breaking news
ganesh chaviti
-
నేటి విశేషం.. సంకష్టహర చతుర్థీ
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి... మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం!!... పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు... సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి... సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకట హర చతుర్ధి వ్రత కథ ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు... సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు, ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది, దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. -
దేవుడి పేరుతో దందా !
సంగీత కళాశాలలో వేదికల ఏర్పాటు టార్గెట్ నిర్ణయించి వసూలు ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, విజయవాడ : పండగొస్తే అందరూ సంబరం చేసుకుంటారు. కానీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వ్యాపారులు మాత్రం వణికిపోతున్నారు. పండగ పేరు చెప్పగానే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఉత్సవాలు, పండగల పేరుతో అడ్డగోలుగా వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడటమే ఇందుకు కారణం. సంగీత కళాశాలను వేదికగా చేసుకుని దేవుడి పేరుతో టార్గెట్లు విధించి మరీ దందా సాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా దసరా ఉత్సవాల పేరుతో... నగరంలో ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నగరంలో అనేక దేవాలయాల్లోనూ అమ్మవారి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చేస్తారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యాన రెండేళ్లుగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ దేవాలయం లేకపోయినా తాత్కాలికంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ ఉత్సవాల పేరుతో నియోజకవర్గంలోని వ్యాపారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలి ఏడాది ఈ ఉత్సవాలకు సీఎం హాజరుకావాల్సి ఉన్నా... నిర్వాహకులపై తీవ్ర విమర్శలు రావడంతో చివరి నిమిషంలో ఆయన రాలేదు. మరోవైపు భాషా, సంస్కృతిక శాఖ నుంచి రూ.30 లక్షలు తీసుకుని ఇక్కడ తూతూ మంత్రంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిధులను నొక్కేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ ఉత్సవాలనూ కబ్జా ! నగర ప్రతిష్ట పెంచేందుకు గత ఏడాది కొంతమంది ఔత్సాహిక వ్యాపారులు డూండి గణేష్ సేవా సమితి పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యాన సంగీత కళాశాలలో 73 అడుగుల వినాయక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అయితే ఆ సమయంలో డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు రూ.30 లక్షలు స్వాహా చేసినట్లు మిగిలిన సభ్యుల బహిరంగంగానే ఆరోపించారు. అయితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడిని కలుపుకొని ఈ ఏడాది స్థానిక ప్రజాప్రతినిధి డూండి గణేష్ సేవా సమితికి కొత్త కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై ప్రశ్నించిన పాత కమిటీలో ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను పథకం ప్రకారం అరెస్ట్ చేయించారు. తద్వారా ఆయన వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఉత్సవాల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో కూడా నియోజవకర్గంలోని వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సులభంగా లక్షలాది రూపాయలు వస్తుండటంతో ఇటువంటి ఉత్సవాలు మరిన్ని నిర్వహించాలని సదరు ప్రజాప్రతినిధి వర్గం పథకాలు రచిస్తున్నట్లు తెలి సింది. గత ఏడాది గణేష్ ఉత్సవాల సమయంలో సంగీత కళాశాల వద్ద ఆ ప్రజాప్రతినిధి పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఈసారి పెద్ద ఎత్తున రాజకీయ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సమీపంలోని సీతారామ కల్యాణ మండపంపైనా సదరు ప్రజాప్రతినిధి కన్నేశారు. పథకం ప్రకారం దేవాదాయ శాఖను ఉపయోగించి ఈ కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే బ్రాహ్మణ సంఘాలతోపాటు టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడం.. చివరకు ఈ విషయం సీఎం వరకు వెళ్లడం,ఆయన సీరియస్ కావడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ వివాదం దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వద్ద పెండింగ్లో ఉంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యాపారులను, కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉత్సవాలు నిర్వహించడం వల్ల సదరు ప్రజాప్రతినిధితోపాటు టీడీపీకి కూడా అప్రతిష్ట వస్తోందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. -
విదేశాల్లో మన వినాయకుడు