fuel outlets
-
పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థగా ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) రిటైల్ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో సీపీసీఎల్ ప్రత్యేకంగా తన సొంత బ్రాండెడ్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ను విక్రయించనుంది.ప్రస్తుతం సీపీసీఎల్ చెన్నైలోని మనాలిలో సంవత్సరానికి 10.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో క్రూడాయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కంపెనీ మొత్తం ఉత్పత్తులను రిటైల్ అమ్మకాలను నిర్వహించే ఐఓసీకి సరఫరా చేసింది. సొంత రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), రిలయన్స్, షెల్, నయారా ఎనర్జీ వంటి ప్రధాన ఇంధన రిటైలర్లతో సీపీసీఎల్ పోటీ పడనుంది.ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్ఆఫ్’కంపెనీ ఉత్పత్తుల పంపిణీ కోసం గతంలో ఐఓసీపై ఆధారపడిన సీపీసీఎల్ రిటైల్ రంగంలోకి ప్రవేశించడం దాని సొంత ఇంధన ధరలు, అమ్మకాల వ్యూహాలను నియంత్రించడం ద్వారా లాభాలు ఆర్జించనుంది. భవిష్యత్తులో ప్రీమియం ఇంధన ఆఫర్లు, ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలను విస్తరించడానికి ఈ చర్యలు వీలు కల్పిస్తున్నాయి. అయితే సీపీసీఎల్ తన రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను, వాటి లోకేషన్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కంపెనీ తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి ప్రధాన పట్టణ కేంద్రాలు, రహదారుల సమీపంలో వ్యూహాత్మకంగా అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పెట్రోలియం డీలర్స్కి ఝలకిచ్చిన మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: త్వరలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలన్న నిర్ణయానికి ఆయిల్ మంత్రిత్వ శాఖ నో చెప్పింది. పెట్రోలియం డీలర్స్కి నిర్ణయానికి మంత్రిత్వ శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెట్రోల్ పంపు ఆపరేటర్ల అసోసియేషన్ ఆదివారాలు మూసివేయాలని నిర్ణయంపై మంత్రిత్వ శాఖ ప్రతికూలంగా స్పందించింది. ఈ చర్య సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. పెట్రోలియమ్ మినహాయింపులు లేదా పెట్రోల్ ఔట్ లెట్ల మూసివేసేందుకు అంగీకరించడం లేదని మంత్రిత్వశాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. ఇది ప్రజల అసౌకర్యానికి దారి తీస్తుందని ట్వీట్ చేసింది. అలాగే ఈ ట్వీట్లను రీ ట్వీట్ చేసిన చమురు శాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ కూడా ఇదే సందేశాన్నిచ్చారు. మేజర్ డీలర్ అసోసియేషన్లు ఈ నిర్ణయంలో భాగస్వాములు కాదని ట్వీట్ చేశారు. మరోవైపు పబ్లిక్ సెక్టార్ ఆయిల్ సంస్థలకు చెందిన 53,223 పెట్రోల్ పంపుల్లో 80 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న బంకుల యాజమాన్యాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. అయితే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని కొన్ని భాగాలు , బెంగళూకు, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలోని కొన్ని ప్రాంతాలు ఆదివారం పెట్రోల్ ఔట్ లెట్లను బంద్ను పాటించేందుకు అంగీకరించాయి. కాగా ఎనిమిది రాష్ట్రాల్లో మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేసేందుకు నిర్ణయించినట్టు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఇటీవల ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.