-
ముంచుకొస్తున్న మిచాంగ్
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/సాక్షి, అమలాపురం/భీమవరం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రేపల్లె/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు తుపాను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీరం దాటితే తుపాను బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఆదివారానికి వచ్చే అవకాశముంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, 5న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఎస్పీఎస్సార్ నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా∙భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 6న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. తుపాను నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. తుపాను సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు. తిరుపతి జిల్లాలో వర్షాలు.. కోనసీమలో బలమైన గాలులు.. మిచాంగ్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమ్తతం చేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో కలిసే మొగల ద్వారా నీరు డ్రెయిన్లలోకి వస్తోంది. ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యాన్ని మెరక ప్రాంతంలో భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు. లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో సముద్రం అల్లకల్లోలం తుపాను తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరులలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జన జీవనం దాదాపు స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ముంపునకు గురయ్యాయి. మరో 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు మధ్య తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు జారీచేశారు. జిల్లా అంతటా ఉదయం నుంచి ముసురుతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. 144 రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ)/హైదరాబాద్: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలు, ట్రాక్ల పటిష్టత, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ముందుజాగ్రత్తగా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా నడిచే 144 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్్కలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మరికొన్ని రైళ్లు రద్దు తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. -
దిశ కేసు: అలాంటి ఆపద మనకొస్తే?
నెలల పసికందు దగ్గర్నుంచి వయసుపై బడిన వృద్ధుల వరకు కామాంధుల చేతిలో బలవుతున్న మహిళలు ఎందరో. గణాంకాల ప్రకారం మన దేశంలో నిత్యం ప్రతీ గంటకు నలుగురు చొప్పున అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా దిశ హత్యోదంతంతో ఆడపిల్ల అడుగుతీసి బయటికి వెళ్లాలంటేనేవెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకే అలాంటి ఆపద పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? వాచ్ దిస్ స్టోరి.. -
విపత్తు వేళ...భరోసా!
వర్ష విపత్తులు ఎదుర్కొనేందుకు అధికారుల కసరత్తు మంత్రి కేటీఆర్ చొరవతో ఎమర్జెన్సీ కంట్రోల్ రూం అన్ని ముఖ్య శాఖలతో సమన్వయం ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా ఏర్పాట్లు వర్షాకాలం వస్తుందంటేనే నగరవాసుల్లో దడ. చినుకు పడితే నరకమే. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, రోడ్లు నదులను తలపించడం మామూలే. వీటికి తోడు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు. రోజుల తరబడి విద్యుత్ సమస్యలు కూడా. వీటికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ‘ఎమర్జెన్సీ కంట్రోల్ రూం’ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఫోన్ నెంబర్లను గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ ముఖ్య శాఖలను సమన్వయపరిచేలా రూపొందించారు. వర్షం కారణంగా నగరం నలుమూలలా ఎక్కడ..ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగేలా చర్యలు చేపడుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: వర్షాకాల విపత్తుల్ని ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక ఎమర్జెన్సీ కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేశారు. గురువారం మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు దీన్ని ప్రారంభించారు. ప్రజలనుంచి అందే ఫిర్యాదుల్ని ఈ కంట్రోల్ రూమ్లో ఉండే వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పరిష్కరిస్తారు. వర్షం సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు ఈ ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలోని నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంట్రోల్ రూం ఇలా పనిచేస్తుంది... వర్షాకాలంలో భారీ వర్షసూచనల వంటివి వాతావరణ శాఖ నుంచి తెలియగానే వివిధ విభాగాలనుంచి ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ కంట్రోల్రూమ్లో అందుబాటులో ఉంటారు. {పజలు తమ సమస్యలను విపత్తు సమయంలో 100 నెంబర్కు లేదా 040-21 11 11 11 నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఆ నెంబర్ల నుంచి ఫిర్యాదు ఎమర్జెన్సీ కంట్రోల్రూమ్కు చేరుతుంది.ఫిర్యాదు అందగానే.. తమ వద్ద ఉన్న రిసోర్స్ మ్యాపింగ్ ద్వారా సమీపంలోని ఎమర్జెన్సీ బృందాలు.. వారి వద్ద ఉన్న ఉపకరణాలు తదితరమైనవి కంట్రోల్ రూమ్లోని అధికారులు తెలుసుకుంటారు. ఫిర్యాదు పరిష్కారానికి ఎవరు ఏంచేయా లో.. సంబంధిత విభాగం అధికారి క్షేత్రస్థాయిలోని తమ వారికి ఆదేశాలిస్తారు. వారు వెంటనే రంగంలోకిదిగి చర్యలు చేపడతారు.రోడ్లపై నీరు నిలిచిపోతే నీటిని తోడే మోటర్లను పంపుతారు. చెట్లు కూలితే వాటిని తొలగించేందుకు అవసరమైన ఉపకరణాలతో కూడిన బృందాలను పంపుతారు. ఇలా.. ఏ విభాగం నుంచి ఏమేం అవసరమో, ఎవరివద్ద ఏమేం ఉన్నాయో గుర్తించి త్వరితంగా చర్యలు చేపడతారు. అనంతరం సమస్య పరిష్కారమైందీ లేనిదీ కంట్రోల్ రూమ్ నుంచి తెలుసుకుంటారు. ఏవైనా ఆటంకాలు ఎదురైతే అవసరమైన అదనపు సిబ్బంది, సామాగ్రి పంపించే ఏర్పాట్లు చేస్తారు. దీంతోపాటు త్వరలోనే ఎన్ఆర్ఎస్సీ, జీహెచ్ఎంసీ కలిసి సంయుక్తంగా మొబైల్యాప్ను అందుబాటులోకి తేనున్నాయి. సమస్యను ఫొటో తీసి( చెట్లు కూలినా, నీళ్లు రోడ్లను ముంచెత్తినా.. శిథిల భవనాలు కూలినా.. ఇతరత్రా) సదరు ఫొటోను సెల్ఫోన్లో తీసి యాప్కు అప్లోడ్ చేస్తే కంట్రోల్రూమ్లోని వారికి అది ఏప్రాంతం నుంచి వచ్చింది.. ఫోన్ చేసినవారి నెంబర్.. సదరు సమస్య పరిష్కారానికి సమీపంలో ఉన్న సిబ్బంది, యంత్రాలు.. తదితరమైవన్నీ తెలుస్తాయి. జియోట్యాగింగ్తో వీటిని తెలుసుకొని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తుగా అందే హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. 100 నెంబర్, 040-21 11 11 11 యధావిధి సేవలు అందిస్తాయని, విపత్తుల సమయంలో మాత్రం సహాయకచర్యలకు, సమస్యలపరిష్కారానికి ప్రజలు విచక్షణతో ఫోన్ చేయాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెంబర్లు కంట్రోల్రూమ్కు అనుసంధానమై పనిచేస్తాయి. అందిన ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ నుంచి 105 మాన్సూన్ ప్రత్యేకబృందాలు పనిచేస్తాయి. వివిధ షిప్టుల్లో ఇవి పనిచేస్తాయి. వీటి తోపాటు జలమండలికి చెందిన 29 ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తాయి. 100కు ఫిర్యాదు చేసిన మంత్రి ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ప్రారంభించిన అనంతరం...కొత్త వ్యవస్థ పనితీరు పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ 100 నెంబర్కు ఫోన్చేశారు. తాను కవాడిగూడ నుంచి మాట్లాడుతున్నానని, ఇక్కడ చెట్టు కూలిందని తెలిపారు. జీహెచ్ఎంసీకి విషయం తెలియజేసి పరిష్కరిస్తామని అవతలి నుంచి సమాధానం రావడంతో మంత్రి సంతృప్తి చెందారు. చివరగా, తాను కేటీఆర్ను మాట్లాడుతున్నానని అసలు విషయం వివరించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement