-
అభాగినులకు అండ
విజయనగరం ఫోర్ట్: ఆశల పల్లకిలో మెట్టినింటికి చేరుకుంటున్నారు. అత్తింటి వేధింపుల్ని తట్టుకోలేక పోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. అలాంటి అభాగినుల చేతికి పాశుపతాస్త్రం చేరింది. అత్తింటి వేధింపులను అరికడుతోంది. అదే గృహ హింస చట్టం–2005. ఈ చట్టం వచ్చాక ఎందరో బాధితులకు న్యాయం జరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త, అత్త వేధిస్తున్నారన్న మనస్తాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నెం పున్నెం తెలియని వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. ఉచిత న్యాయ సహాయం వేధింపుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం 2005లో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు గురయ్యేవారు నేరుగా గృహిహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారు. ప్రస్తుతం గృహహింస కార్యాలయం విజయనగరం కేంద్రాస్పత్రిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయం పక్కన ఉంది. గృహ హింస అంటే.. మానసికంగా మాటలతో ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింస, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యం చేయడం, ఆరోగ్యం కుంటుపడేలా వ్యవహరించడం కూడా గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలికి, ప్రతివాది మధ్య సంబంధం భార్యాభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక వల్ల లేదా పెళ్లి, దత్తత వల్ల కలిసి ఉంటున్న వారైనా, ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ పురుషులు కూడా ఈ చట్టపరిధిలోకి వస్తారు. ఆశ్రయం అందించే సంస్థలు గృహహింసకు గురైన మహిళలకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పిస్తారు. గృహహింస కార్యలయంలో అయిదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. నేరుగా ఫిర్యాదు చేయవచ్చు గృహహింసకు గురయ్యే మహిళలు నేరుగా లేదా ఫోన్లో ఫిర్యాదు చేయవచ్చు. మాటలతో లేదా శారీరకంగా వేధించినా అది గృహహింస పరిధిలోకి వస్తుంది. గృహహింస కార్యాలయాన్ని ఆశ్రయించిన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తాం. ఇద్దరికీ ముందుగా కౌన్సెలింగ్ చేస్తాం. రాజీ కుదరకపోతే కోర్టులో కేసు వేస్తాం. – జి.మాధవి, లీగల్ కౌన్సిలర్ సయోధ్యతోనే సమస్య పరిష్కారం వివాహానంతరం భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలకు తావీయరాదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ అహానికి పోరాదు. చిన్న చిన్న సమస్యలుంటే ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. భార్యను అనుమానంతో, వరకట్నం కోసం వేధించడం లేదా దాడికి పాల్పడటం గృహహింస కిందకు వస్తుంది. – జిల్లెల రజని, గృహ హింస సోషల్ కౌన్సిలర్ -
లాయర్ల ఫీజులు భారీగా పెంపు
ఉచిత న్యాయసలహా కేంద్రాలలో భాగంగా అండర్ ట్రయల్ ఖైదీల తరఫున వాదించే న్యాయవాదులకు చెల్లించే ఫీజులు మరీ దారుణంగా ఉంటున్నాయని, వాటిని గణనీయంగా పెంచాలని కర్ణాటకలోని ఓ ప్రత్యేక జడ్జి ప్రభుత్వానికి సూచించారు. న్యాయసలహా కేంద్రం కింద వాదించే న్యాయవాదులకు ఒక్కో కేసుకు కేవలం రూ. 900 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదని, గత కొన్నేళ్లుగా ఈ ఫీజులు ఇలాగే ఉన్నాయని జడ్జి వీవీ పాటిల్ అన్నారు. కోర్టుకు పెద్దకేసులు వాదించడానికి వచ్చే లాయర్లకు ఒక్క సింగిల్ హియరింగ్కే కొన్ని లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తుంటే.. వీళ్లకు మరీ ఇంత తక్కువ ఇవ్వడం సరికాదని తెలిపారు. దోపిడీ కేసులో నిందితుడి తరఫున వాదించిన ఖుద్రత్ షేక్ అనే న్యాయవాదికి రూ. 10వేలను ప్రభుత్వం ఫీజుగా చెల్లించాలని సూచించారు. న్యాయవాదులు ఇంత కష్టపడి వాదిస్తుంటే వాళ్లకు 900 మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పారు. సదరు న్యాయవాది కోర్టులో సెక్షన్ 304 కింద దాఖలు చేసిన దరఖాస్తు విచారణ అనంతరం జడ్జి పాటిల్ ప్రభుత్వానికి ఈ విధంగా తెలిపారు. ఉచిత న్యాయసలహా కేంద్రాల్లో ఇచ్చే ఫీజులు ఇంత తక్కువగా ఉంటాయి కాబట్టే న్యాయవాదులు చాలావరకు వీటికి దూరంగా ఉంటున్నారు. దాంతో అండర్ ట్రయల్ ఖైదీల విచారణలు ముందుకు సాగక.. వాళ్లు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు. దోపిడీ కేసులో దోషిగా తేలి, ఏడేళ్ల జైలుశిక్ష పడిన ఓ ఖైదీ తరఫున షేక్ వాదిస్తున్నారు. అయితే అతడి మీద ఉన్న మోకా కేసును కోర్టు కొట్టేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement