breaking news
films shooting
-
పాత బొమ్మల కొత్త రి‘స్టోరీ’
గోల్డెన్ క్లాసిక్గా నిలిచిన ఆ తరం పాత సినిమాలను నేటి అధునాతన టెక్నాలజీ అయిన 4కే రిజల్యూషన్తో పునరుద్ధరించి, సరికొత్తగా జీవం పోస్తున్నారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే తాతయ్య అమ్మమ్మ జ్ఞాపకాలుగా ఇంట్లో ఉన్న పాత మరచెంబును అలా మూలకు పడకుండా చింతపండు వేసి తోమి తళతళా మిలమిలా మెరిపించి కొత్తదానిలా చేయడం. దానితో ఉన్న జ్ఞాపకాలను మరొక్కసారి మననం చేయడమే ఈ రిస్టోరేషన్.1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ సినిమాను ఫోర్ కే రిజల్యూషన్లోకి సరికొత్తగా మార్చి, అక్కినేని శత జయంతి సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్లో విడుదల చేశారు. ఒక తాతయ్య తన మనవరాలితో కలిసి ఆ సినిమా చూశాడు. మొదటిసారిగా ఆ సినిమా చూసినప్పుడు తనెంత చిన్న పిల్లాడో, ఆరోజున సినిమా టికెట్ ధర పది పైసలు సంపాదించడానికి తానెంత కష్టపడ్డాడో, ఆ నేల టికెట్ తీసుకొని కింద ఇసుకలో కూర్చున్న సంగతి నుంచి రాజనాల ఎన్టీఆర్ ఫైట్, అక్కినేని తాగి చేసిన అల్లరి, ‘కోలో కోలో’ పాటకు ఆనందంతో తాను చేసిన డ్యాన్స్ , ఆనాటి నుంచి తనతో పాటు ప్రయాణిస్తూ మదిగదిలో తడియారని జ్ఞాపకాలను మనవరాలితో పంచుకున్నాడు. ‘చదువుకోకుండా టీవీలు, సినిమాలు చూస్తే పాడైపోతారని అస్తమానం మందలించే తాతయ్య, తామంతా భయపడే నాన్న కూడా భయపడే తాతయ్యలో ఇంతటి అల్లరి సినీ ప్రేమికుడు ఉన్నాడా?’ అనుకుంటూ ఆ మనవరాలు ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి తాతయ్యకు తనకు బాండింగ్ మునుపటి కంటే ఇంకా చిక్కగా అయ్యింది. ఈ అనుభవం ఒక్క ఆ తాత మనవరాలిదే కాదు. భారతదేశంలో ఉన్న చాలామంది సినీ ప్రేమికులది. దీనికంతటికీ కారణం ఫోర్కే రిజల్యూషన్తో రిస్టోర్ చేసిన ఓ సినిమా.వివిధ భాషలకు చెందిన అనేక క్లాసిక్ చిత్రాలను 4కేలో రిస్టోర్ చేసి, థియేటర్లోకి మళ్ళీ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ రిస్టోర్ రీ రిలీజ్కు సంబంధించిన కథా కమామిషూ తెలుసుకుందాం!సామాన్యంగా ఏ సినిమా అయినా, అది తీసే నాటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తెరకెక్కిస్తారు. అప్పటికి అందుబాటులో ఉన్న కెమెరాలనే వాడతారు. పిక్చర్ క్వాలిటీ ఆ కెమెరాల పరిధి మేరకే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అని అంటే కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు జనమంతా వాటినే వాడారు. తర్వాత ఆ కీప్యాడ్ ఫోన్లకి ఓ చిన్న కెమెరా అమర్చారు. అప్పటికి ఫోన్లకు కెమెరా ఉండటమే గొప్ప! తరువాత ఆ కెమెరా క్వాలిటీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో కెమెరాతో 4కే లేదా 8కే వరకు వీడియోలు తీయవచ్చు. అప్పటికీ ఇప్పటికీ వీడియో క్లారిటీ చాలా పెరిగింది. ఇదే విధానం ఇప్పుడు సినిమా కెమెరాలకూ వర్తిస్తుంది. కీప్యాడ్ కెమెరాతో తీసిన వీడియోకు, ప్రస్తుతం ఐఫోన్తో తీసిన వీడియోకు వ్యత్యాసం ఎంత ఉందో; ఆనాడు మిచెల్ కెమెరాతో ఫిల్మ్ మీద తీసిన సినిమాలకు ఈనాడు అందుబాటులో ఉన్న కెమెరాలతో చీప్ మీద తీసిన సినిమాలకు అంత వ్యత్యాసం ఉంది. పాత కెమెరాలతో తీసిన సినిమాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేయడమే రిస్టోరేషన్ పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పాత తాతయ్య ఫోటోను సరికొత్త ఫొటోగా మార్చడం. తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పిన 1989 ‘శివ’ సినిమాను సరికొత్త ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఇలానే విడుదల చేశారు.తొలి ఘనత ‘కల్పన’‘దీని వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పాత సినిమాలను నేటితరం కోసం, తర్వాతి తరాల కోసం జాగ్రత్త చేయడం; రెండు ఈ సరికొత్త చిత్రాన్ని రిలీజ్ చేసి వ్యాపారం చేయడం. ఇందులో పుణ్యం పురుషార్థం రెండూ ఉన్నాయి. వ్యాపారం చేసి, డబ్బులు సంపాదించడం ఒకటైతే; ప్రేక్షకుల జ్ఞాపకాలను మరొక్కసారి తట్టి లేపడం రెండవది. అయితే అన్ని చిత్రాలూ డబ్బు సంపాదించి పెట్టలేకపోవచ్చు’’ అంటున్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ఈ సంస్థ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్ససి స్థాపించిన ఫిల్మ్ రిస్టోరేషన్ సంస్థతో కలిసి పాత సినిమాల పునరుద్ధరణ నిర్వహిస్తుంది. ఈ ఫౌండేషన్ ఉదయ్ శంకర్ 1948లో తీసిన ‘కల్పన’ చిత్రాన్ని ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఆ సినిమాకు పునరుజ్జీవం పోసింది. ‘కల్పన’ రిస్టోర్ అయిన మొదటి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.రిస్టోరేషన్ నేటి తరానికి అవసరంనేటి కమర్షియల్ సినిమాల్లో మితిమీరిన హింస, మతిలేని డ్రామా ఉంటోందని ఆనాటి సినిమా చూసిన పాతతరం ప్రేక్షకులు వాపోతుంటారు. వారి మాటల్లోనే చెప్పాలంటే, ‘కత్తి పట్టుకుంటే నరకటం, గన్ను పట్టుకుంటే కాల్చడం, శత్రువును క్షమించడం కంటే కనపడితే రెండుగా చీల్చడం– ఎలివేషన్లే కాని, ఎమోషన్ లేని సీన్లతో ఈ సినిమాలో కథ ఏముంది? అదే మా కాలంలోని సినిమాలోనైతేనా’ అంటూ ఆనాటి వారి సినిమాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఈ మాటను నేటి యువ సినీ ప్రేక్షకులు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ ఎలివేషన్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి ఈలలు, చప్పట్లతో థియేటర్ని హోరెత్తించే నేటి బర్గర్ పిజ్జా బిర్యానీ తరానికి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఈతరం వారి సినిమాలను అప్పటి వారు మెచ్చుకోరు. ఆతరం వారి సినిమాలను ఇప్పటివారు ఒప్పుకోరు. ఫాస్ట్ కట్స్కి అలవాటుపడ్డ వారికి పాత సినిమాలు లాగ్ అనిపిస్తాయి. అయినా నలుపు తెలుపు రెండే రంగులున్న ఆ పాత సినిమాలు చూసేవారెవరు? చూడాలన్నా అందుబాటులో ఉండాలి కదా! అద్దం మొహం ఒక దగ్గర ఉంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకోసమైనా ఆ ఓల్డ్ గోల్డ్ క్లాసిక్స్ని నేటి టెక్నాలజీకి అనువుగా మార్చి ఈ జెన్ జీ తరానికి చేరువ చేయాలి. ఆ పాత సినిమాల్లో కథలు ఎలా ఉండేవి? ఆ నటుల నటనాస్థాయి ఏమిటి? హాస్యం, జుగుప్స లేకుండా ఎంత హాయిగా ఉండేది? సంగీతంలో లాలిత్యం, సాహిత్యంలో కవి భావం ఎంత లోతుగా ఉండేదో ఈ తరానికి తెలియాలంటే ఈ ఫోర్ కే రిస్టోరేషన్ అవసరం చాలా ఉంది.‘నేటి ప్రేక్షకుడు సాంకేతికంగా నాణ్యమైన సినిమాని చూడడానికి అలవాటు పడ్డాడు. సినిమా, టీవీ తెరలే కాదు, ఎక్కువ సమయాన్ని గడిపే మొబైల్ స్క్రీన్లు కూడా అద్భుతమైన ఫోర్ కే దృశ్యాలను చూపెడుతున్నాయి. అలాంటి వారికి సెవెంటీ ఎంఎంపై తీసిన సినిమాలు చూడమంటే ఇబ్బందే. అందుకే పాత సినిమాల రిస్టోరేషన్ చేయడం అవసరం’ అని శేమారూ ఎంటర్టైన్మెంట్ సీఈవో హిరేన్ గాడా అభిప్రాయపడ్డారు.