breaking news
Dr. Sunanda
-
పీహెచ్సీలపై ప్రత్యేక శ్రద్ధ
జలుబు లేదా జ్వరమొస్తే రూ.వందలు.. ఇంకొంచెం పెద్ద ఆరోగ్య సమస్య అరుుతే రూ.వేలకు వేలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అయ్యే ఖర్చులివి. ఇంత ఖర్చుకు మధ్య తరగతి ప్రజలే కాదు.. సంపన్నులూ వెనుకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులకు మొదట గుర్తుకువచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. అక్కడ వైద్య పరీక్షలే కాదు మందులూ ఉచితం. అయితే పీహెచ్సీల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని పీహెచ్సీల తీరు ఎలా ఉంది.. ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలి వంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నారు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద. ఇందుకు ‘సాక్షి’ని వేదికగా చేసుకున్నారు. వీఐపీ రిపోర్టర్గా నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ను, స్కానింగ్ సెంటర్ను ఆమె పరిశీలించారు. తొలుత తంగెళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించడానికి వెళ్లిన డాక్టర్ సునంద అక్కడి పరిస్థితులను గమనించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరు, వైద్యులు, సిబ్బంది వైఖరిపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సునంద : ఈ కేంద్రానికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. గర్భిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారా డాక్టర్ కె.మిద్దేశ్వరరావు : రోజుకు 30 నుంచి 50 మంది రోగులు వస్తుంటారు మేడమ్. గర్భిణుల వివరాలతో రికార్డులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సునంద : గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుళ్లు పోస్తున్నారా.. బయటకు పంపుతున్నారా మిద్దేశ్వరరావు : మా కేంద్రానికి వచ్చే గర్భిణులందరినీ 9 నెలలపాటు జగ్రత్తగా పరిశీలిస్తూ ఇక్కడే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తున్నాం. సునంద : ఇక్కడ అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచుతున్నారా. కె.విజయ, నర్సు : అన్ని మందులూ ఉన్నాయి మేడమ్. ఈ ప్రాంతం మురికివాడ కావడంతో ఎక్కువ మంది కుక్క కాటుకు గురై వైద్యం కోసం వస్తున్నారు. యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు మేడమ్. సునంద : అర్బన్ హెల్త్ సెంటర్లలో యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం కష్టం. వాటిని శీతల ప్రదేశంలో ఉంచాల్సి ఉన్నందున్న ఫ్రిజ్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి బాధితులను అక్కడికి పంపించాలి. అనంతరం టాయిలెట్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన డీఎంహెచ్వో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ స్వీపర్ ఎవరని ప్రశ్నించారు. కొప్పుల రామలక్ష్మి : నేను ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్నాను మేడమ్. సునంద : టాయిలెట్లు ఇంత మురికిగా ఉన్నాయేంటి. నీరుకూడా వృథాగా పోతోంది. రామలక్ష్మి : ఎప్పుడూ కడుగుతూనే ఉంటానండి. రోగులు వచ్చి వినియోగించుకుంటారు కదాండి. అందుకే మురికిగా ఉన్నాయి. మరింత శుభ్రంగా ఉంచుతాను మేడమ్. సునంద : నీరు వృథాగా పోతోంది కదా. పంపులను జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడూ పరిశీలిస్తుండాలి. రామలక్ష్మి : అలాగేనండి. ఆ తర్వాత అక్కడున్న కమ్యూనిటీ ఆర్గనైజర్తో డీఎంహెచ్వో మాట్లాడారు. ఎంబీ విజయసత్యకళ, సీవో : ప్రతినెలా జీతాలు అందడం లేదు మేడమ్. ఏ నెల జీతాలు ఆ నెలలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. సునంద : ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి. బడ్జెట్ విడుదల కాగానే జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడి నుండి నగరం నడిబొడ్డులోని రామచంద్రరావు పేటలో గల వంశీ స్కానింగ్ సెంటర్కు వెళ్లిన సునంద ఆ సెంటర్ నిర్వాహకురాలిని అక్కడ ఏయే పరీక్షలు చేస్తున్నారు, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్.మృణాళిని : మేడమ్. ఇక్కడ నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్గా వ్యవహరిస్తున్నాను. సునంద : అందుకు సంబంధించి మీ అర్హత ఏమిటి. బయట బోర్డు పెట్టారా. మీ పత్రాలు చూపండి. మృణాళిని : రిజిస్ట్రేషన్ చేయించాం మేడమ్. బయట బోర్డు కూడా ఉంది. సునంద : ఇక్కడ స్కానింగ్లు చేస్తున్నారా. ఎంత వసూలు చేస్తున్నారు. మృణాళిని : అన్నిరకాల స్కానింగ్లూ చేస్తున్నాం మేడమ్. లింగ నిర్థారణ ప్రకటించడం లేదు. సునంద : రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు. మృణాళిని : గర్భస్థ శిశు పరీక్షలు కాకుండా ఇతర స్కానింగ్లు సుమారు 30 నుంచి 40 వరకూ చేస్తాం. సునంద : మీరు చేసే అన్ని పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు మాకు నివేదిక పంపాలి. వైద్యుల సూచనల మేరకు వస్తున్న రోగులకే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వచ్చేవారికి కూడా పరీక్షలు చేస్తున్నారా. మృణాళిని : లేదు మేడమ్. డాక్టర్లు పంపిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఎంహెచ్వో పరీక్షల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు. సునంద : ఏమ్మా.. ఏ పరీక్ష కోసం వచ్చారు. ఫాతిమా : కడుపునొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన స్కానింగ్ చేయించుకు రమ్మని పంపారు. సునంద : ఏ వైద్యుడు పంపారు. ఆ చీటీ ఏది. ఫాతిమా : చీటీ నా దగ్గర లేదండి. నా భర్త వద్ద ఉంది. ఆయన బయటకు వెళ్లారు. -
నికోటిన్ దుష్ర్పభావాల పొగాకు..!
అగ్నికి ఆజ్యం తోడైతే మంట మరింత పెరుగుతుంది. మరి ఆ అగ్నికి విషం తోడైతే? అది స్టైలిష్ సిగరెట్గా మారుతుంది. దాంతో జీవితం ఫూలిష్గా కాలిపోతుంది. ఇంత ఫ్యాషనబుల్గా జీవితాలను తగలబెట్టుకోడానికి మనం ఏటా రూ. 24 లక్షల కోట్లు తగలేస్తున్నాం. స్టైలే డెవిలై కబళిస్తుంటే... ప్రతి పది సెకన్లకు ఒకరం చొప్పున నికరంగా పొగాకుకు బలవుతున్నాం. పొగాకు గురించి చాలాసార్లు చాలామంది చెప్పారు, చదివారు, విన్నారు. అయితే వాటితో పాటు కొన్ని అంతగా వినని వాటినీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సిగరెట్ నుంచి రక్షించుకోవడం ఎంతగా అవసరమో చెప్పడానికే ఈ కథనం. జీవితం పొగచూరిపోవడానికి ఈజీ మార్గం... పొగాకు. ఆ విషాన్ని పెట్టెలో దాచి మరీ జాగ్రత్తగా జేబులో పెట్టుకుని తిరుగుతుంటాం. ఆ విషాన్ని అగ్గితో రగిలించి స్వీకరిస్తాం. అగ్నికి ఆజ్యం తోడయ్యే బదులు ఇక్కడ మనం అగ్నికి గరళం తోడయ్యేలా చేస్తాం. అగ్గిపుల్లతో మంట పెచ్చరిల్లుతుంది. అది సిగరెట్కు తాకగానే జీవితం కునారిల్లుతుంది. దాన్ని ఎందుకు వదలాలో తెలుసుకోడానికి తోడ్పడే కొన్ని ప్రధాన విషయాలివి... మీకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ ఆయుధాలను అమ్ముతూ మనుగడ సాగిస్తున్న అమెరికా మరో విషయంలోనూ ముందంజలో ఉంది. ఈ వాణిజ్యం ద్వారా అది దేశాల మధ్య చిచ్చు పెడుతుంటే... ఈ బిజినెస్ ద్వారా అది దేహాలకు ముప్పు తెస్తోంది. అదే సిగరెట్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రఖ్యాత సిగరెట్ బ్రాండ్లలో 70 శాతం అమ్మకాలు అమెరికన్ బ్రాండ్స్ అయిన మార్ల్బోరో, కూల్, క్యామెల్ సిగరెట్స్వే. ఇలా ఆయుధాల బాటలోనూ, సిగరెట్ల చేటు లోనూ అమెరికా తన అగ్రాధిపత్యాన్నీ, అగ్రరాజ్యాధి-పైత్యాన్నీ చాటుకుంటూనే ఉండటం విశేషం. సిగరెట్లో ఆర్సినిక్, ఫార్మాల్డిహైడ్, లెడ్, హైడ్రోజన్ సైనైడ్, నైట్రోజెన్ ఆక్సిడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి 43 రకాల తెలిసిన కార్సినోజెన్లు (క్యాన్సర్ కారకాలు) ఉన్నాయి. ఇక పేరు తెలియని హానికర రసాయనాలు దాదాపు 4000 రకాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం వంటి అన్ని అవయవాలూ క్యాన్సర్కు గురికావచ్చు. బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి జబ్బులూ రావచ్చు. ఆ తర్వాత వారికి సెకండరీ ఇన్ఫెక్షన్గా నిమోనియా వస్తే మృత్యువుకు గెస్ట్ అయినట్లే. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ప్రపంచంలోని ఏదోమూల ఎవరో ఒకరు పొగాకు వల్లనే చనిపోతున్నారు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో చనిపోయేవారిలో కనీసం 35% మంది నేరుగా స్మోకింగ్ వల్ల ప్రభావితమై మృతిచెందేవారే. మీరు సిగరెట్ పొగను పీల్చిన 10 సెకండ్లలో అందులోని నికోటిన్ మెదడును చేరుతుంది. సిగరెట్ తాగేవారి ప్రతి అవయవంలోనూ నికోటిన్ ఉంటుంది... అంటే ఒకవేళ తల్లికి పొగతాగే అలవాటుంటే ఆమె చనుబాలలో కూడా చేరుతుంది. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. సిగరెట్లో 20 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది డయాబెటిక్ రోగులకు ఈ విషయం తెలియదు. అలాగే చక్కెరను కాల్చి పీల్చితే కలిగే దుష్పరిణామాల గురించి ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే... అది నేరుగా చక్కెరను తీసుకోవడం కంటే చాలా ప్రమాదమని. చాలామంది ‘లైట్’ సిగరెట్స్ తాగితే అందులో రసాయనాల ఘాటు, జరగాల్సిన కీడు చాలా లైట్గా ఉంటాయని నమ్ముతారు. సిగరెట్ను లైట్గా చేయడానికి పొగాకును కార్బన్డయాక్సైడ్తో కలిసి సూపర్ హీట్ వద్ద మండించాలి. అప్పుడది మామూలు పొగాకు పొడికి బదులుగా పఫ్డ్ మెటీరియల్గా మారిపోతుంది. (పఫ్డ్ మెటీరియల్ను వివరించాలంటే... ఉదాహరణకు నీళ్లకూ, నురగ కూ ఉన్న తేడాతోనూ, బియ్యానికీ, మరమరాల కూ ఉన్న తేడాతోనూ పోల్చుకోవచ్చు). అప్పుడు అలా మారిన దాన్ని కాగితపు గొట్టంలోకి ఎక్కిస్తారన్నమాట. లైట్ అంటే దాని తాలూకు ప్రభావం లైట్గా ఉంటుందన్నది మన అపోహ మాత్రమే. నిజానికి దాన్ని మరింత విషపూరితమైన కార్బన్డయాక్సైడ్తో మరింత అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి మరింత విషపూరితం చేస్తున్నామన్న సత్యాన్ని మరిచిపోతున్నాం. లైట్ సిగరెట్ లో పొగాకు ఫ్లేక్స్ మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల పొగ మరింత ఘాటుగా, నేరుగా, బలంగా ఊపిరితిత్తులకు తాకుతుంది. మీరు ఈ కింది మాట వింటే... ఆహా సిగరెట్ చేసే మేలెంతో కదా అని ‘పొగాకులో కాలేస్తారు’. ఆ తర్వాత కాలు కాలినట్లు కాస్త ఆలస్యం గా గ్రహిస్తారు. అదేమిటం టే... పొగ తాగేవారిలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే అబ్బా, ఆహా... అనుకోకండి. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎంత త్వరగా పనిచేస్తుందో, అంత త్వరగా బలహీనపడిపోతుంది. సిగరెట్ తాగడం మొదలుపెట్టాక... లోపలికి పీల్చుకునేవి విష పదార్థాలు కావడంతో వాటితో పోరాడటానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఉపక్రమిస్తుంది. అయితే అదేపనిగా సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతుండటం వల్ల అది బలహీనపడుతుంది. అందుకే సిగరెట్ తాగేవారిలో ఇమ్యూనిటీ వేగంగా ప్రతిచర్య జరిపి వేగంగా బలహీనపడి అంతేవేగంగా నిర్వీర్యమైపోతుంది. అదే పొగతాగనివారిలో ఇమ్యూనిటీ కాస్తంత ఆలస్యంగా మేలుకున్నా... బలంగా, ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ జరగాల్సిన దానికంటే ఆలస్యంగా జరుగుతుంది. అంటే జీర్ణమయ్యే ఆహారం ఉండాల్సిన వ్యవధికంటే ఎక్కువసేపు పేగుల్లో ఉంటుంది. దీనివల్ల కుళ్లాల్సిన దానికంటే ఎక్కువగా కుళ్లుతుంది. ఫలితంగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ఇంకేటప్పుడు... అందులోకి వెళ్లాల్సిన దానికంటే అధికమోతాదులో విషాలు ప్రవేశిస్తుంటాయి. విషపూరితమైన రక్తకణాలు మెదడుకు చేరడంతో అది పనిచేయాల్సిన దానికంటే ఆలస్యంగా పనిచేస్తూ క్రమంగా తన పనితీరును మందకొడిగా మార్చేసుకుంటుంది. గర్భవతులకు ఒకసారి ఎక్స్-రే తీయించాల్సి వస్తేనే డాక్టర్లు వద్దని నిరాకరిస్తుంటారు. అయితే ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగితే... అది దాదాపు 2000 ఛాతీ ఎక్స్-రేలు తీయించుకున్న దాని దుష్ర్పభావంతో సమానం. పొగాకు మొక్కలో హార్మలా అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది భ్రాంతులను కలగజేసే రసాయనం. అయితే మనం సిగరెట్ తాగేప్పుడు అలా భ్రాంతులు కలగకపోవడానికి కారణం... సిగరెట్ తయారీలో పొగాకు ను ప్రాసెస్ చేసే సమయంలో హార్మలాను తొలగించడమే. కానీ ఎంతో కొంత స్వల్ప మోతాదుల్లో అది మెదడుకు చేరుతుండటం వల్ల హార్మలాతో కలిగే హార్మ్ అంతా ఇంతా కాదు. అలా కాల్చగా కాల్చగా కొన్నేళ్ల తర్వాత సిగరెట్ దుష్ర్పభావం మన శరీరంపై పడుతుందని మీకు ఇప్పటివరకూ ఒక నమ్మకం ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు సరికొత్త పరిశోధనల వల్ల తెలుస్తున్న సత్యం ఏమిటంటే... సిగరెట్ తాగిన 15 నుంచి 30 నిమిషాల లోపు అందులో ఉండే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీయేహెచ్) ప్రభావం శరీరంలోని కణాలన్నింటి పైనా పడుతుంది. అందువల్ల డీఎన్ఏ స్వరూపం మారుతుంది. డీఎన్ఏ స్వరూపం మారడం అంటేనే క్యాన్సర్ అన్నమాట. ఈ పని మొట్టమొదటి సిగరెట్తోనూ జరగవచ్చు. అయితే ఇన్ని సిగరెట్లు కాల్చాక కూడా ఇంకా మీపై పీఏహెచ్ల ప్రభావం పడలేదంటే అది మీ అదృష్టమే. పడేలోపే ఆ అలవాటును మానుకోండి. ఇన్ని కారణాలతో తక్షణం నిర్వీర్యం చేసి... క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలనూ శక్తిహీనం చేసేసి, ఆ తర్వాత మెల్లగా ప్రాణాలను తీసేసే సిగరెట్ను వదులుకోండి. అది ప్రాణాల ను మెలివేయకముందే... దాన్ని వెలివేయండి. అలవాటు మానేశానంటూ గర్వంగా మీసం మెలివేయండి. -నిర్వహణ: యాసీన్ ఇవీ టాపింగ్స్: ఆహారపదార్థాలకు మరింత రుచిని ఆపాదించడానికి రుచికరమైన వాటిని వాటి పైన పూస్తారు. ఈ ప్రక్రియనే వంటల్లో టాపింగ్ అంటారు. అలాగే పొగాకును టాపింగ్ చేయడానికి... లవంగ నూనె, ఆప్రికాట్ స్టోన్, నిమ్మనూనె, లావెండర్నూనె, డిల్సీడ్ నూనె, కోకా, క్యారట్ నూనె, బీట్ జ్యూస్, ఓక్, రమ్, వెనీలా, వెనిగార్లను పైపూత పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇది తెలిశాక కూడా మీరు సిగరెట్ తాగగలరా...? సిగరెట్కు ఫ్లేవర్ (రుచి, వాసన) ఆపాదించడానికి దానికి ‘యూరియా’ ను జతచేస్తారు. యూరియాతో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పొగాకులోని ముతకదనం తగ్గి, ఘాటు మరింతగా పెరగాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. మీకు తెలుసా? మన శరీరానికి విషపూరితం అంటూ మూత్రం ద్వారా మన కిడ్నీలు బయటకు పంపేది ఈ యూరియా అనే వ్యర్థాన్నే. అంటే మన మూత్రంలో ఉండే పదార్థాన్నే సిగరెట్కు రుచి తేవడానికి ఉపయోగించి మళ్లీ శరీరంలోకి పంపిస్తున్నారన్నమాట. మార్ల్బోరో కోసం పనిచేస్తే... జీవితమే బోర్లా! వేన్ మెక్ క్లారెన్, డేవిడ్ మెక్ క్లీన్... వీళ్లిద్దరూ సదరు కంపెనీ యాడ్ కోసం పనిచేసే రోజుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా ‘మార్ల్బోరో మ్యాన్’ అంటూ ఆదరంగా పిలిచేవారు. ఎందుకంటే కౌబాయ్ గెటప్లో, రగ్డ్గా, రఫ్గా దేన్నైనా తట్టుకోగల ధీరులుగా, వీరులుగా ఆ కంపెనీ యాడ్స్లో వాళ్లను చూపించేవారు. యాడ్స్ తయారీలో భాగంగా వారు రోజూ సిగరెట్లు తాగాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే... ఆ ఇద్దరూ తమ కాంట్రాక్ట్ ముగిశాక... పదేళ్లలోపే ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే... డేవిడ్ మెక్క్లీన్ చావుకు సిగరెట్ల కంపెనీయే కారణమంటూ కుటుంబసభ్యులు కేసు కూడా పెట్టారు. మృత్యువును వడపోసి మరీ తెచ్చే ‘ఫిల్టర్’... పొగతాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యసమస్యలేమీ రావంటూ కొందరు చమత్కారంగా చెప్పేమాట అక్షరాలా వాస్తవం. కాకపోతే కాస్త నెగెటివ్గా. ఎందుకంటే వారు వృద్ధాప్యం వచ్చేవరకు ఉండరు కదా..! ఇక స్మోకింగ్ అనే దురలవాటు వల్ల వ్యక్తులు ఎంత త్వరగా చనిపోతున్నారన్నది సైంటిస్టులు గణాంకాలతో లెక్కగట్టారు. సగటున చూస్తే స్మోకర్లు 14 ఏళ్ల ముందుగానే చనిపోతున్నారు. అంటే పొగతాగడం మొదలుపెట్టారంటే మీ జీవితంలో 14 ఏళ్లను త్యాగం చేస్తున్నారన్నమాట. దీనికి తోడు గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక కిడ్నీ, లివర్, మెదడు సంబంధమైన జబ్బులు బోనస్. బోరిస్ ఐవాజ్ అనే హంగేరియన్ సైంటిస్ట్ 1925లో కార్క్తో తొలిసారి సిగరెట్ ఫిల్టర్ను తయారుచేసి, ఆ తర్వాత క్రేప్ పేపర్తో ఫిల్టర్ను రూపొందించి, పేటెంట్ పొందాడు. నిజానికి మామూలు సిగరెట్ లో ప్రమాదకరమైన ముతకపదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే... ఫిల్టర్ ఉన్న సిగరెట్ ద్వారా అవి మరింత వడపోతకు గురై మరింత ప్రమాదకరమైనవిగా రూపొంది మరీ ప్రాణం తీస్తాయి. విషాన్ని మరింత మేలురకమైనదిగా రూపొందించుకోడానికి పొందిన పేటెంట్ అది అని గ్రహించండి. ఇక కెంట్ అనే ఒక పాపులర్ బ్రాండ్ సిగరెట్ ఫిల్టర్ కోసం మరింత నాణ్యమైన కార్సినోజెన్ (క్యాన్సర్ను తెచ్చే రసాయనం) ‘క్రోసిడోలైట్ ఆస్బెస్టాస్’ను ఉపయోగించేవారు. మనం మన జీవితాల ను చాలా నాణ్యంగా తగలబెట్టుకుంటున్నామని గ్రహించి 1950లో ఆ ఫిల్టర్ను వాడటం మానేశారు సదరు తయారీదారులు. ప్రతికూల ప్లాసెబో ఎఫెక్ట్: మనం ఏదైనా మందు తీసుకున్న తర్వాత ఉపశమనం పొందితే, నిజానికి అది మందు కారణంగా కాకపోయినా దాన్ని మందుకే ఆపాదిస్తాం. దాన్నే ప్లాసెబో ఎఫెక్ట్ అంటారు. అలాగే సిగరెట్ తర్వాత మనం కుదుటపడినట్లుగా, రిలాక్స్గా ఫీలవ్వడం, చురుగ్గా మారడం... ఇవన్నీ సిగరెట్ తాలూకు ప్రతికూల ప్లాసెబో ప్రభావాలే. డాక్టర్ సునంద కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్