breaking news
films shooting
-
తెరమరుగవుతున్న గోదారి
సాక్షి డెస్్క, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఏదో ఒకచోట తరచుగా సినిమా షూటింగులు జరుగుతుండేవి. ఆ పరిసరాల ప్రజలకు కొన్నాళ్ల పాటు ఇదే ముచ్చటగా ఉండేది. కమెడియన్ను చూశామనో.. విలన్ను పలకరించామనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడిది గత వైభవంగా మిగిలిపోతోంది. వెండితెరపై నాడు విరిసిన జిల్లా అందాలు నేడు అంతగా కనిపించడం లేదు. సహజసిద్ధ స్టూడియోగా పేరు సంపాదించిన ఇక్కడి ప్రకృతి అందాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. వ్యయ ప్రయాసలకు భయపడి నిర్మాతలు ఔట్డోర్ షూటింగులకు చాప చుట్టేయడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఎందుకిలా అయిందంటే.. చాలా రంగాలను ప్రభావితం చేసిన ఆధునిక సాంకేతికత సినిమాను కూడా తాకింది. గతంలో మాదిరిగా ఆర్టిస్టులందరినీ లొకేషనుకు తీసుకువెళ్లే రోజులు పోయాయి. అందరినీ తీసుకుని వెళ్లాలంటే బస, రవాణా వంటి ఖర్చులతో చాలా బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు నిర్మాతలు ఈ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. పాత రోజుల్లో సినిమా తీస్తూంటే మొత్తం ఆరి్టస్టులందరూ వచ్చేవారు. ఈ వ్యయం నిర్మాతలకు చాలా భారమయ్యేది. దీనికి తోడు ఎక్కువ సినిమా కథల నేపథ్యం పట్టణాలతో, నగరాలతో ముడిపడి ఉంటోంది. పల్లె కథలు తగ్గిపోతున్నాయి. 90 ఏళ్ల క్రితమే స్టూడియో సుమారు 90 ఏళ్ల క్రితమే జిల్లాలో సినిమా షూటింగులకు స్టూడియో ఏర్పాటైంది. 1936లో నిడమర్తి దుర్గయ్య ధవళేశ్వరం వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దుర్గా మూవీ టోన్ స్టూడియో నిర్మించారు. చల్మోహన్రంగా వంటి చిత్రాలు ఇక్కడ తీశారు. ఆరేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇది మూత పడింది. కానీ జిల్లాలో షూటింగులు మాత్రం కొనసాగాయి. జిల్లా నుంచి ఎందరికో చాన్స్ జిల్లాలో సినిమా షూటింగుల ప్రభావం ఫలితంగా చాలామంది ఈ రంగానికి వెళ్లాలని ఉత్సాహపడేవారు. దర్శక నిర్మాతలు తరచూ వస్తూండటంతో ఉమ్మడి జిల్లాలోని ఎంతోమంది ఔత్సాహికులకు సినిమా చాన్సులు దక్కాయి. అంజలీదేవి, జయప్రద, సుకన్య, జరీనా వహాబ్, వహీదా రెహమాన్, లలితారాణి వంటి వారు హీరోయిన్లుగా వెలుగొందారు. ఈ జిల్లా నుంచే చెన్నై వెళ్లిన భానుప్రియ మీద కూడా జిల్లాలో జరిగిన సినిమా షూటింగుల ప్రభావమే ఉంది. బాల నటుడిగా ఆలీకి అవకాశమొస్తే ఇప్పుడు అగ్రశ్రేణి కామెడీ నటుడయ్యారు. ఆయనకు ముందు రాజబాబు కూడా కామెడీలో రాణించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పని చేసిన రంగనాథ్ ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, క్రాంతికుమార్, వంశీ, కాశీ విశ్వనాథ్, బాపు, శోభన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్ నుంచి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా వరకూ ఎందరో ఈ ప్రాంత వాసులు దర్శకులయ్యారు. నట వర్గం గురించి చెప్పుకుంటే జిల్లాకు చెందిన చాలామంది వెండితెరపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా షూటింగులు తగ్గిపోవడంతో సినిమాల్లో జిల్లా ప్రాతినిధ్యం కూడా పలుచబడిందనే చెప్పాలి. ఆదుర్తి నుంచి వంశీ వరకూ.. గోదావరి అందాలను పూర్తి స్థాయిలో వెండితెరకెక్కించిన ఘనత రాజమహేంద్రవరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు దక్కుతుంది. 1963లో ఆయన తీసిన మూగమనసులు గోదావరి నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత ఏదో ఒక విధంగా వెండితెరపై గోదావరి కనువిందు చేస్తూ వచ్చింది. 1963లో దర్శకుడు బాపు సాక్షి సినిమాకు జిల్లాలో ఎక్కువ లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రమిది. 1969లో బుద్ధిమంతుడు, 1973లో అందాల రాముడు తీశారు. మూగమనసులు సినిమాతో గోదావరితో పరిచయమేర్పడిన కె.విశ్వనాథ్కు ఈ నదీ తీర ప్రాంతాల్లో షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. 1973లో శారద సినిమాను గోదావరి పరిసరాల్లోనే నిర్మించారు. అక్కడి నుంచి వరుసగా తన చిత్రాలన్నింటిలోనూ గోదావరి అందాలను విశ్వనాథ్ తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచందర్ సహా ఎందరో దర్శకులు పోటీ పడి మరీ గోదావరి జిల్లాలో చిత్రాలను నిర్మించారు. దేశంలోని ఇతర భాషా చిత్రాల షూటింగులకు కూడా మన ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. వంశీ కేరాఫ్ గోదావరి రాయవరం మండలం పసలపూడికి చెందిన సుప్రసిద్ధ దర్శకుడు వంశీకి గోదావరి అంటే ప్రాణం. అందుకే ఆయన చిత్రాల్లో గోదావరి అందాలే కాదు భాష, యాస కూడా కనిపిస్తూ మనసును గిలిగింతలు పెడతాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంతో ముడిపడిన వినోదభరిత చిత్రం. గోదావరి లేకుండా ఆయన ఏ సినిమా తీయలేదేమో అనిపించేలా జిల్లా లొకేషన్లన్నీ చూపించారాయన. -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
తెలంగాణ సంస్కృతి, కథలు, యాసతో కళకళలాడుతున్న తెలుగు సినిమా
-
ఆగిపోయిన సినిమా షూటింగ్లు
చెన్నై(తమిళనాడు): తమిళనాడు వ్యాప్తంగా సినిమా షూటింగ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) చేపట్టిన ఆందోళనతో దాదాపు 20 సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయిన సినిమాల్లో తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ‘కాలా’ కూడా ఉంది. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25వేల మంది సినీ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే, వీరి డిమాండ్లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్పీసీ) తోసిపుచ్చింది. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నేతలకు టీఎఫ్పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్ సందర్భంగా వేతనాలు పెంచాలనే డిమాండ్పై ఆ చిత్ర నిర్మాత-నటుడు అయిన ఆర్కే సురేష్తో ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముదిరి మంగళవారం సమ్మె దాకా వెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్.. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యులు కానివారితో షూటింగ్లు చేసుకోవాలని నిర్మాతలకు సలహాఇచ్చారు. అయితే, దీనిపై ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. ఇదివరలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరో వేతన ఒప్పందం తీసుకురావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. సినీ రంగ పనివారి డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని, ప్రత్యామ్నాయ మార్గాల్లో షూటింగ్లు కొనసాగించుకోవాలని టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్ సూచించారు. ఆయన నటిస్తున్న సినిమా ‘తుప్పరివాలన్’ షూటింగ్ మంగళవారం కొనసాగింది.