-
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగాలి టెలికం ఉత్పత్తులపైనా దృష్టి పెట్టాలి అప్పుడే ఆయా రంగాల్లో దిగుమతుల భారం దిగొస్తుంది... టెలికం 2013 సదస్సులో ప్రధాని మన్మోహన్వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రానిక్స్, టెలికం రంగ ఉత్పత్తుల దిగుమతుల విలువ ఏకంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను మించిపోగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీ: ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వీటి ఉత్పత్తి మరింత పెంచే విధంగా తయారీ రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా టెలికం 2013 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 2020 నాటికి భారత్ 300 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చన్న అంచనాలు ఉన్నట్లు, ఇవి పెట్రోలియం ఉత్పత్తులను మించిపోనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇంత భారీస్థాయిలో దిగుమతులకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, 2012 జాతీయ టెలికం విధానం.... టెలికం రంగంలోని అనేక అంశాలపై స్పష్టత తీసుకువచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, బోధనా పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా విద్యార్థులకు 3జీ కనెక్టివిటీ ఉన్న ట్యాబ్లెట్ పీసీలను అందించడంపై టెలికం కమిషన్ కృషి చేస్తోందని ప్రధాని వివరించారు. టెలికం సమస్యల పరిష్కారంపై దృష్టి.. టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోందని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. పరిశ్రమకు సానుకూలమయ్యే విధంగా నియంత్రణపరమైన సంస్కరణలు చేసిన నేపథ్యంలో స్పెక్ట్రం వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, పరిశ్రమ వర్గాల్లో విభేదాలు కూడా టెలికం రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చొరవ చూపే ముందు .. పరిశ్రమ వర్గాల మధ్య ఐకమత్యం అవసరమని ఆయన చెప్పారు. 3 వారాల్లో స్పెక్ట్రం వేలానికి దరఖాస్తుల ఆహ్వానం... 2జీ టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి 15-20 రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారూఖీ తెలిపారు. 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో 400 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్జలో 45 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే.. 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు రిజర్వ్ ధరను సిఫార్సు చేయాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి టెలికం విభాగం ఈ వారంలో లేఖ రాయనున్నట్లు ఫారూఖీ వివరించారు. జనవరిలో నిర్వహించబోయే మూడో విడత స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 11,000 కోట్ల నిధులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement