-
అదానీ-హిండెన్బర్గ్ సంక్షోభం: వారికి ఆనంద్ మహీంద్ర హెచ్చరిక
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రేపిన దుమారంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. తన తాజా ట్వీట్లో అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ప్రస్తావించారు.ఎన్ని సవాళ్లు వచ్చినా భారత్ దృఢంగా నిలబడుతుంది అంటూ సోషల్మీడియాలో ప్రకటించారు. (కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్) వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థికశక్తిగా ఉండాలనే భారతదేశ ఆశయాలను దెబ్బతీస్తాయా అని గ్లోబల్ మీడియా అనేక ఊహాగానాలు చేస్తోంది కానీ అలాంటిదేమీ ఉండదు. ఎన్ని తుఫానులు, సంక్షోభాలు వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని ప్రకటించారు. ఇండియా గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, కానీ ప్రతిసారీ బలంగా నిలబడిందని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. భూకంపాలు, కరువులు, మాంద్యాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు లాంటివి ఎన్నో చూశా.. తాను చెప్పేది ఒక్కటే, భారతదేశానికి వ్యతిరేకంగా ఎపుడూ సవాల్ చేయొద్దని సూచించారు. అలా అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై మోపిన అకౌంటింగ్ మోసం ఆరోపణల నేపథ్యంలో అనేక ఊహాగానాలు చేస్తున్న వారిని పరోక్షంగా ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. Global media is speculating whether current challenges in the business sector will trip India’s ambitions to be a global economic force. I’ve lived long enough to see us face earthquakes, droughts, recessions, wars, terror attacks. All I will say is: never, ever bet against India — anand mahindra (@anandmahindra) February 4, 2023 /p> -
చైనా డొల్లతనం..దాచేస్తే దాగని సత్యం!
బీజింగ్: చైనాలో మీడియా అన్నది ఉండదు. ఉన్న ఒక్క మీడియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకే చైనా ఆర్ధిక వ్యవస్థలోని డొల్లతనం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశాలు తక్కువ. కానీ ఎంతకాలమని ఇలా దాచగలరు. నిప్పు కణికలను గుప్పెట్లో దాచి పెడితే కొంత సేపటికి చెయ్యి కాలిపోతుంది. చైనా ప్రభుత్వం కూడా అటువంటి ప్రమాదం ముంగిట నిలబడిందని మేధావులు అంటున్నారు. పైకి చాలా బలంగా ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉన్నట్లు కనిపిస్తోంది చైనా. కానీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో చైనా సతమతమవుతోంది. ఇదీ చదవండి: చైనా సర్కార్కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు కరోనా కారణంగా చైనా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. చైనా నుండి రక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు ఆర్ధిక సంక్షోభం కారణంగా చైనాతో లావాదేవీలు నిలిపివేయడంతో చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అది చైనా విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావాన్ని చూపింది. ఇది చాలదన్నట్లు రెండేళ్లుగా చైనా లో అకాల వర్షాలు.. భారీ వరదలతో వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. అది ఆహార సంక్షోభానికి కారణమయ్యింది. కానీ లోపల మాత్రం అగ్ని పర్వతాల్లాంటి సంక్షోభాలు రగులుతున్నాయంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? చైనాలో ఏం జరిగినా ప్రపంచానికి తెలీకుండా అక్కడి ప్రభుత్వం దాచిపెడుతూ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే చైనాలో విదేశీ మీడియాను కూడా ఉండనివ్వరని పత్రికలపై ఎక్కడా లేని ఆంక్షలు ఉంటాయని వారంటున్నారు. అయితే తమ మీడియా ద్వారా అంతా అద్భుతంగా ఉందని చైనా ప్రచారం చేసుకుంటోందని వారంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కోలుకునే పరిస్థితి లేకపోతే మాత్రం చైనా పరిస్థితి చెప్పనలవి కానంత దుర్భరంగా మారిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, చైనా 2009 నుండి గ్లోబల్ మీడియా పెట్టుబడులపై 6.6 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా -
ఆర్టికల్ 370 రద్దు : గ్లోబల్ మీడియా స్పందన
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తి కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దుపై ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిసారించింది. జమ్మూ కశ్మీర్లో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన గ్లోబల్ మీడియా ఆర్టికల్ 370 రద్దుపై స్పందించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత ఉపఖండంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరమని వ్యాఖ్యానించింది. కశ్మీర్పై గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని లండన్కు చెందిన ది గార్డియన్ అభివర్ణించింది. కశ్మీర్ను రెండు భాగాలుగా విభజించడం నాటకీయ చర్యగా పేర్కొంటూ ఈ నిర్ణయం పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగేందుకు దారితీయవచ్చని అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వానికి ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించింది. ఇక జమ్మూ కశ్మీర్కు సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుందని బీబీసీ వ్యాఖ్యనించింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లోయలో అశాంతి తలెత్తవచ్చని, లోయలో ఇప్పటికే అలజడి వాతావరణం నెలకొందని, ఉద్రిక్తతలు పెరిగిపోయాయని బీబీసీ పేర్కొంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు సైకలాజికల్ షాక్ వంటిదని సీఎన్ఎన్ అభివర్ణించింది. కేంద్ర నిర్ణయం సరికొత్త ఘర్షణలకు తెరలేపిందని వాషింగ్టన్ పోస్ట్ హెచ్చరించింది. భారత్లో కశ్మీర్ చేరికకు మూలమైన ఆర్టికల్ 370 రద్దు జమ్ము కశ్మీర్తో భారత్ సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇక పాకిస్తాన్కు చెందిన డాన్ న్యూస్ ఆర్టికల్ 370 రద్దును తప్పుపట్టింది. హడావిడిగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంలో తొందరపాటును ప్రశ్నించింది. ఈ నిర్ణయంతో జమ్ము కశ్మీర్ ముస్లిం మెజారిటీ ప్రాంతం నుంచి హిందూ మెజారిటీ ప్రాంతంగా మారిపోతుందని కశ్మీరీలు భయపడుతున్నారని పేర్కొంది. -
భారత్ ఓ దిగ్గజం: గ్లోబల్ మీడియా
వాషింగ్టన్: అంతరిక్ష సాంకేతికతలో భారత్ ఓ దిగ్గజంగా మారిందని ప్రపంచమీడియా పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ ఒకే ప్రయోగంలో రెండంకెల సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి మల్లగుల్లాలు పడుతుంటే.. భారత్ మాత్రం తక్కువ ఖర్చుతో చరిత్ర సృష్టించిందని ఆకాశానికి ఎత్తేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) బుధవారం ఒకే రాకెట్(పీఎస్ఎల్వే సీ-37) ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎవరెవరు ఏమన్నారంటే.. వాషింగ్టన్ పోస్టు: ఇస్రో తక్కువ ఖర్చుతో జరిపిన తాజా ప్రయోగం ప్రపంచదేశాల్లో మరింత నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యానించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీఎస్ఎల్వీతో ప్రయోగం కోసం ఇస్రోకు విదేశీ ఉపగ్రహాలు క్యూ కడుతున్నాయని చెప్పింది. న్యూయార్క్ టైమ్స్: ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో చేర్చి ఎదుగుతున్న స్పేస్ టెక్నాలజీ మార్కెట్కు భారత్ రారాజు అయిందని పేర్కొంది. శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతున్న సమయంలో మిస్ పాత్లో విడుదలైతే ఒకదానితో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం ఉందని చెప్పింది. సీఎన్ఎన్: అమెరికా, రష్యాలను ఇక మర్చిపోండి; నిజమైన అంతరిక్ష రేసు ఆసియాలో జరుగుతోందని వాఖ్యానించింది. లండన్ టైమ్స్: ఇండియా చేసిన ప్రయోగం అంతర్జాతీయ స్పేస్ దిగ్గజాల సరసన ఆ దేశాన్ని నిలబెట్టేలా చేసిందని పేర్కొంది. అమెరికా, రష్యా, యూరప్లు ఖర్చు పెట్టిన మొత్తాని కంటే భారత్ అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రయోగాలు నిర్వహించిందని కొనియాడింది. గార్డియన్: 1980ల్లో అంతరిక్షంలోకి రాకెట్ను పంపిన ఆరో దేశంగా రికార్డుల్లోకెక్కిన భారత్ అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ మార్కెట్ ను ఎదుర్కొనే స్ధాయికి చేరిందని పేర్కొంది. వీనస్ గ్రహం మీదకు కూడా ప్రయోగం చేస్తామని భారత్ ప్రకటించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. బీబీసీ: భారత్ ప్రయోగం అంతర్జాతీయ స్పేస్ మార్కెట్లో కొత్త శక్తి పుట్టుకువస్తోందనడానికి సూచన అని వ్యాఖ్యానించింది. చైనా ప్రభుత్వ మీడియా: 104 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ కొత్త చరిత్రను సృష్టించిందని వ్యాఖ్యానించింది. -
బలిపీఠంపై భావ ప్రకటనా స్వేచ్ఛ
దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్లో పాత్రికేయ శిఖరాగ్ర సభను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది. ‘‘దేశాల అభ్యుదయానికి సంబంధించిన సకల అంశాలలో పారదర్శకత ద్వారా అవినీతిని, లంచగొండితనాన్ని అదుపు చేయడానికీ; పౌర సమాజాన్ని నిర్మించడానికి, న్యాయ చట్టాల ద్వారా చట్టబద్ధ పాలనను స్థిరపరచడానికీ మీడియా (పత్రికలు, టీవీ మాధ్యమాలు) అత్యవసరం, అనివార్యం. పాలక వ్యవస్థ ప్రయోజనాలతో నిమిత్తం లేని ప్రచార ప్రసార మాధ్యమాలు ఏ మేరకు స్వేచ్ఛగా ఉండగలవో ఆ మేరకు దేశాల స్వేచ్ఛాస్వాతంత్య్రాల ఉనికి ఆధారపడి ఉంటుంది. ఈ మీడియా స్వేచ్ఛ మనుగడ అనేది దఫదఫాలుగా జరిగే ఎన్నికల కన్నా కూడా దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సరైన కొలమానంగా భావించాలి.’’ - డేవిడ్ హాఫ్మన్ (ఇంటర్ న్యూస్ మీడియా నిర్మాత, ఎమిరిటస్ ప్రెసిడెంట్, ఎమ్మీ అవార్డు గ్రహీత, సిటిజన్స్ రైజింగ్ గ్రంథకర్త) ‘అబద్ధాల అంకయ్యకు అర వీశెడు సున్నం నోట్లో కొడితేగానీ వాయి ముడవడు’ అన్నది సామెత. మహజర్లూ, విజ్ఞాపనలూ, సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలం పాటు ఉద్యమించి; పాలకుల మొండితనం వల్ల సమస్య ఒక కొలిక్కి రానప్పుడు, ఒక సామాజిక వర్గం సమస్యకు అంతిమ పరిష్కా రంగా మచ్చలేని నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరశన తలపెట్టడం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం తలెత్తే ఆందోళనలను, ఉద్యమా లను, ఉద్రేకాలను; ఆఖరికి ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యకలాపాలతో సహా అన్నింటినీ అటు అక్షరబద్ధంగానూ, ఇటు దృశ్య మాధ్యమంతోనూ ఆవి ష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ మీడియా చానల్ ప్రసా రాలను నిషేధించడం ఏమిటి? ఆ రెండింటికీ సంబంధం ఏమిటి? ప్రాథమిక హక్కు అన్న సంగతి మరచిపోవద్దు పై ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు పాలకుల నుంచి రాలేదు. కానీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రం ‘ముద్ర గడ దీక్ష నేపథ్యంలో ఈ ప్రసారాలను మేమే నిలిపివేశాం’ అని స్వయంగా ప్రకటించారు. నిత్యమూ తాము ‘ప్రజాస్వామ్యం’ కోసమే, దాని ‘పరిరక్షణ’ కోసమే పాటుపడుతున్నామని గుండెలు బాదుకునే పాలకులను గతంలోనూ చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం. నిజానికి, ప్రజాస్వామ్యమన్నా, అది పని చేసే తీరన్నా, లేదా పార్లమెంటరీ వ్యవస్థలో భిన్నాభిప్రాయానికి చోటు ఉండి తీరాలన్న ప్రాథమిక విలువన్నా - కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఆధునిక పాలకులకు గౌరవం లేదు. దీనిని నిరూపించేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చివరకు భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించే రాజ్యాంగ విరుద్ధ సంస్కృతిని కూడా ప్రవేశపెడుతున్నారు. వివిధ స్థాయిలలో రాష్ట్ర, జాతీయ పాత్రికేయ సంస్థలు, పాత్రికేయులు ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం మీద ఇటు గవర్నర్కు, అటు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్కు నివేదించాయి. దీని మీద ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ చానల్ ప్రసారాల నిలిపివేత మీద ఎంత విస్మయం ప్రకటించినా; ప్రసారాల పునరు ద్ధరణకు కౌన్సిల్ పరిధిలో చేపట్టగల చర్యలకు గల అవకాశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అంటే లోగడ చైర్మన్ల మాదిరిగానే మాటమాత్రంగా ఆ సంగతి చెప్పారు. కానీ రాజ్యాంగం గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, వృత్తి వ్యాపార రక్షణ ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రకటనకు పూచీ పడుతూ, వాటిని అమలు చేయించడంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన పాల కులను శిక్షించే క్రిమినల్ నిబంధనలను అమలు చేయించే అవకాశం కౌన్సి ల్కు మాత్రం లేదు. అందుకే పాలకుల ఆగడాలు అనంతంగా కొనసాగ డానికి అసలు కారణమని పత్రికా రచయితలు మరచిపోరాదు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కౌన్సిల్ కలగచేసుకుని శిక్షించే అధికారాన్ని దఖలు పరుస్తూ ప్రెస్ కౌన్సిల్ చట్టాలను సవరించాలని, పార్లమెంట్ చొరవ చూపాలని ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ కట్జూ పదే పదే విజ్ఞప్తి చేశారు. కొత్త సవాళ్ల కాలం దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్లో పాత్రికేయ శిఖరాగ్ర సభ (2016)ను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది. నేడు సమాచార సాంకేతిక వ్యవస్థ, డిజిటల్ విప్లవం శరవేగాన దూసుకు రావడంతో పాత్రికేయ వృత్తికి పాలక వర్గాల నుంచి ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఆ ఫోరమ్ చర్చించింది. ఈ సదస్సులోనే టర్కిష్ దినపత్రిక ‘హురి యత్’ ప్రధాన సంపాదకుడు సీదత్ ఎర్గిన్కు ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పుర స్కారాన్ని కాయే డీక్మాన్ (ప్రసిద్ధ జర్మనీ పత్రిక ‘బిల్’ అధినేత) ప్రదానం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రకటించినందుకు, విమర్శనాత్మక వ్యాస పరంపరను వెలువరించినందుకు సీదత్ను టర్కిష్ పాలకులు నాలుగేళ్ల పాటు ఎలా కారాగార ం పాలు చేశారో ఆ సందర్భంగా డీక్మాన్ గుర్తు చేశారు. మితవాద పాలకవర్గ పార్టీ కార్యకర్తలు గుంపుగా ఎర్గిన్ పత్రికా కార్యాల యంపై దాడులు చేసి, మరొక వ్యాసకర్తను ఏవిధంగా తీవ్రంగా గాయ పరిచిందీ కూడా ఆ సదస్సులో వెల్లడించాడు. యూరప్లో మితవాదపక్షాలు అధికారంలో ఉన్న దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వివరించారు. ఎర్గిన్ ప్రసంగిస్తూ, ‘ నిరంకుశ ధోరణులకు అలవాటుపడిన పాలకులు ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కడానికి ఓటింగ్ ద్వారా ప్రజా ప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే సౌలభ్యానికి అవకాశం కల్పించిన ఎలక్టోరల్ ప్రజాస్వామ్యం అనే ఓ బిల్లును తెరగా పెట్టుకుంటున్నారని, ఈ ధోరణి ప్రజా స్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదకరం’అని ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిం చాడు. అలాగే ఎక్కడికక్కడ పౌర సమాజాలు చైతన్యం పొంది రంగంలోకి దిగి ఉద్యమించడం ద్వారానే భావ స్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛనూ తద్వారా ప్రజాస్వామ్య విలువల్ని రక్షించుకోగల్గుతారని ‘ఇంటర్ న్యూస్’ వ్యవస్థాపకుడు డేవిడ్ హాఫ్మాన్ ‘తిరగబడుతున్న పౌరులు’ అన్న తాజా గ్రంథంలో పేర్కొన్నాడు. అంతేగాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో గానీ లేదా తలుపులు మూసివేసుకునే మూస వ్యవస్థలలో గానీ - ప్రజా బాహుళ్యం సత్తా, వారి అధికారం ఏదో ఒక రూపంలో ఒక్క ప్రసార మాధ్య మాల ద్వారా మాత్రమే వ్యక్తమవుతూ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల పుట్టుపూర్వోత్తరాలను తడుముతూ హాఫ్మాన్ మరొక విషయం కూడా వెల్లడించాడు: ‘‘శరవేగాన ఆవిష్కరించుకుంటున్న, పరి వ్యాప్తమవుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞాన వేదికలు, భారీస్థాయిలో ప్రజా స్వామీకరణ పొందుతున్న మీడియా నేడు ఎలాంటి నిరంకుశ పాలనా వ్యవస్థనైనా ‘ఢీ’ కొనగల సవాళ్లను విసరగల్గుతోంది. గత వంద సంవత్సరా లుగా నిరంకుశ అహంకార పాలనా వ్యవస్థలు యుద్ధాల మీద ఆధారపడి ఉనికిని కాపాడుకుంటూ వచ్చాయి. కాగా నూతనంగా దూసుకువచ్చిన సమాచార సాంకేతిక విప్లవం ఈ 21వ శతాబ్దాన్ని తీర్చిదిద్దే సైద్ధాంతిక శక్తి కాబోతున్నది’’. ఎందుకంటే, దాపరికం లేని సమాచార వ్యవస్థ అనేది మానవ స్వేచ్ఛకు పరిపూర్ణతను కల్పించడానికి ఒక కీలక సాధనం అని సామా జిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల సమాచార స్రవంతికి అడ్డుకట్టలు వేయడం ద్వారా మానవ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేయడమే అవు తుందని వారి ఆవేదన. అయితే ఎటుతిరిగీ వచ్చిపడుతున్న చిక్కంతా, దురదృష్టవశాత్తూ ‘‘ఎన్నికల ప్రజాస్వామ్యం’’ అనే ముసుగు కింద అయిదేళ్ల పాలనతో మురిసిపోయి రకరకాల ప్రలోభాల ద్వారా మీడియాలో ఒక వర్గాన్ని (విలేకరులు, సంపాదకుల్ని) తాత్కాలిక పదవుల కోసం ‘సాకుతో’ పాత్రికేయుల మధ్య ఐక్యతను గండికొట్టడానికి పాలకులు అలవాటుపడ్డారు. పత్రికా రచయితలకు ఎరలు గతంలో దుబాయ్, కువైట్, మలేసియా, సింగపూర్ విహారయాత్రల ద్వారా కొందరు పాత్రికేయుల్ని తిప్పుకొచ్చింది పాలకవర్గం, వారిని బానిసలుగా మార్చడం కోసం. అలాంటి వారి పేర్లను ఒకవైపున ఆనాటి (1995-2003) ‘బ్లిట్జ్’, ‘టెలిగ్రాఫ్’ పత్రికలు ప్రకటించిన విషయాన్ని మరవరాదు. లేకపోతే కొందరు పాత్రికేయులు సొంత చానళ్లు ప్రారంభించగల కోట్ల ఆర్జన ఎక్కడి నుంచి సంక్రమించిందో చెప్పగలగాలి. ఈ రకమైన వాతావరణంలో పరి ణామాల ప్రభావంవల్ల పాత్రికేయ వృత్తిలో ‘కుక్కమూతి పిందెలు’ తలెత్తడం సహజం. పైగా రాజకీయాలు, ప్రధాన స్రవంతిలో ఉన్న మాస్మీడియా పరస్పరం చేతులు కలుపుతున్నచోట్ల పత్రికా రంగంలో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రష్యన్ మీడియా చరిత్రకారుడు, జర్నలిస్టు ఇవాన్ జసోర్స్కీ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు అమలులోకి వచ్చిన తర్వాత నేటి రష్యాలో మీడియా పరిస్థితిని సమీక్షిస్తూ వెల్లడించాడు. రాజకీయ ఫ్యాక్షన్లు ఎలా రకరకాల నేషనల్ చానల్స్గా ఏర్పడి వార్తా స్రవంతి వాస్తవ పరిణామాలను గుర్తించకుండా తప్పించుకు తిరుగాడుతున్నాయో రాశాడు. ఈ ‘సంస్కరణల’ ప్రభావంలోనే ఆంగ్లో-అమెరికన్, ఆస్ట్రేలియన్ మీడియా గుత్త సంస్థలు ఇండియాలోకి మిడతల దండులా ప్రకాశించడానికి, విదేశీ మీడియా గుత్త కంపెనీలు ప్రత్యక్ష పెట్టుబడులతో భారత పత్రికా రంగాన్ని అల్లకల్లోలం చేయడానికి రూపర్డ్ మర్దోక్, కెర్రీపాకర్లు కాంగ్రెస్, బీజేపీల ఆరెస్సెస్ల సాయంతో రెక్కలు కట్టుకుని వాలారని మరచిపోరాదు! abkprasad2006@yahoo.co.in - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement