-
సీఎం వైఎస్ జగన్తో జర్మన్ కన్సులేట్ జనరల్ భేటీ
-
ఏపీలో పెట్టుబడులకు జర్మనీ సుముఖత
సాక్షి, అమరావతి : సౌర విద్యుత్, పర్యాటకం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఆసక్తి వ్యక్తం చేసింది. జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్ సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి.. కేవలం తొమ్మిది నెలల్లోనే నవరత్నాలు, పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆమె సీఎంను అభినందించారు. రాష్ట్రంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా త్వరలో ఇండో–జర్మన్ బిజినెస్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను సీఎం వివరించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు.. పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారంటూ చెన్నైలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ట్వీట్ చేసింది. ఇది ఇండో జర్మనీ సంబంధాల్లో గణనీయమైన సమావేశం అని పేర్కొంది. ఈ సమావేశంలో నాస్కామ్ మాజీ చైర్మన్, సెయింట్ (ఇన్ఫోటెక్) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా కెరిన్ స్టోల్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాల్లో జర్మనీ దేశం తరఫున వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించారు. ఏపీతో సన్నిహిత సంబంధాలు : కెరిన్ స్టోల్ - భారత్ – జర్మనీ మధ్య సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ సత్సంబంధాలున్నాయి. - రాష్ట్రంలో జర్మనీకి చెందిన సీమెన్స్ – గమేసా, పలు విండ్ పవర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలున్నాయి. - ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇండో జర్మన్ బిజినెస్ కౌన్సిల్ ఆసక్తిగా ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా దేశ కంపెనీలను ప్రోత్సహిస్తాం. - జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేసే చర్యల్లో భాగంగా ది జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు(కేఎఫ్డబ్ల్యూ) రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. - ఏపీ, జర్మన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, సాంస్కృతిక, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తాం. రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలు : సీఎం జగన్ - రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాం. - విద్య, వైద్యం, వ్యవసాయం మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. - కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలను చేపడుతోంది. - పాలిటెక్నిక్, బీటెక్లలో పాఠ్య ప్రణాళిక మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్షిప్ విధానం తీసుకొచ్చాం. - స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. -
‘సింగరేణి’కి జర్మన్ కంపెనీల క్యూ
సంస్థ సీఎండీతో 15 కంపెనీల బృందం సమావేశం సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల సరఫరాకు ప్రతిపాదనలు హైదరాబాద్: సింగరేణికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు 15 జర్మనీ కంపెనీలు ముందుకు వచ్చాయి. సిమాగ్ టెక్బర్గ్, కామాట్, డీఎంటీ, ఎస్ఎంటీ, క్లీమన్, వీడీఎంఏ ఫ్రాన్ఫుర్ట్, జియో కాన్స్టెక్ తదితర సంస్థల ప్రతినిధుల బృందం సోమవారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్తో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు ముందుంచింది. ఈ సందర్భంగా శ్రీధర్ తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ‘సింగరేణి భవిష్యత్తులో 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో 15 కొత్త గనులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ గనుల కోసం లాంగ్వాల్, కంటిన్యుయస్ మైనర్, డ్రిల్లింగ్, షాఫ్ట్ సింకింగ్ కోసం అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసేం దుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలి’ అని జర్మనీ కంపెనీలను కోరారు. ఆయా కం పెనీలు సరఫరా చేసే యంత్రాలు వాటి పూర్తి జీవితకాలం పనిచేసే వరకూ సరఫరాదారు సేవలు అందించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. తొలుత సింగరేణి గనులను సందర్శించి అవగాహన ఏర్పరుచుకున్నాక ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్పత్తి పెంచవచ్చో ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. సింగరేణికి ఉన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా యంత్రాలు అందించి ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. దీనిపై జర్మనీ బృందం సానుకూలత వ్యక్తం చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement