Dubai company
-
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
వికాస్ లైఫ్కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
దోపిడీ సొమ్ముకు రాచబాట!
సాక్షి, అమరావతి :ఊరూ పేరు లేని ఓ అనామక కంపెనీ..లక్ష రూపాయల మూలధనంతో మొదలైన సంస్థ. ఎలాంటి ట్రాక్ రికార్డూ లేదు..అలాంటి కంపెనీ 70 వేల కోట్లతో ఓ భారీ రిఫైనరీ పెట్టడానికి ముందుకొచ్చింది.దానికి 5,000 ఎకరాలు కేటాయించబోతున్నారు..అంత పెట్టుబడి ఎక్కడిదంటే.. దుబాయ్ కంపెనీ సర్దుబాటు చేస్తోందని చెబుతోంది..అది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ.. రిఫైనరీ పెట్టడమేమిటి? అయినా దానికంత సామర్థ్యం లేదు.. అలాంటి కంపెనీకి ఏం చూసి దుబాయ్ కంపెనీ సొమ్ము సర్దుబాటు చేస్తుంది?అసలు దుబాయ్ కంపెనీకైనా అంత సామర్థ్యం ఉందా మరి సర్కారు పెద్దలెందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు..?ఎందుకు హడావిడిగా ఎంఓయూ కుదుర్చుకుని భూములు సిద్ధం చేస్తున్నారు?ఇదంతా ఏదో మాయలా కనిపించడంలేదూ..అమరావతిలో కాజేసిన అవినీతి సొమ్ము హవాలా మార్గంలో దుబాయ్కి పంపించి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేందుకు సర్కారు పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారని, ఆ పేరుతో మరో ఐదువేల ఎకరాలకు టెండర్ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరో భారీ కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. నాలుగున్నరేళ్లపాటు లక్షల కోట్లు వెనకేసిన సర్కారు పెద్దలు హవాలా మార్గంలో దుబాయ్ నుంచి ఓ 70 వేల కోట్లు వెనక్కి తెచ్చుకునేందుకు ‘రిఫైనరీ’ నాటకానికి తెరలేపారు. దాంతోపాటు అత్యంత విలువైన ప్రాంతంలో ఐదు వేల ఎకరాల భూమిని కాజేయడానికి స్కెచ్ వేశారు. ఎవరికీ పెద్దగా తెలియని, చిన్నచిన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసుకునే సంస్థలో దుబాయ్కి చెందిన అరబ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఒప్పందం ఎన్నో అనుమానాలకు ఆస్కారం కల్గిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో భారీ రిఫైనరీ ఏర్పాటు పేరుతో జరుగుతున్న తంతు ఇది.. బందరు వేదికగా.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని (బందరు) ప్రతిపాదిత ఓడరేవుకు దగ్గర్లో ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలో ఐదువేల ఎకరాల భూములను నొక్కేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పథక రచన చేశారు. ఇందులో భాగంగా పెద్దగా ప్రాచుర్యంలేని.. చిన్నచిన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసుకునే ఐరా ఇన్ఫ్రా వెంచర్స్ భారీ రిఫైనరీ కర్మాగారాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ సంస్థలో దుబాయ్కి చెందిన అరబ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ రూ. 70వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రిఫైనరీ రంగంలో ఏమాత్రం అనుభవంలేని ఐరా ఇన్ఫ్రాతో ఈ అరబ్ సంస్థ ఒప్పందం చేసుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దురుద్దేశాలు బట్టబయలయ్యాయి. అంతేకాదు.. ఈ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తే అనేకానేక అనుమానాలకు ఆస్కారం కలిగించేలా ఉంది. రూ.వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో రోజుకు 4,00,000 బ్యారెల్స్ సామర్థ్యం గల రిఫైనరీ ఏర్పాటుచేసే విధంగా ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ)తో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐరా ఇన్ఫ్రా వెంచర్స్ జూలై 31, 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రిఫైనరీ వస్తే 1,50,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, అందుకోసం 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ రిఫైనరీ కోసం ఐరా గ్రూపు, ఐకాన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనే సంస్థతో కలిసి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను దుబాయ్కు చెందిన అరబ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథార్టీ (ఏఐడీఏ) సమకూర్చనున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, అందులో పేర్కొన్న ఈ మూడు సంస్థలను పరిశీలిస్తే రిఫైనరీ పేరుతో జరుగుతున్న కుంభకోణాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మూడూ అనామక కంపెనీలే.. కాగా, 2014లో ఐరా ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ను జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56, హైదరాబాద్ చిరునామాతో ఏర్పాటుచేశారు. ముగ్గురు డైరెక్టరులు కలిసి లక్ష రూపాయల మూలధనంతో దీనిని స్థాపించారు. కానీ, ఈ కంపెనీ ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వార్షిక సర్వసభ్య సమావేశం జరిగిన దాఖలాల్లేవు.. బ్యాలెన్స్ షీటు వివరాలు లేవు.. ఆర్వోసీ దగ్గరా వివరాల్లేవు.. అసలు ఈ ఐరా గ్రూపు ఇంతవరకు ఎటువంటి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును సైతం చేపట్టలేదు. ఇలాంటి చరిత్ర ఉన్న ఐరా, రిఫైనరీ రంగంలో ఇంత భారీ ప్రాజెక్టును ఏ విధంగా చేపడుతోందో అర్థం కావడంలేదని పరిశ్రమ శాఖ అధికార వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఐరా గ్రూపునకు రియల్ ఎస్టేట్, మైనింగ్, ఇన్ఫ్రా, పారిశ్రామిక పార్కులు, ఎనర్జీ రంగాల్లో అనుభవం ఉన్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారని.. కనీసం ఈ సంస్థకు తమ అసోసియేషన్లో కూడా సభ్యత్వంలేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (‘క్రెడాయ్) అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, ఒప్పందంలో పేర్కొన్న మరో కంపెనీ ఐకాన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీకి సంబంధించి ఆర్వోసీలోగానీ, బయటగానీ ఎక్కడా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. మరి ఇలా ఊరూ.. పేరు లేని సంస్థతో ఇంత భారీ ప్రాజెక్టుకు ఏర్పాటుచేయడానికి ఎస్పీవి (స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటుచేస్తా అనగానే ఈడీబీ (ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు) ఎలా ఒప్పందం కుదుర్చుకుందో అర్థంకావడంలేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు నివ్వెరపోతున్నారు. ఏఐడీఏ కంపెనీకి అంత సీన్ ఉందా!? భారీ రిఫైనరీ ప్రాజెక్టుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను ఐరా ఇన్ఫ్రా వెంచర్స్కు సమకూర్చేందుకు ముందుకొచ్చిన దుబాయ్కు చెందిన ఏఐడీఏ కంపెనీ పరిస్థితి అయితే మరింత ఘోరం. ఇంత భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీ ఏఐడీఏ వెబ్సైట్ను ‘సాక్షి’ పరిశీలిస్తే ‘అండర్ రివిజన్’ అన్న మెసేజ్ దర్శనమిస్తోంది. సాధారణంగా ఏదైనా సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు పంపితే ఆ సంస్థ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే ఎంవోయూ కుదుర్చుకుంటారు. పైస్థాయి నుంచి ఒత్తిడి ఉండటంతో పూర్తి వివరాలు పరిశీలించలేదని, ఇంకా ఈ సంస్థ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించలేదని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్ ఇవ్వకపోయినా త్వరితగతిన భూ కేటాయింపులు చేయాలంటూ పైనుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందంటూ అధికారులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే.. హవాలా మార్గంలో ఇక్కడ నుంచి విదేశాలకు తరలించిన సొమ్మును దుబాయి ఇన్వెస్ట్మెంట్ కంపెనీల పేరుతో డొల్ల కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వెనక్కి తీసుకువస్తున్నట్లు అర్థమవుతోందని పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు స్పష్టంచేస్తున్నారు. ఈ ఏడాది జూలై 31న ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు, ఐరా ఇన్ఫ్రా వెంచర్స్కు మధ్య జరిగిన ఎంవోయూ -
డీమెర్జర్ దిశగా ఎమ్మార్ ఎంజీఎఫ్
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ నుంచి దుబాయ్ సంస్థ వైదొలగనున్నట్లు సమాచారం. భవిష్యత్ వృద్ధి, విస్తరణ నిమిత్తం డీమెర్జర్ స్కీమ్ ద్వారా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నామని ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ బీఎస్ఈకి నివేదించింది. మరోవైపు ఈ జేవీ డీమెర్జర్ కోసం చర్యలు తీసుకోనున్నామని ఎమ్మార్ ప్రోపర్టీస్ కూడా దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్కు నివేదించింది. ప్రస్తుతమున్న ప్రాజెక్ట్లు, భూములు ఈ రెండు కంపెనీల మధ్య పంపకం జరుగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాలపై ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. దుబాయ్కు చెందిన రియల్టీ సంస్థ ఎమ్మార్ ప్రోపర్టీస్, భారత్కు చెందిన ఎంజీఎఫ్ గ్రూప్లు పదకొండేళ్ల క్రితం ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ పేరుతో ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో ఈ రెండు కంపెనీలకు చెరో 49% వాటా ఉండగా, మిగిలింది ఆర్థిక సంస్థల వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తై బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎమ్మార్ ప్రోపర్టీస్ 2005లో భారత రియల్టీలోని ఈ జేవీతో ప్రవేశించింది. -
చేతులెత్తేసిన దుబాయ్ సంస్థ
*ఏపీకి రూ.300 కోట్లకు గండి *ఎర్రచందనం టెండరును వదులుకున్న డైమండ్ స్టార్ హైదరాబాద్: ఎర్రచందనం కొనుగోలు టెండరు దక్కించుకున్న దుబాయ్ సంస్థ డైమండ్ స్టార్ చేతులెత్తేసింది. దీంతో ఎర్రచందనం ఈ-టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం చేతికొచ్చినట్లేననుకున్న రూ.300 కోట్ల రాబడికి గండిపడింది. మొదటి విడత ఈ వేలంలో పెట్టిన 4,169 టన్నుల్లో 2,694 టన్నులకు మాత్రమే టెండర్లు ఖరారు కావడం, ఇందులో 569.99 టన్నుల టెండరు కైవసం చేసుకున్న దుబాయ్ సంస్థ డైమండ్ స్టార్ డబ్బు చెల్లించకుండా ముఖం చాటేయడం ప్రభుత్వానికి నిరాశ కలిగించింది. కాగా ఈ నెలలోనే రెండో విడత ఈ-వేలం నోటిఫికేషన్ జారీచేస్తామని రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు. -
స్మార్ట్ సిటీ
⇒ నగర శివార్లలో ఏర్పాటుకు సన్నాహాలు ⇒ ఐటీ కంపెనీలు సహా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులు ⇒ సర్వ హంగులతో నిర్మించేందుకు ముందుకొచ్చిన దుబాయ్ సంస్థ ⇒ 300 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖత ⇒ త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో అందమైన, అధునాతన నగర (స్మార్ట్ సిటీ) నిర్మాణానికి దుబాయ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల ఆ దేశ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో త్వరలోనే ‘స్మార్ట్సిటీ’ కార్యరూపం దాల్చే అవకాశముంది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) పరిధిలో ఈ సిటీని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర సర్కారు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సకల హంగులతో నిర్మించే స్మార్ట్ సిటీలో ఐటీ కంపెనీలు సహా వాణిజ్య, నివాస సముదాయాలుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడమేకాకుండా.. అధునాతన జీవనశైలికి అనుగుణంగా ఈ సిటీలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు కొన్నాళ్ల క్రితం దుబాయ్లో పర్యటనలో భాగంగా అక్కడి ‘స్మార్ట్ సిటీ’ని సందర్శించారు. ఈ నిర్మాణ శైలిని చూసి ముచ్చటపడ్డ మంత్రి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రతినిధి బృందం నగర శివార్లలో స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఆసక్తి చూపింది. ఈ క్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) ఐటీఐఆర్ పరిధిలోని కోహెడ, రావిర్యాల, శంషాబాద్ ప్రాంతాల్లోని భూములను చూపింది. ఈ మూడు స్థలాల పట్ల మొగ్గు చూపిన స్మార్ట్సిటీ నిర్మాణ సంస్థ.. కనిష్టంగా వేయి ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. అయితే, భారీ విస్తీర్ణంలో భూమి కావాలని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేయడంతో డైల మాలో పడ్డ టీఐఐసీ 300 ఎకరాల మేర తక్షణమే కేటాయిస్తామని సెలవిచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పని స్మార్ట్ సిటీ ప్రతినిధులు.. యాజమాన్యంతో సంప్రదించి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ కృతనిశ్చయంతో ఉండడంతోపాటు అధునిక నగరానికి ప్రతీకగా ఈ ప్రాజెక్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఐఐసీ కూడా స్థలాల గుర్తింపుపై దృష్టి సారించింది. శంషాబాద్ మండలం ‘111’ జీఓ పరిధిలో ఉన్నందున.. రావిర్యాల లేదా కోహెడలో స్మార్ట్ సిటీకి భూములు కేటాయించేదిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ నిర్మాణ సంస్థ కొచ్చి నగర శివార్లలో స్మార్ట్సిటీని అభివృద్ధి చేస్తోంది. దుబాయ్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ కావడం.. నిర్మాణరంగంలో విశేష అనుభవం ఉన్న దృష్ట్యా ఈ సంస్థ ప్రతిపాదనలకు అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.