breaking news
eleshwaram
-
‘సీఎం మాటలు అబద్దాలుగా మిగిలాయి’
విజయవాడ: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. నారాయణరెడ్డి హత్యకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షనిజాన్ని అరికడతామన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దాలుగా మిగిలిపోయాయనని విమర్శించారు. రాజకీయ హత్యలపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. హత్యారాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, రాజకీయ హత్యలను ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దురు మృతి
తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.