breaking news
Davis Cup match
-
పేస్ పునరాగమనం!
న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్ స్టార్, 46 ఏళ్ల లియాండర్ పేస్ ముందుకొచ్చాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా నవంబర్ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్లో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరణ్మయ్ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేనితోపాటు అర్జున్ ఖడే, విజయ్ సుందర్ ప్రశాంత్, శ్రీరామ్ బాలాజీ, సిద్ధార్థ్ రావత్, మనీశ్ సురేశ్ కుమార్, శశికుమార్ ముకుంద్ ఉన్నారు. -
భళా... భారత్
* రెండు సింగిల్స్లో రామ్కుమార్, సాకేత్ విజయం * కొరియాపై 2-0తో ఆధిక్యం * డేవిస్ కప్ మ్యాచ్ చండీగఢ్: సొంతగడ్డపై భారత టెన్నిస్ యువ ఆటగాళ్లు రామ్కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్లో తొలి రోజు భారత్కు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. రెండు మ్యాచ్ల్లో కొరియా ఆటగాళ్లు ఓటమి అంచుల్లో ఉన్న దశలో గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. డేవిస్ కప్లో తొలిసారి బరిలోకి దిగిన 21 ఏళ్ల రామ్కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్కుమార్ను విజేతగా ప్రకటించారు. యోంగ్కు లిమ్తో జరిగిన రెండో మ్యాచ్లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కొరియా ప్లేయర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఐదు సెట్ల మ్యాచ్ను ఆడిన సాకేత్ విజయం ఖాయం కాగానే ఆనందంతో తన జెర్సీని విప్పి గాల్లోకి విసిరేసి సంబరం చేసుకున్నాడు. మిగతా సహచరులు సాకేత్ను భుజాలపైకి ఎత్తుకొని అతణ్ని అభినందించారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న ద్వయం హాంగ్ చుంగ్-యున్సియోంగ్ చుంగ్ జోడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది.