breaking news
exam complete
-
గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది. సెల్ఫోన్తో పట్టుబడిన అభ్యర్థి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి సెల్ఫోన్తో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విస్ కాలేజిలోని 121701 వెన్యూకోడ్లో హాల్ టికెట్ నంబర్ 121100538 ఉన్న ఒక అభ్యర్ధి ఐఫోన్తో ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్కు తెలపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయ తి్నంచడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్ష కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీ ఫుటేజ్ను సేకరించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు -
ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్ సెట్ పరీక్ష
మడకశిర : పట్టణంలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం అగ్రి ఇంజినీరింగ్ సెట్–2017 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షలకు డిప్లొమో విద్యార్థులకు 95.5శాతం హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 170 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 161 మంది విద్యార్థులు హాజరయ్యారు. 94మంది బాలురు, 67మంది బాలికలు పరీక్ష రాసినట్లు అగ్రి ఇంజనీరింగ్ సెట్ కన్వీనర్ డాక్టర్ సీ రమణ తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం గుంటూరు నుంచి పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ పీ సునీల్కుమార్ పరీక్షలను పరిశీలించారు.