breaking news
Distribution transformers
-
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో నూతన విధానం
హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా స్థల సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు, ట్రాన్స్ఫార్మర్ పరిసరాలు మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంటాయని తెలిపారు. నిర్వహణ, పర్యవేక్షణ పనులు కూడా మరింత సులభంగా నిర్వహించగలిగే అవకాశం ఉంటుందన్నారు.సాంప్రదాయంగా దిమ్మెల మీద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 30–35 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని, కాంక్రిట్ దిమ్మెల నిర్మాణం, క్యూరింగ్ ప్రక్రియకు సుమారు వారం రోజుల సమయం పడుతుందని సీఎండీ వివరించారు. అదనంగా హెచ్జీ ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఏబీ స్విచ్ వంటి ఉపకరణాలను ప్రత్యేకంగా మరో పోల్ పై ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల పీటీఆర్ దిమ్మె శుభ్రత లోపించి పోల్ చుట్టూ చెత్త పేరుకుపోయే అవకాశం ఉండటంతో నిర్వహణ పనులు సిబ్బందికి కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.దీనికి ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో, కేవలం 377 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన 11 మీటర్ల గుండ్రటి పోల్పై 6-9 అడుగుల ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయవచ్చు. HG ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, AB స్విచ్ వంటి అన్ని ఉపకరణాలను పోల్పైనే అమర్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విధానంలో కేవలం ఒక్క రోజులోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పూర్తి చేయవచ్చు. బకెట్ లాడర్ సహాయంతో కేవలం ఒక్క సిబ్బంది సులభంగా మరియు సురక్షితంగా నిర్వహణ పనులు చేపట్టగలడని తెలిపారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న UG కేబుల్స్ను కూడా ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లకు ఎంతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు.ప్రస్తుతం ఈ విధానంలో 63 కేవీఏ, 100 కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను 11 మీటర్ల ఎత్తు గల పోల్లపై ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవి ప్రధాన రహదారులపై రవాణాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇరుకైన గల్లీల్లో రవాణా చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు 9.5 మీటర్ల ఎత్తు గల తక్కువ ఎత్తైన పోల్లపై కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు. అదేవిధంగా అధిక సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను కూడా ఈ విధానంలో ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని వెల్లడించారు.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 304 ప్రాంతాల్లో ఈ ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 100కి పైగా ట్రాన్స్ఫార్మర్లను ఈ విధానంలో విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్థ చేపడుతున్న ‘కరెంటోళ్ల ప్రజాబాట’ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రమాదకరంగా లేదా రోడ్లపై అడ్డుగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రానున్న రోజుల్లో ఈ నూతన విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆధునీకరణ, భద్రత, విశ్వసనీయత మరింతగా పెరుగుతాయని ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. -
భారత్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యెన్లు (సుమారు రూ. 500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తోషిబా గ్రూప్ వెల్లడించింది. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచుకునేందుకు తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఈ నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. 2024–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టీటీడీఐ చైర్పర్సన్ హిరోషి ఫురుటా తెలిపారు. భారత్లో తయారీ, భారత్ నుంచి ఎగుమతుల నినాదానికి అనుగుణంగా చేసే ఈ పెట్టుబడులతో నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోనున్నట్లు వివరించారు. భారత మార్కెట్లో ట్రాన్స్ఫార్మర్ల డిమాండ్ను తీర్చడానికి, ఎగుమతులను పెంచుకోవడానికి పవర్ ట్రాన్స్ఫార్మర్ల విస్తరణ తోడ్పడగలదని హిరోషి పేర్కొన్నారు. -
సారూ.. కరెంటు కష్టాలు వినరూ..
ఖమ్మం: జిల్లాలో ట్రాన్స్కో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటాను సరఫరా చేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుం దో... ఎప్పుడు పోతుందో తెలవని దుస్థితి నెల కొంది. ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఇతర విద్యుత్ వస్తువుల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎటు పోతుందోననే తెలుసుకునే నిఘా లేకుండా పోయింది. కరెంటు లైన్ల మరమ్మతు కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులు సాగుతూనే ఉన్నాయి. దీనికితోడు ట్రాన్స్కో అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు,పెద్ద ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ.. చిరు ఉద్యోగులపై వేటువేస్తూ పిచ్చుకపై బ్ర హ్మాస్త్రాలు సంధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతనంగా నియమితులై జిల్లాకు వ స్తున్న ఎన్పీడీసీఎల్ వరంగల్ డివిజన్ సీఎండీ వెంకటనారాయణ ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి మెరుగైన సేవలను అందించేలా చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా.. జిల్లాలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రానికి 6 గంటలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సబ్స్టేషన్ సెంట ర్లకు 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రకటించిన అధికారులు అందుకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి సైతం సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లాలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పో తుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి అధికారులు ప్రకటించిన విధంగానైనా విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం... ట్రాన్స్కోలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిం దనే విమర్శలు వస్తున్నాయి. పై స్థాయి అధికారులు చేసిన తప్పులను కిందిస్థాయి అధికారులపై నెడుతూ వారిని బలితీసుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు పలువు రు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఒక కేంద్రంలో త ప్పు జరిగితే దాని పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులకు వంతపాడి అమాయకులను బలి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఏళ్లు గడిచినా పూర్తి కాని పనులు జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం, పురాతన లైన్ల పునరుద్ధరణ మొదలైన పనుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్డబ్ల్యూఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చినా సదరు కాంట్రాక్టర్లపై చర్య తీసుకోలేదు. జిల్లాలోని పట్టణాల్లో ఉన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, అవసరమైనచోట నూతన లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీడీఆర్పీ ద్వారా నిధులు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయలేదు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లుతోంది. ఈ పనులను వేగవంతం చేయమని చెప్పే నాధుడే లేడని పలువురు అంటున్నారు. లోపించిన నిఘా.. అధికారుల ఇష్టారాజ్యం ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ ఇతర వస్తువుల సరఫరా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆరా తీయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతోంది. పైరవీ, పలుకుబడి ఉన్న ప్రాంతాలకు అధిక మొత్తంలో వస్తువులు సరఫరా చేస్తున్నారని, గిరిజనుల పేరున గిరిజనేతరులు ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనికితోడు రైతులు, ఇతర పారిశ్రామిక వేత్తలు తమ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇతర విద్యుత్ పోల్స్, లైన్ల నిర్మాణానికి సంబంధించిన వస్తువులను సొంత ఖర్చులతో కొనుగోలు చేసినా వాటిని కాంట్రాక్టర్లే కొనుగోలు చేశారని బిల్లులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై సీఎం డీ నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు.


