breaking news
doctors problems
-
మారుతున్న ఉష్ణోగ్రతలు హానికరం.. వైద్యుల హెచ్చరిక
పగటి ఉష్ణోగ్రత పెరుగుదల, రాత్రిపూట చలి కారణంగా జ్వరం, గొంతు చికాకు మరియు దగ్గు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేనివారికి ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య ఇటీవలి అధిక వ్యత్యాసం ఆందోళనకరంగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు వాతావరణ మార్పులకు సంకేతమని, ఇవి అనారోగ్యాల పెరుగుదలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు వైవిధ్యం సాధారణ నిద్రకు భంగం కలిగిస్తాయని, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పుల సమయంలో వేడి గాలి, పొడి గాలి, ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్య స్థాయి పెరుగుతోంది. ఉష్ణోగ్రత 40ని డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలసట, చురుకుదనం కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి కంటి, గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ► బయట ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి ► పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ► మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది ► రోగనిరోధక శక్తికోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి ► అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. -
కరోనా: వైద్యులకు తప్పని వెతలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాతో బాధపడే ప్రజలకు వైద్యం అందిస్తూ డాక్టర్లు చేస్తున్న కృషి మరువలేనిది. కనిపించే దైవంగా భావించే డాక్టర్లను కరోనా కబలిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 100 మంది డాక్టర్లు మరణించారు. జనాభాకు సరిపడా వైద్య సిబ్బంది లేనందున ప్రస్తుతం ఉన్న డాక్టర్లే అధిక గంటలు సేవలందిస్తున్నారు. 40 డిగ్రీల వేడిలో పీపీఈ కిట్లతో కరోనా రోగులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఇంత వేడిలో పీపీఈ కిట్లను ధరించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కానీ తమ ప్రాణాలు, రోగుల ప్రాణాలను కాపాడానికి వేరే మార్గం లేదని ఢిల్లీలోని శారదా ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ తెలిపారు. దేశంలోని ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చాలా తక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతుందని, వైద్య సిబ్బందికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు అధిక సమయం ఆస్పత్రులలో పనిచేస్తుండడం వల్ల తలనొప్పి, వాంతులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సరియైన సదుపాయాలు లేక వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలు, తక్కువ వేతనాల అసంతృప్తితో చాలా మంది డాక్టర్లు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. -
ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: వైద్యుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘తెలంగాణ ప్రభుత్వ వైద్యుల ఐక్య కార్యాచరణ సమితి’ నోటీసు ఇచ్చింది. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారికి వైద్యుల జేఏసీ చైర్మన్ డాక్టర్ బి.రమేశ్, కన్వీనర్ డాక్టర్ ఆర్.లాలూప్రసాద్లు ఈ మేరకు మంగళవారం నోటీసిచ్చారు. ‘పీజీ వైద్య సీట్ల భర్తీలో ఇన్సర్వీస్ కోటాలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన 21, 22 ఉత్తర్వులను రద్దు చేయాలి. ప్రజారోగ్య విభాగంలో వైద్యుల సంఖ్యను పెంచాలి. అత్యవసర అలవెన్సులను పెంచాలి. ప్రభుత్వ వైద్యులకు ప్రొటోకాల్ ఉం డాలి. ఏడో వేతన సంఘం కెరియర్ అడ్వాన్స్మెంట్ అమలు చేయాలి. కేసీఆర్ కిట్కు అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ ట్రెజరీ వేతనాలు ఇవ్వాలి. కొత్త జిల్లాలకు డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఎం జీఎం ఫోరెన్సిక్ వైద్యుడు రజామాలిక్ సస్పెన్షన్ ఎత్తి వేయాలి. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మా ణం వెంటనే చేపట్టాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహం
సమస్యలు పరిష్కరించాలని వైద్యుల డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట డాక్టర్లు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమ్రం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశ్, కె.మనోహర్ మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశంలో డాక్టర్లంతా సత్యాగ్ర హం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకు తగిన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చిన్నచిన్న క్లినికల్ పొరపాట్లను సాకుగా చూపి డాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం డాక్టర్లను అనవసరమైన కేసులలో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్యవృత్తి మానవీయ కోణంతో ముడిపడి ఉన్నందున చట్టం నుంచి డాక్టర్లను మినహాయించాలన్నారు. అల్లోపతి డాక్టర్లు మాత్రమే అల్లోపతి మందులు ఇవ్వాలని, మరే డాక్టర్లు అల్లోపతి మందులు ఇచ్చినట్లరుుతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైద్యులు మనోహర్, శ్యామలారాణి, అనిల్ చిద్రాల, మహాభలేశ్వర్, లీనా గుజరాత్, తిప్పేస్వామి, నరోత్తమ్రెడ్డి, రవికాంత్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టరుగారూ... బాగున్నారా?
డాక్టర్స్ డే: జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమిస్తారు వాళ్లు. అయినా వాళ్ల ప్రాణాలకు మాత్రం సుఖశాంతులు తక్కువే సమాజంలో గౌరవం సరే, దానికి వారు చెల్లించే మూల్యం... చిన్ని చిన్ని సరదాలు, కుటుంబంతో గడిపే కాలం. చిన్న పొరపాటు జరిగినా వైద్యులను నిందించే జనం... వైద్యుల సమస్యలను ఎన్నడైనా పట్టించుకుంటున్నారా..? అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్స్డ్ హ్యాండ్వాష్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ భారత్లో మెడికల్ కాలేజీలు 420 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 200 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 220 వీటిలో మొత్తం సీట్లు 52,765 రిజిస్టర్డ్ అల్లోపతిక్ వైద్యులు 9,38,861 డెంటల్ వైద్యులు 1,54,000 ఆయుష్ వైద్యులు 7,37,000 ‘హాయ్’ చెప్పే ఇన్ఫెక్షన్లు డాక్టర్లను ఇన్ఫెక్షన్లు నిత్యం పలకరిస్తుంటాయి. వారికి రోజూ ‘హాయ్’ చెబుతాయి. ఇది అతిశయోక్తి అనుకుంటే పొరబాటు. హాస్పిటల్స్లో రోగులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించుకుని రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా హాస్పిటల్స్లోనూ, ఐసీయూలలోనూ వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆసుపత్రుల సాంకేతిక పరిభాషలో ‘హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్’ (హాయ్) అంటారు. ఇక మరో రకమైన ‘హాయ్’ కూడా డాక్టర్లను పలకరిస్తుంది. ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్సే ఆ మరో ‘హాయ్’. ఇలా తాము చికిత్స కోసం వచ్చిన జబ్బు వల్ల కాకుండా, హాస్పిటల్ను సందర్శించాక వచ్చే జబ్బును ‘హాయ్’ అంటారు. సాధారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు ఆసుపత్రిలో మరో జబ్బుకు గురవుతారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనంలో వెల్లడైంది. అంటే కాసేపు సందర్శన వల్లనో లేదా ఒక గంట కన్సల్టేషన్కు వచ్చినందువల్లనో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంతగా ఉందంటే మరి డాక్టర్లుకు ఉండదా? ఎందుకు ఉండదూ... వారూ మానవమాత్రులే కదా. అందుకే వాళ్లకూ ఈ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాళ్లే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ నుంచి భాగస్వామికీ... పిల్లలకూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోగి నుంచి డాక్టర్లకే కాదు... వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు గనుకనే డాక్టర్లు అంటే అందరికీ గౌరవం. సామాజికపరమైన ఇక్కట్లు డాక్టర్లు ఉత్సవాలు, ఫంక్షన్లు వంటి వేడుకలకు హాజరు కాలేకపోవడం చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఒక్కోసారి తమ సొంత బిడ్డల పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరు కాలేని పరిస్థితులు వాళ్లలో చాలామందికి అనుభవమయ్యే విషయమే. దాంతో బంధువర్గాల్లో నిష్ఠురాలు మామూలే. స్నేహితులతో కులాసాగా గడపడం వైద్యవృత్తిలో గగనకుసుమమే. రోగులను నిత్యం విజిట్ చేసే వీరు ఏదైనా వేడుకల్లో విజిట్ చేయడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా కొనసాగే కాన్ఫరెన్స్లు మినహా వ్యక్తిగతంగా పర్యటనలూ తక్కువే. విదేశాలలో తిరిగినా అది తమ కాన్ఫరెన్సుల్లో భాగంగా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడో గాని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు దొరకవు. వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందే వీళ్లు... రోగులు మృతి చెందిన సమయంలో ఒక్కోసారి చేదు అనుభవాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితి. అప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను రక్షించడానికి వీళ్లు శక్తివంచన లేకుండా పూనుకుంటారు. అలాంటి సమయాల్లో తమ వల్ల కాకపోయినా... రోగి మృతి చెందినప్పుడు చాలా సందర్భాల్లో వీరు నిందలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాలలో చాలా అరుదుగానైనా భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1000 భారత్లో వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1700 డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోవాలంటే... 4,00,000 2022 నాటికి భారత్కు అదనంగా కావలసిన వైద్యుల సంఖ్య దురభిప్రాయాలు వద్దు... చికిత్సకు దూరం కావద్దు... ఆయన వయసు 86 ఏళ్లు. నాందేడ్ నుంచి వచ్చారు. అన్నవాహిక క్యాన్సరు. ఆహారనాళం పూర్తిగా మూసుకుపోయింది. మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తొలగించాలంటే ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కారణం ఆయన క్రానిక్ స్మోకర్. పైగా ఊపిరితిత్తులు బాగాలేవు. ఇలాంటి వాళ్లకు ఆపరేషన్ టైమ్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువే. అది రిస్క్తో కూడిన వ్యవహారం కాబట్టి సర్జరీ కాకుండా అన్నవాహికలోకి పైప్ వేసి, ఆహారం పంపించి రేడియేషన్ కూడా ఇద్దామని సూచించాం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన మాటలు చాలా అసెర్టివ్గా ఉన్నాయి. ‘‘ఎనభై ఆరేళ్ల జీవితాన్ని చూశా. అన్ని బాధ్యతలూ తీర్చుకున్నా. ఈ వయసులో కేవలం బతకడం కోసం పైప్ వేసి, దాని ద్వారా ఆహారం పంపడం ఎందుకు. బతికినన్నాళ్లూ తింటూ, తాగుతూ సంతోషంగా బతకాలి. ఒకవేళ క్యాన్సర్ సర్జరీ చేస్తుండగానే చనిపోయాననుకోండి. ఈ వయసులో హాయిగా చనిపోవడం కంటే ఏం కావాలి. ఒకవేళ బతికాననుకోండి. నాకు ఇష్టమైనట్లుగా తింటూ, తాగుతూ సుఖంగా ఉంటా. అందుకే పైప్ వేసి, దాని ద్వారా ఆహారం తీసుకోవడం వద్దు. రిస్క్ అయినా ఆపరేషన్ చేయండి’’ అన్నారు. దాంతో మేం చాలా జాగ్రత్తగా కీహోల్ సర్జరీ చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనకు ఇష్టమైనవి తింటూ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాడు. మొన్ననే ఫాలో అప్కు వచ్చి వెళ్లారు. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ మీద ఉన్న అనేక అపోహలతో చాలా మంది పెద్దవయసులో ఇలాంటి చికిత్సలు... తీసుకోవడానికి భయపడుతుంటారు. క్యాన్సర్ చికిత్సల్లో ఈ మధ్య వచ్చిన మార్పులతో పెద్దవయసులో కూడా చికిత్సలు తట్టుకునే అవకాశం ఉంది. అపోహలతో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే చికిత్సలతో ప్రాణాలు కాపాడుకోవడం మేలు. - డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒక సర్జరీ... ఇద్దరి ప్రాణాలు కాపాడింది... సాధారణంగా బిడ్డను కనడం అంటేనే పునర్జన్మ. అలాంటిది 36 వారాల గర్భిణి ఉమాదేవి (25)కి గుండెలో సమస్య ఎదురైంది. గుండెలోని అతిపెద్ద రక్తనాళం (మహాధమని) బలహీనమైంది. ఒకరోజు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు గుండె పరీక్షలు చేశారు. ఉమాదేవికి మార్ఫన్స్ సిండ్రోమ్ ఉందని తేలింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పుట్టుకతోనే కొందరిలో ఈ వ్యాధి మొదలవుతుంది. గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం బలహీనమవుతుంది. రక్తనాళంలో ఇంటిమా, మీడియా, అడ్వెంటీషియా అనే పొరలుంటాయి. రక్తప్రసరణ సరిగా చూసేందుకు ఇంటిమా తోడ్పడు తుంది. మీడియా, అడ్వెంటీషియా పొరలతో పాటు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. రక్తం ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు అది బలంగా ఉండేందుకు దోహదపడతాయి. కొందరికి పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ పోవడం వల్ల రక్తనాళం బలహీనపడి, వాచిపోతుంది. దీన్నే అయోర్టికర్ డెసైక్షన్ లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం చిట్లి రక్తం మొత్తం లీక్ అవుతుంది. అదే జరిగితే కొన్ని సెకండ్లలోనే రోగి మృతిచెందే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని బెంటాల్స్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాలి. కాబట్టి ఉమాదేవికి ఆ సర్జరీ అత్యవసరంగా చేయాలి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఒక ప్రాణాన్ని కాదు... ఇద్దరివి. ఆమె ప్రాణాన్ని, కడుపులోని ఆమె బిడ్డ ప్రాణాన్ని. ఆపరేషన్ సక్సెస్. తల్లీ బిడ్డా సేఫ్. - డాక్టర్ జి. రామసుబ్రమణ్యం, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిస్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఛాన్స్ 1% - రిజల్ట్ 100% ఆరోజు జనవరి 21... ఆదివారం. మా కుటుంబం అంతా వైజాగ్కు బయల్దేరింది. కుటుంబ సభ్యులంతా హ్యాపీ. సరిగ్గా బోర్డింగ్ పాస్లు తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా నాకు ఫోన్. అదీ హాస్పిటల్ నుంచి. పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో ఎమర్జెన్సీకి వచ్చారనీ, అర్జెంటుగా రమ్మని ఆ కాల్ సారాంశం. అంతే! ప్రయాణం కట్టిపెట్టి... బాబు, పాపలను సముదాయించి, నా భార్యకు విషయం చెప్పి హాస్పిటల్కు ప్రయాణం కట్టాను. నేను బయల్దేరే సమయంలోనే నా కొలీగ్ డాక్టర్ ఆర్ముగంకూ ఫోన్ చేశా. అతడూ భార్యాపిల్లలతో నగరం శివార్లలోని ఏదో రిసార్ట్లో హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. నాలాగే అతడూ తన హాలీడేకు ఫుల్స్టాప్ పెట్టి బయల్దేరాడు. మేమిద్దరమూ ఇలా ఆగమేఘాల మీద ఆసుపత్రికి రావడానికి కారణం... 59 ఏళ్ల పేషెంట్. జనవరిలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల్లోనే మళ్లీ హార్ట్ ఎటాక్. హాస్పిటల్కు వచ్చే సమయానికి గుండె దాదాపు ఆగిపోయింది. ఎమర్జెన్సీ టీమ్ పేషెంట్కు ముందుగా ‘డీసీ షాక్స్’ ఇచ్చారు. గుండె స్పందనలు మొదలయ్యాయి. వెంటనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్తో వెంటిలేటర్పై ఉంచారు. పేషెంట్ బతికేందుకు ఒక్క శాతమే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా ‘ఎండార్ట్ ఇరెక్టొమీ విత్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ అనే సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నాం. ఏడెనిమిది గంటలు సాగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకున్నాడు. మరో రెండు రోజుల తర్వాత లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్ తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకొని మమ్మల్ని కళ్లతోనే ఆత్మీయంగా పలకరించాడు. కుటుంబాలతో హాలీడేని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో తెలియదుగానీ... పేషెంట్కు మా బృందం ఇచ్చిన పునర్జన్మ మాకు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని నమ్మకంగా చెప్పగలం. - డాక్టర్ పి.వి.నరేష్ కుమార్, కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ మానసికమైన ఒత్తిళ్లూ ఎక్కువే... డాక్టర్ల వృత్తిగతమైన జీవితాల్లో మానసిక ఒత్తిళ్లూ చాలా ఎక్కువ. అవతలి వారి ప్రాణాలతో వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా వృత్తుల్లో కంటే వైద్యవృత్తిలో ఈ మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆ... ఈ జీవితం ఇలా తగలడిపోయింది’ అనడం సాధారణంగా వింటుంటాం. కానీ డాక్టర్ల జీవితాల్లో ఇలాంటి అభివ్యక్తికి నిజంగానే ‘బర్నవుట్’ అని పేరు పెట్టి అనేక అధ్యయనాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో డాక్టర్లపై ఈ అంశమై అనేక అధ్యయనాలు జరిగాయి. 