breaking news
E set exam
-
తెలంగాణలో ఆగస్టు నెలంతా ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అవి నెలంతా కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ముందుగా మంగళవారం (నేడు) ఈ–సెట్ జరగనుంది. దీన్ని రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 24 వేల మందికిపైగా రాయనున్నారు. దీనికోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 4 నుంచి ఎంసెట్ను నిర్వహిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారికి పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తారు. 4, 5, 6వ తేదీల్లో ఇంజనీరింగ్కు, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం తెలంగాణలో 82 కేంద్రాలు, ఏపీలో 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలను కూడా రెండు విడతలుగా నిర్వహిస్తారు. తొలి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఇంజనీరింగ్ 1,64,678 మంది, మెడికల్ 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు బిట్స్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. మరోవైపు ఈ నెల 4వ తేదీన డిగ్రీ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా జాగ్రత్తల మధ్య పరీక్షలు... కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు థర్డ్వేవ్కు సంబంధించి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరిగే ప్రవేశ పరీక్షలకు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. శానిటైజర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు జ్వరం చూస్తారని, విద్యార్థులు మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ ఉంటే వారి విన్నపం మేరకు తదుపరి.. పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
25 నుంచి వెబ్సైట్లో ఈ–సెట్ హాల్టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న నిర్వహించనున్న ఈసెట్–20 పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను 25వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సెట్ కన్వీనర్ ఎం.మంజూర్హుస్సేన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను 56 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 52 సెంటర్లు, ఏపీలో 4 సెంటర్లలో ఉన్నాయని వెల్లడించారు. 21, 22న వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 22న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్లో సీటు అలాట్ అయినా చేరని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని ప్రకటించింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా అనర్హులుగా పరిగణిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. -
పాపిరెడ్డిని అరెస్ట్ చేయాలి: కొనగల
ఈసెట్ పరీక్ష ఆలస్యంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఈసెట్ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని అరెస్టు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించిన ఈసెట్ పరీక్షపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు.