breaking news
gattamaneni srinivas
-
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ను పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
వటపత్రశాయి.. కరుణించవోయి..
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భక్తజనబృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో రామరాజు, సూపరింటెండెంట్లు లక్ష్మినాగరాజు, సుబ్రమణ్యం ఇతర అధికారులు, పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ జి. శ్రీనివాస్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఓఎస్డీ నయిం అస్మి, టీటీడీ డీఈ రాఘవయ్య ఉన్నారు. అనంతరం కోదండ రామస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ సీసీ కెమెరాల కనుసన్నల్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం
పీలేరు: ఎర్రచందనం అక్రమ రవాణాను ఇప్పటికే చాలావరకు అరికట్టామని, పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం పీలేరు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీలేరు పోలీస్ సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించి రెండు రోజుల్లో 125 ఎర్రచందనం దుంగలు, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. పది మంది స్మగ్లర్లు, 24 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అడ్డుకునేందుకు పోలీసు యం త్రాంగం చేపట్టిన చర్యలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈనెల 3న విజయవాడలో భారీ ఎత్తున ఎర్రచందనం డంప్ను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసి, పీడీ యాక్టుపై కేసులు నమోదు చేసి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని గుర్తు చేశారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై కళాజాతలు నిర్వహిస్తామని తెలిపారు. ము ఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.