breaking news
ganny bags
-
గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఖరీఫ్, రబీ సీజన్లలో వరిధాన్యం సేకరించడానికి ప్రతీ ఏడాది ఎదురవుతున్న గన్నీ బ్యాగుల కొరతను అధిగమించడానికి సివిల్ సప్లయి కార్పోరేషన్ శాఖ కొత్త మార్గాన్ని వెతుక్కుంది. కొనుగోలుకు అవుతున్న ఖర్చులో కొంత మేరకు తగ్గించుకుని నాణ్యమైన గోనే సంచులను సేకరించడానికి రేషన్ దుకాణాలను ఎంచుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లా సివిల్ సప్లయి అధికారులకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన అంశంపై వారం రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఇకపై రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా ఖాళీ అయిన సంచులను సివిల్ సప్లయి కార్పొరేషన్కే అప్పగించాలని సూచించారు. ఒక్క గన్నీ బ్యాగుకు రూ.16 జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో 54 శాతం కొత్తవి, 46 శాతం వినియోగించిన గన్నీ బ్యాగులు వినియోగించాలని నిబంధనలున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన గన్నీలు రైస్ మిల్లులకు చేరి, అక్కడి నుంచి బియ్యంతో అవే సంచుల్లో ఎఫ్సీఐకి చేరి, మళ్లీ ఎఫ్సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గన్నీలు కొంత మేర పాడతువుతున్నాయి. దీంతో కార్పొరేషన్ శాఖకు నష్టం వాటిల్లుతోంది. మళ్లీ కొత్తవి కొనుగోలు చేయడం భారంగా మారుతోంది. బయటి మార్కెట్లో కొత్త గన్నీలు ఒకటి రూ. 22 వరకు లభిస్తోంది. అయితే రేషన్ దుకాణాలకు బియ్యం నింపిన గన్నీలు ఖాళీ అయిన అనంతరం డీలర్లు బయట విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాలకు వచ్చిన గన్నీలు నాణ్యతగా, కొత్తగా ఉండడంతో వాటిని సివిల్ సప్లయి కార్పోరేషనే కొనుగోలు చేస్తే బాగుంటుందని, పైగా ధర కూడా తక్కువ . వెంటనే డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.16ల ధరను అధికారులు కుదుర్చుకున్నారు. డీలర్లు కూడా ఇందుకు సమ్మతం తెలుపడంతో గత కొన్ని రోజులుగా రేషన్ దుకాణాల నుంచి గన్నీల సేకరణ ప్రారంభమైంది. రేషన్ బస్తాలను సరఫరా చేసిన క్రమంలోనే అదే లారీలో ఖాళీ సంచులను పంపాలని అధికారులు డీలర్లకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విధానంతో 75వేల గన్నీ బ్యాగులు సేకరించారు. ప్రతీ నెలా 1లక్షల వరకు గన్నీలు రేషన్ దుకాణాల నుంచి సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాం రేషన్ దుకాణాల నుంచి గన్నీ బ్యాగులు సేకరించాలని రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారంగా ఇటీవల రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నిర్ణయించిన ధర ప్రకారంగా ప్రతీ నెలా ఖాళీ గన్నీలను సివిల్ సప్లయి కార్పోరేషన్కు అందించాలని తెలిపాం. నాణ్యమైన గన్నీలతో పాటు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గన్నీల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. – అభిషేక్, డీఎం, సివిల్ సప్లయి కార్పొరేషన్, నిజామాబాద్ -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయూలన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏటా గన్నీ బ్యాగుల సమస్య కారణఃగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. రైతుల నుండి కొనుగోలు ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు అవరసమైన వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని, చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 176 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో నవంబర్ రెండవ వారంలో ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపాయాలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం సేకరణకు 9,75లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, మరో 9, 75 లక్షల సంచులు అవసరం ఉందన్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకన్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా పౌర స రఫరాల మేనేజర్ ప్రసాద్రావు, డీఎస్ఓ మహమ్మద్ యాసిన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ శాఖ జెడీ భగవత్ స్వరూప్ పాల్గొన్నారు.