‘ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్లు ప్రస్తుతం 4కేలో లేని సినిమాలను స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసిన హక్కుదారులకు, అదే పాత సినిమాను నాన్ ఫోర్కే హక్కుదారులకు వ్యాపారపరంగా చాలా అంతరం ఉంది. పాత సినిమాలను పాత పద్ధతిలో ఉంచుకున్న వారికి ఆదాయ మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి’ అని అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు.‘బోల్తా’బొమ్మలతో రిస్టోరేషన్కు వేగంపాత క్లాసిక్స్ను ఫోర్ కేలో రిస్టోర్ చేసి, రిలీజ్ చేయడం వలన థియేటర్లో ప్రేక్షకుల రాక మళ్ళీ పెరిగింది. అమితాభ్ బచ్చన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అక్టోబర్లో జరిగింది. ఇందులో అమితాభ్ బచ్చన్ పదకొండు హిట్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలీజ్ అయిన హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా పాత సినిమాల 4కే రిస్టోరేషన్ను వేగవంతం చేసింది. మల్టీప్లెక్స్లకు కొత్త కంటెంట్ కావాలి. వారాల తరబడి, నెలల తరబడి అవి ఒకే సినిమాను ప్రదర్శించవు. అందులోనూ సినిమా సక్సెస్ను బట్టి రిలీజ్ అయిన రెండు వారాలలోపే ఓటీటీలోకి ఆ సినిమాలు వచ్చేస్తుంటే మల్టీప్లెక్స్లకు ఆడియన్స్ ఎందుకు వస్తారు? కాబట్టి ఓటీటీలోకి వచ్చిన సినిమాను మల్టీప్లెక్స్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి. అందుకోసమైనా కొత్త కంటెంట్ కావాలి. కంటెంట్ లేమితో ఐపీఎల్ మ్యాచ్లు ప్రదర్శించడానికి కూడా మల్టీప్లెక్స్లు వెనుకాడటం లేదు. సరిగ్గా ఈ సందర్భాన్ని ఫోర్ కే రిస్టోరేషన్ సినిమాలు సమర్థంగా వాడుకుంటున్నాయి. సౌత్లో కూడా ఫోర్ కే రిలీజ్ ట్రెండ్గా మారింది. దానికంటూ కొత్తతరంలో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది.కొంతమంది నిర్మాతలు దర్శకులు నటులు తమ తొలినాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ ఫోర్ కే రిస్టోరేషన్ను గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ‘శివ’ సినిమా 4కే విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగార్జున ‘శివ సినిమాను నాన్నగారు చూశారు. ఆరోజు మేమిద్దరం కారులో వెళుతున్నాం. నాన్నగారే డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేసరికి ఆయన నా చేతి మీద చేయి వేస్తూ చాలా బాగా నటించావు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో అంచనా వేయడం చాలా కష్టం’ అని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఈ ట్రెండ్ కొనసాగేనా..?ఆ పాత మధురాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసి రిలీజ్ చేస్తే ప్రస్తుతానికైతే ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని చాలా సినిమాలను ఫోర్ కేలోకి మారుస్తున్నారు. అయితే ఈ ఆదరణ తాత్కాలికమేనా, లేదా దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందా అంటే ‘అది ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి’ అని సినిమా ప్రముఖులు సమాధానం చెబుతున్నారు. కొత్తగా సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాను 4కేలో రిలీజ్ చేయడం ఖర్చుతో పాటు రిస్క్ను కూడా తగ్గిస్తుంది. పాత సినిమాలను 4కేలో రిస్టోర్ చేయడానికయ్యే ఖర్చు దాని నెగటివ్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నెగటివ్ నాణ్యతను బట్టి రూ. 20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే కొత్త సినిమా తీయాలంటే కనీసం ఐదు కోట్లయినా కావాలి. దాన్ని కూడా లో బడ్జెట్ చిత్రంగానే పరిగణిస్తారు. ఆ సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవు. హిట్ టాక్ వస్తే ఆడియ¯Œ ్స వస్తారు. లేదంటే పోస్టర్ మైదా ఖర్చులు కూడా రావు. అదే పెద్ద సినిమాలైతే వందల కోట్లు కావాలి. ఎన్ని కోట్లు పెట్టినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు. అదే పాత సినిమాల విషయంలో ఆ భయం అవసరం లేదు. ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ. అలాగని పాత సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని నమ్మకం లేదు.‘మేము గురుదత్ సినిమాలను 4కేలోకి రిస్టోర్ చేశాం. వాటిలో కొన్ని మాత్రమే లాభసాటి బిజినెస్ చేశాయి. ఉదాహరణకు బాజ్ (1953) సినిమాకు ప్రేక్షకులు లేరు. కాని, ప్యాసా (1953) మాత్రం బాగా వర్కౌట్ అయింది’ అని అగర్వాల్ చెప్పారు.ఇప్పుడు పాత సినిమా హక్కుదారులు జాగరూకులయ్యారు. 10–15 రీస్టోర్ చేసిన సినిమాలు దీర్ఘకాలికంగా తమకి ఎంత లాభాలు తీసుకువస్తాయో అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రదర్శన, సినిమా పాపులారిటీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4కే చేసిన పాత సినిమాల రిస్టోరేషన్ తర్వాత మూడు నుండి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రిస్టోరేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది. ప్రేక్షకుడిని చేరుకునే పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా మారి థియేటర్లో ప్రేక్షకుడికి పాత సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. ఫిల్మ్ రిస్టోరేషన్ రంగంలో పనిచేసే కంపెనీలు చెప్పిన దానిని బట్టి ‘ఈ ఫోర్ కే సినిమాల ఆదాయం స్మార్ట్ టీవీలు, యూట్యూబ్పై వచ్చే యాడ్స్ ఆదాయం పాత సినిమాల ఆదాయం కంటే అధికంగా ఉంటుంది. ఒక సినిమాని ఫోర్ కేలో చూడాలా లేదా పాత ఫార్మాట్లో చూడాలా అనే సంశయం ప్రేక్షకుడికి అస్సలు లేదు. ఫోర్ కే ఓకే అంటాడు. మారిన ప్రేక్షకుడి అభిరుచి కూడా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం రావడానికి కారణమైంది. ప్రస్తుతం సగటున అగ్రిగేటర్ల లైబ్రరీలో కనీసం 10 శాతం సినిమాలు 4కేలోకి రిస్టోర్ అయ్యాయి. మిగతా 80–90% సినిమాలు కనీసం హెచ్డీ ఫార్మాట్ వరకు అప్డేట్ అయ్యాయి. లభ్యమయ్యే ఆదాయ మార్గాల దృష్ట్యా రాబోయే సంవత్సరాలలో 4కే రిస్టోరేషన్ మరింత పెరుగుతుందని పరిశ్రమ నిపుణుల అంచనా. మరోవైపు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయలేకపోవడం, కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడం వలన సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలకు విడుదల కాకపోవడం, మరో తేదీకి వాయిదా పడడం కూడా ఈ రీ రిలీజ్ సినిమాలకు కలిసి వచ్చే అంశం అయింది. వాళ్ల తేదీలను వీళ్లు ఉపయోగించుకుంటున్నారు.‘క్లాసిక్ సినిమాలకు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఉంటారు. ఒక క్లాసిక్ సినిమాకు ప్రజాదరణ ఉన్నప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారా తక్కువలో తక్కువ 300 నుంచి 400 శాతం లాభం తీసుకు రాగలదు’ అని ‘క్వాలిటీ మేటర్’ వ్యవస్థాపకుడు కౌశిక్ భట్టాచార్య చెప్పారు.అలా 4కే పుట్టింది! 4కేఅంటే సాధారణంగా ‘ఓకే, మంచి క్వాలిటీ’ మాత్రమే కాదు. ఆ స్క్రీన్ లోపల జరుగుతున్న మ్యాజిక్ తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు! 3840 ఎక్స్ 2160 పిక్సెల్స్ అంటే సామాన్యంగా అంటే 8.3 మిలియన్ చుక్కలు! ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ముఖం, రంగు, నీడ అన్నీ ఆ 83 లక్షల పిక్సెల్స్ కలిసి వేసే ఒక అందమైన చిత్రం. అందుకే దీన్నే అల్ట్రా హెచ్డీ అంటారు. ఒకసారి పోల్చితే 720 పిక్సెల్స్ హెచ్డీ నుంచి 1080 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డీ నుంచి దానికి రెట్టింపు 2160 పిక్సెల్స్. ఇప్పుడిది సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1980 నుంచి 1997 వరకు పాత సినిమాలు పాత ఫొటోల్లో ఉండే చిరునవ్వులా స్పష్టత లేని చిత్రాల్లా జీవించాయి. రీల్స్ మీద కాలం వేసిన మరకలు, రంగుల్లో మసక, శబ్దంలో జనాల చప్పట్లు అలా– అవి బతికి ఉండేవి కాని, మెరిసేవి కాదు. తర్వాత 2006లో ఒక్కసారిగా హెచ్డీ టెక్నాలజీతో వాటి రంగు మెరిసింది. ఒక్కో పాత రీల్ మేల్కొంటున్నట్టుగా, పాడైపోయిన ఫ్రేమ్స్కు రంగులు పూయడం మొదలయింది. ఇక 2015లో 4కే రాకతో అసలు పండుగ మొదలైంది. పాత సినిమాలకు పునర్జన్మ లభించినట్టుగా– అదే ఏడాదిలో 23 సినిమాలు పుట్టాయి. మరుసటి ఏడాదికి 43 అయ్యాయి. 2022 నాటికి 85. ప్రపంచం మొత్తం పాత ఖజానాలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు పరుగెడుతోంది.ఈ కథ వెనుక నిశ్శబ్ద సూపర్ హీరో మార్టిన్ స్కోర్సేసీ. ఆయన 1990లో స్థాపించిన ఫిల్మ్ ఫౌండేషన్ సంస్థ. నటులు కథలను జీవిస్తే, ఈయన కథలను కాపాడతాడు. ఆయన ఒక్కరితోనే వందలాది సినిమాలు మళ్లీ శ్వాస పీల్చాయి. ఆ జ్వాల భారతదేశానికీ చేరింది. 2015లో నేషనల్ ఫిల్మ్ yð వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) పాడైపోయిన రీల్స్ను చేతుల్లోకి తీసుకుని, డిజిటల్ ప్రపంచంలోకి లాగి, 4కే కాంతిలో మళ్లీ నిలబెట్టింది. అప్పటి నుంచే మనం పాత సినిమాలను చూసేటప్పుడు ‘అది పాత సినిమా కాదు, పాత కాలం కొత్తగా పుట్టింది’ అనిపిస్తోంది.సినీ పునరుద్ధరణ ప్రస్థానం∙1980 నుంచి 1997 నెగటివ్ నుంచి ఎస్డీ ఫార్మాట్ ∙2006 నుంచి 2013 హెచ్డీ ఫార్మాట్ ∙2015 2కే ∙2016 4కే ∙2022 8కే ∙1990 ఫిల్మ్ ఫౌండేషన్ అనే సంస్థను హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ స్థాపించారు.∙2015 నుంచి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎఫ్ఏఐ) ఫిల్మ్ రిస్టోరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
తెరమరుగవుతున్న గోదారి
సాక్షి డెస్్క, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఏదో ఒకచోట తరచుగా సినిమా షూటింగులు జరుగుతుండేవి. ఆ పరిసరాల ప్రజలకు కొన్నాళ్ల పాటు ఇదే ముచ్చటగా ఉండేది. కమెడియన్ను చూశామనో.. విలన్ను పలకరించామనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడిది గత వైభవంగా మిగిలిపోతోంది. వెండితెరపై నాడు విరిసిన జిల్లా అందాలు నేడు అంతగా కనిపించడం లేదు. సహజసిద్ధ స్టూడియోగా పేరు సంపాదించిన ఇక్కడి ప్రకృతి అందాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. వ్యయ ప్రయాసలకు భయపడి నిర్మాతలు ఔట్డోర్ షూటింగులకు చాప చుట్టేయడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఎందుకిలా అయిందంటే.. చాలా రంగాలను ప్రభావితం చేసిన ఆధునిక సాంకేతికత సినిమాను కూడా తాకింది. గతంలో మాదిరిగా ఆర్టిస్టులందరినీ లొకేషనుకు తీసుకువెళ్లే రోజులు పోయాయి. అందరినీ తీసుకుని వెళ్లాలంటే బస, రవాణా వంటి ఖర్చులతో చాలా బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు నిర్మాతలు ఈ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. పాత రోజుల్లో సినిమా తీస్తూంటే మొత్తం ఆరి్టస్టులందరూ వచ్చేవారు. ఈ వ్యయం నిర్మాతలకు చాలా భారమయ్యేది. దీనికి తోడు ఎక్కువ సినిమా కథల నేపథ్యం పట్టణాలతో, నగరాలతో ముడిపడి ఉంటోంది. పల్లె కథలు తగ్గిపోతున్నాయి. 90 ఏళ్ల క్రితమే స్టూడియో సుమారు 90 ఏళ్ల క్రితమే జిల్లాలో సినిమా షూటింగులకు స్టూడియో ఏర్పాటైంది. 1936లో నిడమర్తి దుర్గయ్య ధవళేశ్వరం వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దుర్గా మూవీ టోన్ స్టూడియో నిర్మించారు. చల్మోహన్రంగా వంటి చిత్రాలు ఇక్కడ తీశారు. ఆరేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇది మూత పడింది. కానీ జిల్లాలో షూటింగులు మాత్రం కొనసాగాయి. జిల్లా నుంచి ఎందరికో చాన్స్ జిల్లాలో సినిమా షూటింగుల ప్రభావం ఫలితంగా చాలామంది ఈ రంగానికి వెళ్లాలని ఉత్సాహపడేవారు. దర్శక నిర్మాతలు తరచూ వస్తూండటంతో ఉమ్మడి జిల్లాలోని ఎంతోమంది ఔత్సాహికులకు సినిమా చాన్సులు దక్కాయి. అంజలీదేవి, జయప్రద, సుకన్య, జరీనా వహాబ్, వహీదా రెహమాన్, లలితారాణి వంటి వారు హీరోయిన్లుగా వెలుగొందారు. ఈ జిల్లా నుంచే చెన్నై వెళ్లిన భానుప్రియ మీద కూడా జిల్లాలో జరిగిన సినిమా షూటింగుల ప్రభావమే ఉంది. బాల నటుడిగా ఆలీకి అవకాశమొస్తే ఇప్పుడు అగ్రశ్రేణి కామెడీ నటుడయ్యారు. ఆయనకు ముందు రాజబాబు కూడా కామెడీలో రాణించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పని చేసిన రంగనాథ్ ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, క్రాంతికుమార్, వంశీ, కాశీ విశ్వనాథ్, బాపు, శోభన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్ నుంచి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా వరకూ ఎందరో ఈ ప్రాంత వాసులు దర్శకులయ్యారు. నట వర్గం గురించి చెప్పుకుంటే జిల్లాకు చెందిన చాలామంది వెండితెరపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా షూటింగులు తగ్గిపోవడంతో సినిమాల్లో జిల్లా ప్రాతినిధ్యం కూడా పలుచబడిందనే చెప్పాలి. ఆదుర్తి నుంచి వంశీ వరకూ.. గోదావరి అందాలను పూర్తి స్థాయిలో వెండితెరకెక్కించిన ఘనత రాజమహేంద్రవరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు దక్కుతుంది. 1963లో ఆయన తీసిన మూగమనసులు గోదావరి నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత ఏదో ఒక విధంగా వెండితెరపై గోదావరి కనువిందు చేస్తూ వచ్చింది. 1963లో దర్శకుడు బాపు సాక్షి సినిమాకు జిల్లాలో ఎక్కువ లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రమిది. 1969లో బుద్ధిమంతుడు, 1973లో అందాల రాముడు తీశారు. మూగమనసులు సినిమాతో గోదావరితో పరిచయమేర్పడిన కె.విశ్వనాథ్కు ఈ నదీ తీర ప్రాంతాల్లో షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. 1973లో శారద సినిమాను గోదావరి పరిసరాల్లోనే నిర్మించారు. అక్కడి నుంచి వరుసగా తన చిత్రాలన్నింటిలోనూ గోదావరి అందాలను విశ్వనాథ్ తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచందర్ సహా ఎందరో దర్శకులు పోటీ పడి మరీ గోదావరి జిల్లాలో చిత్రాలను నిర్మించారు. దేశంలోని ఇతర భాషా చిత్రాల షూటింగులకు కూడా మన ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. వంశీ కేరాఫ్ గోదావరి రాయవరం మండలం పసలపూడికి చెందిన సుప్రసిద్ధ దర్శకుడు వంశీకి గోదావరి అంటే ప్రాణం. అందుకే ఆయన చిత్రాల్లో గోదావరి అందాలే కాదు భాష, యాస కూడా కనిపిస్తూ మనసును గిలిగింతలు పెడతాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంతో ముడిపడిన వినోదభరిత చిత్రం. గోదావరి లేకుండా ఆయన ఏ సినిమా తీయలేదేమో అనిపించేలా జిల్లా లొకేషన్లన్నీ చూపించారాయన. -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
తెలంగాణ సంస్కృతి, కథలు, యాసతో కళకళలాడుతున్న తెలుగు సినిమా
-
ఆగిపోయిన సినిమా షూటింగ్లు
చెన్నై(తమిళనాడు): తమిళనాడు వ్యాప్తంగా సినిమా షూటింగ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) చేపట్టిన ఆందోళనతో దాదాపు 20 సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయిన సినిమాల్లో తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ‘కాలా’ కూడా ఉంది. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25వేల మంది సినీ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే, వీరి డిమాండ్లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్పీసీ) తోసిపుచ్చింది. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నేతలకు టీఎఫ్పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్ సందర్భంగా వేతనాలు పెంచాలనే డిమాండ్పై ఆ చిత్ర నిర్మాత-నటుడు అయిన ఆర్కే సురేష్తో ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముదిరి మంగళవారం సమ్మె దాకా వెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్.. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యులు కానివారితో షూటింగ్లు చేసుకోవాలని నిర్మాతలకు సలహాఇచ్చారు. అయితే, దీనిపై ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. ఇదివరలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరో వేతన ఒప్పందం తీసుకురావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. సినీ రంగ పనివారి డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని, ప్రత్యామ్నాయ మార్గాల్లో షూటింగ్లు కొనసాగించుకోవాలని టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్ సూచించారు. ఆయన నటిస్తున్న సినిమా ‘తుప్పరివాలన్’ షూటింగ్ మంగళవారం కొనసాగింది.