2012లో యూఎస్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఇద్దరు ఫిజీషియన్లలో ఒకరిపై వృత్తిగతమైన ఒత్తిడి ఎక్కువ అని తేలింది. ఇది ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్లో నమోదైంది. ఇలాంటిదే మళ్లీ 2013లో నిర్వహించారు. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి చేరాక ఒకింత స్వేచ్ఛాజీవితం దొరికినట్లు భావిస్తుండటం మామూలే. అయితే వైద్యవిద్య అభ్యసించే వారికి మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా స్వేచ్ఛాజీవితం లభించినట్లు భావించడం తక్కువేనని తేలింది. డాక్టర్స్ డే విషెస్ when there are tears, you are a shoulder when there is pain, you are a medicine when there is a tragedy, you are a hope happy doctor's day i want to say a big thanks for making me healthy and fit you are the best doctor i have ever known happy doctor's day may your days be wonderful and healthy like you make it for others. i want to thank you this doctor's day dawn of relief - obliging caring - tolerant omniscient -reasonable happy doctor's day అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్స్డ్ హ్యాండ్వాష్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ -
ఆయన చెప్పే కారణం... సరైనదేనా?!
నా వయసు 21. పెళ్లై సంవత్సరం కావస్తోంది. మావారికి ఇద్దరు భార్యలు. నేను రెండో భార్యని. అయినా నన్ను బాగానే చూసుకుంటారు. కాకపోతే కలిసేటప్పుడు కండోమ్ వాడుతుంటారు. నాకు పిల్లలు కావాలి, కండోమ్ వాడొద్దు అని చెప్పాను. కానీ ఆయన... ఇద్దరితోనూ కలుస్తాను కదా, హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందుకే కండోమ్ తప్పక వాడాలి అంటున్నారు. అది నిజమేనా? నాకు తల్లిని కావాలన్న కోరిక బలంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? - స్వీటీ, మెయిల్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ మీ ఆయనకో, ఆయన మొదటి భార్యకో ఉంటే... మీరు మీవారితో కలవడం వల్ల వస్తుంది. అంతే కానీ మీ ముగ్గురిలో ఎవరికీ హెచ్ఐవీ లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? కండోమ్స్ వాడటం వలన ఇంకా వేరే ఇన్ఫెక్షన్లు ఏమైనా వాళ్లిద్దరిలో ఉన్నా కూడా, అవి మీకు రాకుండా ఉంటాయి. మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో! లేకపోవడం వల్లే అలా ఇన్ఫెక్షన్ సాకు పెట్టుకుని కండోమ్స్ వాడుతున్నారేమోనన్న విషయం మనకు తెలియాలి కదా! ఒకవేళ ఆయనకు ఏ అభ్యంతరం లేకపోతే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో మీరిద్దరూ ముందు పరీక్షలు చేయించుకోండి. ఏమీ లేకపోతే కండోమ్ లేకుండా ధైర్యంగా కలవండి. తద్వారా గర్భం ధరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో! నేను ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. వయసు 29. నాకు ఎండో మెట్రియాసిస్ ఉంది. మందులు వాడుతున్నాను. ఈమధ్యే ఎక్కడో చదివాను... ఎండో మెట్రియాసిస్ ఉన్నవాళ్లకు కొన్ని రకాల క్యాన్సర్లు తేలికగా వస్తాయి అని. అది నిజమేనా? వస్తే ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం? - ప్రీతి, హైదరాబాద్ ఎండో మెట్రియాసిస్ అనేది గర్భాశయం లోపల ఉండే పొర. అది అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా... అంటే పొత్తి కడుపులో, అండాశయాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన చిన్నగా పాతుకుని ఉంటుంది. ప్రతినెలా బ్లీడింగ్ అయినట్లే అక్కడ కూడా కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ రక్తం కొద్దికొద్దిగా గడ్డ కట్టడం వల్ల చుట్టూ ఉన్న అవయవాలు దగ్గరకు చేరి, అతుక్కుపోవడం జరగవచ్చు. ఈ ఎండోమెట్రియాసిస్ పొర పైన ఈస్ట్రోజన్ ప్రభావం దీర్ఘకాలంగా ఎక్కువ నిష్పత్తిలో పని చేసినప్పుడు కొందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అది అరుదుగానే జరుగుతుంది. పిల్లలు లేనివారు, అధిక బరువు ఉండేవారు, రక్తంలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నవారు, ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ దీర్ఘకాలంగా చేయించుకున్నవారిలోనూ ఇలా ఎక్కువగా జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఎండో మెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి కొందరిలో ఎలా వస్తుంటాయో... అలాగే ఎండో మెట్రియాసిస్ ఉన్నవారిలో కూడా 1-2 శాతం మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తరచుగా చెకప్, వెజైనల్ స్కానింగ్, అవసరమైతే ఇ్చ 125 లాంటి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ కాలం వాడటం మంచిది. ఎందుకంటే ఇవి ఎండో మెట్రియాసిస్ను యాక్టివ్ అవ్వకుండా అణచి వేస్తాయి. అలాగే అవసరమైతే ల్యాపరోస్కోపి ద్వారా నిర్ధారణ చేసుకుని, ఎండోమెట్రియాసిస్ ఆపరేషన్ కూడా చేయించేసుకోవచ్చు. మా పాప వయసు పదహారేళ్లు. మూడేళ్ల క్రితం మెచ్యూర్ అయ్యింది. అప్పుడు బ్లీడింగ్ చాలా ఎక్కువ అయ్యింది. ఎంతకీ ఆగకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాం. రక్తం చాలా తక్కువ ఉంది, ప్లేట్లెట్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంది అన్నారు. ఆ సమస్య పేరు Thrombo cytopenia అని చెప్పారు. Wysolone ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ ఆ ట్యాబ్లెట్ వేస్తేనే బ్లీడింగ్ ఆగుతోంది. లేకపోతే అవుతూనే ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? - పద్మావతి, మందమర్రి Thrombo cytopenia అంటే రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటం. రక్తంలో అనేక రకాల కణాలు ఉంటాయి. వాటిలో ఒక రకమైన కణాలనే ప్లేట్లెట్స్ అంటారు. వీటివల్ల రక్తానికి గడ్డకట్టే గుణం ఏర్పడుతుంది. ఇవి కనుక తక్కువ ఉంటే... చిన్న దెబ్బ తగిలి బ్లీడింగ్ మొదలైనా అది ఆగకుండా అవుతూనే ఉంటుంది. అనేక కారణాల వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు. కొంతమందిలో అయితే ప్లేట్లెట్స్ను నాశనం చేసే యాంటి బాడీస్ రక్తంలో తయారవుతూ ఉంటాయి. ఈ యాంటీ బాడీస్ తయారు కాకుండా Wysolone ట్యాబ్లెట్స్ అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ఓసారి మీ పాపను మంచి హెమటాలజిస్టుకు చూపించి, అన్ని రకాల పరీక్షలూ చేయించండి. పాపలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసుకుని, చికిత్స చేస్తారు. అయితే ఇటువంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. నా వయసు 25. బరువు 58 కిలోలు. మావారి వయసు 40. మాకు పెళ్లై ఆరేళ్లయ్యింది. కానీ ఇంతవరకూ పిల్లలు లేరు. నాకు పీసీఓడీ ఉంది. ల్యాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ, మూడుసార్లు ఐయూఐ చేశారు. మా వారికి షుగర్ ఉంది కానీ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే ఆయన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందట. అలాగే వీర్యంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని అంటున్నారు డాక్టర్. ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేస్తే పిల్లలు కలుగుతారు? - స్వాతి, నల్గొండ కొంతమందిలో షుగర్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండవచ్చు. మరికొంత మందిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం, వాటి కదలిలు సరిగ్గా లేకపోవడం, వాటిలో నాణ్యత లేకపోవడం వంటివి జరగవచ్చు. మీవారి సీమన్ కల్చర్ చేయిస్తే... అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉంది, అది ఏ మందులతో తగ్గుతుంది అనేది తెలుస్తుంది. దాన్నిబట్టి మందులు వాడవచ్చు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత పెరగవచ్చు. అలాగే కొందరిలో హార్మోన్ల తేడా వల్ల లేదా వృషణాల్లో వాపు, వేరికోసిల్ వంటి సమస్యల వల్ల కూడా స్పెర్మ కౌంట్ తగ్గవచ్చు. కాబట్టి ఓసారి మీవారిని డాక్టర్కి చూపించి, అవసరమైన పరీక్షలు చేయించి, తగిన చికిత్స ఇప్పించండి. మూడు నెలల వ్యవధి తీసుకుని, తర్వాత కణాలు కొద్దిగానైనా పెరిగాయేమో పరీక్ష చేయించుకోండి. పెరిగితే ఐయూఐ మరో మూడుసార్లు ప్రయత్నించవచ్చు. లేకపోతే ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లవచ్చు. నా వయసు 25. నాకు మూడు నెలల నుంచి పదిహేను రోజులకోసారి నెలసరి వస్తోంది. పైగా వచ్చిన ప్రతిసారీ తొమ్మిది రోజులు అవుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే... ఐదు నెలలు చూడు, అప్పటికీ అలాగే వస్తే అప్పుడు పరీక్ష చేస్తాను అన్నారు. కానీ నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి ఇలా జరుగుతోంది. ఇంకా వెయిట్ చేయడం కరెక్టేనా? నాకింకా పెళ్లి కాలేదు. దీన్నిలా వదిలేస్తే పెళ్లయ్యాక సమస్యలేమైనా వస్తాయంటారా? - సుప్రజ, కర్నూలు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్ వంటి ఎన్నో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం. వాటి అసమతుల్యతతో పాటు అండాశయాల్లో నీటి తిత్తులు, నీటి బుడగలు, అధిక బరువు, గర్భాశయంలో గడ్డలు, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో అంశాలు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణమవుతాయి. మూడు నెలల నుంచి సమస్య ఉంది కాబట్టి ఇంకో రెండు నెలలు ఆగే ఓపిక లేకపోతే... ముందే హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకోండి. అప్పుడు సమస్య ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రావడం మొదలైతే పెళ్లి తర్వాత ఇక ఏ సమస్యలూ ఉండవు. నా వయసు 21. ఇంకా పెళ్లి కాలేదు. నాకు పీరియడ్స్ వచ్చి ఆగాక, ఐదు రోజుల పాటు వైట్ డిశ్చార్జి అవుతోంది. చాలా దుర్వాసన కూడా వస్తోంది. అలాగే చాలాసార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తోంది. ఐదు రోజుల పాటే ఇలా ఉంటోంది. తర్వాత ఏ సమస్యా ఉండటం లేదు. ఎందుకిలా అవుతోంది? - పి.శ్వేత, కర్నూలు పీరియడ్స్ సమయంలో నాలుగైదు రోజుల పాటు న్యాప్కిన్స్ పెట్టుకునే ఉండటం వల్ల గాలి సోకక, ఏదైనా ఇన్ఫెక్షన్ రావొచ్చు. దానివల్ల పీరియడ్స్ ఆగిన తర్వాత దుర్వాసనతో కూడిన తెల్లబట్ట అవ్వవచ్చు. బ్లీడింగ్ సమయంలో న్యాప్కిన్స్ తరచుగా మార్చుకోవడం మంచిది. యోనిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుని, క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ని యోని చుట్టూ చల్లుకోవాలి. ఒకవేళ రక్తహీనత ఉన్నా, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తుంటాయి. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు రోజూ తగినన్ని మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మీ బరువు ఎంతో రాయలేదు. బరువు ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు రావొచ్చు. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్