breaking news
eamcet second phase counselling
-
174 కాలేజీల్లో అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్!
సర్కారుతో చర్చించి నిర్ణయిస్తామన్న టీ-విద్యా మండలి కౌన్సెలింగ్ నిర్వహణ మాదేనన్న ఏపీ మండలి సాక్షి, హైదరాబాద్: 174 కాలేజీలకు సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం శనివారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్పై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా, సంబంధిత అథారిటీనే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు తాజాగా సవరణ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్ను గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యంతో నియమించిన ప్రవేశాల కమిటీ నేతృత్వంలోనే చేపట్టే అవకాశముంది. అదే కమిటీకి ప్రవేశాలను చే పట్టే బాధ్యతను అప్పగించామని ఏపీ ఉన్నత విద్యా మండలి పేర్కొంటుండగా, సుప్రీం ఆదేశాల ప్రకారం ‘సంబంధిత అథారిటీ’ అన్నందున తామే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేర్కొంటోంది. శనివారం ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాల షెడ్యూలును జారీ చేస్తామని టీ-విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. 14వ తేదీ నాటికి ప్రవేశాలు చేపట్టి, 15 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు సుప్రీం తాజా సవరణ ఉత్తర్వుల్లో సంబంధిత అథారిటీ అని పేర్కొనడమేకాకుండా గతంలో ప్రవేశపరీక్ష నిర్వహించిన స్టేట్ అని కూడా పేర్కొందని, విభజన చట్టంలోనూ ప్రవేశాల నిర్వహణ బాధ్యత తమకే అప్పగించినట్లు ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. అయితే గతంలో మాదిరిగానే ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, కోకన్వీనర్లకే బాధ్యత అప్పగించామని చెప్పారు. పాత విధానంలోనే కౌన్సెలింగ్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతించిన సుప్రీంకోర్టు... బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కానీ బుధవారం కోర్టు ఉత్తర్వుల కాపీలో కౌన్సెలింగ్కు కళాశాలలే దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రచురితమైంది. దీనిని సవరిస్తూ సంబంధిత ఆధీకృత సంస్థ (ఉన్నత విద్యా మండలి) కౌన్సెలింగ్ను నిర్వహించాలని పేర్కొంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో విడతకు నో
-
రెండో విడతకు నో
* ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ * ఏపీ ఉన్నత విద్యామండలి తీరుపై ఆగ్రహం * గడువు పొడిగింపు గతంలోనే ఎందుకు కోరలేదని ప్రశ్న * భారీగా సీట్లు మిగిలిపోయాయని అభ్యర్థించిన మండలి * సీట్లు మిగిలినా అనుమతివ్వబోమన్న కోర్టు.. పిటిషన్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అడ్మిషన్ల కోసం ఇంతకుముందే గడువు పొడిగించామని, మళ్లీ పెంచాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయన్న ఏపీ ఉన్నత విద్యామండలి వాదనను తప్పుబట్టింది. ప్రతిసారీ గడువు పొడిగించలేమని, సీట్లు మిగలడానికి మండలి తీరే కారణమని పేర్కొంటూ.. పిటిషన్ను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రెండో విడత వెబ్ కౌన్సెలింగ్కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుల్ల చంద్రపంత్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ఏపీ మండలి తరఫున న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ... ‘‘ఏఐసీటీఈ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జూలై 31లోపు అడ్మిషన్లు పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులు ప్రారంభించాలి. మిగతా సీట్ల భర్తీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చిన మీదట.. మీరు ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. దాని ప్రకారం మేం కౌన్సెలింగ్ నిర్వహించాం. లక్షా 17 వేల సీట్లు భర్తీకాగా.. ఇంకా 65 వేల సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీ కోసం కౌన్సెలింగ్కు అదనపు గడువు ఇవ్వాలని కోరుతున్నాం..’’ అని విన్నవించారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ... ‘‘ఇంతకుముందు మీరు కోరిన తేదీల ప్రకారమే గడువు పొడిగించాం. కానీ అదనపు గడువు కావాలని మీరు ఆరోజు ప్రస్తావించలేదు. ఒకసారి అవకాశం ఇస్తే మళ్లీ మళ్లీ వస్తారా? ఈ రోజు గడువు పొడిగిస్తే మీరు మరో విడత కౌన్సెలింగ్ అంటారు.. ప్రతిసారీ ఇలా గడువు పొడిగించలేం. సీట్లు మిగిలిపోతే మిగలనివ్వండి.. అందుకు మీరే కారణం కదా..’’ అని పేర్కొన్నారు. దీనికి విశ్వనాథన్ బదులిస్తూ.. ‘‘ఆ రోజున కౌన్సెలింగ్ ముగింపు తేదీ ఆగస్టు 31 అని ఇచ్చాం. అయితే తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు మరో 15 రోజుల గడువు ఉంటుంది. ఆ మేరకు ఏఐసీటీఈ నిర్దేశిత షెడ్యూలులో కూడా ఉంది. మేం యాజమాన్యాల తరఫున గానీ ఎవరి తరఫునగానీ మాట్లాడడం లేదు. అడ్మిషన్లు నిర్వహించాల్సిన అథారిటీగా కోర్టును ఆశ్రయించాం..’’ అని పేర్కొన్నారు. కానీ దీనిని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘మీరు సూచించిన తేదీల ప్రకారమే అనుమతించాం. మళ్లీ గడువు కోరడం సమంజసం కాదు. సెప్టెంబరు 1నే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 11వ తేదీ. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకెప్పుడు చేస్తారు..?’’ అని ప్రశ్నించారు. అయితే.. పంజాబ్లోని కొన్ని కళాశాలల్లో కూడా సీట్లు మిగిలిపోయాయని, సీబీఎస్ఈ ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా 6 కళాశాలల్లో 180 సీట్లు మిగిలాయని మరో న్యాయవాది కోర్టు దృష్టికి తేగా... ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో 65 వేల సీట్లు మిగిలిపోయాయని గుర్తుంచుకోవాల’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తే ఏఐసీటీఈని సంప్రదించి 15 రోజుల పాటు గడువు కోరుతామని ఏపీ ఉన్నత విద్యామండలి న్యాయవాది అభ్యర్థించగా... న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీరు ఏఐసీటీఈకి వెళ్లినా అనుమతివ్వాల్సింది కోర్టే కదా..’ అని స్పష్టం చేశారు. ‘ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మంచి రోజు కోసం ఎదురుచూడండి..’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను తోసిపుచ్చారు.