breaking news
goodresults
-
అధ్యాపకుల నియామకంతో మెరుగైన ఫలితాలు
ఎంజీయూ (నల్లగొండ రూరల్) : యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించడం ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయని న్యాక్ బృందం చైర్మన్ కౌశిక్ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలను న్యాక్ బృందం బుధవారం పరిశీలించింది. అనంతరం యూనివర్సిటీ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త కోర్సులు, కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూజీసీ గ్రాంట్ కోసం తగిన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. యూనివర్సిటీ ఏర్పడిన ప్రథమార్ధంలోనే న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నించడం అభినందనీయమని పేర్కొన్నారు. యూనివర్సిటీ పరిస్థితులను వీసీ అల్తాఫ్హుస్సేన్, రిజిస్ట్రార్ ఉమేష్కుమార్ వివరించారు. ఈ సమావేశంలో రవి, శ్రీదేవి, అన్నపూర్ణ, అరుణప్రియ, అంజిరెడ్డి, ప్రశాంతి, జయంతి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలు పుణ్యఫలితాన్నిస్తాయి
జోగుళాంబను దర్శించుకున్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మానవపాడు/అలంపూర్రూరల్ : పుష్కరాలు పుణ్యఫలితాలను ఇస్తాయని, అందుకే భక్తులు పెద్దఎత్తున పుష్కరస్నానాలు ఆచరిస్తారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా అలంపూర్ ఆలయాలను దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో ఆలయ ఈఓ గురురాజ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి. నారాయణరెడ్డి, టీడీపీ తాలూకా ఇన్చార్జ్ ఎస్. ఆంజనేయులు, సర్పంచ్ జయరాముడు ఆలయ అర్చకులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదటగా బాలబ్రహ్మేశ్వరుడిని దర్శించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం వారు శేషవస్త్రాలు, అమ్మవారి జ్ఞాపికలు, ప్రసాదాలను అందజేశారు. భక్తులతో ఆత్మీయ పలకరింపు అమ్మవారి, స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడిన భ క్తులను ఎక్కడి నుంచి వచ్చారంటూ కరచలనం చేస్తూ ఆ ప్యాయంగా పలకరించారు. అనంతరం టీడీపీ కార్యకర్త లు విశ్వం, గోపాల్, స్వామి, రామును అభినందిస్తూ పు ష్కరాల్లో భక్తులకు సేవలందించాలని ప్రోత్సహించారు. అభిమానులుగా మారిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో పెద్ద ఎత్తున నిల్చున్న భక్తులు ఒక్కసారి గా క్యూలో నుంచి బయటకు దూకి బాలకృష్ణను కలసిందేకు గుమిగూడారు. దీంతో ఒక్కసారిగా క్యూలైన్ ఖాళీ అయింది. బాలకృష్ణకు స్వాగతం పలికిన మంత్రి సోమశిల నుంచి సాక్షి బృందం : సప్తనదుల సంగమమైన సోమశిల పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం 11గంటల సమయంలో సోమశిల వీఐపీ ఘాట్కు చేరుకున్నారు. ఆయనకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాదరంగా స్వాగతం పలికారు. పుణ్యస్నానాల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ భద్రత దృష్ట్యా గట్టి ఏర్పాట్లు చేయాలని అక్కడున్న పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు జెడ్పీటీసీ హన్మంతునాయక్, ఎంపీపీ నిరంజన్రావు, పెద్దకొత్తపల్లి ఎంపీపీ వెంకటేశ్వర్రావు, కొల్లాపూర్ సింగిల్విండో అధ్యక్షుడు తదితరులు ఉన్నారు. -
మెరుగైన ఫలితాలు సాధించాలి
రామన్నపేట క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని శ్రీహిందూ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పనకంటి భాస్కర్రావ్ విద్యార్థులకు సూచించారు. శనివారం శ్రీహిందూ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమసంవత్సరం విద్యార్థులకు ఉచితంగా స్టడీమెటీరియల్ను అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదువలేదన్నారు. పేదవిద్యార్థులకు కళాశాల యాజమాన్యం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తొల్పునూరి చంద్రశేఖర్, వైస్ప్రిన్సిపాల్ వి,దేవేందర్రావ్,అధ్యాపకులు కె.సుధాకర్, జి.శ్రీను, ఎం.వెంకటేశ్వర్లు, బి.మహేష్, డి.ప్రభాకర్, ఇ.జ్ఞానేశ్వరి, ఎండీ ముజాహిద్, ఎ.మల్లికార్జున్,కె. ప్రశాంత్రెడ్డి, సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, వి.మమత పాల్గొన్నారు.