-
బాలుడి మృతదేహం లభ్యం
అమలాపురం టౌన్ : అమలాపురం ఎర్రవంతెన సమీపంలో కాలువలో పడి గల్లంతైన నల్లి వరుణ్కుమార్ (14) మృతదేహం శనివారం ఉదయం ఆరు గంటలకు లభ్యమైంది. వరుణ్కుమార్ శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులతో కలసి ఆటలాడుకుంటుండగా పెంపుడు కుక్క తరమడంతో ఆ బాలుడు కాలువ ఐరన్ గ్రిల్ ఎక్కి కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఇంట్లోంచి వచ్చిన పెంపుడు కుక్క తరమడం వల్లే వరుణ్కుమార్ ఈ ప్రమాదానికి గురయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వరుణ్కుమార్ మృతదేహం లభ్యం అయ్యాక అతని తండ్రి, బ్యాంక్ ఉద్యోగి నెల్లి తిరుపతిరావు శనివారం ఉదయం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా నిమ్మకాయల జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే తన కుమారుడు కాలువలో పడి చనిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహం ఆస్పత్రికి తరలింపుపై వివాదం బాలుని మృతదేహం కోసం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలించారు. ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యం కాగానే ఆమృతదేహాన్ని కుటుంబ సభ్యుల వద్దకు తీసుకు వెళ్లకుండా... వారికి చూపించకుండా పోస్టుమార్టం కోసం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువులతో దళిత సంఘాల నాయకులు పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏరియా ఆస్పత్రి వద్ద, బాలుని ఇంటి వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ జోక్యం చేసుకుని ఆందోళనకారులతో మాట్లాడి బాలుడి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు. మిన్నంటిన రోదనలు మృతదేహాన్ని చూసిన వరుణ్కుమార్ తల్లిదండ్రులు, అక్కలు, బంధువులు ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబం ఈ దుర్ఘటనను తట్టుకోలేకపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తమ్ముడిని కోల్పోయిన అక్కలు విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. శవ పంచనామాలోనూ ఫిర్యాదులు బాలుడి మృతదేహానికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తహసీల్దార్ బేబీ జ్ఞానాంబ, వీఆర్వోల సమక్షంలో శవ పంచనామా చేశారు. వరుణ్కుమార్ మృతదేహంపై గాయాలు ఉండడంతో కుక్క కాట్ల వల్లే ఆ గాయాలు అయ్యాయని బాలుడి తండ్రి తిరుపతి రావుతో పాటు దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే వరుణ్కుమార్ మృతి చెందినట్టు వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. జగ్గయ్యనాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాన్ని పోలీసు అధికారులు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాల నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సంపదరావు, చిల్లా పురుషోత్తం, సబ్బిత కృష్ణ ప్రసాద్, కోలా త్రిమూర్తులు, నక్కా సంపత్కుమార్, బొంతు బాలరాజు, పెయ్యల పరశురాముడు తదితరులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి అధికారులతో చర్చల్లో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాలుడి ఇల్లు, ఆస్పత్రి వద్ద సీఐలు జి.దేవకుమార్, సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు, అయిదుగురు ఎస్సైలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం తర్వాత మరో వివాదం అమలాపురం టౌన్: పెంపుడు కుక్క తరమడంతో కాలువలో పడి గల్లంతై మృతి చెందిన నెల్లి వరుణ్కుమార్ పోస్టుమార్టం అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద దళిత నాయకులు మరో అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో మరో వివాదం అనివార్యమైంది. పోలీసు కేసులో చనిపోవటానికి కారణం రాసే కాలమ్లో ఐపీసీ 174 సెక్షన్తో అనుమానస్పద మృతిగా నమోదు చేయడంపై దళితనాయకులు అభ్యంతరం చెప్పారు. పోస్టుమార్టం ముందు పోలీసు అధికారులు ఇచ్చిన హామీ మేరకు కాకుండా మరోలా పేర్కొనడంతో వివాదం మొదలైంది. దాంతో పోస్టు మార్టం పూర్తయినా బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకు వెళ్లకుండా ఆందోళన చేశారు. అప్పుడు పోలీసు అధికారులు కేసు పత్రంపై మృతికి కారణం రాసే కాలమ్లో నిమ్మకాయల జగ్గయ్య నాయుడు పెంపుడు కుక్కను వదిలేయడం వల్ల బాలుడు మరణించినట్టు రాయడంతో వివాదానికి తెరపడింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కవల పిల్లల్లో ఒకడు వరుణ్కుమార్ తండ్రి తిరుపతిరావుకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో ఒకరు, వరుణ్కుమార్ కవల పిల్లలు. తనతో పాటు ఒక్కసారే పుట్టిన సోదరుడు మృతి చెందడంతో ఆ సోదరి వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు అందరినీ బాధిస్తోంది. -
గోదావరిలో గల్లంతైన మహిళల మృతదేహాలు లభ్యం
ఏటూరునాగారం: గోదావరిలో పుష్కర స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతానపల్లి పడవరేవు వద్ద మహిళల మృతదేహాలను సోమవారం ఉదయం గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్వతి(35), కల్పన (21) కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 25 న సాయంత్రం గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తుండగా సోమవారం ఉదయం మృతదేహాలు బయటపడడంతో పోలీసులు నది వద్దకు చేరుకుని వాటికి వెలికి తీయించారు. పోస్ట్మార్టం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement