breaking news
e-mail policy
-
రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-మెయిల్’
♦ పాలసీని విడుదల చేసిన ఐటీ శాఖ ♦అధికారులు ఇకపై ప్రైవేటు ♦ ఈ మెయిల్స్ వాడకూడదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఈ-మెయిల్ పాలసీని ఐటీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వపరంగా ఇతర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేటప్పుడు, అధికారుల మధ్య సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రైవేటు ఈ-మెయిల్ను వినియోగించకుండా ప్రభుత్వ ఈ-మెయిల్నే వినియోగించేలా ఈ విధానాన్ని తెచ్చింది. ప్రైవేటు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపడం వల్ల భద్రతా సమస్యలు ఉండటంతో పూర్తి రక్షణ కలిగిన ప్రభుత్వ ఈ-మెయిల్ను అనుసరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం ఈ విధానాన్ని తెచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాక పోవడంతో అధికారులు, వివిధ శాఖలు జీమెయిల్ వంటి ప్రైవేటు ఈ-మెయిల్ను వినియోగిస్తున్నారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాల్లో, సంప్రదింపుల్లో ప్రైవేటు ఈ-మెయిల్ను వినియోగించడానికి వీల్లేదు. దీని నిర్వహణకు నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది. శాఖలు, అధికారుల హోదాను బట్టి ఎన్ఐసీ యూజర్ ఐడీని క్రియేట్ చేసి ఇస్తుంది. అధికారులు, మంత్రులకు అధికారిక ఈ-మెయిల్తోపాటు కావాలనుకుంటే వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్లను ఇస్తారు. అయితే ప్రభుత్వ, అధికారిక కార్యకలాపాలు, సంప్రదింపులు, ఫైల్ ప్రొసీజర్ అంతా అధికారిక మెయిల్ ద్వారా జరపాలి. డిజిటల్ సంతకంతో కూడిన ఈ-మెయిల్ను ఇస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలి. ఇందులో వన్టైమ్ పాస్వర్డ్ విధానం ఉంటుంది. యూజర్ వినతిని బట్టి ఈ-మెయిల్ను క్రియేట్ చేసి ఇస్తారు. హోదా వింగ్ శాఖను పేర్కొంటూ ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో క్రియేట్ చేసి ఇస్తారు. ఎవరైనా అధికారికి ఇవ్వాలంటే ముందు ఠట్ఛటజీఛీః్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ పేరుతో ఇస్తారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు, పాస్వర్డ్ పాలసీ వివరాలు ఠీఠీఠీ.జ్టీ. ్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ/్ఛఝ్చజీఞౌజీఛిడ/జఠజీఛ్ఛీజ్ఛీట వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
ఈ-మెయిల్ పాలసీకి ఆమోదం
హైదరాబాద్:ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-మెయిల్స్ ద్వారానే జరుగనున్నాయి. ఈమేరకు శనివారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. ఇప్పటివరకూ లేఖల ద్వారా రాత పూర్వకంగా జరిగిన ప్రభుత్వ నిర్ణయాలు.. ఈ-మెయిల్ ద్వారా చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించే అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ-మెయిల్స్ ద్వారా చేపట్టాడానికి కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. కాగా, గృహ నిర్మాణాల అవినీతిపై సభాసంఘం వేయాలని కేబినెట్ నిర్ణయించింది. సగంలో నిలిచిపోయిన గృహాలను చేపట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ కార్డులు లింక్ చేయాలని.. ఒకవేళ ఆధార్ లేకపోతే ప్రత్యామ్నాయ కార్డులను పరిగణలోనికి తీసుకోవాలని నిర్ణయించారు. గృహ నిర్మాణాల అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కేబినెట్ నిర్ణయింది. అందులో సుమారు రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది. కాగా, కేబినెట్ రాజీవ్ స్వగృహ ఇళ్లపై నిర్ణయాన్ని మాత్రం కేబినెట్ వాయిదా వేసింది.