-
గోరంతను కొండంత చేసి..
ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు శాంతికాముకులనడంలో సందేహం లేదు. అయితే మంత్రి కాలవ శ్రీనివాసులు మాత్రం ఇక్కడి ప్రజలను ఇంకో విధంగా భావిస్తున్నాడు. ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించరు.. ఏమి చెప్పినా వెర్రివెంగళప్పల్లా నమ్ముతారు అని అనుకున్నాడు. అందుకే పట్టణంలో నాలుగు కి.మీ రోడ్డు విస్తరణకు గాను 1.2 కి.మీ, మాత్రం అదీ అసంపూర్తిగా పనులు చేసి, ప్రచారంలో మాత్రం రాయదుర్గం రోడ్లు వెలిగిపోతున్నాయి అని గొప్పలు చెబుతున్నాడు. మాటలకు, పనులకు పొంతన లేకుండా పోతోంది. సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో నాలుగు వరుసల రోడ్ల విస్తరణ, విద్యుత్ దీపాల అమరిక కోసం 2014లో నిధులు మంజూరయ్యాయి. పాలశీతలీకరణ కేంద్రం నుంచి మొలకాల్మూరు రోడ్డు బైపాస్ రోడ్డుకు లింక్ కలిపే 4 కి.మీ రోడ్డు పనులు 2015లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లు గడిచినా మంత్రి నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాల్టీలో 4 కి.మీ రోడ్డు కూడా వేయని దుస్థితి. నాలుగేళ్లుగా ముక్కి, మూలిగి 1.2 కి.మీ సీసీ రోడ్డు, వంద మీటర్ల బీటీ రోడ్డు మాత్రం వేశారు. వినాయక సర్కిల్లో కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రధానంగా ప్రమాదాలు జరిగే తేరు మలుపు వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. అలాగే వేసిన 1.2 కి.మీ. ప్రధాన సీసీ రోడ్డు నుంచి వీధుల్లోకి వెళ్లే రోడ్లకు కూడా లింక్ కలుపకుండా పనులు ఆగిపోయినా మంత్రికి మాత్రం ఇలాంటివి అగుపడవు. ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు అసలు కనబడవు. వీటి గురించి మంత్రి గాని, ఆయన అనుచరగణం గాని కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. 2 కణేకల్లు రోడ్డును ఫారెస్ట్లో 3 కి.మీలు, పూలచెర్ల రోడ్డు నుండి నల్లంపల్లి సమీపం వరకు 1 కి.మీ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోలయ్య తోట నుంచి క్రాసింగ్ వరకు 2 కి.మీలు అక్కడి నుంచి కణేకల్లు వరకు 8 కి.మీ డబుల్ రోడ్డు చేయించలేని అసమర్థుడు మంత్రి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవి లేని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలే నయమని, పూర్తి స్థాయిలో ఆయా పట్టణాల్లో రోడ్లు వేశారని దుర్గం ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రిగా ఉంటూ తన అభివృద్ధి మాత్రమే చూసుకున్న కాలవ ‘దుర్గం’ అభివృద్దికి ఏమాత్రం చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణలో రోడ్డు మధ్య అమర్చిన వీధి దీపాలు కూడా ఒకరోజు వెలిగితే రెండురోజులు వెలగని పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
విస్తరణ 10 మీటర్లే
ఫోర్ లేన్.. ఫాల్స్ న్యూస్ సంగారెడ్డి - నాందేడ్ రహదారి నాదేండ్ రహదారి అభివృద్ధిపై స్పష్టత నాలుగులేన్ల ప్రకటన అవాస్తవమని తేల్చిన అధికారులు 7 నుంచి 10 మీటర్ల మేర పెంచాలని నిర్ణయం జిల్లాలోని 51 కి.మీ. పనులకు రూ.98.6 కోట్లు మంజూరు నెల రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం సంగారెడ్డి-నాందేడ్ రహదారి... జిల్లా నుంచి ఢిల్లీ, షిరిడీ లాంటి ప్రాంతాలకు వెళ్లే ఏకైక రోడ్డు. అందువల్లే ఈ దారిపై నిత్యం వందల వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దాదాపుగా 141 కిలోమీటర్లు విస్తరించిన ఈ రోడ్డు కేవలం 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మూల మలుపులు, గుంతలు కుడా అధికం కావడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో రోడ్డును విస్తరించాలనే డిమాండ్ తీవ్రమైంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తుండడంతో ప్రజాప్రతినిధులు ఓ అవాస్తవ ప్రకటన చేశారు. నాందేడ్ దారిని నాలుగులేన్లుగా విస్తరిస్తున్నామని, జీవో కూడా జారీ అయ్యిందంటూ ఊదరగొట్టారు. అయితే నేతలు మాటలన్నీ అవాస్తమని అధికారులు తేల్చేశారు. జోగిపేట: జిల్లాలో 89 కిలోమీటర్ల మేర విస్తరించిన నాందేడ్ రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. సంగారెడ్డి- నాందేడ్- అకోల రహదారి పొడవు 141 కిలోమీటర్లు కాగా, వెడల్పు మాత్రం కేవలం 7 మీటర్లు. దీంతో ఈ రోడ్డుపై మూల మలుపులు, గోతులు కూడా అధికం కావడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును విస్తరించాలనే డిమాండ్ అధికమైంది. నేతలు ఎక్కడకూ వెళ్లినా నాందేడ్ రహదారి విస్తరణ అంశంపై నిలదీతలూ ఎక్కువయ్యాయి. మరోవైపు ఎన్నికలు సమీపించడంతో ప్రజాప్రతినిధులు గండం గట్టెక్కేందుకు ఓ అవాస్తవ ప్రకటన చేశారు. కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా, సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించిందని, ఈ రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించేందుకు నిధులు మంజూరైనట్లు అప్పుడుపార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా పలుసార్లు ప్రకటించారు. జిల్లా ప్రజానీకం కూడా ఆనందపడ్డారు. ఇక కదలకుండా షిర్డీ, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్లవచ్చని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అంతా అవాస్తవం సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తారన్న ప్రకటనలు అవాస్తవమని జాతీయ రహదారుల అధికారులు తేల్చేశారు, ప్రస్తుతం ఉన్న 7 మీటర్ల రోడ్డును 10 మీటర్లుగా పెంచుతూ రోడ్డు వేసేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు గల 141 కి.మీ పొడువున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు మెదక్ జిల్లాలో 89 కి.మీ మేర ఉన్న ఈ రోడ్డును 10 మీటర్ల విస్తరించాలని ప్రభుత్వం జీఓలో పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు. ఈపనులు 2013వ సంవత్సరంలోనే మంజూరు చేసినా, టెండర్ల నిర్వహణకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం చూపారన్నారు. అందువల్ల తాజాగా సంగారెడ్డి నుంచి బొడ్మట్పల్లి గ్రామం వరకు గల 51 కి.మీ మేర రోడ్డు విస్తరణకు గాను ప్రభుత్వం రూ.98 కోట్లు మంజూరు చేసిందని ఈ పనులకు సంబంధించి టెండర్లను నెలరోజుల్లో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ రహదారుల(ఎన్హెచ్) డిప్యూటీ ఈఈ శ్రావణ్ ప్రకాశ్ తెలిపారు. ఈ నిధులతోనే అన్నాసాగర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 20 వరకు కల్వర్టుల నిర్మిస్తామన్నారు. ఫోర్లేన్కు సంబంధించి ఎలాంటి మంజూరు లేదని ఆయన స్పష్టం చేశారు. కలగా మారిన నాలుగు లేన్ల విస్తరణ నిత్యం వందలాది లారీలు, కార్లు, ఇతర సర్వీసులతో రద్దీగా ఉండే ఈ రోడ్డును ఫోర్లేన్లుగా విస్తరిస్తారని స్థానికులు భావించారు. వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈ రోడ్డును సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి పరచడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పలు సభల్లో ఫోర్లేన్ రోడ్డు మంజూరైందని ప్రకటించారనీ, అయితే జాతీయ రహదారుల అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని చెబుతున్నారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణకు కృషి చేశా నాందేడ్ అకోలా రహదారి విస్తరణ కోసం తనవంతు కృషి చేశానని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా జోగినాథ్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు దేవేందర్గౌడ్ ద్వారా రోడ్డు విస్తరణ చేపట్టాలన్న లేఖతో అప్పటి కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణను కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డును 10 మీటర్ల మేర పెంచేందుకు నిధులను మంజూరు చేయడం హర్షదాయకమన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement