'నన్ను జైలులో పెట్టుకోండి'
న్యూఢిల్లీ: బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. తాను తప్పు చేసినట్లు తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే జైలులో పెట్టండి అంటూ సవాల్ చేశారు. ఆరు నెలల్లో విచారణ జరిపి వాస్తవాలు చెప్పండన్నారు.
రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం అని చెప్పారు.