breaking news
ex lover MURDER
-
అలా.. మాజీ లవర్ను చంపించింది!
సాక్షి, థానే: మహారాష్ట్రలో మరో స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ స్వాతి భర్తను హత్య చేయిస్తే.. మహరాష్ట్రలో మాజీ ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రియుడు చేస్తున్న విపరీత ఒత్తిడిని తట్టుకోలేకే ప్రస్తుత ప్రియుడితో.. అతన్ని హత్య చేయించినట్లు నిందితురాలు 45 ఏళ్ల సుమారి యాదవ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సుమారి యాదవ్కు 46 ఏళ్ల రాంజీ శర్మ మధ్య చాలాకాలం పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ కొన్నేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. మూడేళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సుమారీ యాదవ్.. ఈ మధ్య 35 ఏళ్ల జయప్రకాష్ చౌహాన్తో సహజీవనం సాగిస్తోంది. దాదాపు నాలుగు నెలల నుంచి మాజీ ప్రియుడు రాంజీ శర్మ డబ్బుకోసం సుమారిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు, ఇతర ఒత్తిడులు తట్టుకోలేక శర్మను హత్య చేసేందుకు ప్రస్తుత ప్రియుడు చౌహాన్తో కలిసి సుమారి ప్లాన్ వేసింది. రాంజీ శర్మకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉండడంతో.. పార్క్లోనే అతన్ని హత్య చేసేందుకు ఇద్దరూ ప్రణాళిక రూపొందించారు. అనుకున్నట్లుగానే నవంబర్18న శర్మ మార్నింగ్ వాక్నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. చౌహాన్ అత్యంత వేగంగా కారుతో అతన్ని ఢీకొట్టి హత్య చేశాడు. ఈ ఘటన తరువాత కారును శుభ్రం చేసి.. యాక్సిండెంట్ అయినట్లు అందరినీ నమ్మించాడు. తాను కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు నటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కారును సర్వీసింగ్ చేయించాడు. ఇంత వరకూ బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో.. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులకు విస్మయం కలిగించే ఈ విషయం బయట పడింది. వెంటనే పోలీసులు సుమారి యాదవ్, చౌహాన్, శర్మల ఫొన్ రికార్డును పరిశీలించారు. విషయం అర్థమైన వెంటనే చౌహాన్, సుమారి యాదవ్లను అదుపులోకి తీసుకుని విచానించడంతో.. విషయం మొత్తం బయటపడింది. ఇదిలావుండగా సుమారి యాదవ్కు మొత్తం ఐదుగురు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
మాజీ ప్రియుడిని చంపిన చోట భర్తతో..!
గతవారం ముందిల్ మహిల్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. బ్రిటన్కు చెందిన లేబర్ పార్టీ యువనేత వరిందర్ సింగ్ను ఆమె పెళ్లాడింది. ఆనందంగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. భర్తతో కలిసి పెళ్లిఫొటోలు తీసుకునేందుకు లండన్లోని ఓ ప్రదేశానికి వెళ్లింది. అక్కడ భర్తతో తొలి ఫొటో దిగి.. దానిని ఫేస్బుక్లో పెట్టింది. కానీ, ముందిల్ పెట్టిన ఫొటోపై గగన్ దీప్ సింగ్ కుటుంబసభ్యులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది అమానుషం.. జుగుప్సకరమని మండిపడుతున్నారు. వారి ఆక్రోశంలో అర్థముంది. ముందిల్ దంపతులు ఫొటో దిగిన ప్రదేశానికి సమీపంలోనే సరిగ్గా ఐదేళ్ల కిందట టీవీ ఉద్యోగి అయిన గగన్ దీప్ సింగ్ను సజీవంగా తగులబెట్టారు. అప్పట్లో మెడికల్ విద్యార్ధినిగా ఉన్న ముందిల్ ప్రేమ పేరిట గగన్ను వంచించి ఆ తర్వాత అతన్ని చంపించింది. ఆగ్నేయ లండన్లోని గ్రీన్విచ్ పార్కులో ఉంచిన కారులో గగన్ను కట్టిపడేసి.. కారును తగులబెట్టేశారు. దీంతో గగన్ సజీవ దహనమయ్యాడు. ఈ కుట్రలో భాగం పంచుకున్నందుకు ముందిల్కు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, మూడేళ్ల జైలుశిక్ష తర్వాత విడుదలైన ముందిల్ ఇటీవల వరిందర్ సింగ్ను పెళ్లి చేసుకుంది. అయితే, వారి పెళ్లి వేదికకు 25 మైళ్ల దూరంలోని గ్రీన్విచ్ పార్కులో ఈ జంట తొలి ఫొటో దిగడంపై బాధితుడు గగన్ దీప్ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందిల్ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని తమకు నమ్యశక్యం కావడం లేదని గగన్ తల్లి తేజిందర్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ప్రదేశంలోనే ఆమె తన కొత్త జీవితాన్ని నిర్మించాలనుకోవడం దారుణమని పేర్కొంది. గగన్ సోదరి అమన్ దీప్ (23) ఈ ఫొటోను తీవ్రంగా తప్పుబట్టింది. ముందిల్ తీరు జుగుప్సకరంగా, అమానవీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.