breaking news
darmaram
-
అక్కే చంపింది..
► 18 నెలలకు వీడిన మిస్సింగ్ కేసు మిస్టరీ ► ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడి హత్య ► ప్రియుడికి సింగరేణి ఉద్యోగం కోసం అఘాయిత్యం ► వివరాలు వెల్లడించిన డీసీపీ ధర్మారం(ధర్మపురి): మానవత్వం మంట కలుస్తోంది. రక్తబంధం మాయమవుతోంది. ప్రియుడికోసం సొంత తమ్ముడినే హత్యచేసిందో సోదరి... వివరాల్లో కెళితే.. 18 నెలల క్రితం ధర్మారం పోలీస్స్టేషన్లో నమోదైన మి స్సింగ్కేసు మిస్టరీ వీడింది.ప్రియుడితో కలిసి సొంత అక్క నే తమ్ముడిని హత్య చేసింది. ఖమ్మం జిల్లా చండ్రుపాడు మండలం రవికంపాడు గ్రామాని చెందిన కావేటి వెంకటేశం(26) మిస్సింగ్ కేసును ఎస్సై బాబురావు వి విధ కోణాలలో విచారణ జరిపి ఛేదించారు. ధర్మారం మండలం చామనపల్లి శివారులోని వాగులో పూడ్చిన పెట్టిన వెంకటేశం శవాన్ని పెద్దపల్లి డీసీ పీ విజేందర్రెడ్డి, ఏసీపీ సింధూశర్మ, సీఐ మహేష్, ఎస్సై బాబురావు ఆధ్వర్యంలో శనివారం వెలికితీశారు. అనంతరం డీసీపీ విజేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా రవికంపాడుకు చెంది న కావేటి రాములు సింగరేణి కార్మికుడిగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ స్ధిరపడ్డాడు. రాములుకు ఇద్దరు కు మారులు నాగేశ్వర్రావు, వెంకటేశం, కూతురు నాగమణి(30) ఉన్నారు. పెద్దకుమారుడు సొంత గ్రామంలో ఉండగా, వెంకటేశం ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ భార్య ప్రియాంకతో కలిసి పెద్దపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నాడు. నాగమణిని ధర్మారం మండలం కటికెనపల్లి గ్రా మానికి చెందిన కట్ట పోచయ్యతో వివాహం జరిపిం చారు. కొద్దిరోజులు కాపురం చేసి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన వేల్పు ల మల్లేశం(35)తో వివాహేతర సంబంధం పెటుకుని అతడితోనే కలిసి ఉంటుంది. ఉద్యోగం కోసమే హత్య నాగమణి తండ్రి రాములు తన ఉద్యోగ విరమణ అనం తరం పెద్దకొడుకుకు వ్యవసాయ భూమి, చిన్న కొడుకుకు సింగరేణి ఉద్యోగం ఇస్తానని తీర్మానం చేశాడు. తండ్రి ఉద్యోగం తమ్ముడైన వెంకటేశంకు కాకుండా తన ప్రియుడైన మల్లేశంకు వచ్చేందుకు నాగమణి పథకం పన్నింది. మల్లేశంను వివాహమాడి, వెంకటేశంను హతమారిస్తే ఉద్యోగం అతడికే వస్తుందని ఆలోచన చేసింది. ఇంటికి పిలిచి.. గొంతు నులిమి వెంకటేశంను హతమార్చేందుకు పథకం పన్నిన నాగమ ణి గతేడాది జనవరి 15న వెంకటేశంను కటికెనపల్లి లోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. వెంకటేశ్ వ చ్చాక ముగ్గురు కలిసి విందు చేసుకున్నారు. ఆతరువాత మల్లేశం, నాగమణి కలిసి వెంకటేశ్ను గొంతునులిమి హత్య చేశారు. అదే రాత్రి శవా న్ని మండలంలోని పత్తి పాకకు చెందిన చిక్కాల రాయమల్లు(40) కారులో చామనపల్లి వాగులోకి తరలించారు. అక్కడే గోయ్యి తీసి పూడ్చి పెట్టారు. భార్యఫిర్యాదుతో మిస్సింగ్ కేసు వారం గడిచినా వెంకటేశం ఇంటికి రాకపోవటంతో భార్య ప్రియాంక ఆడబిడ్డ నాగమణికి చెప్పింది. నాగమణి సూచన మేరకు ధర్మారం పోలీస్స్టేషన్లోఫిర్యాదు చేసిం ది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. ఇటీవల ధర్మారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాబురావు మిస్సింగ్ కేసుపై దృష్టి సాచించారు. అన్ని కోణాల్లో విచారించి వెంకటేశం హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిందితులను పట్టుకుని విచారిస్తే నిజాలు వెల్లడించారు. నాగమణి, వేల్పుల మల్లేశంలతో పాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్ చిక్కాల రాయమల్లు,అరెస్టు చేసి, హత్యకు పరోక్షంగా సహకరించిన వెంకటేశం సోదరుడు నాగేశ్వర్రావులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజేందర్రెడ్డి తెలిపారు. నిందితులు రాయమల్లు, మల్లేశం, నాగమణి -
శిథిలావస్థలో గ్రంథాలయం
ధర్మారం(పెద్దపల్లి జిల్లా): ప్రజలకు విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటంతో పాఠకులకు సరైన రీతిలో సేవలందించలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాల్సిన విలువైన పుస్తకాలు వానకు తడుస్తూ చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది. ధర్మారం మండల కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినప్పటికి ఫలితం లేదని పాఠకులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి æ పైకప్పు నుంచి వర్షపు నీరు వస్తోంది. స్థానిక లైబ్రెరియన్ పై కప్పు పెంకుల మీద ప్లాస్టిక్ కవర్లు కప్పించారు. అయినా వర్షం పడుతున్నప్పుడు ఉరుస్తోంది. దీంతో విలువైన గ్రంథాలు, దిన, వారపత్రికలు నీటిలో తడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో గ్రంథాలయం ఉండటంతో విలువైన పుస్తకాలను భద్రపర్చటానికి స్థలం లేక పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. పురాతన కాలంనాటి విషయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా శిథిలావస్థకు చేరిన భవనంతో ఫలితం లేకుండా పోతోందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయం గ్రామం చివరలో ఉండటంతో ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రంథాలయానికి పక్క భవనాన్ని నిర్మించుటకు నిధులు మంజూరు చేయించాలని పాఠకులు కోరుతున్నారు. భూమి కేటాయించాలి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వం భూమిని గ్రంథాలయ భవనం కోసం కేటాయించాలి. ప్రసుత్తం ఉన్న చోట సరైన వసతులు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భవనాన్ని నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. -బత్తిని సంతోష్, బొట్లవనపర్తి నిధులు మంజూరు చేయాలి గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలి. నిరుద్యోగులకు పోటీపరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. సొంత భవనం నిర్మించేలా చూడాలి. - ఎండీ.రఫీ, ధర్మారం అందుబాటులో ఉంచాలి పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచాలి. త్వరలో జరగబోయే గ్రూప్ పరీక్షలకు అవసరమయ్యో పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - మోహన్నాయక్,