అతడికి సమీపంగానే పడటంతో చివరకు అతడు కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మృత్యువాత పడినట్లు వెల్లడించారు. -
మణిపూర్ సీఎం ఇంటి ఎదుట బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంటి ఎదుట శక్తిమంతమైన గ్రెనేడ్ ఒకటి పేలింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట సాయంత్రం ఈ బాంబు పేలినా, ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులే ఈ గ్రెనేడ్ పేల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించగా, ఆ తర్వాతి నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిషెన్పూర్, తౌబల్ జిల్లాలన్నింటిలో పోలీసు, సెక్యూరిటీ ఔట్పోస్టులను ఏర్పాటుచేశారు.